Tuesday, June 25, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహేడవ అధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
నాగాలయం రమణకం కథం తత్యాజ కాలియః
కృతం కిం వా సుపర్ణస్య తేనైకేనాసమఞ్జసమ్

గరుత్మంతుని భయముతో కాళీయుడు ఈ నదికి వచ్చాడని చెప్పారు. గరుత్మంతునికి కాళీయుడు చేసిన అపచారం ఏమిటి

శ్రీశుక ఉవాచ
ఉపహార్యైః సర్పజనైర్మాసి మాసీహ యో బలిః
వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాఙ్నిరూపితః

గరుడుడి ఆహారం సర్పాలు. సర్పాలన్నీ "మేమే మీ దగ్గరకు వస్తాము రోజు. నెల ఒకరము వచ్చి నీకు తీసుకుని వచ్చి ఒక చెట్టు దగ్గర పెట్టి వెళతాము"

స్వం స్వం భాగం ప్రయచ్ఛన్తి నాగాః పర్వణి పర్వణి
గోపీథాయాత్మనః సర్వే సుపర్ణాయ మహాత్మనే

ఎవరు ఏ  రోజు వచ్చి తీసుకు రావాలో ఆ వరుసలో వచ్చి తీసుకు వెళుతున్నారు. ఇలా అందరూ చేసారు కానీ కాళీయుడు తాను బలాడ్యుడని గర్వించి, తాను గరుత్మంతునికి ఆహరం పెట్టక ఆ ఆహారం తానే తినేశాడు

విషవీర్యమదావిష్టః కాద్రవేయస్తు కాలియః
కదర్థీకృత్య గరుడం స్వయం తం బుభుజే బలిమ్

గరుడుడు అది తెలుసుకుని అతన్ని చంపాలని సముద్రం వద్దకు వచ్చాడు. అప్పుడు గరుత్మంతున్ని కాటు వేయడానికి ప్రయత్నించాడు. అపుడు గరుడుడు ఎడమ రెక్క కొసభాగముతో కొట్టగా కాళీయుడు ఈ నది వద్దకు వచ్చి పడ్డాడు

తచ్ఛ్రుత్వా కుపితో రాజన్భగవాన్భగవత్ప్రియః
విజిఘాంసుర్మహావేగః కాలియం సమపాద్రవత్

తమాపతన్తం తరసా విషాయుధః ప్రత్యభ్యయాదుత్థితనైకమస్తకః
దద్భిః సుపర్ణం వ్యదశద్దదాయుధః కరాలజిహ్రోచ్ఛ్వసితోగ్రలోచనః

తం తార్క్ష్యపుత్రః స నిరస్య మన్యుమాన్
ప్రచణ్డవేగో మధుసూదనాసనః
పక్షేణ సవ్యేన హిరణ్యరోచిషా
జఘాన కద్రుసుతముగ్రవిక్రమః

ఎడమ రెక్కతో మెల్లగా కొట్టగా ఈ హ్రదములోకి వచ్చిపట్టాడు కాళీయుడు కుంగిపోయి. ఈ హ్రదములో వచ్చి దాక్కున్నాడు

సుపర్ణపక్షాభిహతః కాలియోऽతీవ విహ్వలః
హ్రదం వివేశ కాలిన్ద్యాస్తదగమ్యం దురాసదమ్

అన్ని లోకాలలో గర్తుమంతుడు రావడానికి వీలు లేని మడుగు ఇది ఒక్కటే. ఈ మడుగులో సౌభరి అనే ముని ఉన్నాడు. గరుత్మంతుడు పైన వెళుతూ ఉంటే ఒకసారి ఒక చేప కనపడింది. ఆ మడులో ఉన్న సౌభరిని ఆ చేపలు శరణు వేడాయి. సౌభరి ఇక్కడకు రాకు, ఇది ముని ఆశ్రమం అని అన్నాడు. ఐనా వినకుండా గరుత్మంతుడు రాగా, ఈ మడుగులోకి వచ్చావంటే నీ తల ముక్కలవుతుంది అని శపించాడు. అది తెలుసుకున్న కాళీయుడు ఇక్కడ ప్రవేశించాడు

తత్రైకదా జలచరం గరుడో భక్ష్యమీప్సితమ్
నివారితః సౌభరిణా ప్రసహ్య క్షుధితోऽహరత్

మీనాన్సుదుఃఖితాన్దృష్ట్వా దీనాన్మీనపతౌ హతే
కృపయా సౌభరిః ప్రాహ తత్రత్యక్షేమమాచరన్

అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాన్స ఖాదతి
సద్యః ప్రాణైర్వియుజ్యేత సత్యమేతద్బ్రవీమ్యహమ్

తత్కాలియః పరం వేద నాన్యః కశ్చన లేలిహః
అవాత్సీద్గరుడాద్భీతః కృష్ణేన చ వివాసితః

కృష్ణం హ్రదాద్వినిష్క్రాన్తం దివ్యస్రగ్గన్ధవాససమ్
మహామణిగణాకీర్ణం జామ్బూనదపరిష్కృతమ్

కాళీయుడు సంపరించిన మణులు ధరించి కృష్ణ పరమాత్మ పైకి వచ్చాడు

ఉపలభ్యోత్థితాః సర్వే లబ్ధప్రాణా ఇవాసవః
ప్రమోదనిభృతాత్మానో గోపాః ప్రీత్యాభిరేభిరే

చాలా కాలానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినంతగా కృష్ణున్ని చూచి సంతోషముతో అతన్ని దగ్గరకు తీసుకుని సంతోషించారు

యశోదా రోహిణీ నన్దో గోప్యో గోపాశ్చ కౌరవ
కృష్ణం సమేత్య లబ్ధేహా ఆసన్శుష్కా నగా అపి

ఇప్పటికి మా మనసు కుదుట పడింది అనుకున్నారు

రామశ్చాచ్యుతమాలిఙ్గ్య జహాసాస్యానుభావవిత్
ప్రేమ్ణా తమఙ్కమారోప్య పునః పునరుదైక్షత
గావో వృషా వత్సతర్యో లేభిరే పరమాం ముదమ్

అందరూ కౌగిలించుకుని వదిలిపెట్టాక బలరామున్ని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని ఒక చిరునవ్వు నవ్వాడు. కృష్ణుని ప్రభావం తెలిసిన బలరాముడు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. గోపికలూ గోపాలురే కాక గోవులూ దూడలూ చెట్లు పర్వతములూ శిలలు పక్షులు కూడా పైకి వచ్చిన కృష్ణ పరమాత్మను చూచి పరమానందాన్ని పొందారు

నన్దం విప్రాః సమాగత్య గురవః సకలత్రకాః
ఊచుస్తే కాలియగ్రస్తో దిష్ట్యా ముక్తస్తవాత్మజః

బ్రాహ్మణులూ గురువులూ వచ్చి నందునితో "నందా నీవు చాలా అదృష్టవంతుడవు. కాళీయుని చేత ఇంచుమించు మింగబడిన నీ కుమారుడు మళ్ళీ బయటకు వచ్చాడంటే ఎంతో ప్రభావం కలవాడు నీ కుమారుడు. మనకు ఒక ఆపద తొలగిందంటే మనం చేయవలసింది, గోబ్రాహ్మణులకూ భోజనం పెట్టాలి, బ్రాహ్మణులకు వస్త్రములూ ఆభరణములూ దక్షిణలూ ఇవ్వాలి. వారి ఆశీర్వాదమూ అనుగ్రహ్మూ లేకుండా నీవు ఇంత ఆపదను తప్పించుకోలేవు.కృష్ణుడు కాళీయుని నుంచి ముక్తిపొందిన ఈ సందర్భములో బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి అని చెప్పగా నందుడు అలాగే చేసాడు

దేహి దానం ద్విజాతీనాం కృష్ణనిర్ముక్తిహేతవే
నన్దః ప్రీతమనా రాజన్గాః సువర్ణం తదాదిశత్

యశోదాపి మహాభాగా నష్టలబ్ధప్రజా సతీ
పరిష్వజ్యాఙ్కమారోప్య ముమోచాశ్రుకలాం ముహుః

తల్లికూడా పిల్లవాన్ని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, నీటి ధారలతో అతన్ని తడిపింది

తాం రాత్రిం తత్ర రాజేన్ద్ర క్షుత్తృడ్భ్యాం శ్రమకర్షితాః
ఊషుర్వ్రయౌకసో గావః కాలిన్ద్యా ఉపకూలతః

ఆ హ్రదములోకి వెళ్ళడానికి ఆంక్షలు లేకపోవడముతో అందరూ ఆ హ్రదములో ఆడుకున్నారు. అక్కడే పడుకున్నారు. 

తదా శుచివనోద్భూతో దావాగ్నిః సర్వతో వ్రజమ్
సుప్తం నిశీథ ఆవృత్య ప్రదగ్ధుముపచక్రమే

తత ఉత్థాయ సమ్భ్రాన్తా దహ్యమానా వ్రజౌకసః
కృష్ణం యయుస్తే శరణం మాయామనుజమీశ్వరమ్

అప్పుడు దావాగ్ని మొత్తం అడవిని చుట్టుముట్టింది, అందరూ పరుగెత్తుకుని వచ్చి కృష్ణున్ని శరణు వేడారు. రామా! కృష్ణా! ఈ దావాగ్ని మీవారమైన మమ్ము మింగుతున్నది

కృష్ణ కృష్ణ మహాభగ హే రామామితవిక్రమ
ఏష ఘోరతమో వహ్నిస్తావకాన్గ్రసతే హి నః

సుదుస్తరాన్నః స్వాన్పాహి కాలాగ్నేః సుహృదః ప్రభో
న శక్నుమస్త్వచ్చరణం సన్త్యక్తుమకుతోభయమ్

ఎలాంటి ఆపదలోనైనా అందరికీ దిక్కు నీ పాదములే. వాటినే శరణముగా స్వీకరించాము అని ఏక కంఠముతో అందరూ ప్రార్థన చేస్తే

ఇత్థం స్వజనవైక్లవ్యం నిరీక్ష్య జగదీశ్వరః
తమగ్నిమపిబత్తీవ్రమనన్తోऽనన్తశక్తిధృక్

మీరేమీ భయపడకండీ అంటూ స్వామి అగ్నిని అంతా తాగేసాడు అనంత శక్తిధరుడు . (ఆయన ముఖమే అగ్నిహోత్రుడు)

                                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment