Monday, January 28, 2013

అరణ్యానికి వెళ్ళిన కర్దముడు చేసిన పనులు

అరణ్యానికి వెళ్ళిన కర్దముడు చేసిన పనులు

అరణ్యమునకు వెళ్ళి మౌన వ్రతాన్ని ఆచరించాడు (జితం సర్వం జితే రసే - నాలుకకు రెండు పనులు ఉన్నాయి. మౌన వ్రతం, రోజులో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతామో ఆ సమయాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. మౌనం రెండు రకాలు వాచా మౌనం, హృదా మౌనం. వాక్కును నియమించినపుడు మనసును కూడా నియమించాలి.  ). పరమాత్మని మాత్రమే రక్షకునిగా భావించాడు.  మౌనం ఆశ్రయించాడు కాబట్టి ముని అయ్యాడు. ఇంద్రియార్థములయందు ఎ మాత్రం ఆసక్తి లేని వాడు. గార్హపత్యాగ్ని(నిత్యాగ్ని హోత్రాన్ని తనలో ఆవాహన చేసుకుని సన్యాసం స్వీకరించాడు), అనికేతన (ఇల్లు కూడా లేని వాడయ్యాడు). అన్ని మమకారాలకు మూలమైనది గృహం. ( అందుకే ధర్మ శాస్త్రం "ఇల్లు ఇల్లు కాదు - అసలైన ఇల్లు ఇల్లాలే అని చెబుతుంది)

తన మనసుని పరమాత్మ యందు లగ్నం చేసాడు. పరమాత్మ సత్అసత్ రెండూ అయిన్ పరమాత్మ యందు లగ్నం చేసి . గుణావభాసములైన (గుణాలలా అనిపించే) శబ్ద స్పర్శ రూప రస గంధములు వంటి గుణాలు లేని వాడు, కళ్యాణ గుణములు గలవాడైన పరమాత్మ, భక్తితో మాత్రమే ధ్యానించడానికి దొరికేవాడు అయిన పరమాత్మ యందు మనసు లగ్నం చేసాడు


నిరహంకారం ( దేహాత్మాభిమానం లేక) , మమకారం (ఆత్మగా భావించే దేహం కొరకు, దేహం వలన వచ్చిన వారి యందు ఉండేది. అవిద్య అనే మహా వృక్షం నుండి సంసారానికి రెండు బీజాలు పుట్టాయి. తనది కాని దాన్ని తనది అనుకోవాడు, తాను కాని దానిని తాను అనుకోవడం),  శీతోష్ణ సుఖదుఖాలను సమముగా చూచేవాడు (అందుకే వేసవిలో పంచాగ్నుల మధ్యా, వర్షాకాలములో పైకప్పులేని ఆకాశములో ఉండి, చలికాలములో చల్ల నీటిలో ఉండి తపస్సు చేయాలి) , సకల ప్రాణులనూ సమానముగా చూసేవాడు (ప్రతీ జీవికి, వారు వారు ఆయా జన్మలలో చేసుకున్న పాప పుణ్య కర్మల వలన వచ్చిన శరీరాలే. పరమాత్మ ప్రసాదమే ఈ శరీరాలన్నీ. పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. ) ,  స్వదృక్ - అంతటా తనను చూచేవాడు, తనలో అందరినీ చూచేవాడు. ప్రపంచములో పరమాత్మనీ, పరమాత్మలో ప్రపంచాన్ని చూచుట స్వదృక్. ప్రత్యక్ - జీవాత్మ. ఎలాంటి ఒడిదుడుకులూ లేని జీవాత్మ.

No comments:

Post a Comment