Tuesday, June 25, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

                                              ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీః
స్వైరం చరన్త్యో వివిశుస్తృణలోభేన గహ్వరమ్

కాళీయ హ్రద తీరములో దావాగ్ని కొద్దిగానే వచ్చింది. ఈ సారి పగటిపూటే వచ్చింది. వారందరూ చూడకుండా ఉండడానికి మీరందరూ కళ్ళు మూసుకోండి కాపాడబడతారు అన్నాడు.
అందరూ హాయిగా విహరిస్తూ ఉన్నారు. ఆవులూ దూడలూ ఒక వనం నుంచి ఇంకో వనానికి హాయిగా వెళ్ళాయి

అజా గావో మహిష్యశ్చ నిర్విశన్త్యో వనాద్వనమ్
ఈషీకాటవీం నిర్వివిశుః క్రన్దన్త్యో దావతర్షితాః

తేऽపశ్యన్తః పశూన్గోపాః కృష్ణరామాదయస్తదా
జాతానుతాపా న విదుర్విచిన్వన్తో గవాం గతిమ్

తృణైస్తత్ఖురదచ్ఛిన్నైర్గోష్పదైరఙ్కితైర్గవామ్
మార్గమన్వగమన్సర్వే నష్టాజీవ్యా విచేతసః

అలా చాలా దూరం వెళ్ళాయి. కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళాయో. బాగా గడ్డి ఏపుగా పెరగడముతో అడుగుజాడలు కూడా లేవు . వాటిని ఎలా వెతకాలో పరితాపం పొందుతూ ప్రాణాలు పోయిన వారిలాగ వాటిని వెతుక్కుంటూ

ముఞ్జాటవ్యాం భ్రష్టమార్గం క్రన్దమానం స్వగోధనమ్
సమ్ప్రాప్య తృషితాః శ్రాన్తాస్తతస్తే సన్న్యవర్తయన్

ఆవులు కూడా దారి తప్పి అంబారావం చేస్తున్నాయి. ఆ అరుపులు వినవస్తున్నాయి గానీ అవి ఎక్కడ ఉన్నాయో కనపడడం లేదు. ఇక మా వల్ల కాదు అని వెతకలేక వెనక్కు వచ్చి కృష్ణునితో చెప్పారు

తా ఆహూతా భగవతా మేఘగమ్భీరయా గిరా
స్వనామ్నాం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః

అపుడు మేఘ గంభీర నాదముతో ఒక్కో ఆవు పేరునూ గట్టిగా పిలిస్తూ ఉంటే అవి కూడా అంబారావములో వాటి పేరు పలుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చాయి

తతః సమన్తాద్దవధూమకేతుర్యదృచ్ఛయాభూత్క్షయకృద్వనౌకసామ్
సమీరితః సారథినోల్బణోల్ముకైర్విలేలిహానః స్థిరజఙ్గమాన్మహాన్

హమ్మయ్య ఆవులు వచ్చేసాయి మనం వెళ్ళవచ్చు అనుకుంటూ ఉంటే, వాటితోబాటే దావాగ్ని కూడా వచ్చింది. గాలి చేత ప్రోత్సహించబడి మహా వృక్షాలను కాలుస్తూ మహావేగముగా వస్తోంది. అందరూ భయపడి మృత్యు భయం ఆవరించిన మానవులు పరమాత్మను ఎలా పిలుస్తారో అలా కృష్ణున్ని ఆశ్రయించి కాపాడమని అన్నారు. మేము నీ బంధువులము. నీ బంధువులకు ఆపద రావచ్చా?

తమాపతన్తం పరితో దవాగ్నిం గోపాశ్చ గావః ప్రసమీక్ష్య భీతాః
ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నా యథా హరిం మృత్యుభయార్దితా జనాః

కృష్ణ కృష్ణ మహావీర హే రామామోఘ విక్రమ
దావాగ్నినా దహ్యమానాన్ప్రపన్నాంస్త్రాతుమర్హథః

నూనం త్వద్బాన్ధవాః కృష్ణ న చార్హన్త్యవసాదితుమ్
వయం హి సర్వధర్మజ్ఞ త్వన్నాథాస్త్వత్పరాయణాః

మేమంతా నిన్నే దిక్కుగా భావించాము. నీవే మాకు శరణం.

శ్రీశుక ఉవాచ
వచో నిశమ్య కృపణం బన్ధూనాం భగవాన్హరిః
నిమీలయత మా భైష్ట లోచనానీత్యభాషత

ఏమీ భయపడకండి అందరూ మీ కన్నులు ఒకసారి మూసుకోండి అన్నాడు.

తథేతి మీలితాక్షేషు భగవానగ్నిముల్బణమ్
పీత్వా ముఖేన తాన్కృచ్ఛ్రాద్యోగాధీశో వ్యమోచయత్

పరమాత్మ చెప్పగానే కళ్ళు గట్టిగా మూసుకున్నారు అందరూ.మళ్ళీ అగ్నిని పానం చేసి వారిని అవతలకు దాటించాడు. అందరూ కళ్ళు తెరిచి చూసి ఇళ్ళకు చేరారు

తతశ్చ తేऽక్షీణ్యున్మీల్య పునర్భాణ్డీరమాపితాః
నిశమ్య విస్మితా ఆసన్నాత్మానం గాశ్చ మోచితాః

మాకూ ఆవులకూ కూడా ఆపద తప్పిందని చూచి, పరమాత్మ యొక్క యోగ మాయా ప్రభావాన్ని గుర్తించారు

కృష్ణస్య యోగవీర్యం తద్యోగమాయానుభావితమ్
దావాగ్నేరాత్మనః క్షేమం వీక్ష్య తే మేనిరేऽమరమ్

గాః సన్నివర్త్య సాయాహ్నే సహరామో జనార్దనః
వేణుం విరణయన్గోష్ఠమగాద్గోపైరభిష్టుతః

ఇంత పెద్ద దావాని నుండి మమ్ములను సురక్షితముగా ఉంచాడంటే ఈయన మామూలు మహాత్ముడు కాడు అని ఆవులను  తీస్కుకుని ఇళ్ళకు వెళ్ళారు

గోపీనాం పరమానన్ద ఆసీద్గోవిన్దదర్శనే
క్షణం యుగశతమివ యాసాం యేన వినాభవత్

కృష్ణ పరమాత్మ వచ్చాడన్న విషయం తెలుసుకున్న గోపికలు పరమానందాన్ని పొందారు. 


                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment