Sunday, September 29, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

                                                     ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీశౌనక ఉవాచ
సూత జీవ చిరం సాధో వద నో వదతాం వర
తమస్యపారే భ్రమతాం నౄణాం త్వం పారదర్శనః

సూతా, నీవు చాలా కాలం జీవించి ఉండుగాక.
అజ్ఞ్యానమనే మహా అంధకారములో సంచరించే మానవులకు వెలుగు చూపే వాడవు

ఆహుశ్చిరాయుషమృషిం మృకణ్డుతనయం జనాః
యః కల్పాన్తే హ్యుర్వరితో యేన గ్రస్తమిదం జగత్

నీవు మార్కండేయుని గురించి చెప్పావు
ఆయన చిరంజీవి అని లోకాలన్నీ చెప్పుకుంటున్నాయి

స వా అస్మత్కులోత్పన్నః కల్పేऽస్మిన్భార్గవర్షభః
నైవాధునాపి భూతానాం సమ్ప్లవః కోऽపి జాయతే

ప్రళయకాల చివరలో కూడా ఈయన ఉన్నాడట. స్వామే ఈయనను మింగివేసాడట
ఈయన మా కులం వాడు. ఆయన గొప్ప తనాన్ని మేము కూడా వినాలనుకుంటున్నాము
ప్రళయాన్ని చూచాడు ప్రళయ కాలములో స్వామి చేత మింగబడి, తరువాత బయటకు వచ్చాడు అని చెప్పుకుంటున్నారు

ఏక ఏవార్ణవే భ్రామ్యన్దదర్శ పురుషం కిల
వటపత్రపుటే తోకం శయానం త్వేకమద్భుతమ్

మాకు తెలియకుండా ఈ ప్రళయం ఎలా వచ్చింది
ఏకార్ణవములో తిరుగుతూ ఉన్న ఈ మహాత్ముడు పరమాత్మను చూచాడట
సముద్రములో వటపత్రం మీద ఒంటిగా పడుకున్న పరమాత్మను చూచాడట
మా ఈ సందేహాన్ని తొలగించవలసింది

ఏష నః సంశయో భూయాన్సూత కౌతూహలం యతః
తం నశ్ఛిన్ధి మహాయోగిన్పురాణేష్వపి సమ్మతః

సూత ఉవాచ
ప్రశ్నస్త్వయా మహర్షేऽయం కృతో లోకభ్రమాపహః
నారాయణకథా యత్ర గీతా కలిమలాపహా

లోకుల భ్రమ పోగొట్టడానికి చాలా చక్కని ప్రశ్న వేశావు. ఇది నారాయణ కథ, కలి పాపాలను పోగొడుతుంది

ప్రాప్తద్విజాతిసంస్కారో మార్కణ్డేయః పితుః క్రమాత్
ఛన్దాంస్యధీత్య ధర్మేణ తపఃస్వాధ్యాయసంయుతః

ఈయన తండ్రిగారి దగ్గరనుండి వరుసలో ఉపనయనాదులన్నీ చేసుకుని
వేదములు ధర్మముగా చదువుకుని

బృహద్వ్రతధరః శాన్తో జటిలో వల్కలామ్బరః
బిభ్రత్కమణ్డలుం దణ్డముపవీతం సమేఖలమ్

బృహద్వ్రతం (బ్రహ్మచర్యవ్రతము) తీసుకుని జటలు ధరించి వల్కలు ధరించి

కృష్ణాజినం సాక్షసూత్రం కుశాంశ్చ నియమర్ద్ధయే
అగ్న్యర్కగురువిప్రాత్మస్వర్చయన్సన్ధ్యయోర్హరిమ్

రెండు సంధ్యలలో పరమాత్మను అగ్ని అర్క గురు విప్ర ఆత్మ స్వరూపులుగా పూజిస్తూ

సాయం ప్రాతః స గురవే భైక్ష్యమాహృత్య వాగ్యతః
బుభుజే గుర్వనుజ్ఞాతః సకృన్నో చేదుపోషితః

సాయం ప్రాతః కాలలో భిక్షాటన చేసి గురువుగారికి అర్పిస్తూ ఆయన అనుజ్ఞ్య ఇస్తే రోజుకు ఒక్క సారి భుజించేవాడు

ఏవం తపఃస్వాధ్యాయపరో వర్షాణామయుతాయుతమ్
ఆరాధయన్హృషీకేశం జిగ్యే మృత్యుం సుదుర్జయమ్

ఇలా తపస్వాధ్యాయ పరుడై పదివేల సంవత్సరాలు గురువును సేవిస్తూ పరమాత్మను ఆరాధిస్తూ జయింపరాని మృత్యువును కూడా గెలిచాడు

బ్రహ్మా భృగుర్భవో దక్షో బ్రహ్మపుత్రాశ్చ యేऽపరే
నృదేవపితృభూతాని తేనాసన్నతివిస్మితాః

బ్రహ్మా బృగు శంకరులూ దక్షాదులు ఈ మార్కండేయుని తపశ్శక్తిని చూచి అత్యాశ్చర్యపడ్డారు

ఇత్థం బృహద్వ్రతధరస్తపఃస్వాధ్యాయసంయమైః
దధ్యావధోక్షజం యోగీ ధ్వస్తక్లేశాన్తరాత్మనా

బ్రహ్మచర్యముతో తపస్వాధ్యాయముతో పరమాత్మను శ్రీమన్నారాయణున్ని హృదయములో నిలుపుకున్నాడు

తస్యైవం యుఞ్జతశ్చిత్తం మహాయోగేన యోగినః
వ్యతీయాయ మహాన్కాలో మన్వన్తరషడాత్మకః

ఇలా ఆరు మన్వంతర కాలాలు ఉన్నాడు మార్కండేయుడు. ఇంత కాలం స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు

ఏతత్పురన్దరో జ్ఞాత్వా సప్తమేऽస్మిన్కిలాన్తరే
తపోవిశఙ్కితో బ్రహ్మన్నారేభే తద్విఘాతనమ్

ఈ విషయాన్ని సప్తమ మన్వంతరములో ఇంద్రుడు తెలుసుకుని
ఈయన చేస్తున్న తపస్సు వలన మా లోకానికి ప్రమాదం రవొచ్చు అని విఘ్నాలు కల్పించడం ప్రారంభించాడు

గన్ధర్వాప్సరసః కామం వసన్తమలయానిలౌ
మునయే ప్రేషయామాస రజస్తోకమదౌ తథా

గంధర్వులూ అప్సరసలూ మలయానిలం వసంతుడూ మొదలైన వారు, రజస్సునూ మదాన్నీ తమస్సునూ పెంచేవారిని పంపాడు

తే వై తదాశ్రమం జగ్ముర్హిమాద్రేః పార్శ్వ ఉత్తరే
పుష్పభద్రా నదీ యత్ర చిత్రాఖ్యా చ శిలా విభో

వారు అక్కడ ఆశ్రమానికి వెళ్ళారు

తదాశ్రమపదం పుణ్యం పుణ్యద్రుమలతాఞ్చితమ్
పుణ్యద్విజకులాకీఋనం పుణ్యామలజలాశయమ్

పవిత్రమైన ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆయన తపస్సు విఘ్నం కలిగించడానికి ప్రయత్నించారు
వసంత ఋతువు ప్రతీ చెట్టుకూ ప్రతీ కొమ్మకూ పూలు పూస్తూ కోకిల తన కూతలతో మయూరము నాట్యముతో గంధర్వులు గానముతో మన్మధుడు బాణాన్ని ఎక్కుపెట్టాడు

మత్తభ్రమరసఙ్గీతం మత్తకోకిలకూజితమ్
మత్తబర్హినటాటోపం మత్తద్విజకులాకులమ్

వాయుః ప్రవిష్ట ఆదాయ హిమనిర్ఝరశీకరాన్
సుమనోభిః పరిష్వక్తో వవావుత్తమ్భయన్స్మరమ్

ఉద్యచ్చన్ద్రనిశావక్త్రః ప్రవాలస్తబకాలిభిః
గోపద్రుమలతాజాలైస్తత్రాసీత్కుసుమాకరః

అన్వీయమానో గన్ధర్వైర్గీతవాదిత్రయూథకైః
అదృశ్యతాత్తచాపేషుః స్వఃస్త్రీయూథపతిః స్మరః

హుత్వాగ్నిం సముపాసీనం దదృశుః శక్రకిఙ్కరాః
మీలితాక్షం దురాధర్షం మూర్తిమన్తమివానలమ్

అగ్నిని ఉపాసించే మార్కండేయున్ని చూచారు.
రూపుదాల్చిన అగ్నిహోత్రం వంటి ఆయనను చూచి

ననృతుస్తస్య పురతః స్త్రియోऽథో గాయకా జగుః
మృదఙ్గవీణాపణవైర్వాద్యం చక్రుర్మనోరమమ్

ఆయన ముందర స్త్రీలు నాట్యమూ గాయకులు గానమూ
మృదంగాలూ వీణా నాదాలు చేసారు
మన్మధుడు అస్త్రాన్ని సంధించాడు

సన్దధేऽస్త్రం స్వధనుషి కామః పఞ్చముఖం తదా
మధుర్మనో రజస్తోక ఇన్ద్రభృత్యా వ్యకమ్పయన్

క్రీడన్త్యాః పుఞ్జికస్థల్యాః కన్దుకైః స్తనగౌరవాత్
భృశముద్విగ్నమధ్యాయాః కేశవిస్రంసితస్రజః

పుంజకస్థలి అనే అప్సరస స్త్రీ ఉంది అక్కడ
మన్మధుడు తన బాణాన్నీ ప్రయోగించాడు

ఇతస్తతో భ్రమద్దృష్టేశ్చలన్త్యా అను కన్దుకమ్
వాయుర్జహార తద్వాసః సూక్ష్మం త్రుటితమేఖలమ్

విససర్జ తదా బాణం మత్వా తం స్వజితం స్మరః
సర్వం తత్రాభవన్మోఘమనీశస్య యథోద్యమః

కానీ ఆయన కనులు తెరవనే లేదు వారిని చూడనే లేదు

త ఇత్థమపకుర్వన్తో మునేస్తత్తేజసా మునే
దహ్యమానా నివవృతుః ప్రబోధ్యాహిమివార్భకాః

వీరి ప్రయత్నం వ్యర్థమయిపోయింది
ఇంత చేసినా ఆయనకు వీరి మీద కోపం కూడా రాలేదు
ఆయన తపస్సు యొక్క తేజస్సు వేడిని భరించలేక పాముని లేపిన పసిపిల్లల్లాగ పారిపోయారు

ఇతీన్ద్రానుచరైర్బ్రహ్మన్ధర్షితోऽపి మహామునిః
యన్నాగాదహమో భావం న తచ్చిత్రం మహత్సు హి

దృష్ట్వా నిస్తేజసం కామం సగణం భగవాన్స్వరాట్
శ్రుత్వానుభావం బ్రహ్మర్షేర్విస్మయం సమగాత్పరమ్

మన్మధుడు నిస్తేజుడయ్యాడు
ఆయన ప్రభావాన్ని చూచి ఆశ్చర్యపోయారు

తస్యైవం యుఞ్జతశ్చిత్తం తపఃస్వాధ్యాయసంయమైః
అనుగ్రహాయావిరాసీన్నరనారాయణో హరిః

ఈయన చూపిన తపశ్శక్తీ ఇంద్రియ నిగ్రహాన్ని చూచి నర నారాయణులు వచ్చారు అక్కడకి

తౌ శుక్లకృష్ణౌ నవకఞ్జలోచనౌ
చతుర్భుజౌ రౌరవవల్కలామ్బరౌ
పవిత్రపాణీ ఉపవీతకం త్రివృత్
కమణ్డలుం దణ్డమృజుం చ వైణవమ్

అలా నలుపూ తెలుపూ మిశ్రమమైన నారాయణున్నీ నరున్నీ చూచి
పద్మాలవంటి కనులతో ఉన్నారు, నాలుగు భుజాలతో
కమండలమూ దండమూ జపమాలనూ తీసుకుని

పద్మాక్షమాలాముత జన్తుమార్జనం
వేదం చ సాక్షాత్తప ఏవ రూపిణౌ
తపత్తడిద్వర్ణపిశఙ్గరోచిషా
ప్రాంశూ దధానౌ విబుధర్షభార్చితౌ

వేదమూ తపస్సే రూపు దాల్చినట్లుగా ఉన్నారు.

తే వై భగవతో రూపే నరనారాయణావృషీ
దృష్ట్వోత్థాయాదరేణోచ్చైర్ననామాఙ్గేన దణ్డవత్

ఈ ఇద్దరినీ చూచి సంతోషముతో ఆశ్చర్యముతో లేచి దండములాగ పడి నమస్కరించాడు

స తత్సన్దర్శనానన్ద నిర్వృతాత్మేన్ద్రియాశయః
హృష్టరోమాశ్రుపూర్ణాక్షో న సేహే తావుదీక్షితుమ్

పరమాత్మ దర్శనముతో మనసుకూ ఇంద్రియాలకూ  తృప్తి కలగడముతో
ఆనంద బాష్పములు కనులలో నిండి ఎదురుగా ఉన్న వారిని సరిగా చూడలేకపోయాడు

ఉత్థాయ ప్రాఞ్జలిః ప్రహ్వ ఔత్సుక్యాదాశ్లిషన్నివ
నమో నమ ఇతీశానౌ బభాశే గద్గదాక్షరమ్

ఉత్సాహముగా వార్ని ఆలింగనం చేసుకున్నట్లుగా నమో నమః అంటూ మాటలు పెగలక ఉన్నాడు

తయోరాసనమాదాయ పాదయోరవనిజ్య చ
అర్హణేనానులేపేన ధూపమాల్యైరపూజయత్

వారికి ఆసనాన్నిచ్చి  పాద్యమూ అర్ఘ్యమూ ధూపమూ దీపమూ మాల్యములూ ఇలా పదుహారు ఉపచారాలు సక్రమముగా జరిపి

సుఖమాసనమాసీనౌ ప్రసాదాభిముఖౌ మునీ
పునరానమ్య పాదాభ్యాం గరిష్ఠావిదమబ్రవీత్

అనుగ్రహముతో ఉన్నవారిరువురినీ చూచి మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు

శ్రీమార్కణ్డేయ ఉవాచ
కిం వర్ణయే తవ విభో యదుదీరితోऽసుః
సంస్పన్దతే తమను వాఙ్మనైన్ద్రియాణి
స్పన్దన్తి వై తనుభృతామజశర్వయోశ్చ
స్వస్యాప్యథాపి భజతామసి భావబన్ధుః

మీ గురించి ఏమని వర్ణించాలి.
సకల జీవుల ప్రాణములూ వాక్కు మనసు ఇంద్రియములు నీ సంకల్పముతోనే పని చేస్తాయి, బ్రహ్మ రుద్రులకు కూడా.
ఐనా ఇంత గొప్ప వాడవైనా నిన్ను సేవించేవారికి నీవు బంధువు

మూర్తీ ఇమే భగవతో భగవంస్త్రిలోక్యాః
క్షేమాయ తాపవిరమాయ చ మృత్యుజిత్యై
నానా బిభర్ష్యవితుమన్యతనూర్యథేదం
సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః

స్వామీ, మీ ఈ రెండు రూపాలూ మూడు లోకముల తాపాన్ని పోగొట్టి క్షేమాన్ని అందించడానికి మృత్యువును జయించడానికి
సకల లోకాలను కాపాడడానికి ఇవే కాక చాలా రూపలను ధరిస్తూ ఉన్నావు
సాలెపురుగు ఎలా సృష్టించి మళ్ళీ మింగుతుందో నీవు జగత్తును సృష్టించి మరలా సంహరిస్తూ ఉన్నావు

తస్యావితుః స్థిరచరేశితురఙ్ఘ్రిమూలం
యత్స్థం న కర్మగుణకాలరజః స్పృశన్తి
యద్వై స్తువన్తి నినమన్తి యజన్త్యభీక్ష్ణం
ధ్యాయన్తి వేదహృదయా మునయస్తదాప్త్యై

ఇలా స్థావర జంగమాధిపతి ఐన నీ పాదపద్మములను,
కర్మ కాలముల గుణముల మురికి ఎక్కడ ఉంటే స్పృశించవో
వాటిని వేదముల యందే మనసు ఉన్న మునులు స్తోత్రం చేస్తారు నమస్కారం చేస్తారు, మాటి మాటికీ పూజిస్తారు ధ్యానం చేస్తారు

నాన్యం తవాఙ్ఘ్ర్యుపనయాదపవర్గమూర్తేః
క్షేమం జనస్య పరితోభియ ఈశ విద్మః
బ్రహ్మా బిభేత్యలమతో ద్విపరార్ధధిష్ణ్యః
కాలస్య తే కిముత తత్కృతభౌతికానామ్

అన్ని వైపులా భయం ఆవరించి ఉన్న జీవునికి
నీ పాదపద్మాల చేరిక కంటే వేరే అభయాన్ని మేము తెలియము
సంసార తాప తప్తులకు భయాన్ని తొలగించేవి నీ పాదములే
ద్విపరార్థ కాల ఆయుష్యమున్న బ్రహ్మ కూడా కాలానికి భయపడుతూ ఉంటాడు
అలాంటపుడు బ్రహ్మ చేత సృష్టించబడిన వారు భయపడతారని వేరేగా చెప్పాలా

తద్వై భజామ్యృతధియస్తవ పాదమూలం
హిత్వేదమాత్మచ్ఛది చాత్మగురోః పరస్య
దేహాద్యపార్థమసదన్త్యమభిజ్ఞమాత్రం
విన్దేత తే తర్హి సర్వమనీషితార్థమ్

కాబట్టి ఉత్త్తమ భక్తి కలవారమై నీ పాద మూలాన్ని భజిస్తాము
శరీరము ఇంద్రియాలూ అన్నీ జీవుడు అందులో ఉన్నాడు అని చెప్పడానికి ఒక గుర్తు  మాత్రమే
అలాంటి ఆవరణలను విడిచిపెట్టి నీ పాదాలను సేవిస్తేనే అనుకున్నవన్నీ పొందగలడు

సత్త్వం రజస్తమ ఇతీశ తవాత్మబన్ధో
మాయామయాః స్థితిలయోదయహేతవోऽస్య
లీలా ధృతా యదపి సత్త్వమయీ ప్రశాన్త్యై
నాన్యే నృణాం వ్యసనమోహభియశ్చ యాభ్యామ్

నీ మాయతో వచ్చిన మూడు గుణాలు సృష్టి స్థితి సంహారాలను కలిగిస్తాయి
నీవే సత్వ రూపాన్ని ప్రశాంతి కోసం ధరిస్తావు. రజస్తమస్సుల వలన వ్యసన మోహాలు కలుగుతాయి. నీ దర్శనముతో అవి అన్నీ తొలగుతాయి

తస్మాత్తవేహ భగవన్నథ తావకానాం
శుక్లాం తనుం స్వదయితాం కుశలా భజన్తి
యత్సాత్వతాః పురుషరూపముశన్తి సత్త్వం
లోకో యతోऽభయముతాత్మసుఖం న చాన్యత్

నీ సత్వ రూపాన్ని ఉపాసించేవారికి ఏ భయమూ ఉండదు

తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే
విశ్వాయ విశ్వగురవే పరదైవతాయ
నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ
హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ

అటువంటి పరమాత్మకు నమస్కారము
నీవే ప్రపంచము, ప్రపంచానికి గురువూ
నీవే పరదేవతవు.
నరునికీ నారాయణునికీ నమస్కారం
మీరే హంసలు. మీరే మౌన స్వరూపులు
మీరే నిగమేశ్వరులు వేదాధిపతులు
అటువంటి మీకు నమస్కారం

యం వై న వేద వితథాక్షపథైర్భ్రమద్ధీః
సన్తం స్వకేష్వసుషు హృద్యపి దృక్పథేషు
తన్మాయయావృతమతిః స ఉ ఏవ సాక్షాద్
ఆద్యస్తవాఖిలగురోరుపసాద్య వేదమ్

రకరకముల ఇంద్రియముల మార్గములతో భ్రమ పడే వారు మీ స్వరూపాన్ని తెలుసుకోలేరు
నీవు మా హృదయాలలో ఇంద్రియాలలో ప్రాణాలలో మనసులో ఉన్నావు
ఐనా నిన్ను మేము తెలుసుకోలేకపోతున్నాము
నీ మాయ చేత మా అందరి బుద్ధీ కప్పబడుతూ ఉన్నది.
వేదానికి బ్రహ్మకు అందించినవాడవు
వేదాన్ని కాపాడినవాడవు

యద్దర్శనం నిగమ ఆత్మరహఃప్రకాశం
ముహ్యన్తి యత్ర కవయోऽజపరా యతన్తః
తం సర్వవాదవిషయప్రతిరూపశీలం
వన్దే మహాపురుషమాత్మనిగూఢబోధమ్

పరమాత్మను దర్శించుకుంటే వేదములు ఆత్మస్వరూపమూ స్పష్టముగా తెలుస్తాయి
ఇలాంటి నిన్ను తెలుసుకోవడానికి బ్రహ్మాది దేవతలు ప్రయత్నం చేస్తూ కూడా మోహాన్ని చెందుతారు
ఇటువంటి మహా పురుషున్ని, పరమ రహస్యమైన ఆత్మ స్వరూప ప్రకాశకునికి నమస్కరిస్తున్నాను అని మార్కండేయుడు శ్రీమన్నారాయణున్ని స్తోత్రం చేసాడు

                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                            సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment