Thursday, November 15, 2012

వివేకం

వివేకం అనగా శరీరం ఆత్మ వేరు అని తెలియడం - భక్తి జ్ఞ్యానవిరాగములతో వివేకం కలుగుతుంది.
మొదలు భక్తి కలగాలి - భగవంతుని మీద ప్రేమకు భక్తి అని పేరు. అప్పుడు భగవంతుని మాహత్యం తెలుస్తుంది - అదే జ్ఞ్యానం. జ్ఞ్యానం వల్ల విరాగం కలుగుతుంది

పరీక్షిన్మహరాజు ప్రాయోపవేశం చేసినప్పుడు 6994 మంది ఋషులు వచ్చారు. గోవు గాయత్రి గంగ గీత సుర్యుడు ఇవన్నీ ఒకటే
భాగవత ప్రవచనాలు పలురకాలు - సాత్వికం రాజసం తామసం
భాగవత సప్తాహం - రాజసం. ఇది ఖర్చుతో కూడుకున్నది. అందుకే రాజసం కాని వెంటనే ఫలితం ఇస్తుంది
21 లేదా 14, 31, 62 రోజులు - సాత్వికం
ఒక యేడాది లేదా ఇంకా ఎక్కువ - తామసం
కాల నియమంలేకుండా చేసేది - నిర్గుణం - ఇది ఉత్తమోత్తమం

మనస్సును గెలవలేము కాబట్టి, మానవులు అల్పాయుష్కులు కాబట్టి, లోభాన్ని గెలవలేము కాబట్టి సప్తాహ శ్రవణం ఉత్తమం సత్యం మనోనిగ్రహంతో వినాలి.


No comments:

Post a Comment