Thursday, September 26, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ప్రథామాధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ప్రథామాధ్యాయం

శ్రీశుక ఉవాచ
యోऽన్త్యః పురఞ్జయో నామ భవిష్యో బారహద్రథః
తస్యామాత్యస్తు శునకో హత్వా స్వామినమాత్మజమ్

యదు వంశ విభూషణుడైన పరమాత్మ తన లోకానికి వెళ్ళిన తరువాత భూమి మీద ఏ రాజ వంశం పరిపాలించింది. ఏ వంశాలు పరిపాలించాయి అని అడుగగా
బృహద్రథుని వంశములో ఉన్న పురంజయుడే రాజుల వంశములో పరిపాలించిన వారిలో చివరివాడు.
రాజుల వంశములో రాజుగా పరిపాలించినవారిలో పురంజయుడు చివరివాడు
తరువాత మంత్రుల పరిపాలణం మొదలయ్యింది

ప్రద్యోతసంజ్ఞం రాజానం కర్తా యత్పాలకః సుతః
విశాఖయూపస్తత్పుత్రో భవితా రాజకస్తతః

అతని మంత్రి ఐన సునతుడు రాజునీ రాజ కుమారుడినీ చంపి తన కుమారుడు ఐన విశాఖుడిని రాజు చేసాడు

నన్దివర్ధనస్తత్పుత్రః పఞ్చ ప్రద్యోతనా ఇమే
అష్టత్రింశోత్తరశతం భోక్ష్యన్తి పృథివీం నృపాః

138 సంవత్సరాలు వీరి వంశం పరిపాలించింది

శిశునాగస్తతో భావ్యః కాకవర్ణస్తు తత్సుతః
క్షేమధర్మా తస్య సుతః క్షేత్రజ్ఞః క్షేమధర్మజః

విధిసారః సుతస్తస్యా జాతశత్రుర్భవిష్యతి
దర్భకస్తత్సుతో భావీ దర్భకస్యాజయః స్మృతః

నన్దివర్ధన ఆజేయో మహానన్దిః సుతస్తతః
శిశునాగా దశైవైతే సష్ట్యుత్తరశతత్రయమ్

వీరందరూ వారి సంతానం. ఈ పది పందినీ శిశునాగులూ అంటారు
360 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తాడు

సమా భోక్ష్యన్తి పృథివీం కురుశ్రేష్ఠ కలౌ నృపాః
మహానన్దిసుతో రాజన్శూద్రాగర్భోద్భవో బలీ

మహాపద్మపతిః కశ్చిన్నన్దః క్షత్రవినాశకృత్
తతో నృపా భవిష్యన్తి శూద్రప్రాయాస్త్వధార్మికాః

మహానంది సుతుడు శూద్ర స్త్రీ నుండి పుట్టిన మహాపద్మపతి అనే ఒక నందుడు, క్షత్రియ వంశాన్ని నాశనం చేసినవాడు
తరువాత ఇంచుమించు శూద్రులే పరిపాలిస్తారు
వీరు అధార్మికులు

స ఏకచ్ఛత్రాం పృథివీమనుల్లఙ్ఘితశాసనః
శాసిష్యతి మహాపద్మో ద్వితీయ ఇవ భార్గవః

ఇతను పృధ్విని ఏకచత్రముగా పరిపాలించాడు. రెండవ పరశురామునిలా చండశాసనుడై పరిపాలించాడు

తస్య చాష్టౌ భవిష్యన్తి సుమాల్యప్రముఖాః సుతాః
య ఇమాం భోక్ష్యన్తి మహీం రాజానశ్చ శతం సమాః

ఇతనికి ఎనిమిది మంది కుమారులు

నవ నన్దాన్ద్విజః కశ్చిత్ప్రపన్నానుద్ధరిష్యతి
తేషాం అభావే జగతీం మౌర్యా భోక్ష్యన్తి వై కలౌ

ఈ నవ నందులను ఒక  బ్రాహ్మణుడు ఉద్ధరిస్తాడు(చాణక్యుడు)
వీరి తరువాత చంద్రగుప్తుడు (మౌర్యులు) రాజులుగా వస్తారు

స ఏవ చన్ద్రగుప్తం వై ద్విజో రాజ్యేऽభిషేక్ష్యతి
తత్సుతో వారిసారస్తు తతశ్చాశోకవర్ధనః

చాణక్యుడే చంద్రగుప్తున్ని రాజుగా చేస్తాడు

సుయశా భవితా తస్య సఙ్గతః సుయశఃసుతః
శాలిశూకస్తతస్తస్య సోమశర్మా భవిష్యతి
శతధన్వా తతస్తస్య భవితా తద్బృహద్రథః

వీరందరూ అతని కుమారులు

మౌర్యా హ్యేతే దశ నృపాః సప్తత్రింశచ్ఛతోత్తరమ్
సమా భోక్ష్యన్తి పృథివీం కలౌ కురుకులోద్వహ

137 సంవత్సరాలు పరిపాలిస్తారు వీరు

అగ్నిమిత్రస్తతస్తస్మాత్సుజ్యేష్ఠో భవితా తతః
వసుమిత్రో భద్రకశ్చ పులిన్దో భవితా సుతః

తరువాత సేనాపతుల రాజ్యం మొదలవుతుంది.

తతో ఘోషః సుతస్తస్మాద్వజ్రమిత్రో భవిష్యతి
తతో భాగవతస్తస్మాద్దేవభూతిః కురూద్వహ

శుఙ్గా దశైతే భోక్ష్యన్తి భూమిం వర్షశతాధికమ్
తతః కాణ్వానియం భూమిర్యాస్యత్యల్పగుణాన్నృప

వీరందరూ శుంగులు, నూరు సంవత్సరాలు పరిపాలిస్తారు
ఈ కణ్వుడి దగ్గర నుండి భూమి కూడా ఫలితాలను తగ్గించి వేస్తుంది

శుఙ్గం హత్వా దేవభూతిం కాణ్వోऽమాత్యస్తు కామినమ్
స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతిః

కణ్వుడు శుంగున్ని చంపి రాజ్యం తీసుకుంటాడు

తస్య పుత్రస్తు భూమిత్రస్తస్య నారాయణః సుతః
కాణ్వాయనా ఇమే భూమిం చత్వారింశచ్చ పఞ్చ చ
శతాని త్రీణి భోక్ష్యన్తి వర్షాణాం చ కలౌ యుగే

వీరు అతని పుత్రులు.
345 సంవత్సరాలు పరిపాలిస్తారు

హత్వా కాణ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలో బలీ
గాం భోక్ష్యత్యన్ధ్రజాతీయః కఞ్చిత్కాలమసత్తమః

కాణ్వున్ని చంపి ఒక శూద్ర బృత్యుడు, రాజు అవుతాడు
ఇతడు ఆంధ్ర జాతీయుడు.

కృష్ణనామాథ తద్భ్రాతా భవితా పృథివీపతిః
శ్రీశాన్తకర్ణస్తత్పుత్రః పౌర్ణమాసస్తు తత్సుతః

అతని సోదరుడు రాజవుతాడు
వీరు అతని కుమారులు

లమ్బోదరస్తు తత్పుత్రస్తస్మాచ్చిబిలకో నృపః
మేఘస్వాతిశ్చిబిలకాదటమానస్తు తస్య చ

అనిష్టకర్మా హాలేయస్తలకస్తస్య చాత్మజః
పురీషభీరుస్తత్పుత్రస్తతో రాజా సునన్దనః

చకోరో బహవో యత్ర శివస్వాతిరరిన్దమః
తస్యాపి గోమతీ పుత్రః పురీమాన్భవితా తతః


మేదశిరాః శివస్కన్దో యజ్ఞశ్రీస్తత్సుతస్తతః
విజయస్తత్సుతో భావ్యశ్చన్ద్రవిజ్ఞః సలోమధిః

వీరంతా(30) ఆ వంశానికి చెందినవారు

ఏతే త్రింశన్నృపతయశ్చత్వార్యబ్దశతాని చ
షట్పఞ్చాశచ్చ పృథివీం భోక్ష్యన్తి కురునన్దన

వీరంతా 456 సంవత్సరాలు పరిపాలిస్తారు

సప్తాభీరా ఆవభృత్యా దశ గర్దభినో నృపాః
కఙ్కాః షోడశ భూపాలా భవిష్యన్త్యతిలోలుపాః

తరువాత ఏడుగురు ఆభీరులు , పదిమంది గర్ద్భులు, 16 కంకులూ పరిపాలిస్తారు

తతోऽష్టౌ యవనా భావ్యాశ్చతుర్దశ తురుష్కకాః
భూయో దశ గురుణ్డాశ్చ మౌలా ఏకాదశైవ తు

తరువాత యవనులు పాలిస్తారు. 14 మంది తురుష్కులు
పది మంది గరుడులు
11 మౌలులు


ఏతే భోక్ష్యన్తి పృథివీం దశ వర్షశతాని చ
నవాధికాం చ నవతిం మౌలా ఏకాదశ క్షితిమ్

వీరంతా కలసి 1099 సంవత్సరాలు పరిపాలిస్తారు

భోక్ష్యన్త్యబ్దశతాన్యఙ్గ త్రీణి తైః సంస్థితే తతః
కిలకిలాయాం నృపతయో భూతనన్దోऽథ వఙ్గిరిః

మౌలులు 300 సంవత్సరాలు పరిపాలిస్తారు

శిశునన్దిశ్చ తద్భ్రాతా యశోనన్దిః ప్రవీరకః
ఇత్యేతే వై వర్షశతం భవిష్యన్త్యధికాని షట్

వీరు 106 సంవత్సరాలు పరిపాలిస్తారు

తేషాం త్రయోదశ సుతా భవితారశ్చ బాహ్లికాః
పుష్పమిత్రోऽథ రాజన్యో దుర్మిత్రోऽస్య తథైవ చ

ఏకకాలా ఇమే భూపాః సప్తాన్ధ్రాః సప్త కౌశలాః
విదూరపతయో భావ్యా నిషధాస్తత ఏవ హి

13 మంది పుత్రులు వీరికి
7 గురు ఆంధ్రులు కౌసలులూ నిషధులూ పరిపాలిస్తారు

మాగధానాం తు భవితా విశ్వస్ఫూర్జిః పురఞ్జయః
కరిష్యత్యపరో వర్ణాన్పులిన్దయదుమద్రకాన్

తరువాత మాగధులు

ప్రజాశ్చాబ్రహ్మభూయిష్ఠాః స్థాపయిష్యతి దుర్మతిః
వీర్యవాన్క్షత్రముత్సాద్య పద్మవత్యాం స వై పురి
అనుగఙ్గమాప్రయాగం గుప్తాం భోక్ష్యతి మేదినీమ్

ప్రజలకు బ్రాహ్మణుల యందు భక్తి తగ్గుతుంది.
క్షత్రియులను పూర్తిగా సంహరించి పద్మవతీ నగరములో గంగనుంచీ ప్రయాగ వరకూ పరిపాలిస్తాడు

సౌరాష్ట్రావన్త్యాభీరాశ్చ శూరా అర్బుదమాలవాః
వ్రాత్యా ద్విజా భవిష్యన్తి శూద్రప్రాయా జనాధిపాః

వ్రాత్యులు( ఆశ్రమ భ్రష్టులు/ ధర్మభ్రష్టులు/ఉపనయనాది సంస్కారం లేనివారు- రెండు  అర్థాలున్నాయి)
రాజులు శూద్రప్రాయులుగా ఉంటారు

సిన్ధోస్తటం చన్ద్రభాగాం కౌన్తీం కాశ్మీరమణ్డలమ్
భోక్ష్యన్తి శూద్రా వ్రాత్యాద్యా మ్లేచ్ఛాశ్చాబ్రహ్మవర్చసః

వీళ్ళంతా మలేచ్చులు బ్రహ్మవర్చస్సు లేనివారు.

తుల్యకాలా ఇమే రాజన్మ్లేచ్ఛప్రాయాశ్చ భూభృతః
ఏతేऽధర్మానృతపరాః ఫల్గుదాస్తీవ్రమన్యవః

రాజులెవరైనా వారిలాగానే ఉంటారు.
వీరంతా అధర్మమూ అసత్యమూ, కొద్దిగా ఇచ్చి పెద్దగా కోప్పడేవారు

స్త్రీబాలగోద్విజఘ్నాశ్చ పరదారధనాదృతాః
ఉదితాస్తమితప్రాయా అల్పసత్త్వాల్పకాయుషః

స్త్రీ బాల గో బ్రాహ్మణులను చంపేవారు
పరుల ధనమూ పరుల భార్యలనూ, హరించేవారు
పుట్టినంతలోనే పోయేవారు (అల్పాయుష్యులు)
బలం తక్కువ ఆయుష్షు తక్కువ

అసంస్కృతాః క్రియాహీనా రజసా తమసావృతాః
ప్రజాస్తే భక్షయిష్యన్తి మ్లేచ్ఛా రాజన్యరూపిణః

సంస్కార, క్రియా హీనులు
రజో తమో గుణాలు గలవారు
అన్నము కాక డబ్బు తినేవారు
రాజు రూపములో ఉన్న మలేచ్చులు

తన్నాథాస్తే జనపదాస్తచ్ఛీలాచారవాదినః
అన్యోన్యతో రాజభిశ్చ క్షయం యాస్యన్తి పీడితాః

జనపధాలలో వారే రాజులైనపుడు వారి చేత పరిపాలించేవారు  కూడా అదే శీలం ఆచారం గలవారు
వీరంతా పరస్పరం ఒకరిచే ఒకరు పీడించబడి చస్తారు


                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment