Sunday, April 14, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
పృశ్నిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్
అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్

పన్నెండు మంది ఆదిత్యులలో ఒకరు త్వష్ట, తరువాత సవిత
సవిత భార్య ఐన పృశ్ని మహామఖులైన వీరందరినీ సంతానముగా పొందింది (సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్ అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం)

సిద్ధిర్భగస్య భార్యాఙ్గ మహిమానం విభుం ప్రభుమ్
ఆశిషం చ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతామ్

పన్నెండు మంది ఆదిత్యులలో భగుడు కూడా ఒకరు. అతని భార్య సిద్ధి. ఒక కన్యనూ ముగ్గురు కుమారులనూ కన్నారు

ధాతుః కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా
సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసమనుక్రమాత్

ధాతకు కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసం సంతానముగా కలిగారు

అగ్నీన్పురీష్యానాధత్త క్రియాయాం సమనన్తరః
చర్షణీ వరుణస్యాసీద్యస్యాం జాతో భృగుః పునః

అగ్నిక్రియలో వీరందరినీ సంతానముగా పొందారు. వరుణుని భార్య చర్షణి. వారికి బృగు మహర్షి మరలా పుత్రునిగా పుట్టారు.

వాల్మీకిశ్చ మహాయోగీ వల్మీకాదభవత్కిల
అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోరృషీ

వాల్మీకి కూడా వరుణునికీ చర్షణికీ పుట్టారు. అందుకే వాల్మికీ కూడా ప్రాచేతసుడు (వరుణ). రెండవ సారి ఈయన పుట్ట నుండి పుట్టాడు. నాలుగు మహాయుగాలు జపం చేసాడు. అంతలో ఆయన మీద పెద్ద పుట్ట మొలచింది. పుట్ట (వల్మీకం) నుంచి లేచాడు కాబట్టి ఈయన వాల్మీకి. అగస్త్య వసిష్ఠ మహర్షి మిత్రా వరుణులు (ఆదిత్యులు) ఊర్వశి నాట్యం చేస్తుండగా వ్యామోహించి కుండలో తమ వీర్యాన్ని నిక్షిప్తం చేసారు. అగస్త్యుడు మిత్రా వరుణుల కుమారుడు, తల్లి ఊర్వశి. (ఎవరిని భావించి రేతస్సును వదిలిపెడతామో వారే తల్లి అవుతారు. కంసుడు ఉగ్రసేనుడి కుమారుడే గానీ, ఉగ్రసేనుడు పరమభక్తుడైనప్పుడు కంసుడు అలా ఎందుకయ్యాడు. ఉగ్రసేనుని భార్య ఋతుమతియై ఒక సాయంకాలం వేళ విహరిస్తూ ఉండగా తన భర్తను స్మరించింది ఒక ఉద్యానవనములో. ఎప్పటినుండో ఆమె సౌందర్యాన్ని ఆశించిన ఒక గంధర్వుడు భర్త రూపాన్ని తీసుకుని అసురాంశతో వచ్చాడు. వారి సమాగమం వలన కంసుడు పుట్టాడు. కానీ కంసుడు అసుర గంధర్వ వీర్యం వలన వచ్చాడు. క్షేత్ర బీజ సంకల్ప ప్రభావం వలననే పిల్లలు పుడతారు. అందుకే ఏ వైపు చూసిన పరమాత్మ చిత్రపటాలు ఉండేట్లు ఉంచుతారు శయ్యామందిరములో. కారణమూ స్మరణమూ దేహమూ.) మిత్రావరుణులు ఊర్వశి సౌందర్యం చూసి అగస్త్య వసిష్ఠుల జననం కోసం కుంభములో రేతస్సు ఉంచారు.
మిత్రుడు రేవతి యందు ముగ్గురు కుమారులను పొందాడు.

రేతః సిషిచతుః కుమ్భే ఉర్వశ్యాః సన్నిధౌ ద్రుతమ్
రేవత్యాం మిత్ర ఉత్సర్గమరిష్టం పిప్పలం వ్యధాత్

పౌలోమ్యామిన్ద్ర ఆధత్త త్రీన్పుత్రానితి నః శ్రుతమ్
జయన్తమృషభం తాత తృతీయం మీఢుషం ప్రభుః

ఇంద్రుడు పౌలోమి యందు ముగ్గురు కుమారులను పొందాడు

ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః
కీర్తౌ పత్న్యాం బృహచ్ఛ్లోకస్తస్యాసన్సౌభగాదయః

త్రివిక్రముడి భార్య కీర్తి, వీరికి బృహశ్లోకుడూ, అతనికి సౌభగుడూ కలిగారు

తత్కర్మగుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః
పశ్చాద్వక్ష్యామహేऽదిత్యాం యథైవావతతార హ

కాశ్యపస ప్రభావాన్ని తరువాత చెబుతాను

అథ కశ్యపదాయాదాన్దైతేయాన్కీర్తయామి తే
యత్ర భాగవతః శ్రీమాన్ప్రహ్రాదో బలిరేవ చ

కశ్యపుడికీ అధితికీ వామనుడిగా స్వామి ఎలా అవతరించాడో ఆ ఉపాఖ్యానం తరువాత చెబుతాను. ఇంతవరకూ దేవతల గురించి చెప్పాను.. ఇక దితి పుత్రుల గురించి విను. ఆ వంశములో ప్రహ్లాదుడూ బలి చక్రవతీ పుట్టారు.

దితేర్ద్వావేవ దాయాదౌ దైత్యదానవవన్దితౌ
హిరణ్యకశిపుర్నామ హిరణ్యాక్షశ్చ కీర్తితౌ

దైత్య దానవుల చేత కీర్తించబడే దితి పుత్రులు ఇద్దరు ఉన్నారు. హిరణ్యకశిపుడూ హిరణ్యాక్షుడు.

హిరణ్యకశిపోర్భార్యా కయాధుర్నామ దానవీ
జమ్భస్య తనయా సా తు సుషువే చతురః సుతాన్

కయాత అనే హిరణ్యకశిపుని భార్య, వీరికి నలుగురు పుత్రులు సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ

సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ చ
తత్స్వసా సింహికా నామ రాహుం విప్రచితోऽగ్రహీత్

సింహిక అన్న పుత్రిక కలదు. రాహువు సింహికను వివాహం చేసుకున్నాడు. ఇతన్ని శ్రీమహావిష్ణువు చక్రముతో సంహరించాడు.

శిరోऽహరద్యస్య హరిశ్చక్రేణ పిబతోऽమృతమ్
సంహ్రాదస్య కృతిర్భార్యా సూత పఞ్చజనం తతః

సంహ్రాదునికి కృతి భార్య , వీరికి పంచజనుడనే కొడుకు

హ్రాదస్య ధమనిర్భార్యా సూత వాతాపిమిల్వలమ్
యోऽగస్త్యాయ త్వతిథయే పేచే వాతాపిమిల్వలః

హ్రాదునికి ధమని యందు వాతాపీ ఇల్వలుడు పుట్టారు. వీరు అగస్త్యుని చేత సంహరించబడ్డారు

అనుహ్రాదస్య సూర్యాయాం బాష్కలో మహిషస్తథా
విరోచనస్తు ప్రాహ్రాదిర్దేవ్యాం తస్యాభవద్బలిః

ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. అతని కుమారుడు బలి చక్రవర్తి. అతనికి బాణుడు పెద్ద కుమారుడు

బాణజ్యేష్ఠం పుత్రశతమశనాయాం తతోऽభవత్
తస్యానుభావం సుశ్లోక్యం పశ్చాదేవాభిధాస్యతే

ఆ బలి చక్రవర్తి ప్రహ్లాదుల ప్రభావం తరువాత వివరిస్తాను

బాణ ఆరాధ్య గిరిశం లేభే తద్గణముఖ్యతామ్
యత్పార్శ్వే భగవానాస్తే హ్యద్యాపి పురపాలకః

బాణాసురుడు శంకరున్ని పూజించి శంకరుని ప్రమధ గణాలలో ఒకడయ్యాడు. ఇప్పటికీ ద్వారపాలకుడిగా ఉన్నాడు

మరుతశ్చ దితేః పుత్రాశ్చత్వారింశన్నవాధికాః
త ఆసన్నప్రజాః సర్వే నీతా ఇన్ద్రేణ సాత్మతామ్

దితికి నలభై తొమ్మిది మంది మరుత్ గణములు పుట్టారు. శ్రాద్ధ, పితృ తర్పణ గ్రహణ సంక్రమణ కాలములో వీరి జననం వినాలి. పుట్టబోయే ముందు ఇంద్రుడు వారిని తన భృత్యులుగా చేసుకున్నాడు. కశ్యప ప్రజాపతికీ దితికీ పుట్టిన వారు మరుత్తులు. ఇది విన్న వారికి వంశ వృద్ధి అవుతుంది.

శ్రీరాజోవాచ
కథం త ఆసురం భావమపోహ్యౌత్పత్తికం గురో
ఇన్ద్రేణ ప్రాపితాః సాత్మ్యం కిం తత్సాధు కృతం హి తైః

దితి పుత్రులు ఆసురత్వాన్ని వదిలిపెట్టి దైవత్వాన్ని ఎలా పొందారు. ఈ విషయాన్ని నాతో బాటు కథ వింటోన్న ఋషులకు కూడా వినాలని ఉంది.

ఇమే శ్రద్దధతే బ్రహ్మన్నృషయో హి మయా సహ
పరిజ్ఞానాయ భగవంస్తన్నో వ్యాఖ్యాతుమర్హసి

శ్రీసూత ఉవాచ
తద్విష్ణురాతస్య స బాదరాయణిర్వచో నిశమ్యాదృతమల్పమర్థవత్
సభాజయన్సన్నిభృతేన చేతసా జగాద సత్రాయణ సర్వదర్శనః

విష్ణు రాతుడు ఆర్థ్రతతో అడిగినందుకు సంతోషించి అన్నీ తెలుసుకున్నవాడైన శుకుడు పరీక్షిత్తుకు వివరించాడు.

శ్రీశుక ఉవాచ
హతపుత్రా దితిః శక్ర పార్ష్ణిగ్రాహేణ విష్ణునా
మన్యునా శోకదీప్తేన జ్వలన్తీ పర్యచిన్తయత్

దేవ దానవ యుద్ధములో ఇంద్రుడు రాక్షసులని సంహరించాడు. ఇంద్రునికి శ్రీ హరి రక్షకునిగా ఉన్నాడు

కదా ను భ్రాతృహన్తారమిన్ద్రియారామముల్బణమ్
అక్లిన్నహృదయం పాపం ఘాతయిత్వా శయే సుఖమ్

తన సంతానాన్ని విష్ణువు చంపడం చూసి ఆ దుఃఖం తట్టుకోలేక, నా పిల్లలు ఇలా అయ్యినందుకు నా సవతి అయిన అదితి పిల్లలు ఇలా ఎప్పుడవుతారు అని అమర్షముతో ఉంది. నాకొక కుమారుడు కలిగి వాడు ఇంద్రున్ని చంపితే ఆ వార్త నేను విని ప్రశాంతముగా ఎప్పుడు నిద్రపోతానో.

కృమివిడ్భస్మసంజ్ఞాసీద్యస్యేశాభిహితస్య చ
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

ఈ భావాన్ని చెప్పవలసి వచ్చినందుకు వ్యాసుడూ  శుకుడూ బాధపడుతున్నారు.  అందరూ బాధపడుతున్నదీ బాధపెడుతున్నదీ ఈ శరీరాన్నే. తాను ఏ శరీరాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడో అలాంటి ఇంకొకరి శరీరాన్ని బాధపెట్టాలని చూస్తున్నారు. చనిపోయిన తరువాత ఏమవుతుంది. దహనం చేస్తే బూడిదవుతాడు. లేకపోతే ఏ కుక్కలో గద్దలో పీక్కొని తింటాయి. తిన్న తరువాత మలం వదిలిపెడతాయి.  కాలిస్తే బూడిదవుతుంది, విడిచిపెడితే మలమవుతుంది. కొంతభాగం పురుగవుతుంది, మలమవుతుంది, లేక బూడిదవుతుంది. అలాంటి ఈ శరీరం కోసం ఇలాంటి ఇంకో శరీరాన్ని వేధిస్తున్నారు.
ఈ పాపాన్ని వారు నరకములో అనుభవిస్తారు. పెళ్ళి ఒక నరకం, పిల్లలు ఒక నరకం, పిల్లలకు యవ్వనం రావడం ఒక నరకం. తమకు వృద్ధాప్యం రావడం ఒక నరకం. ఐదవ నరకం రోగం. ఆరు నుంచీ తొమ్మిది వరకూ నరకలోకములో అనుభవిస్తాము. ఇలా నవ విధ నరకములలో బాధపడుతూ ఉంటారు. నిజముగా శత్రువుకు బాధకలిగించాలనుకుంటే వారితో మాట్లాడకు, శత్రువు మీద పగ తీర్చుకోవడమంటే వారితో బాధించబడు. ఈ విషయం తెలుసుకోరు. దీని వలన నరకం వస్తుంది

ఆశాసానస్య తస్యేదం ధ్రువమున్నద్ధచేతసః
మదశోషక ఇన్ద్రస్య భూయాద్యేన సుతో హి మే

ఇలా జ్ఞ్యాతులూ శత్రువులూ ఎవ్వరూ మిగలకుండా అందరూ పోవాలి అని బాధిస్తున్న ఇంద్రుని మదం ఎలా అణచాలి అని ఆలోచిస్తూ ఉన్నది

ఇతి భావేన సా భర్తురాచచారాసకృత్ప్రియమ్
శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ

ఇంద్రునికి హాని కలిగించాలి. ఇంద్రుని సేననూ సంహరించాలి. ఒక తేజస్వి ఐన కుమారుడు కావాలి. అందుకోసం భర్త దగ్గరకు వెళ్ళి, చాలా కాలం ఉండి అడిగినవీ అడగనివీ ఎన్నో సేవలు చేసింది

భక్త్యా పరమయా రాజన్మనోజ్ఞైర్వల్గుభాషితైః
మనో జగ్రాహ భావజ్ఞా సస్మితాపాఙ్గవీక్షణైః

అలా చాలా సార్లు ప్రీతి కలిగించింది. ప్రేమతో వినయముతో ఇంద్రియ నిగ్రహముతో పరమభక్తితో, మనసుకు నచ్చే మాటలతో క్రీగంటి చూపులతో, కొన్ని భావములతో అతని మనసుని స్వీకరించింది

ఏవం స్త్రియా జడీభూతో విద్వానపి మనోజ్ఞయా
బాఢమిత్యాహ వివశో న తచ్చిత్రం హి యోషితి

కశ్యపుడు జ్ఞ్యానే అయినా నేర్పు గలిగిన స్త్రీ చేత ఓడించబడ్డాడు

విలోక్యైకాన్తభూతాని భూతాన్యాదౌ ప్రజాపతిః
స్త్రియం చక్రే స్వదేహార్ధం యయా పుంసాం మతిర్హృతా

బ్రహ్మ తన శరీరములో సగ భాగాన్ని స్త్రీగా సృష్టించాడు పురుషుల బుద్ధి హరించడానికి

ఏవం శుశ్రూషితస్తాత భగవాన్కశ్యపః స్త్రియా
ప్రహస్య పరమప్రీతో దితిమాహాభినన్ద్య చ

ఇలా చాలా కాలం సేవించిన దితిని చూచి కశ్యపుడు

శ్రీకశ్యప ఉవాచ
వరం వరయ వామోరు ప్రీతస్తేऽహమనిన్దితే
స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః

ఇంతకాలం నీవు చేసిన సేవకు నేను మెచ్చాను, ఎమైనా వరం కోరుకో. భర్త సంతోషించిన తరువాత స్త్రీ పొందలేనిది ఏమైనా ఉంటుందా

పతిరేవ హి నారీణాం దైవతం పరమం స్మృతమ్
మానసః సర్వభూతానాం వాసుదేవః శ్రియః పతిః

పరమాత్మే భరత రూపములో అవతరిస్తాడు.

స ఏవ దేవతాలిఙ్గైర్నామరూపవికల్పితైః
ఇజ్యతే భగవాన్పుమ్భిః స్త్రీభిశ్చ పతిరూపధృక్

పరమాత్మ నామ రూప చిహ్నములతో కావలసిన అన్ని కోరికలూ తీర్చేవాడు భర్త. పురుషులూ స్త్రీలూ శ్రీమన్నారాయణున్నే సేవిస్తారు.

తస్మాత్పతివ్రతా నార్యః శ్రేయస్కామాః సుమధ్యమే
యజన్తేऽనన్యభావేన పతిమాత్మానమీశ్వరమ్

పతివరతలు ఐన స్త్రీలు భర్త యొక్క శ్రేయస్సును కోరుస్తారు. అనురాగమున్న భర్తలు భార్య యొక్క కోరికలు తీరుస్తారు. అటువంటి స్త్రీలు అన్ని కోరికలనూ పొందుతారు

సోऽహం త్వయార్చితో భద్రే ఈదృగ్భావేన భక్తితః
తం తే సమ్పాదయే కామమసతీనాం సుదుర్లభమ్

నీకేమి కావాలో కోరుకోమని కశ్యపుడు అడిగాడు

దితిరువాచ
వరదో యది మే బ్రహ్మన్పుత్రమిన్ద్రహణం వృణే
అమృత్యుం మృతపుత్రాహం యేన మే ఘాతితౌ సుతౌ

ఇంద్రున్ని చంపే కొడుకు కావాలి. నా పుత్రులను ఇంద్రుడు అతని రక్షకులూ చంపారు

నిశమ్య తద్వచో విప్రో విమనాః పర్యతప్యత
అహో అధర్మః సుమహానద్య మే సముపస్థితః

ఈ కోరిక వినగానే తాను చేసిన అధర్మం తెలుసుకున్నాడు కశ్యపుడు.

అహో అర్థేన్ద్రియారామో యోషిన్మయ్యేహ మాయయా
గృహీతచేతాః కృపణః పతిష్యే నరకే ధ్రువమ్

స్త్రీ రూపమైన మాయతో నా మనస్సూ ఇంద్రియములూ హరించబడ్డాయి. నేను నరకములో పడెదను

కోऽతిక్రమోऽనువర్తన్త్యాః స్వభావమిహ యోషితః
ధిఙ్మాం బతాబుధం స్వార్థే యదహం త్వజితేన్ద్రియః

స్త్రీ తనకు తానుగా వచ్చి సేవిస్తే ఎంత తెలివిగలవాడైనా కాదనకపోవడమే నరకానికి మూలం. వారు మనసులో ఏమి భావించుకుని వచ్చారో ఎవరికీ తెలియదు.

శరత్పద్మోత్సవం వక్త్రం వచశ్చ శ్రవణామృతమ్
హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితమ్

పద్మము వంటి ముఖం, పద్మము నుండి వచ్చే మకరందం లాంటి మాటలు ఉంటాయి. వారి ముఖం చూసి, మాటలు విని మోసపోతాము. వారి మనసును తెలుసుకోగలవాడు ఎవ్వడూ. స్వార్థపరులైన స్త్రీలకు ప్రియుడైనవాడు అంటూ ఎవ్వరూ ఉండరు.

న హి కశ్చిత్ప్రియః స్త్రీణామఞ్జసా స్వాశిషాత్మనామ్
పతిం పుత్రం భ్రాతరం వా ఘ్నన్త్యర్థే ఘాతయన్తి చ

తమ కోరిక తీరకపోతే స్వార్థపరులైన స్త్రీలు ఎవ్వరిని చంపడానికీ వెనుకాడరు

ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్న మృషా భవేత్
వధం నార్హతి చేన్ద్రోऽపి తత్రేదముపకల్పతే

ఇప్పుడు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా అధర్మమే అవుతుంది. నేను ధర్మ తప్పకుండా నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని ఆలోచించి

ఇతి సఞ్చిన్త్య భగవాన్మారీచః కురునన్దన
ఉవాచ కిఞ్చిత్కుపిత ఆత్మానం చ విగర్హయన్

తనను తాను నిందించుకుంటూ కొద్దిగా కనపడీ కనపడనట్లుగా కోపాన్ని ప్రదర్శించి ఇలా అన్నాడు

శ్రీకశ్యప ఉవాచ
పుత్రస్తే భవితా భద్రే ఇన్ద్రహాదేవబాన్ధవః
సంవత్సరం వ్రతమిదం యద్యఞ్జో ధారయిష్యసి

శుభంకరురాలా నీవన్నట్లు ఇంద్రున్ని చంపేవాడు నీకు కొడుకుగా కలుగుతాడు, అతను దేవ బాంధవుడవుతాడు. నేను చెప్పినట్లుగా నీవు సంవత్సరం వ్రతం ఆచరిస్తే ఇంద్రున్ని చంపేవాడు కొడుకుగా కలుగుతాడు. వ్రత నియమం తప్పితే దేవబాంధవుడు పుత్రుడుగా లభిస్తాడు

దితిరువాచ
ధారయిష్యే వ్రతం బ్రహ్మన్బ్రూహి కార్యాణి యాని మే
యాని చేహ నిషిద్ధాని న వ్రతం ఘ్నన్తి యాన్యుత

తప్పకుండా వ్రతం ఆచరిస్తాను. చేయవలసినవీ చేయకూడనివీ ఏవి అని అడిగింది

శ్రీకశ్యప ఉవాచ
న హింస్యాద్భూతజాతాని న శపేన్నానృతం వదేత్
న ఛిన్ద్యాన్నఖరోమాణి న స్పృశేద్యదమఙ్గలమ్

ప్రాణులను హింసించకూడదు, నిందించకూడదు, అబద్దమాడరాదు, గోళ్ళూ రోమములూ తీయరాదు, అపవిత్రమైన దాన్ని ముట్టరాదు, నీట మునిగి స్నానం చేయరాదు. ఎవరి మీద కోపించరాదు. ఎవరినీ దుర్భాషలాడరాదు. ఉతకని బట్టలు కట్టరాదు, ఒక సారి ధరించిన మాలను మళ్ళీ ధరించరాదు, ఎంగిళి అన్నాన్ని తినరాదు, రజస్వల తాకిన అన్నాన్ని తినరాదు, మాంసాన్నీ అపవిత్రుడు తెచ్చిన అన్నాన్నీ రజస్వల చూచిన అన్నానీ తినరాదు, దోసిటితో నీరు తాగరాదు,. వాడిన పదార్థాలను ఎంగిళినీ తాకరాదు, వాడిన జలం తాకరాదు. ఉభయ సంధ్యలలో జుట్టు విరబూసుకుని ఉండరాదు. వాక్కుని నియమించుకోవాలి, పైన వస్త్రం లేకుండా బయట తిరగరాదు, కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోరాదు, తడి కాళ్ళతో నిద్రపోరాదు. భక్తీ వినయం లేకుండా ఉండరాదు, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోరాదు, తలవైపు కాళ్ళు పెట్టి పడుకోరాదు, ఇతరులు పడుకున్న శయ్య మీద పడుకోరాదు, సంధ్యాకాలములో పడుకోరాదు, వస్త్రం లేకుండా పడుకోరాదు. భక్తీ వినయం లేకుండా ఉండరాదు. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోరాదు, ఇంకొకరు పడుకున్న శయ్య మీద పడుకోరాదు, తలవైపు కాళ్ళుపెట్టి పడుకోరాదు, వస్త్రం లేకుండా పడుకోరాదు, సంధ్యా కాలములలో పడుకోరాదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రమే కట్టుకోవాలీ, పరిశుద్ధిగా ఉండాలీ, అన్నీ మాంగళ్యములనే ఉపయోగించహలి, ఉదయ ఫలహారం ముందే అమ్మవారినీ స్వామినీ గోవులనూ బ్రాహ్మణులనూ ధనమునీ పూజించాలి ముత్తైదువులైన స్త్రీలను పూజించాలి. భర్తను పూజించాలి, స్వామిని పూజించాలి. దెన్ని పుంసవన వ్రతం అంటారు. దీన్ని సంవత్స్రం చేస్తే  నీకు తప్పకుండా ఇంద్రున్ని చంపే కుమారుడు కలుగుతాడు. అలాగే అని ఒప్పుకుంది. కాశ్యపుని వలన గర్భం పొంది ఆ వ్రతాన్ని ఆచరిస్తోంది. పిన తల్లి వ్రతాన్ని తెలుసుకున్నాడు ఇంద్రుడు. జ్ఞ్యాని కాబట్టి ఆమె ఉంటున్న ఆశ్రమానికి వచ్చి ఆమెను శ్రద్ధగా సేవించడం మొదలుపెట్టాడు. పూలనూ పళ్ళనూ కందమూలములనూ దర్భలనూ ఆకులనూ జలములనూ మట్టినీ ఏ సమయములో ఏవి ఆరాధనకు కావాలో అవి తీసుకుని వచ్చేవాడు. ఇంత జాగ్రత్తగా సేవించడానికి కారణం ఈమె ఎప్పుడు వ్రతములో పొరబాటు చేస్తుందా అని కనిపెట్టడానికి మృగన్ని వేటాడే వేటగాడు మృగాకారమైన వేషాన్ని వేసుకున్నట్లుగా.

నాప్సు స్నాయాన్న కుప్యేత న సమ్భాషేత దుర్జనైః
న వసీతాధౌతవాసః స్రజం చ విధృతాం క్వచిత్

నోచ్ఛిష్టం చణ్డికాన్నం చ సామిషం వృషలాహృతమ్
భుఞ్జీతోదక్యయా దృష్టం పిబేన్నాఞ్జలినా త్వపః

నోచ్ఛిష్టాస్పృష్టసలిలా సన్ధ్యాయాం ముక్తమూర్ధజా
అనర్చితాసంయతవాక్నాసంవీతా బహిశ్చరేత్

నాధౌతపాదాప్రయతా నార్ద్రపాదా ఉదక్శిరాః
శయీత నాపరాఙ్నాన్యైర్న నగ్నా న చ సన్ధ్యయోః

ధౌతవాసా శుచిర్నిత్యం సర్వమఙ్గలసంయుతా
పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్గోవిప్రాఞ్శ్రియమచ్యుతమ్

స్త్రియో వీరవతీశ్చార్చేత్స్రగ్గన్ధబలిమణ్డనైః
పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్కోష్ఠగతం చ తమ్

సాంవత్సరం పుంసవనం వ్రతమేతదవిప్లుతమ్
ధారయిష్యసి చేత్తుభ్యం శక్రహా భవితా సుతః

బాఢమిత్యభ్యుపేత్యాథ దితీ రాజన్మహామనాః
కశ్యపాద్గర్భమాధత్త వ్రతం చాఞ్జో దధార సా

మాతృష్వసురభిప్రాయమిన్ద్ర ఆజ్ఞాయ మానద
శుశ్రూషణేనాశ్రమస్థాం దితిం పర్యచరత్కవిః

నిత్యం వనాత్సుమనసః ఫలమూలసమిత్కుశాన్
పత్రాఙ్కురమృదోऽపశ్చ కాలే కాల ఉపాహరత్

ఏవం తస్యా వ్రతస్థాయా వ్రతచ్ఛిద్రం హరిర్నృప
ప్రేప్సుః పర్యచరజ్జిహ్మో మృగహేవ మృగాకృతిః

నాధ్యగచ్ఛద్వ్రతచ్ఛిద్రం తత్పరోऽథ మహీపతే
చిన్తాం తీవ్రాం గతః శక్రః కేన మే స్యాచ్ఛివం త్విహ

ఇంత జాగ్రత్తగా చూస్తున్నా మనసులో సంతానం మీద ఆశ, ఇంద్రుని మీద ద్వేషం, రాజ్యం కావాలన్న ఆశ ఉండుటచే ఎటువంటి పొరబాటు లేకుండా చేస్తోంది.

ఏకదా సా తు సన్ధ్యాయాముచ్ఛిష్టా వ్రతకర్శితా
అస్పృష్టవార్యధౌతాఙ్ఘ్రిః సుష్వాప విధిమోహితా

ఇలా పదకొండు నెలలు చేసి చిక్కిపోయి అలసిపోయి మలమూత్ర విసర్జన చేసి ఆచమనం చేయకుండా కళ్ళూ చేతులూ కడుక్కోకుండా అలాగే పడుకుంది. అందులోనూ అది సంధ్యా సమయం. పరమాత్మ ఆమెను మోహింపచేసాడు

లబ్ధ్వా తదన్తరం శక్రో నిద్రాపహృతచేతసః
దితేః ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా

అప్పుడు ఇంద్రుడు తన యోగమాయతో దితి గర్భములోకి ప్రవేశించి ఆమె గర్భాన్ని ఏడు భాగాలుగా ఖండించాడు. వారు ఏడుస్తుంటే ఏడవకండీ "మా రుదా" అంటూ ఖండించాడు. వారందరూ చేతులు జోడించి మమ్ములను ఎందుకు నీవు చంపుతున్నావు

చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభమ్
రుదన్తం సప్తధైకైకం మా రోదీరితి తాన్పునః

తమూచుః పాట్యమానాస్తే సర్వే ప్రాఞ్జలయో నృప
కిం న ఇన్ద్ర జిఘాంససి భ్రాతరో మరుతస్తవ

మా భైష్ట భ్రాతరో మహ్యం యూయమిత్యాహ కౌశికః
అనన్యభావాన్పార్షదానాత్మనో మరుతాం గణాన్

న మమార దితేర్గర్భః శ్రీనివాసానుకమ్పయా
బహుధా కులిశక్షుణ్ణో ద్రౌణ్యస్త్రేణ యథా భవాన్

అప్పుడు ఇంద్రుడు, మీరు భయపడకండి మీరు అన్నట్లు నాకు మీరు సోదరులే. మిమ్ములను నేను చంపను. ఈ ప్రకారముగా ఇరువురూ ఒప్పందం చేసుకున్నారు. ఇలా వజ్రముతో ఖండించినా ఆమె చేసిన వ్రత ప్రభావం వలన వారు బతికే ఉన్నారు. అశ్వద్ధామ అస్త్రముతో నీవు చావనట్లు అలాగే వజ్రాయుధముతో వారు కూడా మరణించలేదు. ఒక్క సారి మనసారా సేవిస్తే వారి సామీప్యాన్ని పొందుతారు. అలాంటిది దాదాపు ఒక సంవత్సర కాలం సేవించింది. ఒక్క సారి ఖండించగా చావకపోయేసరికి మళ్ళీ ఒక్కొక్కరినీ మళ్ళీ ఏడు సార్లు ఖండించాడు.తల్లి మీద ద్వేషాన్ని పక్కనపెట్టి మరుత్తులకు కూడా తనతో సమాన స్థానన్ని ఇచ్చి. యజ్ఞ్యములో భాగం తీసుకునే వారిగా చేసాడు. దితి లేవగానే తన కుమారులు ఎదురుగా ఉన్నారు. విషయం తెలుసుకుని వారు బతికే ఉన్నందుకు సంతోషించింది. నేను దేవతలకు భయమును కలిగించే సంతానాన్ని కోరి పరమ దుష్కరమైన ఈ వ్రతాన్ని చేసాను. ఒక కుమారుడు కావాలనుకుంటే నలభై తొమ్మిది మంది అయ్యారు. ఇది ఎలా జరిగింది. నీకు తెలిస్తే చెప్పు. అబద్దం చెప్పకు
అమా నీవు చెప్పక ముందే నీ సంకల్పం నాకు తెలుసు. అది తెలుసుకునే నేను కూడా నీవలే ప్రయోజనం కోరి వచ్చాను. అవకాశం దొరికించుకున్నాను. నీ గర్భాన్ని చేదించాను.నేను మొదలు ఏడు భాగాలు చేసాను. వారు మరణించకుంటే మరలా ఏడు భాగాలు చేసాను. అయినా వారు జీవించే ఉన్నారు. ముందు ఆశ్చర్యపడ్డా తరువాత అర్థమయ్యింది. శ్రీమన్నారాయణున్ని నీవు ఆరాధించావు కాబట్టి అది వ్యర్థం కాలేదు. వజ్రాయుధం కూడా పని చేయలేదు. పరమాత్మను ఆరాధిస్తే కోరని వారి కోరికలు కూడా నెరవేరుతాయి. ఎవరు పరమాత్మను వరములు కోరరో వారే స్వార్థం బాగా తెలిసినవారు. భగవంతుని కోరని వాడే స్వార్థ కుశలుడు. తననే తాను ఇచ్చేవాడు పరమాత్మ. పరమాత్మ మాత్రమే తనను తాను ఇచ్చుకుంటాడు. తనను తాను ఇచ్చుకునే వాడు అతనే. అటువంటి పరమాత్మను ప్రకృతి బంధాన్ని పెంచే కోరికలు అడిగే వాడు ఎంత తెలివి తక్కువ వాడు. ఆ విషయం తెలియక నేను దుర్మార్గం చేసాను. నన్ను క్షమించు. నీ సంతానం మరణించలేదు. నీకు అంత కోపం ఉండి ఉండదనుకుంటున్నాను.  విధి అలా ఉన్నదని గ్రహించిన దితి శుద్ధ భావముతో ఇంద్రునీ పంపించింది. మరుత్తులతో కలిసి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు

సకృదిష్ట్వాదిపురుషం పురుషో యాతి సామ్యతామ్
సంవత్సరం కిఞ్చిదూనం దిత్యా యద్ధరిరర్చితః

సజూరిన్ద్రేణ పఞ్చాశద్దేవాస్తే మరుతోऽభవన్
వ్యపోహ్య మాతృదోషం తే హరిణా సోమపాః కృతాః

దితిరుత్థాయ దదృశే కుమారాననలప్రభాన్
ఇన్ద్రేణ సహితాన్దేవీ పర్యతుష్యదనిన్దితా

అథేన్ద్రమాహ తాతాహమాదిత్యానాం భయావహమ్
అపత్యమిచ్ఛన్త్యచరం వ్రతమేతత్సుదుష్కరమ్

ఏకః సఙ్కల్పితః పుత్రః సప్త సప్తాభవన్కథమ్
యది తే విదితం పుత్ర సత్యం కథయ మా మృషా

ఇన్ద్ర ఉవాచ
అమ్బ తేऽహం వ్యవసితముపధార్యాగతోऽన్తికమ్
లబ్ధాన్తరోऽచ్ఛిదం గర్భమర్థబుద్ధిర్న ధర్మదృక్

కృత్తో మే సప్తధా గర్భ ఆసన్సప్త కుమారకాః
తేऽపి చైకైకశో వృక్ణాః సప్తధా నాపి మమ్రిరే

తతస్తత్పరమాశ్చర్యం వీక్ష్య వ్యవసితం మయా
మహాపురుషపూజాయాః సిద్ధిః కాప్యానుషఙ్గిణీ

ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః
యే తు నేచ్ఛన్త్యపి పరం తే స్వార్థకుశలాః స్మృతాః

ఆరాధ్యాత్మప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరమ్
కో వృణీత గుణస్పర్శం బుధః స్యాన్నరకేऽపి యత్

తదిదం మమ దౌర్జన్యం బాలిశస్య మహీయసి
క్షన్తుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భో మృతోత్థితః

శ్రీశుక ఉవాచ
ఇన్ద్రస్తయాభ్యనుజ్ఞాతః శుద్ధభావేన తుష్టయా
మరుద్భిః సహ తాం నత్వా జగామ త్రిదివం ప్రభుః

ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి
మఙ్గలం మరుతాం జన్మ కిం భూయః కథయామి తే

దితి గర్భములో దేవతలు ఎలా పుట్టారో నీవడిగావు. పరమ పావనమైన మరుత్తుల జన్మ నీకు చెప్పాను.

No comments:

Post a Comment