Friday, February 22, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదకొండవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
నిశమ్య గదతామేవమృషీణాం ధనుషి ధ్రువః
సన్దధేऽస్త్రముపస్పృశ్య యన్నారాయణనిర్మితమ్

ఆచమనం చేసి ధౄవుడు నారాయణాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు

సన్ధీయమాన ఏతస్మిన్మాయా గుహ్యకనిర్మితాః
క్షిప్రం వినేశుర్విదుర క్లేశా జ్ఞానోదయే యథా

ధౄవుడు నారాయణాస్త్రాన్ని ఎక్కుపెట్టడముతోనే జ్ఞ్యానం కలిగినతరువాత కష్టాలు పోయినట్లు అన్ని రాక్షస మాయలూ పోయాయి

తస్యార్షాస్త్రం ధనుషి ప్రయుఞ్జతః సువర్ణపుఙ్ఖాః కలహంసవాససః
వినిఃసృతా ఆవివిశుర్ద్విషద్బలం యథా వనం భీమరవాః శిఖణ్డినః

ఒక్క సారి నారాయణాస్త్రాన్ని ఎక్కుపెడితే కొన్ని లక్షల బాణ పరంపరలు బయలు దేరాయి. ఆకాశములో మబ్బులు బాగా పడితే నెమళ్ళు కేకలు వేసుకుంటూ అడవిలోకి పరిగెట్టినట్లు ఆ బాణాలు వారి మీదకు బయలు దేరాయి

తైస్తిగ్మధారైః ప్రధనే శిలీముఖైరితస్తతః పుణ్యజనా ఉపద్రుతాః
తమభ్యధావన్కుపితా ఉదాయుధాః సుపర్ణమున్నద్ధఫణా ఇవాహయః

ఆ బాణాల దెబ్బలు తట్టుకోలేక అందరూ అటూ ఇటూ పరిగెత్తారు. కానీ ఆ బాణాలు వెంటపడి మరీ కొడుతున్నాయి పగబట్టిన పాములాగ.

స తాన్పృషత్కైరభిధావతో మృధే నికృత్తబాహూరుశిరోధరోదరాన్
నినాయ లోకం పరమర్కమణ్డలం వ్రజన్తి నిర్భిద్య యమూర్ధ్వరేతసః

వీళ్ళంతా అర్కమండలానికీ యమ మండలానికి వెళ్ళిపోతున్నారు

తాన్హన్యమానానభివీక్ష్య గుహ్యకాననాగసశ్చిత్రరథేన భూరిశః
ఔత్తానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగతః సహర్షిభిః

ఇలా ధృవుడు చాలా మంది యక్షులని చంపేశాడు. నిరపరాధులని ఇలా సంహరిస్తుంటే దాన్ని ఆపడానికి  తాత గారైన మనువు మహర్షులతో కలిసి వచ్చాడు.

మనురువాచ
అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాప్మనా
యేన పుణ్యజనానేతానవధీస్త్వమనాగసః

వత్సా, చాలు నీ కోపము. ఈ కోపము తమో ద్వారము. అజ్ఞ్యానానికి ద్వారం. ఇది నరకానికి మారుపేరూ. ఆ కోపముతోనే నిరపరాధులైన వారిని చంపావు

నాస్మత్కులోచితం తాత కర్మైతత్సద్విగర్హితమ్
వధో యదుపదేవానామారబ్ధస్తేऽకృతైనసామ్

నీవు చేసిన పని మన కులములో పుట్టినవారు చేయదగినది కాదు. నింద్యమైనది. తప్పు చేయని ఉపదేవతలను నీవు సంహరించరాదు
నన్వేకస్యాపరాధేన ప్రసఙ్గాద్బహవో హతాః
భ్రాతుర్వధాభితప్తేన త్వయాఙ్గ భ్రాతృవత్సల

తప్పు ఒక్కడు చేసాడు. ఒక్కడి తప్పుకు ఇంతమందిని శిక్షించడం నేరము. నీ తప్పు కూడా పూర్తిగా లేదు.నీకు తమ్ముడంటే ప్రేమ ఎక్కువ.

నాయం మార్గో హి సాధూనాం హృషీకేశానువర్తినామ్
యదాత్మానం పరాగ్గృహ్య పశువద్భూతవైశసమ్

శ్రీమన్నారాయణున్ని అనుసరించే వారు నడిచే దారి ఇది కాదు. శ్రీమన్నారాయణుని భక్తులు వారు వేరు వీరు వేరు అని  భిన్న దృష్టి పెట్టరు. ప్రతీ శరీరములో అంతరాత్మగా పరమాత్మే ఉన్నాడు.

సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్
ఆరాధ్యాప దురారాధ్యం విష్ణోస్తత్పరమం పదమ్

నీవు సకల జగత్తులను కడుపులో దాచుకున్న పరమాత్మను తపస్సు చేసి ఆరాధించి సంతోషింపచేసావు.  ఇతరులెవ్వరూ పొందలేని ఉత్తమ స్థానన్ని పొందిన నీవు ఈ పని చేయకూడదు

స త్వం హరేరనుధ్యాతస్తత్పుంసామపి సమ్మతః
కథం త్వవద్యం కృతవాననుశిక్షన్సతాం వ్రతమ్

నిన్ను పరమాత్మ భక్తులు కూడా మెచ్చుకున్నారు. భాగవతోత్తములకు కూడా నీవు స్మరించదగినవాడవు.  సజ్జనుల మార్గాన్నీ వ్రతాన్ని ఆచరించే నీవు నలుగురూ నిందించే పని ఎలా చేస్తావు?

తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిలజన్తుషు
సమత్వేన చ సర్వాత్మా భగవాన్సమ్ప్రసీదతి

పరమాత్మ సంతోషించాలంటే ఓర్పూ దయా స్నేహం సర్వాభూత సమ దర్శనం కావాలి. అలా ఉంటేనే భగవానుడు సంతోషిస్తాడు

సమ్ప్రసన్నే భగవతి పురుషః ప్రాకృతైర్గుణైః
విముక్తో జీవనిర్ముక్తో బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి

ఒక్క సారి పరమాత్మ సంతోషిస్తే ప్రాకృతికమైన సత్వ రజో తమో గుణాలు తొలగిపోయి ఆ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మలో చేరతాడు

భూతైః పఞ్చభిరారబ్ధైర్యోషిత్పురుష ఏవ హి
తయోర్వ్యవాయాత్సమ్భూతిర్యోషిత్పురుషయోరిహ

ఐదు భూతములతో ఏర్పడిన రెండు శరీరముల కలయికతో ఇంకో శరీరం ఏర్పడుతుంది. ఆ స్త్రీ పురుషుల సమాగమముతో ఇంకో శరీరం పుడుతుంది. ఆ స్త్రీ పురుషులు కూడా పాంచభౌతిక శరీరాలకు పేర్లే.

ఏవం ప్రవర్తతే సర్గః స్థితిః సంయమ ఏవ చ
గుణవ్యతికరాద్రాజన్మాయయా పరమాత్మనః

ఇదే సృష్టి సంహారం స్థ్తి. పరమాత్మ యొక్క మాయచేత గుణ వైషమ్యం ఏర్పడి నిర్గుణమైన పరమాత్మ పురుషోత్తముడు

నిమిత్తమాత్రం తత్రాసీన్నిర్గుణః పురుషర్షభః
వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్

ఆయన యందే స్థూల సూక్ష్మాత్మకమైన జగత్తు అయస్కాంతం చుట్టూ ఇనుము తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటాయి

స ఖల్విదం భగవాన్కాలశక్త్యా గుణప్రవాహేణ విభక్తవీర్యః
కరోత్యకర్తైవ నిహన్త్యహన్తా చేష్టా విభూమ్నః ఖలు దుర్విభావ్యా

ఈ గుణప్రవాహములో ఉండి కూడా మళ్ళీ సృష్టి చేయాలనుకున్నా, ప్రళయం చేయాలనుకున్నా, మనలాగ గొప్పలు చెప్పుకోడు. ప్రకృతి తనకు తానుగా ఏమీ చేయలేదు. పరమాత్మే అన్నీ చేసి కూడా ఏమీ చేయని వాడిలాగే ఉంటాడు
ఎవరినీ చంపుతున్నట్లు చెప్పడు కానీ, ఆయనే లోకక్షయం చేస్తాడు. కర్త కానట్లు చేస్తాడు, సంహర్త కానట్లు సంహరిస్తాడు. ఆయన లీలలు మనకు అందవు.

సోऽనన్తోऽన్తకరః కాలోऽనాదిరాదికృదవ్యయః
జనం జనేన జనయన్మారయన్మృత్యునాన్తకమ్

ఈ కాలానికి అంతము లేదు గానీ, అంతము చేసేవాడిని అంతం చేస్తుంది. కాలము అనాది అయిన ఎన్నిటినో సృష్టిస్తుంది. దానికి హెచ్చు తగ్గులు లేవు. ఒక జనముతో ఇంకో జనాన్ని సృష్టి చేస్తుంది. మృత్య్వుతో చంపుతుంది.

న వై స్వపక్షోऽస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః
తం ధావమానమనుధావన్త్యనీశా యథా రజాంస్యనిలం భూతసఙ్ఘాః

అలాంటి కాల రూపి అయిన పరమాత్మకు తన వాడూ లేడూ శత్రువూ లేడు. మన దగ్గరకు వచ్చే మృత్యువుకు అందరూ సమానులే. పరిగెత్తుతున్న కాలం వెంట, మనమందర్మ్ నిస్సహాయులం కాబట్టి పరిగెత్తుతూ ఉటాము. ఏలాగ గాలి బాగా వీస్తూ ఉంటే ధూళి కూడా గాలిలో కలుస్తుంది. అలాగే కాలములో జీవులు కలుస్తారు

ఆయుషోऽపచయం జన్తోస్తథైవోపచయం విభుః
ఉభాభ్యాం రహితః స్వస్థో దుఃస్థస్య విదధాత్యసౌ

కొందరు "వీడి ఆయువు తగ్గిపోయింది " అంటారు. కొందరు "ఆయువు పెరిగిందీ " అంటారు. నిజానికి జీవునికి ఈ రెండూ లేవు.

కేచిత్కర్మ వదన్త్యేనం స్వభావమపరే నృప
ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే

దీనికి కొందరు స్వభావం కారణమంటారు, కాలం కారణమంటారు దవైమని కొందరూ, కోరికా అని కొందరు.

అవ్యక్తస్యాప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ
న వై చికీర్షితం తాత కో వేదాథ స్వసమ్భవమ్

ఎవ్వరికీ తెలియదా దీని గురించి? అంటే, ఇది అవ్యక్తమూ, ఇంతా అని కొలతకు అందనిది. అనేక శక్తులు పుడుతూ ఉంటాయి. కాలం ఏమి చేయాలనుకుంటోందో ఎవరికి తెలుసు. మనకు ఏర్పడే సంబంధం ఈనాడు మనకు అనుకూలం అనుకోవచ్చు, ఆనందం కలిగిస్తుంది అనుకోవచ్చు. అలా ఇష్టపడి మనం కొన్ని కూర్చుకుంటాము. వాటి వలన ఆనందమే కలుగుతుందా? మనము హితము అనుకున్నదానితో అహితమూ చేయిస్తాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఏమి చేయాలనుకుంటున్నాడో ఎవరికి తెలుసు?

న చైతే పుత్రక భ్రాతుర్హన్తారో ధనదానుగాః
విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణమ్

నీ తమ్మున్ని చంపింది వీరు కాదు. మనకు ఒక వస్తువు రావాలన్నా పోవాలన్నా దైవమే కారణం.

స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హన్తి చ
అథాపి హ్యనహఙ్కారాన్నాజ్యతే గుణకర్మభిః

ఆయనే వస్తువును ఇప్పిస్తాడూ, తీసుకుంటాడు. ఆయనే సృష్టిస్తున్నాడు, కాపాడుతున్నాడు సంహరిస్తున్నాడు. ఇన్ని చేస్తున్న ఆయనే "నేను సృష్టిస్తున్నాడు" అని చెప్పుకోడు. అహంకారముతో అంటబడడు, గుణాలతో అంటుబడడు

ఏష భూతాని భూతాత్మా భూతేశో భూతభావనః
స్వశక్త్యా మాయయా యుక్తః సృజత్యత్తి చ పాతి చ

ఈ పరమాత్మే భూతాత్మ (అంతర్యామి), నియామకుడూ, అన్ని ప్రాణులనూ సృష్టించేవాడు. తన మాయ శక్తితో కలిసి సృష్టి స్థితి లయములు చేస్తాడు

తమేవ మృత్యుమమృతం తాత దైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణమ్
యస్మై బలిం విశ్వసృజో హరన్తి గావో యథా వై నసి దామయన్త్రితాః

పరమాత్మకే రెండు పేరులు ఉన్నాయి. ఆయనే మృత్యు, ఆయనే అమృతం.  నీవు కూడా పరిపూర్ణముగా అన్ని భోగాలతో సంపదలతో కైంకర్యములతో ఆయననే శరణు వేడు. ప్రజాపతులు కూడా ఆయనకే దాస్యం చేస్తారు. బలించిన కోడెలు ఏ వ్యవసాయముకూ పనికిరానట్లుగా మొండికేస్తాయి. వాటికి ముక్కుతాడు వేసి వశం చేసుకుంటారు. అలాగే మదించిన పశువులమైన మనని పరమాత్మ లొంగదీసుకుంటాడు

యః పఞ్చవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మా
వనం గతస్తపసా ప్రత్యగక్షమారాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః

ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు పిన తల్లి వాడి మాటలకు హృదయం భిన్నమైతే అడవికి వెళ్ళి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని వరము పొందావు. నీకు పరమాత్మ అంటే అర్థం అయింది కదా.

తమేనమఙ్గాత్మని ముక్తవిగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరమ్
ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృగ్యస్మిన్నిదం భేదమసత్ప్రతీయతే

నిరాకారమూ నిర్గుణమూ ఏనాడూ నశించనిదీ అయిన ఆ పరమాత్మను పొందుటకు ప్రయత్నించు. ఆయన యందే ఈ జగత్తు ఉన్నట్లూ ఉంటుందీ , లేనట్లూ ఉంటుంది.

త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనన్త ఆనన్దమాత్ర ఉపపన్నసమస్తశక్తౌ
భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రన్థిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢమ్

ఆయనే ప్రత్యగాత్మా, పరమాత్మ, అనంతుడు, ఆనంద స్వరూపుడు, సర్వ శక్తిమంతుడు. ఆయన యందు భక్తి కలిగించుకుని నీ హృదయములో ఉన్న "నేనూ నాదీ" అన్న గ్రంధిని భేధించగలవు.

సంయచ్ఛ రోషం భద్రం తే ప్రతీపం శ్రేయసాం పరమ్
శ్రుతేన భూయసా రాజన్నగదేన యథామయమ్

కోపాన్ని నిగ్రహించుకో. నీకు మేలు జరుగుతుంది. ఆ పరమాత్మను పొందితే ఆపదలన్నీ తొలగిపోతాయి. వేద శాస్త్ర పురాణాలని పెద్దల వలన వినడం వలన ఇవన్నీ మందుతో రోగం తొలగినట్లు తొలగిపోతాయి.

యేనోపసృష్టాత్పురుషాల్లోక ఉద్విజతే భృశమ్
న బుధస్తద్వశం గచ్ఛేదిచ్ఛన్నభయమాత్మనః

ఏది వచ్చి మనని చేరితే లోకమంతా భయపడి పారిపోతుందో అలాంటిది మనకు రాకూడదు. దాన్ని మనం కోరుకోకూడదు. నిజముగా అభయం కావాలి అనుకుంటే భయాన్ని కలిగించే వాటి జోలికి వెళ్ళకూడదు

హేలనం గిరిశభ్రాతుర్ధనదస్య త్వయా కృతమ్
యజ్జఘ్నివాన్పుణ్యజనాన్భ్రాతృఘ్నానిత్యమర్షితః

శంకరుని మిత్రునికి నీవు అవమానం చేసావు. నా తమ్మున్ని చంపారన్న అసహనముతో చాలా మంది యక్షులని సంహరించావు.

తం ప్రసాదయ వత్సాశు సన్నత్యా ప్రశ్రయోక్తిభిః
న యావన్మహతాం తేజః కులం నోऽభిభవిష్యతి

నీవిప్పుడు చేతులు జోడించి కుబేరున్ని ప్రసన్నం చేసుకో. గొప్పవారిని అవమానిస్తే వారి తేజస్సు మన కులాన్నీ వంశాన్నీ లేకుండా చేస్తుంది.

ఏవం స్వాయమ్భువః పౌత్రమనుశాస్య మనుర్ధ్రువమ్
తేనాభివన్దితః సాకమృషిభిః స్వపురం యయౌ

ఈ ప్రకారముగా స్వాయంభువ మనువు ధృవున్ని ఓదార్చి, ఆజ్ఞ్యాపించగా ధృవుడు ఒప్పుకుని నమస్కరించగా మనువు ఋషులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు

                                     సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువః
ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ

శింశుమార ప్రజాపతి పుత్రిక అయిన భ్రమి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని కల్ప, వత్సర అనే పిల్లలను కన్నాడు

ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్ర్యాం మహాబలః
పుత్రముత్కలనామానం యోషిద్రత్నమజీజనత్

వాయుదేవుని పుత్రిక అయిన ఇంకో భార్య ఐన ఇల అనే ఆమె యందు ఉత్కలః అనే పుత్రుడు, ఇంకో అమ్మాయి కలిగారు

ఉత్తమస్త్వకృతోద్వాహో మృగయాయాం బలీయసా
హతః పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతిం గతా

ఉత్తముడికి వివాహం జరగక ముందే వేటకని హిమాలయ పర్వతానికి వెళ్ళి యక్షులతో కలహం కలిగి మరణించాడు. అతని తల్లి పిల్లవాన్ని వెతకడానికి వెళ్ళి కార్చిచ్చు వలన మరణించింది
యవ్వనమూ బలమూ అధికారమూ అవకాశమూ, ఈ నలుగూ ఉన్ననాడు తనకు భోగ్యము కాని, ఇతరులవైన భోగ్యములను అనుభవించాలని చూస్తే అవసాన కాలమప్పుడు ఆ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అవకాశం దొరికినా అవసరం లేని భోగాలను అనుభవిస్తే, అవసరం ఉన్నప్పుడు అనుభవించడానికి ఏమీ ఉండవు . సుఖం వస్తున్నది కదా అని అవసరం లేని దాన్ని అనుభవించే ప్రయత్నం చేయకూడదు. అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన దాన్ని మితముగా వాడుకోవాలి. అమితముగా వాడుకొంటే అవసరమైనప్పుడు మనకు దొరకదు.
ఒక యక్షుడు ధౄవున్ని చంపాడు. అతని తల్లి కూడా మరణించింది

ధ్రువో భ్రాతృవధం శ్రుత్వా కోపామర్షశుచార్పితః
జైత్రం స్యన్దనమాస్థాయ గతః పుణ్యజనాలయమ్

తన తమ్నున్ని యక్షులు చంపాడన్న విషయం తెలుసుకున్న ధృవుడు కోపముతో అసహనముతో దుఃఖముతో తన రథం ఎక్కి అలకాపురికి వెళ్ళాడు

గత్వోదీచీం దిశం రాజా రుద్రానుచరసేవితామ్
దదర్శ హిమవద్ద్రోణ్యాం పురీం గుహ్యకసఙ్కులామ్

అలకాపురిని చూచి, తన శంఖ ధవ్ని చేసాడు. ఆ ధ్వని అన్ని దిక్కులకూ ప్రతిధ్వనించింది.

దధ్మౌ శఙ్ఖం బృహద్బాహుః ఖం దిశశ్చానునాదయన్
యేనోద్విగ్నదృశః క్షత్తరుపదేవ్యోऽత్రసన్భృశమ్

ఆ ధ్వని విని యక్షుల భార్యలు భయపడ్డారు. ఆ ధ్వనిని సహించని ఉపదేవతలైన యక్షులు ఆయుధాలు తీసుకుని ధృవుని మీదకు రాగా ఒక్కొక్కరి లలాటము మీదా, వక్షస్థలం మీదా పదేసి బాణాలు నాటాడు.

తతో నిష్క్రమ్య బలిన ఉపదేవమహాభటాః
అసహన్తస్తన్నినాదమభిపేతురుదాయుధాః

స తానాపతతో వీర ఉగ్రధన్వా మహారథః
ఏకైకం యుగపత్సర్వానహన్బాణైస్త్రిభిస్త్రిభిః

తే వై లలాటలగ్నైస్తైరిషుభిః సర్వ ఏవ హి
మత్వా నిరస్తమాత్మానమాశంసన్కర్మ తస్య తత్

తేऽపి చాముమమృష్యన్తః పాదస్పర్శమివోరగాః
శరైరవిధ్యన్యుగపద్ద్విగుణం ప్రచికీర్షవః

తతః పరిఘనిస్త్రింశైః ప్రాసశూలపరశ్వధైః
శక్త్యృష్టిభిర్భుశుణ్డీభిశ్చిత్రవాజైః శరైరపి

అభ్యవర్షన్ప్రకుపితాః సరథం సహసారథిమ్
ఇచ్ఛన్తస్తత్ప్రతీకర్తుమయుతానాం త్రయోదశ


ధృవుని యుద్ధం చూసి యక్షులు ధౄవున్ని పొగిడారు. తోక తొక్కిన తాచులా లేచి పరిఘలతో పాశములతో రకరకాలైన ఆయుధాలతో శరములతో ధృవుని మీదా సారధి మీదా వర్షించారు

ఔత్తానపాదిః స తదా శస్త్రవర్షేణ భూరిణా
న ఏవాదృశ్యతాచ్ఛన్న ఆసారేణ యథా గిరిః

అయుతమంటే 10000. పదమూడు అయుతాల సైన్యం యుద్ధానికి వస్తే ధౄవుడు వారికి శస్త్రమూలతో సమాధానం చెప్పాడు. యక్షుల శరవర్షం ధౄవునికి కొండ మీద వానలా అయ్యింది. అంటే ఎలాంటి హానీ కలగలేదు

హాహాకారస్తదైవాసీత్సిద్ధానాం దివి పశ్యతామ్
హతోऽయం మానవః సూర్యో మగ్నః పుణ్యజనార్ణవే

యుద్ధాన్ని చూడటానికి వచ్చిన దేవతలు "అనవసరముగా ఈ మానవుడు యుద్ధానికి వచ్చాడు. ఈ పుణ్య జనుల (యక్షులకు ఇది ఒక పేరు) మరణించి ఉంటాడు " అని భావించి బాధపడుతూ ఉంటే

నదత్సు యాతుధానేషు జయకాశిష్వథో మృధే
ఉదతిష్ఠద్రథస్తస్య నీహారాదివ భాస్కరః

మంచును తొలగించుకుని సూర్యుడు వచ్చినట్లుగా అందరి బాణాలను తొలగించుకుని ధౄవుని రథం వచ్చింది.

ధనుర్విస్ఫూర్జయన్దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్
అస్త్రౌఘం వ్యధమద్బాణైర్ఘనానీకమివానిలః

మబ్బులను వాయువు చెదరగొట్టినట్లుగా బాణ వర్షం కురిపిస్తూ సైన్యాన్ని చెల్లా చెదురు చేసాడు

తస్య తే చాపనిర్ముక్తా భిత్త్వా వర్మాణి రక్షసామ్
కాయానావివిశుస్తిగ్మా గిరీనశనయో యథా

పర్వతాల మీద పిడుగు పడ్డట్లుగా ధౄవుని బాణాలు వారి మీద పడుతున్నాయి, తలలు తెగిపడుతున్నాయి, కాళ్ళూ చేతులూ చిన్నభిన్నమయ్యాయి.

భల్లైః సఞ్ఛిద్యమానానాం శిరోభిశ్చారుకుణ్డలైః
ఊరుభిర్హేమతాలాభైర్దోర్భిర్వలయవల్గుభిః

హారకేయూరముకుటైరుష్ణీషైశ్చ మహాధనైః
ఆస్తృతాస్తా రణభువో రేజుర్వీరమనోహరాః

యుద్ధానికి బాగా అలంకరించుకుని వచ్చిన యక్షులు వారి శరీర భాగాలు తెగి వారి ఆభరణాలు చెల్లా చెదురుగా పడి, ఆ రణరంగమంతా బంగారం అమ్మే భూమిలా అయ్యింది. వీరుల మనసుని హరించేట్లుగా ఆభరణాలన్నీ వరుసగా పేర్చబడి ఉన్నాయి

హతావశిష్టా ఇతరే రణాజిరాద్రక్షోగణాః క్షత్రియవర్యసాయకైః
ప్రాయో వివృక్ణావయవా విదుద్రువుర్మృగేన్ద్రవిక్రీడితయూథపా ఇవ

చనిపోగా మిగిలిన వారు, చేతులూ కాళ్ళూ కనులూ చెవులూ పోగొట్టుకొని, సిమ్హం పరిగెత్తుకుంటూ వస్తే ఏనుగులు పారిపోయినట్లు వారందరూ పారిపోయారు.

అపశ్యమానః స తదాతతాయినం మహామృధే కఞ్చన మానవోత్తమః
పురీం దిదృక్షన్నపి నావిశద్ద్విషాం న మాయినాం వేద చికీర్షితం జనః

కొద్ది క్షణాల్లో యుద్ధ రంగమంతా ఖాళీ అయిపోయింది. ప్రతి క్రియ ఏమీ లేకపోయే సరికి నగరాన్ని చూడాలని అనిపించినా ధౄవుడు వెళ్ళలేదు. శత్రువుల తరువాతి పన్నాగం తెలియకుండా రాజ నీతి తెలిసిన వాడు ముందుకు వెళ్ళడు. అందులో శత్రువులు మాయ తెలిసిన వారు. ధౄవుడు మాయావులు చేయదలచుకున్న పని తెలిసిన వాడు కాబట్టి నగరానికి వెళ్ళలేదు

ఇతి బ్రువంశ్చిత్రరథః స్వసారథిం యత్తః పరేషాం ప్రతియోగశఙ్కితః
శుశ్రావ శబ్దం జలధేరివేరితం నభస్వతో దిక్షు రజోऽన్వదృశ్యత

ఇదే విషయం సారధితో అంటూ శత్రువులేదైనా ప్రతీకారం చేస్తారేమో అనుకుంటూ ఉంటే, అల్లకల్లోఅమైన సముద్రము నుండి ధ్వని ఎలా దిక్కులని పెక్కుటిల్లిస్తుండో అలాంటి ధ్వని వచ్చి.
క్షణేనాచ్ఛాదితం వ్యోమ ఘనానీకేన సర్వతః
విస్ఫురత్తడితా దిక్షు త్రాసయత్స్తనయిత్నునా

క్షణములో ఆకాశమంతా మబ్బులు పట్టి, రక్త వర్షం కురుస్తోంది, దుర్గంధమూ మలమూ మూత్రమూ కూడా కురుస్తున్నాయి. వారు మాయా యుద్ధానికి దిగారు
వవృషూ రుధిరౌఘాసృక్ పూయవిణ్మూత్రమేదసః
నిపేతుర్గగనాదస్య కబన్ధాన్యగ్రతోऽనఘ

రాళ్ళూ, పరిఘలూ,గదలూ రోకళ్ళూ పడుతున్నాయి. పాములు కురుస్తున్నాయి. పిడుగులు పడుతున్నాయి, తుఫానులా గాలి వీస్తోంది

తతః ఖేऽదృశ్యత గిరిర్నిపేతుః సర్వతోదిశమ్
గదాపరిఘనిస్త్రింశ ముసలాః సాశ్మవర్షిణః

అహయోऽశనినిఃశ్వాసా వమన్తోऽగ్నిం రుషాక్షిభిః
అభ్యధావన్గజా మత్తాః సింహవ్యాఘ్రాశ్చ యూథశః

సముద్ర ఊర్మిభిర్భీమః ప్లావయన్సర్వతో భువమ్
ఆససాద మహాహ్రాదః కల్పాన్త ఇవ భీషణః

ప్రళయకాలం వచ్చేస్తోందా అన్నట్లు వర్షాలు పడుతున్నాయి ఆయుధాలు వస్తున్నాయి, సముద్రాలు ఉప్పొంగి వస్తున్నాయి, పర్వతాలు వస్తున్నాయి,

ఏవంవిధాన్యనేకాని త్రాసనాన్యమనస్వినామ్
ససృజుస్తిగ్మగతయ ఆసుర్యా మాయయాసురాః

రాక్షస మాయతో ధృవుని మీద ఈ మాయ ప్రయోగించారు.

ధ్రువే ప్రయుక్తామసురైస్తాం మాయామతిదుస్తరామ్
నిశమ్య తస్య మునయః శమాశంసన్సమాగతాః

దాన్ని చూచి మునులు ఇలా అన్నారు

మునయ ఊచుః
ఔత్తానపాద భగవాంస్తవ శార్ఙ్గధన్వా
దేవః క్షిణోత్వవనతార్తిహరో విపక్షాన్
యన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధా
లోకోऽఞ్జసా తరతి దుస్తరమఙ్గ మృత్యుమ్

నాయనా, ఒక్క సారి నీవు మీ స్వామిని గుర్తు చేసుకో అన్నారు. ఆశ్రయించిన వారి బాధను తొలగించే పరమాత్మ నీ శత్రువులను సంహరించుగాక. ఏ మహానుభావుని నామధేయాన్ని పలికినా విన్నా లోకమంతా సంసారాన్ని సులభముగా దాటి పరమపదానికి చేరుతుందో అటువంటె మహానుభావుడు నిన్ను రక్షిస్తాడు.

ధృవుని వృత్తాంతం మనకు చెప్పేదేమిటి

ధృవుని వృత్తాంతం మనకు చెప్పేదేమిటి

ధృవుడు తన కన్న తల్లి వద్దకు ఆవేదనతో వెళ్ళినప్పుడు తల్లి, "నీ మనసు బాధపెట్టినవారిని బాధపెట్టడానికి ప్రయత్నించకు.  పరమాత్మ గురించి తపించు" అని చెప్పింది. మనందరికి కూడా అదే వర్తిస్తుంది
ధృవుడు తపస్సు చేసేప్పుడు పరమాత్మ మీదే ధ్యానముతో ఉండి, పరమాత్మను తప్ప మరి దేన్నీ చూడలేదు.
పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉన్నందు వలన ఆయనకి ఆకలి దప్పులు కలగలేదు
పరమాత్మని ధృవుడు చేసిన స్తోత్రం పరమాత్మ కృప వలనే కలిగింది
పరమాత్మ మీద ధ్యానం చేసి ధృవుడు ఏ కోరికా కోరలేదు. అందరి హృదయములో ఉండే స్వామికి ధృవుని మనసులో ఉన్న కోరిక తెలుసు.
ధృవుడు కోరిక బయటకి చెప్పకపోయినా, ఆ సమయములో ధృవుని మనసులో ఉన్న దాన్ని పరమాత్మ అనుగ్రహించాడు. అంటే మనం
ధృవుడు అంత తపస్సు చేసినా మోక్షాన్ని కోరలేదు. అంటే మనమేమి కోరాలో అది కూడా స్వామి సంకల్పమే.
ధృవుని పొరబాటు ఎక్కడ జరిగింది? పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీవంటి (విదురుని) వాళ్ళు, పరమాత్మ వచ్చి ఏమి కావాలంటే "నీ కైంకర్యం కావాలి" అంటారు గానీ, ఇంకో సంపద కోరరు. మనము ఏదో ఒక దానిని ఎందుకు కోరతాము? కొరత ఉంటే కోరతాము. పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన జీవుడు ప్రకృతిలో వేటి వేటిని పొందగలడో అవి అన్నీ పరమాత్మకు దాసుడైన వాడు పొందుతాడు. వాటితో బాటు అన్నింటికన్నా శ్రేష్టమైన పరమాత్మ దాస్యం లభిస్తుంది.
అందుకే భగవంతుని దాస్యాన్ని తప్ప మరి దేన్నీ కోరరు
అందుకే సాయినాథులు ఎప్పుడూ "నేను భగవంతుని దాసుడను" అనే వారు. అంటే మనం కూడా ఏమి కోరాలో ఆయన చెబుతూనే వున్నారు

పరమాత్మ సంకల్పం వల్లనే మనకు ఆయన కథల మీద భక్తి, భక్తుల మీద భక్తి, ఆయన మీద భక్తి కలుగుతుంది. ఆయన సంకల్పం చేతనే మనకు వచ్చే ఆలోచనలూ, కోరికలూ. ఆయన సంకల్పమే మన చేత ఇంద్రియ అధిష్ఠాన దేవతల రూపములో ఉంది మన చేత బుద్ధిని ప్రచోదనం చేసి ఆయా కర్మలు చేయిస్తుంది. చివరికి భగవంతుని సాక్షాత్కారం అయినా, ఆయన సంకల్పానుసారమే మనము కోరతాము. మనము చేయవలసిందీ కోరవలసిందీ కూడా ఆయన కైంకర్యాన్నే

Thursday, February 21, 2013

ధృవ కృత భగవద్ స్తుతి

ధృవ కృత భగవద్ స్తుతి
ధ్రువ ఉవాచ
యోऽన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్

నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి శ్కతీ నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం

ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్
సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి

నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.

త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః
తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం
విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో

పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు

నూనం విముష్టమతయస్తవ మాయయా తే
యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః
అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్
ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేऽపి న్ణామ్

పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి (భవాప్యయవిమోక్షణ) అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం

యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ
ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్
సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్
కిం త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్

శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు

భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసఙ్గో
భూయాదనన్త మహతామమలాశయానామ్
యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణకథామృతపానమత్తః

ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.

తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం
యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద
సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసఙ్గాః

నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.

తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య
మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం
నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః

మేము ఏ ఏ ఆకారాలను  కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.

కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ
గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోऽస్మి తస్మై

ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.

త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా
కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః
యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా
ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే

స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే లోక రక్షణ గురించి యజ్ఞ్యములచే ఆరాధించబడే వాడు. నీ "స్థితి" ధర్మ స్థాపన కొరకే (పరిత్రాణాయ సాధూనాం). నీవు లోకాన్ని రక్షించడానికి అవతరిస్తున్నావు. నీ చేత రక్షించబడినవారు యజ్ఞ్యముల ద్వారా నిన్ను ఆరాధిస్తున్నారు. అవతరించినా నీవు వ్యతిరిక్త . అంటే ప్రకృతి కన్నా పురుషుడికన్నా విలక్షణుడవు. కానీ వాటికన్నా వేరుగా ఉన్నట్లు కనపడతావు.

పరమాత్మ . ప్రకృతి అవ్యక్తం , పంచభూతాలలోనూ ఉంటాడు. అయినా వాటిలోని దోషాలు అంటని వాడు. కానీ జీవుడు అహంకార మమకార వశమై తనకంటని దోషాలు కూడా అంటినట్లు కష్టముల పాలవుతున్నవాడు జీవుడు. ప్రకృతికి దోషాలు అంటుతాయి. కానీ పరమాత్మకు ఈ రెంటి దోషాలూ అంటవు.
నిత్యముక్త - నిత్య ముక్తులంటే దేనిలో ఉంటాడో దాని దోషం అంటని వాడు.
పరిశుద్ధ- ఎలాంటి దోషములూ లేని వాడు. ఎలాంటి దోషాలూ లేకుండా ఎలా ఉంటాడు? కర్మవశులము కాకపోతే. పరమాత్మ కర్మవశుడు కాడు. అందుకు విశుద్ధ
విబుద్ధ - అసంకుచిత జ్ఞ్యానం కలవాడు కాడు. అనుకున్నదాన్ని అనుకున్నట్లు చేయలేకపోవడం, అలా చేయకుండా తనను తాను వారించలేకపోవడం సంకుచిత జ్ఞ్యానం. కానీ పరమాత్మ అలా కాదు.
ఈ లక్షణాలే వైకుంఠములో ఉన్నవారికి కూడా ఉంటాయి. కానీ నీవు ఆత్మవి. అన్నిటిలో ప్రవేశించి శాసితావు. ముక్తులకు అన్నీ ఉంటాయి గానీ సృష్టి స్థితి లయములు చేయలేడు. పరమాత్మ ప్రతీ దానిలో ప్రవేశించి శాసిస్తాడు.
కూటస్థుడు - వికార రహితుడు. పరమాత్మకు స్వరూప స్వభావ వికారాలు ఉండవు. జీవునికి సరూప మారదు కానీ, స్వభావము మారదు. ప్రకృతిలో స్వరూపములో వికారం ఉంటుంది గానీ స్వభావములో వికారం ఉండదు.

ఈయన ఆదిపురుషుడు - మొదటి వాడైన పురుషుడు. ఇక్కడ ఆది అంటే కారణం. అంటే సృష్టి స్థితి లయ కారకుడు. పురుషుడంటే పురములలో ఉండే వాడు. ఇక్కడ పురము అంటే శరీరం. ఆత్మకు శరీరం ఇచ్చి, ఆత్మలోనూ, శరీరములోనూ ఉండేవాడు. పరమాత్మే కారణమూ కార్యమూ

ఈయన భగవానుడు. ఆరు గుణములు కలవాడు. సత్వం రజస్సు తమస్సూ, ఆ వికారాలు ఉన్న మూడు లోకాలు, ఆ వికారలు ఉన్న ప్రకృతికీ పరమాత్మ అధిపతి

యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా - ఏ కష్టమూ లేఖుండా ఇవన్నీ ఆయన సంకల్పములో విషయముగా భాసించిన దాన్నే ఈయన చేస్తాడు. అది కొడా అఖండితయా. మన సంకల్పం ఖండితం. మరచిపోతూ ఉంటాము , ఒక వేళ గుర్తు ఉన్నా చేయలేము. కానీ ఆయనది అఖండితమైన సంకల్పం కలవాడు. అందరూ అందరినీ మరచిపోతారేమో గానీ, పరమాత్మ ఎప్పుడూ ఎవ్వరినీ మరువడు.

స్వదృష్ట్యా -ద్రష్టా: ఈయన స్వయం ద్రష్ట. సర్వకాల సర్వ దేశ సర్వావస్థలలో సర్వ విధములైన జగత్తుకు సుఖ ప్రాప్తీ దుఃఖ నివృత్తినీ చేసేవాడు, కావలసిన దాన్ని ఇచ్చి అవసరములేని దాన్ని ఇవ్వకుండా ఉండగలిగే వాడు. రక్షణ వ్యాపార దక్ష గలవాడు.

యస్మిన్విరుద్ధగతయో హ్యనిశం పతన్తి
విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్
తద్బ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్యమ్
ఆనన్దమాత్రమవికారమహం ప్రపద్యే

ఏ పరమాత్మ యందు ఈ లోకములో మనం అనుకునే పరస్పరవిరుద్ధమైన ఆలోచనలూ, వాటి వలన కలిగే వికారాలు, వాటి వలన కలిగే స్థితి స్వరూపాలన్నీ ఏ పరమాత్మ వలన తమకు తాముగా ఆవిర్భవిస్తాయో. భగవంతుడు కానిది ఏదీ లేదు అనే జ్ఞ్యానం నిన్ను చూస్తేనే కలుగుతుంది. పరమాత్మలో జ్ఞ్య్నాన శక్తాది గుణాలు ఉన్నాయి. ఇవి అన్నీ ఒకే సారి ఉన్నాయా? లేక క్రమముగా వచ్చాయా? అంటే పరమాత్మకు జ్ఞ్యానము ముందు వచ్చి బలం తరువాత వచ్చిందా? ఏ పని చేస్తున్నప్పుడు ఆయన ఆ ఒక్క పనే చేస్తున్నాడనిపిస్తుంది. అలాంటి స్వభావం మనది గానీ ఆయనది కాదు. ఒకదానికి ఒకటి విరుద్ధముగా ఉన్నవి కూడా ఆయనలో సమానముగా ఉంటాయి. ఇవన్నీ ఒక దాని వెనక ఒకటి ఉన్నట్లు కనపడతాయి గానీ ఆయనలోనే అన్ని గుణాలూ (జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు) చూడటానికి వరుసగా ఉన్నట్లు అనిపించినా, అవి అన్నీ సమానముగానే వస్తాయి. ఇదే ఆనుపూర్వ్యాత్
ఇవి ఉన్నవాడే బ్రహ్మ.

విశ్వభవమేకమనన్తమాద్యమ్- ఈయన ప్రపంచానికి కారణం.
ఆనన్దమాత్రమవికారమహం - ఇదే సత్యం జ్ఞ్యానం అనంతం బ్రహ్మ. ఆనందం వలన కలిగేది జ్ఞ్యానం. అవికారం అంటే సత్యం. సత్యం ఎప్పటికీ మారదు. అనంతం అంటే దేశ కాల వస్తు అపరిచ్చిన్నం. పరమాత్మ అనంతుడు : అన్ని కాలలలో రూపాలలో దేశాలలో ఉంటాడు.

ఇలాంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను.

సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మమ్
ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః
అప్యేవమర్య భగవాన్పరిపాతి దీనాన్
వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోऽస్మాన్

అన్ని కోరికలనూ నిజం చేసేవాడు పరమాత్మ. పురుషార్థమూర్తేః - పురుషార్ధమంటే జీవుల చేత కోరబడేది. ధర్మార్థకామ మోక్షాలు కాదు పురుషార్థాలంటే , పరమాత్మే పురుషార్థం. అయినా నిన్ను తప్పించి వేరే కోరికలు అడుగుతున్నావారిని కూడా నీవు కాపాడుతున్నావు. తమకు ఏది కావాలో తెలియని దీనులు వారు. అప్పుడే ఈనిన ఆవు తన దూడను పరిపాలించినట్లుగా, అప్పుడే ప్రసవించిన ఆవు తన నాలికతో దూడ యొక్క దోషాలను పోగొడుతుందో మా అందరి దోషాలను రుచిగా స్వీకరించి మమ్మల్ని కాపాడుతున్నావు

దయ తలచాలన్న దైన్యత్వం ఉన్నవాడివి. వారందరినీ నీవు కాపాడుతున్నావు

అందరిలాగా ధృవుడికి పరమాత్మ ప్రత్యక్షం మాత్రమే కాలేదు. పరమాత్మ తత్వం కూడా ప్రత్యక్షమయ్యింది. పరమాత్మ దీనికోసమె తన స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసి కూడా పాంచజన్యం స్పృశింపచేసి తన తత్వాన్ని సాక్షాత్కరింపచేసాడు. 

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
త ఏవముత్సన్నభయా ఉరుక్రమే కృతావనామాః ప్రయయుస్త్రివిష్టపమ్
సహస్రశీర్షాపి తతో గరుత్మతా మధోర్వనం భృత్యదిదృక్షయా గతః

పరమాత్మ చేత భయము తొలగించబడిన దేవతలు పరమాత్మకు నమస్కరించి స్వర్గానికి వారు వెళ్ళిపోయారు. భగవానుడు కూడా గరుడున్ని అధిరోహించి మధువనానికి వెళ్ళాడు భక్తున్ని చూడాలన్న కోరికతో.

స వై ధియా యోగవిపాకతీవ్రయా హృత్పద్మకోశే స్ఫురితం తడిత్ప్రభమ్
తిరోహితం సహసైవోపలక్ష్య బహిఃస్థితం తదవస్థం దదర్శ

ధృవుడు తదేక ధ్యానములో ఉన్నాడు. మనసులో ఏ రూపాన్ని ధ్యానం చేస్తున్నడో అక్కడ అంతర్థానమయ్యాడు. తన హృదయములో ఉన్న స్వామిని ఎదురుగానే చూసాడు

తద్దర్శనేనాగతసాధ్వసః క్షితావవన్దతాఙ్గం వినమయ్య దణ్డవత్
దృగ్భ్యాం ప్రపశ్యన్ప్రపిబన్నివార్భకశ్చుమ్బన్నివాస్యేన భుజైరివాశ్లిషన్

చూడగానే తొట్రుపడి ఒక కర్ర పడినట్లు ఆయన ముందు పడి నమస్కరించాడు. కళ్ళుబాగా తెరిచి స్వామిని తాగేస్తున్నట్లు చూచాడు. నోటితో ముద్దుపెట్టుకున్నట్లుగా భుజములతో కౌగిలించుకున్నట్లుగా

స తం వివక్షన్తమతద్విదం హరిర్జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః
కృతాఞ్జలిం బ్రహ్మమయేన కమ్బునా పస్పర్శ బాలం కృపయా కపోలే

స్వామి ఎదురుగా ఉన్నాడు. ఎదో చెప్పాలి. స్తోత్రం చేయాలి. కానీ ఏమి తెలియని వాడు. అందరి హృదయాలలో ఉండే స్వామికి ఆ విషయం అర్థమైంది. వేద స్వరూపమైన శంఖముతో స్పృశింపచేసాడు. దక్షిణ కపోల భాగములో శంఖము స్పృశింపచేస్తే

స వై తదైవ ప్రతిపాదితాం గిరం దైవీం పరిజ్ఞాతపరాత్మనిర్ణయః
తం భక్తిభావోऽభ్యగృణాదసత్వరం పరిశ్రుతోరుశ్రవసం ధ్రువక్షితిః

దానితో సకల వేద పరిజ్ఞ్యానం వచ్చింది. తవాన్ని పూర్తిగా తెలుసుకుని భక్తి భావముతో స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ధౄవమైన స్థానం కలవాడు గొప కీర్తి కలిగిన పరమాత్మను స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు


ధృవ కృత భగవద్ స్తుతి
ధ్రువ ఉవాచ
యోऽన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్

నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి శ్కతీ నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం

ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్
సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి

నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.

త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః
తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం
విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో

పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు

నూనం విముష్టమతయస్తవ మాయయా తే
యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః
అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్
ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేऽపి న్ణామ్

పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి (భవాప్యయవిమోక్షణ) అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం

యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ
ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్
సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్
కిం త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్

శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు

భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసఙ్గో
భూయాదనన్త మహతామమలాశయానామ్
యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణకథామృతపానమత్తః

ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.

తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం
యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద
సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసఙ్గాః

నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.

తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య
మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం
నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః

మేము ఏ ఏ ఆకారాలను  కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.

కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ
గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోऽస్మి తస్మై

ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.

త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా
కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః
యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా
ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే

స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే లోక రక్షణ గురించి యజ్ఞ్యములచే ఆరాధించబడే వాడు. నీ "స్థితి" ధర్మ స్థాపన కొరకే (పరిత్రాణాయ సాధూనాం). నీవు లోకాన్ని రక్షించడానికి అవతరిస్తున్నావు. నీ చేత రక్షించబడినవారు యజ్ఞ్యముల ద్వారా నిన్ను ఆరాధిస్తున్నారు. అవతరించినా నీవు వ్యతిరిక్త . అంటే ప్రకృతి కన్నా పురుషుడికన్నా విలక్షణుడవు. కానీ వాటికన్నా వేరుగా ఉన్నట్లు కనపడతావు.

పరమాత్మ . ప్రకృతి అవ్యక్తం , పంచభూతాలలోనూ ఉంటాడు. అయినా వాటిలోని దోషాలు అంటని వాడు. కానీ జీవుడు అహంకార మమకార వశమై తనకంటని దోషాలు కూడా అంటినట్లు కష్టముల పాలవుతున్నవాడు జీవుడు. ప్రకృతికి దోషాలు అంటుతాయి. కానీ పరమాత్మకు ఈ రెంటి దోషాలూ అంటవు.
నిత్యముక్త - నిత్య ముక్తులంటే దేనిలో ఉంటాడో దాని దోషం అంటని వాడు.
పరిశుద్ధ- ఎలాంటి దోషములూ లేని వాడు. ఎలాంటి దోషాలూ లేకుండా ఎలా ఉంటాడు? కర్మవశులము కాకపోతే. పరమాత్మ కర్మవశుడు కాడు. అందుకు విశుద్ధ
విబుద్ధ - అసంకుచిత జ్ఞ్యానం కలవాడు కాడు. అనుకున్నదాన్ని అనుకున్నట్లు చేయలేకపోవడం, అలా చేయకుండా తనను తాను వారించలేకపోవడం సంకుచిత జ్ఞ్యానం. కానీ పరమాత్మ అలా కాదు.
ఈ లక్షణాలే వైకుంఠములో ఉన్నవారికి కూడా ఉంటాయి. కానీ నీవు ఆత్మవి. అన్నిటిలో ప్రవేశించి శాసితావు. ముక్తులకు అన్నీ ఉంటాయి గానీ సృష్టి స్థితి లయములు చేయలేడు. పరమాత్మ ప్రతీ దానిలో ప్రవేశించి శాసిస్తాడు.
కూటస్థుడు - వికార రహితుడు. పరమాత్మకు స్వరూప స్వభావ వికారాలు ఉండవు. జీవునికి సరూప మారదు కానీ, స్వభావము మారదు. ప్రకృతిలో స్వరూపములో వికారం ఉంటుంది గానీ స్వభావములో వికారం ఉండదు.

ఈయన ఆదిపురుషుడు - మొదటి వాడైన పురుషుడు. ఇక్కడ ఆది అంటే కారణం. అంటే సృష్టి స్థితి లయ కారకుడు. పురుషుడంటే పురములలో ఉండే వాడు. ఇక్కడ పురము అంటే శరీరం. ఆత్మకు శరీరం ఇచ్చి, ఆత్మలోనూ, శరీరములోనూ ఉండేవాడు. పరమాత్మే కారణమూ కార్యమూ

ఈయన భగవానుడు. ఆరు గుణములు కలవాడు. సత్వం రజస్సు తమస్సూ, ఆ వికారాలు ఉన్న మూడు లోకాలు, ఆ వికారలు ఉన్న ప్రకృతికీ పరమాత్మ అధిపతి

యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా - ఏ కష్టమూ లేఖుండా ఇవన్నీ ఆయన సంకల్పములో విషయముగా భాసించిన దాన్నే ఈయన చేస్తాడు. అది కొడా అఖండితయా. మన సంకల్పం ఖండితం. మరచిపోతూ ఉంటాము , ఒక వేళ గుర్తు ఉన్నా చేయలేము. కానీ ఆయనది అఖండితమైన సంకల్పం కలవాడు. అందరూ అందరినీ మరచిపోతారేమో గానీ, పరమాత్మ ఎప్పుడూ ఎవ్వరినీ మరువడు.

స్వదృష్ట్యా -ద్రష్టా: ఈయన స్వయం ద్రష్ట. సర్వకాల సర్వ దేశ సర్వావస్థలలో సర్వ విధములైన జగత్తుకు సుఖ ప్రాప్తీ దుఃఖ నివృత్తినీ చేసేవాడు, కావలసిన దాన్ని ఇచ్చి అవసరములేని దాన్ని ఇవ్వకుండా ఉండగలిగే వాడు. రక్షణ వ్యాపార దక్ష గలవాడు.

యస్మిన్విరుద్ధగతయో హ్యనిశం పతన్తి
విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్
తద్బ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్యమ్
ఆనన్దమాత్రమవికారమహం ప్రపద్యే

ఏ పరమాత్మ యందు ఈ లోకములో మనం అనుకునే పరస్పరవిరుద్ధమైన ఆలోచనలూ, వాటి వలన కలిగే వికారాలు, వాటి వలన కలిగే స్థితి స్వరూపాలన్నీ ఏ పరమాత్మ వలన తమకు తాముగా ఆవిర్భవిస్తాయో. భగవంతుడు కానిది ఏదీ లేదు అనే జ్ఞ్యానం నిన్ను చూస్తేనే కలుగుతుంది. పరమాత్మలో జ్ఞ్య్నాన శక్తాది గుణాలు ఉన్నాయి. ఇవి అన్నీ ఒకే సారి ఉన్నాయా? లేక క్రమముగా వచ్చాయా? అంటే పరమాత్మకు జ్ఞ్యానము ముందు వచ్చి బలం తరువాత వచ్చిందా? ఏ పని చేస్తున్నప్పుడు ఆయన ఆ ఒక్క పనే చేస్తున్నాడనిపిస్తుంది. అలాంటి స్వభావం మనది గానీ ఆయనది కాదు. ఒకదానికి ఒకటి విరుద్ధముగా ఉన్నవి కూడా ఆయనలో సమానముగా ఉంటాయి. ఇవన్నీ ఒక దాని వెనక ఒకటి ఉన్నట్లు కనపడతాయి గానీ ఆయనలోనే అన్ని గుణాలూ (జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు) చూడటానికి వరుసగా ఉన్నట్లు అనిపించినా, అవి అన్నీ సమానముగానే వస్తాయి. ఇదే ఆనుపూర్వ్యాత్
ఇవి ఉన్నవాడే బ్రహ్మ.

విశ్వభవమేకమనన్తమాద్యమ్- ఈయన ప్రపంచానికి కారణం.
ఆనన్దమాత్రమవికారమహం - ఇదే సత్యం జ్ఞ్యానం అనంతం బ్రహ్మ. ఆనందం వలన కలిగేది జ్ఞ్యానం. అవికారం అంటే సత్యం. సత్యం ఎప్పటికీ మారదు. అనంతం అంటే దేశ కాల వస్తు అపరిచ్చిన్నం. పరమాత్మ అనంతుడు : అన్ని కాలలలో రూపాలలో దేశాలలో ఉంటాడు.

ఇలాంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను.

సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మమ్
ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః
అప్యేవమర్య భగవాన్పరిపాతి దీనాన్
వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోऽస్మాన్

అన్ని కోరికలనూ నిజం చేసేవాడు పరమాత్మ. పురుషార్థమూర్తేః - పురుషార్ధమంటే జీవుల చేత కోరబడేది. ధర్మార్థకామ మోక్షాలు కాదు పురుషార్థాలంటే , పరమాత్మే పురుషార్థం. అయినా నిన్ను తప్పించి వేరే కోరికలు అడుగుతున్నావారిని కూడా నీవు కాపాడుతున్నావు. తమకు ఏది కావాలో తెలియని దీనులు వారు. అప్పుడే ఈనిన ఆవు తన దూడను పరిపాలించినట్లుగా, అప్పుడే ప్రసవించిన ఆవు తన నాలికతో దూడ యొక్క దోషాలను పోగొడుతుందో మా అందరి దోషాలను రుచిగా స్వీకరించి మమ్మల్ని కాపాడుతున్నావు

దయ తలచాలన్న దైన్యత్వం ఉన్నవాడివి. వారందరినీ నీవు కాపాడుతున్నావు.

అందరిలాగా ధృవుడికి పరమాత్మ ప్రత్యక్షం మాత్రమే కాలేదు. పరమాత్మ తత్వం కూడా ప్రత్యక్షమయ్యింది. పరమాత్మ దీనికోసమె తన స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసి కూడా పాంచజన్యం స్పృశింపచేసి తన తత్వాన్ని సాక్షాత్కరింపచేసాడు.

మైత్రేయ ఉవాచ
అథాభిష్టుత ఏవం వై సత్సఙ్కల్పేన ధీమతా
భృత్యానురక్తో భగవాన్ప్రతినన్ద్యేదమబ్రవీత్

సత్యసంకల్పుడైన ధృవునితో తన సేవకులయందు అమితమైన ప్రేమ ఉన్న వాడైన పరమాత్మ అభినందించి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
వేదాహం తే వ్యవసితం హృది రాజన్యబాలక
తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత

నీవేమికోరి తపస్సు చేసావో నాకు తెలుసు. నీ హృదయములో ఏమనుకున్నావో నాకు తెలుసు. నీవు చక్కని వ్రతమాచరించావు కాబట్టి నీకది ఇస్తున్నాను

నాన్యైరధిష్ఠితం భద్ర యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి
యత్ర గ్రహర్క్షతారాణాం జ్యోతిషాం చక్రమాహితమ్

నీకు ధృవ స్థానాన్ని ఇస్తున్నాను. ఇతరులెవ్వరు పొందని స్థానం. ప్రపంచం మొత్తములో అదే ప్రకాశశీలమైంది. ఆ ధృవస్థానములోనే అన్ని గ్రహములూ నక్షత్రములూ తారలు అన్నీ అక్కడే ఉంటాయి.

మేఢ్యాం గోచక్రవత్స్థాస్ను పరస్తాత్కల్పవాసినామ్
ధర్మోऽగ్నిః కశ్యపః శుక్రో మునయో యే వనౌకసః
చరన్తి దక్షిణీకృత్య భ్రమన్తో యత్సతారకాః

గానుగ స్తంభం చుట్టూ ఎద్దు తిరగడానికి అందులో కర్ర ఆధారం. ఈ సకల ప్రపంచానికీ , లోకములకూ ఆ ధృవ స్థానం మేఢ్య స్థానం. కల్పకాలములో ఉండే వారికంటే అవతల ఉంటుంది. ప్రళయకాలములో కూడా అది నశించదు. బ్రహ్మకు ఒక పూట కాగానే మూడు లోకాలు పోయినా ఇది మాత్రం పోదు. మునులందరూ నక్షత్రాలతో కలిసి నీ ధృవస్థానానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు

ప్రస్థితే తు వనం పిత్రా దత్త్వా గాం ధర్మసంశ్రయః
షట్త్రింశద్వర్షసాహస్రం రక్షితావ్యాహతేన్ద్రియః

నీకు రాజ్యాన్నిచ్చి మీ త్రండ్రి  అరణ్యానికి వెళ్ళినప్పుడు అన్నిభోగాలూ అనుభవిస్తూ (ఇంద్రియములకు అడ్డులేకుండా)36000 సంవత్సరాలు పరిపాలిస్తావు.

త్వద్భ్రాతర్యుత్తమే నష్టే మృగయాయాం తు తన్మనాః
అన్వేషన్తీ వనం మాతా దావాగ్నిం సా ప్రవేక్ష్యతి

తరువాత కొంతకాలానికి నీ సోదరుడు వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన అతని తల్లి దావాగ్నిలో ప్రవేశిస్తుంది.

ఇష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞైః పుష్కలదక్షిణైః
భుక్త్వా చేహాశిషః సత్యా అన్తే మాం సంస్మరిష్యసి

నీవు నన్ను మంచి దక్షిణలతో కూడిన అనేక యజ్ఞ్యములతో ఆరాధించి, అన్ని భోగాలను అనుభవించి, చివరికి నన్ను గుర్తు చేసుకుంటావు.

తతో గన్తాసి మత్స్థానం సర్వలోకనమస్కృతమ్
ఉపరిష్టాదృషిభ్యస్త్వం యతో నావర్తతే గతః

అప్పుడు అందరిచేతా నమస్కరించబడే ధృవస్థానానికి వెళ్ళి, కొంతకాలం ఉండి, నన్ను జ్ఞ్యాపకం చేసుకుని నా లోకానికి వస్తావు

మైత్రేయ ఉవాచ
ఇత్యర్చితః స భగవానతిదిశ్యాత్మనః పదమ్
బాలస్య పశ్యతో ధామ స్వమగాద్గరుడధ్వజః

ఇలా మాట ఇచ్చి పిల్లవాడు చూస్తుండగా గరుడ వాహనుడై తనలోకానికి తాను వెళ్ళాడు

సోऽపి సఙ్కల్పజం విష్ణోః పాదసేవోపసాదితమ్
ప్రాప్య సఙ్కల్పనిర్వాణం నాతిప్రీతోऽభ్యగాత్పురమ్

ధృవుడు కూడా శ్రీమన్నారాయణుని పాద సేవన వలన తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నవాడై (లేదా పరమాత్మ సంకల్పాన్ని పొందినవాడై)  కూడా ఎక్కువగా సంతోషించలేకపోయాడు. అలా ఎక్కువగా సంతోషించకనే తన నగరానికి వెళ్ళాడు

విదుర ఉవాచ
సుదుర్లభం యత్పరమం పదం హరేర్మాయావినస్తచ్చరణార్చనార్జితమ్
లబ్ధ్వాప్యసిద్ధార్థమివైకజన్మనా కథం స్వమాత్మానమమన్యతార్థవిత్

మహామహులు కూడా ప్రత్యక్షం కాని స్వామిని ఆరు నెలలలో ప్రత్యక్షం చేసుకుని కూడా ఎందుకు ఎక్కువగా సంతోషించలేకపోయాడు
ఒక్క జన్మలోనే పరమాత్మ యొక్క పాద పూజ చేత, ఎంత గొప్పవరూ పొందలేని పరమాత్మ సనందిహి అయిన పరమపదన్ని పొంది కూడా, అనుకున్నదాన్ని పొందలేనివాడిలాగ

మైత్రేయ ఉవాచ
మాతుః సపత్న్యా వాగ్బాణైర్హృది విద్ధస్తు తాన్స్మరన్
నైచ్ఛన్ముక్తిపతేర్ముక్తిం తస్మాత్తాపముపేయివాన్

ఎదురుగా పరమాత్మ ప్రత్యక్షమైనా ధృవుని మనసులో పినతల్లి ఆడిన మాటలే వినపడ్డాయి. వాటినే తలచుకుంటూ పరమాత్మ నుండి ముక్తిని కోరలేకపోయాడు. అందుకు ముక్తినాధుడైన స్వామినుండి మోక్షము కోరలేదు. ఆ సంగతి తెలుసుకుని తరువాత బాధపడ్డాడు.

ధ్రువ ఉవాచ
సమాధినా నైకభవేన యత్పదం విదుః సనన్దాదయ ఊర్ధ్వరేతసః
మాసైరహం షడ్భిరముష్య పాదయోశ్ఛాయాముపేత్యాపగతః పృథఙ్మతిః

సనందాదులు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఏ మహానుభావుడిని తెలుసుకుంటారో అలాంటి పరమాత్మను నేను ఆరు నెలలలో పొందాను. ఎదురుగా పరమాత్మను ఉంచుకుని కూడా నేను భేధ భావాన్ని పొందాను.

అహో బత మమానాత్మ్యం మన్దభాగ్యస్య పశ్యత
భవచ్ఛిదః పాదమూలం గత్వా యాచే యదన్తవత్

ఆహా! శరీరం మీద నాకు ఎంత ప్రేమ ఉంది! సంసారాన్ని తొలగించే పరమాత్మ పాదములు వదిలి అంతము గల పదవిని కోరాను.

మతిర్విదూషితా దేవైః పతద్భిరసహిష్ణుభిః
యో నారదవచస్తథ్యం నాగ్రాహిషమసత్తమః

ఇప్పుడు నాకర్థమయ్యింది. దేవతలు నా బుద్ధిని పాడు చేసారు. దేవతలు పాడు చేయడమంటే, మన ఇంద్రియాలన్నీ దేవతలే. (ఉదా: మనసు చంద్రుడు). మనం గర్వించడానికి ఏదీ లేదు. నేను చూస్తున్నా అంటే సూర్యుడు, వింటున్నా అంటే దిక్కులూ, నాలుకా అంటే వరుణుడు, నాసికా అంటే అశ్వనీ దేవతలు. ఇది వరకు జన్మలో చేసినదానికి పొందవలసిన ఫలితాన్ని పొందాలో, పొందవలసిన ఫలితానికి మనం ఎలా ఫలితాన్ని పొందాలో ఆవిధముగా ఇంద్రియాధిష్ఠాన దేవతలు పని చేయిస్తారు. మనం పూర్వజన్మలో చేసిన పనికనుగుణముగానే ఇప్పుడు మన బుద్ధి కూడా ఉంటుంది. నారదుడు ముందే చెప్పాడు. పరమాత్మ ప్రసన్నమైనా నీవు పొందాలంకున్నది పొందగలవా, అని చెప్పాడు. నారదుని మాట నిజమే. అప్పుడు నేను గుర్తించలేదే.

దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్
తప్యే ద్వితీయేऽప్యసతి భ్రాతృభ్రాతృవ్యహృద్రుజా

తపసు చేసానని చెప్పుకుంటున్నాను గానీ, దైవ మాయచేత ఆరు నెలలు నిదుర పోయాను. నిదురపోయినవాడిలాగ భేధ దృష్టి కనపడింది. బాధలన్నీ రావడానికి మూలం, రెండవది ఉన్నది అనుకోవడం వలనే. పరమాత్మకన్నా వేరేదేదీ లేకున్నా నేను బాధపడుతున్నాను.
భ్రాతృభ్రాతృవ్యహృద్రుజా - సోదరులూ, సోదరులపిల్లలు, వీరినే జ్ఞ్యాతులూ అంటారు. అంటే సోదరులలా ఉన్న శతురువుల వలన హృదయానికి రోగం వచ్చింది. ఈ హృదయ రోగమే శత్రువు. దీని వలన తంపింపబడుతున్నాను.
మనోవ్యాధి అనే శత్రువుచేత భేధ బుద్ధి కలిగి నేను బాధపడుతున్నాను.
జ్ఞ్యాతీ అనేది శత్రువుకు పర్యాయపదం.

మయైతత్ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి
ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనమ్
భవచ్ఛిదమయాచేऽహం భవం భాగ్యవివర్జితః

వ్యర్థమైన దానిని అడిగాను. ప్రాణము పోయిన వాటికి వైద్యం చేసినట్లుగా పనికి రాని వరాన్ని అడిగాను. తపస్సు చేసి ప్రసన్నం చేసుకోడానికి శక్తిలేని వాడిని, సంసారాన్ని పోగొట్టే వాడైన పరమాత్మను సంసారం అడిగాను. అదృష్టం లేని నేను ఇది కోరాను

స్వారాజ్యం యచ్ఛతో మౌఢ్యాన్మానో మే భిక్షితో బత
ఈశ్వరాత్క్షీణపుణ్యేన ఫలీకారానివాధనః

స్వారాజ్యం ఇస్తానన్న పరమాత్మను బిక్షమెత్తుకోవడానికి పాత్రని అడిగాను. డబ్బులే చూడని రైతు దగ్గరకు కోటీశ్వరుడు వెళ్ళి "ఏమి కావాలో అడిగితే" తారు ధాన్యాన్ని అడిగినట్లు పరమేశ్వరున్ని నేను ఇది అడిగాను

మైత్రేయ ఉవాచ
న వై ముకున్దస్య పదారవిన్దయో రజోజుషస్తాత భవాదృశా జనాః
వాఞ్ఛన్తి తద్దాస్యమృతేऽర్థమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనఃసమృద్ధయః

ధృవుని పొరబాటు ఎక్కడ జరిగింది? పరమాత్మ యొక్క పాద ధూళిని పొందిన మీవంటి (విదురుని) వాళ్ళు, పరమాత్మ వచ్చి ఏమి కావాలంటే "నీ కైంకర్యం కావాలి" అంటారు గానీ, ఇంకో సంపద కోరరు. మనము ఏదో ఒక దానిని ఎందుకు కోరతాము? కొరత ఉంటే కోరతాము. పరమాత్మ పాద పరాగ స్పర్శ ఉంటే అన్నీ ఉన్నట్లే. సామాన్యమైన జీవుడు ప్రకృతిలో వేటి వేటిని పొందగలడో అవి అన్నీ పరమాత్మకు దాసుడైన వాడు పొందుతాడు. వాటితో బాటు అన్నింటికన్నా శ్రేష్టమైన పరమాత్మ దాస్యం లభిస్తుంది.
అందుకే భగవంతుని దాస్యాన్ని తప్ప మరి దేన్నీ కోరరు

ఆకర్ణ్యాత్మజమాయాన్తం సమ్పరేత్య యథాగతమ్
రాజా న శ్రద్దధే భద్రమభద్రస్య కుతో మమ

ధృవుడు నగరపొలిమేరలు చేరగానే ఆ వార్త విన్న రాజు నమ్మలేదు. అదృష్టహీనుడైన నాకు ఇంత మంగళకరమైన వార్తా?

శ్రద్ధాయ వాక్యం దేవర్షేర్హర్షవేగేన ధర్షితః
వార్తాహర్తురతిప్రీతో హారం ప్రాదాన్మహాధనమ్

కానీ నారదుని మాట గుర్తుకు వచ్చి అతి ప్రీతి పొంది వార్తాహరునికి తన హారాన్నీ కొంత ధనాన్ని బహుమానముగా ఇచ్చి

సదశ్వం రథమారుహ్య కార్తస్వరపరిష్కృతమ్
బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ పర్యస్తోऽమాత్యబన్ధుభిః
శఙ్ఖదున్దుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః
నిశ్చక్రామ పురాత్తూర్ణమాత్మజాభీక్షణోత్సుకః

(కార్తస్వరం అంటే బంగారం. కృతః స్వరః యస్మిన్. దేనితో అందరూ బాగా శ్రుతి చేయబడతారో)
బంగారు రథాన్నీ చక్కని గుర్రాలను పూంచి కులవృద్ధులతో బ్రాహ్మణులతో బంధువులతో శంఖ దుంధుబి నాదముతో బ్రహ్మఘోష (స్వస్తి వాచనం) మురళీ గానాలతో కుమారున్ని చూడాలన్న ఉత్సుకతతో బయటకి వెళ్ళాడు

సునీతిః సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే
ఆరుహ్య శిబికాం సార్ధముత్తమేనాభిజగ్మతుః

అతనితో బాటు ఇద్దరి భార్యలూ అలంకరించుకుని పల్లకీ ఎక్కి ఉత్తమునితో కలిసి అంతా వెళ్ళారు

తం దృష్ట్వోపవనాభ్యాశ ఆయాన్తం తరసా రథాత్
అవరుహ్య నృపస్తూర్ణమాసాద్య ప్రేమవిహ్వలః

పురద్వారం దగ్గరగా ఉన్న ధృవున్ని చూచి రథం దిగి అతని దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు

పరిరేభేऽఙ్గజం దోర్భ్యాం దీర్ఘోత్కణ్ఠమనాః శ్వసన్
విష్వక్సేనాఙ్ఘ్రిసంస్పర్శ హతాశేషాఘబన్ధనమ్

పరమాత్మ దివ్యమంగళ విగ్రహ స్పర్శ పొందినా, అన్ని పాపములూ పోయిన ధృవుడు. తన శరీరము నుంచి పుట్టినవాడు పరమాత్మనే తాకి పాపాలు పోగొట్టుకున్నాడు. గట్టిగా గౌగిలుంచుకున్నాడు

అథాజిఘ్రన్ముహుర్మూర్ధ్ని శీతైర్నయనవారిభిః
స్నాపయామాస తనయం జాతోద్దామమనోరథః

చల్లని కన్నీటితో (ఆనంద బాష్పాలు చల్లగా ఉంటాయి) అభిషేకం చేసాడు. ఇంత కాలానికి ఇంత గొప్ప కోరిక తీరింది ఉత్తానపాదునికి.

అభివన్ద్య పితుః పాదావాశీర్భిశ్చాభిమన్త్రితః
ననామ మాతరౌ శీర్ష్ణా సత్కృతః సజ్జనాగ్రణీః

పిల్లవాడు కూడా తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇద్దరు తల్లులకూ సజ్జనుడైన ధృవుడు నమస్కారం చేసాడు. సురుచి ధౄవున్నీ లేపీ కన్నీటితో బొంగురుపోయిన గొంతుతో

సురుచిస్తం సముత్థాప్య పాదావనతమర్భకమ్
పరిష్వజ్యాహ జీవేతి బాష్పగద్గదయా గిరా

యస్య ప్రసన్నో భగవాన్గుణైర్మైత్ర్యాదిభిర్హరిః
తస్మై నమన్తి భూతాని నిమ్నమాప ఇవ స్వయమ్

ఎలా ఐతే నీరు తనకు తానుగా పల్లం వైపు వెళుతుందో పరమాత్మే ప్రసన్నుడైన వాడిని సకల ప్రాణులూ నమస్కరిస్తాయి. మైత్రీ సంతోషం స్నేహం వంటి గుణములతో పరమాత్మ ప్రసన్నత పొందిన వారికి అన్ని ప్రాణులూ నమస్కరిస్తాయి

ఉత్తమశ్చ ధ్రువశ్చోభావన్యోన్యం ప్రేమవిహ్వలౌ
అఙ్గసఙ్గాదుత్పులకావస్రౌఘం ముహురూహతుః

ఉత్తముడికి కూడా ధౄవుని మీద ప్రేమ కలిగి పరస్పరం కౌగిలించుకుని ఆనందబాష్పాలు కార్చాడు

సునీతిరస్య జననీ ప్రాణేభ్యోऽపి ప్రియం సుతమ్
ఉపగుహ్య జహావాధిం తదఙ్గస్పర్శనిర్వృతా

సురుచికి నమస్కరించి తరువాత, ఉత్తమున్ని ఆలింగనం చేసుకున్నాక సునీతికి నమస్కరించాడు
రాముడు కూడా వనవాసం తరువాత మొదట కైకకు నమస్కరించి, భరతున్ని ఆలింగనం చేసుకుని చివరకు కౌసల్యకు ప్రణామం చేసాడు.
ప్రాణముకన్నా మిన్నగా ఉన్న కుమారున్ని ఆలింగనం చేసుకుని పుత్ర స్పర్శ వలన మనసు యొక్క తాపాన్ని వదిలిపెట్టింది

పయః స్తనాభ్యాం సుస్రావ నేత్రజైః సలిలైః శివైః
తదాభిషిచ్యమానాభ్యాం వీర వీరసువో ముహుః

ఆ తల్లి ధృవునికి క్షీరాభిషేకం (స్తనము నుండి పాలు రాగా), కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాగా నీటితోటి అభిషేకం చేసింది.  వేడిగా ఉన్న స్తన్యాన్ని చల్లబరచడానికి వచ్చినట్లుగా ఆ ఆనందబాష్పాలతో ధృవునికి అభిషేకం జరిగింది

తాం శశంసుర్జనా రాజ్ఞీం దిష్ట్యా తే పుత్ర ఆర్తిహా
ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మణ్డలం భువః

అమ్మా, ఇంతకాలం నీవిన్ని బాధలు పడ్డావు కానీ నీవు అదృష్టవంతురాలివి. నీ కష్టాలను తీర్చే కొడుకు పుట్టావు. ఇంతకాలం వెళ్ళినవాడు మళ్ళీ దొరికాడు. భూమండలం మొత్తం పరిపాలించగల కుమారుడు

అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ప్రణతార్తిహా
యదనుధ్యాయినో ధీరా మృత్యుం జిగ్యుః సుదుర్జయమ్

పూర్వ జన్మలో భగవానుని నీవు బాగా ఆరాధించి ఉంటావు. మనకు వచ్చే ఏ అధికారమైనా కీర్తి అయినా పూర్వ జన్మ సుకృతమే. ఏ పరమాత్మను ఆరాధించడం వలన గెలశక్యము కాని మృత్యువుని సులభముగా గెలుస్తామో ఆయనని ఆరాధించి ఉంటావు

లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః
ఆరోప్య కరిణీం హృష్టః స్తూయమానోऽవిశత్పురమ్

ఇలా ధృవుడు తల్లీ తండ్రుల అభినందనములు అయిన తరువాత పురప్రజలందరూ లాలించారూ, అభినందించారు. ధృవున్నీ, తమ్ముడు ఉత్తమున్ని రథము మీద అధిష్ఠింపచేసుకుని నగరములోకి ప్రవేశించాడు

తత్ర తత్రోపసఙ్క్లృప్తైర్లసన్మకరతోరణైః
సవృన్దైః కదలీస్తమ్భైః పూగపోతైశ్చ తద్విధైః

నగరానికి ధృవుడు వస్తున్న వార్త తెలిసిన ప్రజలంతా నగరాన్ని అలంకరించారు. తోరణాలు, వాటి మధ్య ముత్యాల దారం.

చూతపల్లవవాసఃస్రఙ్ ముక్తాదామవిలమ్బిభిః
ఉపస్కృతం ప్రతిద్వారమపాం కుమ్భైః సదీపకైః

ద్వారానికి రెండు పక్కలా పూర్ణ కుంభాలు పెట్టారు. కుంభముల మీద ప్రమిదలలో దీపం పెట్టారు

ప్రాకారైర్గోపురాగారైః శాతకుమ్భపరిచ్ఛదైః
సర్వతోऽలఙ్కృతం శ్రీమద్ విమానశిఖరద్యుభిః

బంగారు పూత పూసిన ప్రాకార గోపురాలతో అలంకరించబడిన ఇల్లు. నాలుగు కూడలుల దారిలో చందనం జల్లారు.

మృష్టచత్వరరథ్యాట్ట మార్గం చన్దనచర్చితమ్
లాజాక్షతైః పుష్పఫలైస్తణ్డులైర్బలిభిర్యుతమ్

పేలాలు పుష్పములూ అక్షతలూ పూజా ద్రవ్యములతో ధృవుని మీద జల్లారు

ధ్రువాయ పథి దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియః
సిద్ధార్థాక్షతదధ్యమ్బు దూర్వాపుష్పఫలాని చ

పీడ పోవడానికి ఆవాలు (సిద్ధార్ధ) జల్లారు
పెరుగు జల్లారు.

ఉపజహ్రుః ప్రయుఞ్జానా వాత్సల్యాదాశిషః సతీః
శృణ్వంస్తద్వల్గుగీతాని ప్రావిశద్భవనం పితుః

ప్రజల యొక్క మధుర గానములు వింటూ ధృవుడు నగరములోకి ప్రవేశించాడు

మహామణివ్రాతమయే స తస్మిన్భవనోత్తమే
లాలితో నితరాం పిత్రా న్యవసద్దివి దేవవత్

పయఃఫేననిభాః శయ్యా దాన్తా రుక్మపరిచ్ఛదాః
ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మా ఉపస్కరాః

పాల నురుగులాంటి పడకలు. ఏనుగు దంతములతో చేసిన మంచాలు, బంగారు రేకులు తొడిగారు.
కొన్ని ఆసనాలు వెండితో (రౌక్మ).

యత్ర స్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ
మణిప్రదీపా ఆభాన్తి లలనారత్నసంయుతాః

మరకత మాణిక్యాలు ఉన్న స్పటిక రాళ్ళతో గోడలు. మణులతో శోభిస్తున్నాయి ఆ గదులు. బంగారముతో ఒక యువతిని చేసి, తన చేతిలో మణిని పెట్టి, ఆ మణి వలన వచ్చిన వెలుతురుతో గదంతా వెలుగుతూ ఉంది. మొత్తం గదంతా వెలుగుతూ ఉంది.

ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైరమరద్రుమైః
కూజద్విహఙ్గమిథునైర్గాయన్మత్తమధువ్రతైః

అనేకమైన ఉద్యానములూ, కోకిలలూ చక్రవాకములూ నెముళ్ళూ హంసలూ రకరకాల పక్షులూ, ఫలములతో ఉన్న ఉద్యానాలను కుమారునికి చూపుకుంటూ లోపలకి తీసుకుని వెళ్ళాడు.

వాప్యో వైదూర్యసోపానాః పద్మోత్పలకుముద్వతీః
హంసకారణ్డవకులైర్జుష్టాశ్చక్రాహ్వసారసైః

ఇది వరకు ధృవుడు విన్న తన రాజ్యములో సంపదను చూచి ఆశ్చర్యపోయాడు.

ఉత్తానపాదో రాజర్షిః ప్రభావం తనయస్య తమ్
శ్రుత్వా దృష్ట్వాద్భుతతమం ప్రపేదే విస్మయం పరమ్

అతనికి యవ్వనము రావడం చూచి, ప్రజలందరూ ధృవున్ని కోరడం చూచి అతన్ని రాజు చేసాడు

వీక్ష్యోఢవయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతమ్
అనురక్తప్రజం రాజా ధ్రువం చక్రే భువః పతిమ్

పిల్లవాడు పెద్దవాడయ్యడని గ్రహించినట్లే, తనకూ వార్థక్యం వచ్చిందని ఆలోచించిన మీద తెలుసుకొని,

ఆత్మానం చ ప్రవయసమాకలయ్య విశామ్పతిః
వనం విరక్తః ప్రాతిష్ఠద్విమృశన్నాత్మనో గతిమ్

తాను ఎక్కడికి వెళ్ళాడో ఆ లోకం గురించి తెలుసుకొని వనానికి వెళ్ళాడు.

Wednesday, February 20, 2013

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంథం ఎనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంథం ఎనిమిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
సనకాద్యా నారదశ్చ ఋభుర్హంసోऽరుణిర్యతిః
నైతే గృహాన్బ్రహ్మసుతా హ్యావసన్నూర్ధ్వరేతసః

సనకాదులూ, నారదుడూ, ఋభు హంస అరుణి యతి మొదలైన బ్రహ్మ పుత్రులు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు.  జితేంద్రియులై బ్రహ్మచారులుగా ఉన్నారు.

మృషాధర్మస్య భార్యాసీద్దమ్భం మాయాం చ శత్రుహన్
అసూత మిథునం తత్తు నిరృతిర్జగృహేऽప్రజః

ఆ వంశములోనే   అధర్ముడు, అతని భార్య మృష (అసత్యం), వీరికి ధంభం మాయ అని పుట్టారు. కృతయుగములో అబ్బాయీ అమ్మాయీ కవలలుగా పుడితే వారికి వివాహం చేయడం ఆచారం. కానీ వీరి వివాహ సమయానికి ఆ ధర్మం లేదు. అయినా అధర్ముడు కాబట్టి, ఆ ఆచారం లేకపోయినా దానికి విరుద్ధమ్ముగా పెళ్ళి చేసుకున్నారు. సంతానం లేని నిరృతి తన సంతానముగా స్వీకరించాడు. వీరికి లోభము నికృతి అనే సంతానం. వీరికి క్రోధా హింసా అని కలిగారు. వీరికి దురుక్తి అని చెల్లి. దురుక్తికి కలి కలిగాడు

తయోః సమభవల్లోభో నికృతిశ్చ మహామతే
తాభ్యాం క్రోధశ్చ హింసా చ యద్దురుక్తిః స్వసా కలిః

దురుక్తౌ కలిరాధత్త భయం మృత్యుం చ సత్తమ
తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయస్తథా

మృత్యువూ భయమూ వారి సంతానం. వీరికి కూడా యాతనా నిరయం (నరకం) అనే కవలలు పుట్టారు. ఇదే అధర్మ సృష్టి. ఇదే ప్రతి సర్గం (సర్గశ్చ, ప్రతిసర్గశ్చ...)

సఙ్గ్రహేణ మయాఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ
త్రిః శ్రుత్వైతత్పుమాన్పుణ్యం విధునోత్యాత్మనో మలమ్

దీన్ని విన్నా మానవుడు తన పాపాన్ని పోగొట్టుకుంటాడు. దీన్ని మూడు సార్లు వింటే అన్ని పాపాలు తొలగిత్పోతాయి.

అథాతః కీర్తయే వంశం పుణ్యకీర్తేః కురూద్వహ
స్వాయమ్భువస్యాపి మనోర్హరేరంశాంశజన్మనః

హరి యొక్క అంశ బ్రహ్మ, అతని అంశ మనువు. బ్రహ్మ వలన పుట్టిన మనువు వలన పుట్టినవారు ప్రియవ్రత ఉత్తానపాదులు.

ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతేః సుతౌ
వాసుదేవస్య కలయా రక్షాయాం జగతః స్థితౌ

స్వాయంభువ శతరూపలకు ప్రియవ్రతుడూ, ఉత్తానపాదుడు అని కుమారులు. వీరు పరమాత్మ యొక్క అంశతోటే జగద్రక్షణకు అవతరించారు.

జాయే ఉత్తానపాదస్య సునీతిః సురుచిస్తయోః
సురుచిః ప్రేయసీ పత్యుర్నేతరా యత్సుతో ధ్రువః

ఉత్తానపాదుడికి ఒక భార్య సునీతి, ఇంకో భార్య సురుచి. సురుచి యందు ఎక్కువ ప్రీతి ఉత్తానపాదుడికి. సునీతి సంతానమే ధ్రువుడు. సురుచి సంతానం ఉత్తముడు

ఏకదా సురుచేః పుత్రమఙ్కమారోప్య లాలయన్
ఉత్తమం నారురుక్షన్తం ధ్రువం రాజాభ్యనన్దత

ఒక సారి సురుచి పుత్రుడు రాజు గారి ఒడిలో కూర్చున్నాడు. రాజుగారు ఆనందముగా స్వీకరించారు. ధ్రువుడు కూడా కూర్చోబోయాడు. అప్పుడు రాజు అభినందించలేదు

తథా చికీర్షమాణం తం సపత్న్యాస్తనయం ధ్రువమ్
సురుచిః శృణ్వతో రాజ్ఞః సేర్ష్యమాహాతిగర్వితా

భర్తయొక్క భావాన్ని గ్రహించిన సురుచి

న వత్స నృపతేర్ధిష్ణ్యం భవానారోఢుమర్హతి
న గృహీతో మయా యత్త్వం కుక్షావపి నృపాత్మజః

రాజుగారి వడిని నీవు చేరలేవు. నీకు ఆ అర్హత లేదు. నీవు రాజుగారి పుత్రుడవే గానీ నా పుత్రుడవు కావు.

బాలోऽసి బత నాత్మానమన్యస్త్రీగర్భసమ్భృతమ్
నూనం వేద భవాన్యస్య దుర్లభేऽర్థే మనోరథః

పిల్లవాడవి కాబట్టి నీకీ విషయం తెలీదు. పొందలేని దానిని కోరకు

తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే
గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనమ్

పరమాత్మను తపసుతో ఆరాధించి ఆయన అనుగ్రహముతో ఆ కడుపులో పుడితే నీకు ఆ అవకాశం వస్తుంది.

మైత్రేయ ఉవాచ
మాతుః సపత్న్యాః స దురుక్తివిద్ధః శ్వసన్రుషా దణ్డహతో యథాహిః
హిత్వా మిషన్తం పితరం సన్నవాచం జగామ మాతుః ప్రరుదన్సకాశమ్

సవతి తల్లి దుర్భాషలతో కొట్టబడిన వాడై కోపముతో బుసలు కొడుతూ, కట్టెతో కొట్టబడిన సర్పములాగ, నిట్టూర్పు విడిచాడు. చూస్తూ ఊరుకున్న తండ్రిని వదిలి వచ్చాడు. ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళాడు.

తం నిఃశ్వసన్తం స్ఫురితాధరోష్ఠం సునీతిరుత్సఙ్గ ఉదూహ్య బాలమ్
నిశమ్య తత్పౌరముఖాన్నితాన్తం సా వివ్యథే యద్గదితం సపత్న్యా

కోపముతో బుసలు కొడుతూ, పెదవి అదురుతూ ఉన్న కొడుకును దగ్గరకు తీసుకుంది.పౌరుల వలన ఆ వారత విని. సవతి మాటలు ఆమెను కూడా బాధించాయి.

సోత్సృజ్య ధైర్యం విలలాప శోక దావాగ్నినా దావలతేవ బాలా
వాక్యం సపత్న్యాః స్మరతీ సరోజ శ్రియా దృశా బాష్పకలామువాహ

బాగా ధు@ఖిస్తూ పద్మము వంటి కనులలో నీరు నిండగా నిట్టూర్పు విడుస్తూ దుఃఖం యొక్క అంతం ఎప్పుడొస్తుందో తెలియనిదై

దీర్ఘం శ్వసన్తీ వృజినస్య పారమపశ్యతీ బాలకమాహ బాలా
మామఙ్గలం తాత పరేషు మంస్థా భుఙ్క్తే జనో యత్పరదుఃఖదస్తత్

నీ పిన తల్లి మాట్లాడిన మాటలకు నాకు కూడా బాధ కలిగింది. అంతమాత్రముచేత ఇలాంటి బాధ వారికి కూడా కలగాలను కోరరాదు. ఇతరుల విషయములో అశుభాన్ని కలిగించాలని భావించకు. మానవుడు ఇతరులకు ఎలాంటి దుఃఖాన్ని ఇస్తాడో, తాను అలాంటి దుఃఖాన్ని పొందుతాడు.

సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయా ఉదరే గృహీతః
స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోఢుమిడస్పతిర్మామ్

ఎలా అన్నా సురుచి ఉన్న మాటే అన్నది. దౌర్భాగ్యురాలైన నా కడుపున నీవు పుట్టినందుకే నీకు రాజుగారి వడిలో కూర్చునే భాగ్యం రాలేదు. రాజు నన్ను భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాడు. అలాంటి నా గర్భములో పుట్టి నా పాలతో పెరిగావు.

ఆతిష్ఠ తత్తాత విమత్సరస్త్వముక్తం సమాత్రాపి యదవ్యలీకమ్
ఆరాధయాధోక్షజపాదపద్మం యదీచ్ఛసేऽధ్యాసనముత్తమో యథా

సవతి తల్లి అయినా (సమాత్రాపి) మంచి మాటే చెప్పింది, కపటము లేని మాటే చెప్పింది. ఏ దుఃఖం వచ్చినా పోగొట్టేది ఆ శ్రీమన్నారాయణుడే. పరమాత్మ యొక్క పాదపద్మాలనే ఆశ్రయించు. ఉత్తముడిలా నీవు కూడా ఉన్నత స్థానాన్ని కోరుకుంటే ఆమె చెప్పినట్లు పరమాత్మ పాదాలనే ఆశ్రయించు.

యస్యాఙ్ఘ్రిపద్మం పరిచర్య విశ్వ విభావనాయాత్తగుణాభిపత్తేః
అజోऽధ్యతిష్ఠత్ఖలు పారమేష్ఠ్యం పదం జితాత్మశ్వసనాభివన్ద్యమ్

ఇప్పటివరకూ ఉన్న వారిలో ఎవరెవరు గొప్పవారిగా పేరు పొందారో వారందరూ ఆయనను ఆరాధించిన వారే. సకల జగత్తునూ కాపాడటానికి అనంతమైన కళ్యాణ గుణములు కలిగిన ఆయన పాదాలను ఆశ్రయించి బ్రహ్మగారు పారమేష్ఠ్యం పొందారు. మనసునూ వాయువునూ గెలిచిన వారే ఆరాధించే ఉత్తమమైన బ్రహ్మలోకాన్ని చతుర్ముఖ బ్రహ్మ ఎవరి ఆరాధన వలన పొందాడో ఆయననే ఆరాధించు

తథా మనుర్వో భగవాన్పితామహో యమేకమత్యా పురుదక్షిణైర్మఖైః
ఇష్ట్వాభిపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమథాపవర్గ్యమ్

మీ తాతగారైన స్వాయంభువమనువు గొప్ప దక్షిణలు ఇచ్చి ఎన్నో యజ్ఞ్యాలతో ఈయనను ఆరాధించాడు. ఇతరులెవ్వరూ పొందలేని భూలోక సుఖమూ మోక్షమూ పొందడానికి ఆయన ఆరాధనమే మార్గము.

తమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్యపదాబ్జపద్ధతిమ్
అనన్యభావే నిజధర్మభావితే మనస్యవస్థాప్య భజస్వ పూరుషమ్

నీవూ ఆ పరమాత్మను ఆరాధించు. ఆయనకు తన భక్తుల యందు అమితమైన వాత్సల్యం ఉంది. మోక్షం కావాలని కోరుకున్న వారందరూ అతని పాదపద్మములనే అన్వేషిస్తూ ఉంటారు. పరమాత్మను ఆరాధించడానికి ఇది ప్రధానమైన సాధనం. అన్ని భావములూ ఆయన యందే ఉంచాలి. అన్యములందు ఉంచకూడదు. అనన్యభావే. మనసులో ఈ ధర్మం (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే) పెట్టుకుని ఆయననే సేవించు.

నాన్యం తతః పద్మపలాశలోచనాద్దుఃఖచ్ఛిదం తే మృగయామి కఞ్చన
యో మృగ్యతే హస్తగృహీతపద్మయా శ్రియేతరైరఙ్గ విమృగ్యమాణయా

నీ దుఃఖాన్ని పోగొట్టాలంటే పుండరీకాక్షుని కంటే ఇంకెవరూ లేరు. ఆయన కోసం ఎప్పుడూ చేతిలో పద్మము పట్టుకుని వెతుకుతూ ఉంటుంది. దేవతలందరూ అమ్మవారిని వెతుకుతూ ఉంటారు. ఎవరి చేతిలో లక్ష్మి ఉంటుందో ఆయనే జగన్నాధుడు.

మైత్రేయ ఉవాచ
ఏవం సఞ్జల్పితం మాతురాకర్ణ్యార్థాగమం వచః
సన్నియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్

తల్లి పలిక్లిన అర్థవంతములైన మాటలు విని ఆత్మతో మనసు నిగ్రహించుకుని తండ్రి నగరం నుంచి బయలు దేరాడు

నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితమ్
స్పృష్ట్వా మూర్ధన్యఘఘ్నేన పాణినా ప్రాహ విస్మితః

ఇది తెలుసుకున్న నారదుడు అన్ని పాపాలు పోగెట్టే తన హస్తుముతో పిల్లవాడిని స్పృశించి ఆశ్చర్యముతో అన్నాడు

అహో తేజః క్షత్రియాణాం మానభఙ్గమమృష్యతామ్
బాలోऽప్యయం హృదా ధత్తే యత్సమాతురసద్వచః

క్షత్రియులు చాలా గొప్పవారు. అవమానాన్ని సహించని వీరి తేజస్సు చాలా గొప్పది. పిల్లవాడై కూడా సవతి తల్లి మాటలను మనసులో పెట్టుకుని బయలుదేరాడు

నారద ఉవాచ
నాధునాప్యవమానం తే సమ్మానం వాపి పుత్రక
లక్షయామః కుమారస్య సక్తస్య క్రీడనాదిషు

నీవు ఐదేళ్ళ పిల్లవాడు. నీకు అవమానం ఏమిటి. ఆట పాటలలో ఉండాలి. అవమానం, సమ్మానం అనే వాటిని పట్టించుకునే వయసు కాదు

వికల్పే విద్యమానేऽపి న హ్యసన్తోషహేతవః
పుంసో మోహమృతే భిన్నా యల్లోకే నిజకర్మభిః

నీకు మొత్తం విషయం తెలుసూ అనుకుందామా, అవమానం అంటే అది నీవు పూర్వము చేసుకున్న కర్మే కాబట్టి బాధపడకూడదు. జ్ఞ్యానివైనా ఇవి పట్టించుకోకూడదు. చిన్న పిల్లవాడివైనా పట్టించుకోకూడదు. అన్ని దుఃఖాలకు మోహము కారణం. మనమాచరించిన సుకృత దుష్కృతములు అతి సూక్షముగా ఉంటాయి. వాటి వలననే మనకు కలిగేవన్నీ కలుగుతాయి. ఇలాంటీ మోహం మనకు కర్మలవలనే వస్తుంది. కర్మలతో మోహం, మోహం వలన బాధలు కలుగుతాయి.

పరితుష్యేత్తతస్తాత తావన్మాత్రేణ పూరుషః
దైవోపసాదితం యావద్వీక్ష్యేశ్వరగతిం బుధః

నిజమైన బుద్ధిమంతుడు పరమాత్మ ప్రసాదించినవాటితోనే తృప్తి పడతాడు. పరమాత్మ ఎంత ప్రసాదించాడో దానితోనే తృప్తిపడాలి. ఇదంతా మనం చేసేది కాదు. మన ప్రయత్నముతో మనం పొందేది కాదు. ఇదంతా ఈశ్వరస్య గతి. పరమాత్మ ప్రసాదమే ఇది. దొరకని దానికోసం ఏడ్వవద్దు, దొరికిందని సంతోషించకు.

అథ మాత్రోపదిష్టేన యోగేనావరురుత్ససి
యత్ప్రసాదం స వై పుంసాం దురారాధ్యో మతో మమ

తల్లి చెప్పింది కదా అని అనుకున్నా ఇది పిల్లలు చేయగలిగినదా? పరమాత్మ అనుగ్రహం పొందాలనుకుంటున్నావు. ఆయన మనలాంటి వారిచేత ఆరాధించగలిగిన వాడేనా? ఈయన దురారాధ్యుడు. సనకాదులకి కూడా అందని వాడు.

మునయః పదవీం యస్య నిఃసఙ్గేనోరుజన్మభిః
న విదుర్మృగయన్తోऽపి తీవ్రయోగసమాధినా

అన్నిటియందూ సంగం వదిలిన వారు ఎన్నో జన్మలలో ప్రయత్నించి కూడా, గొప్ప సమాధిలో కూడా తెలుసుకోలేకపోయారు.

అతో నివర్తతామేష నిర్బన్ధస్తవ నిష్ఫలః
యతిష్యతి భవాన్కాలే శ్రేయసాం సముపస్థితే

ఇది అయ్యే పని కాదు. ఈ ప్రయత్నం నిష్ఫలం. వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళు. పెద్దవాడివయ్యాక పరమాత్మ నీకు సహకరిస్తాడు. అప్పుడు ప్రయత్నించు

యస్య యద్దైవవిహితం స తేన సుఖదుఃఖయోః
ఆత్మానం తోషయన్దేహీ తమసః పారమృచ్ఛతి

పరమాత్మ ఎవరికి ఎప్పుడు ఎలాంటి సుఖ దుఃఖాలు ఇస్తాడో వాటితో తృప్తి పడితే వాడు సంసారాన్ని దాటుతాడు. "ఇది చాలదు" అనుకుంటే కొత్తది రాదు. ఉన్నదీ పోతుంది. సంసారాన్ని దాటాలి అనుకుంటే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం నేర్చుకోవాలి.

గుణాధికాన్ముదం లిప్సేదనుక్రోశం గుణాధమాత్
మైత్రీం సమానాదన్విచ్ఛేన్న తాపైరభిభూయతే

నీకన్నా గొప్పవారిని చూచి సంతోషించడం నేర్చుకో. నీ కన్నా తక్కువ వాడిని చూచి జాలిపడు. సమానుడితో స్నేహం చేయి. మనకి తాపములు అంటకుండా ఉండాలంటే ఈ మూడు పనులూ చేయడం నేర్చుకోవాలి

ధ్రువ ఉవాచ
సోऽయం శమో భగవతా సుఖదుఃఖహతాత్మనామ్
దర్శితః కృపయా పుంసాం దుర్దర్శోऽస్మద్విధైస్తు యః

మీరు చాలా మంచి మాటలు చెప్పారు. సుఖమూ దుఃఖమూ అని కొట్టుమిట్టే వారికొరకు మీరు చెప్పిన మాట బాగుంది గానీ అలాంటివి మాలాంటి వారు చేయలేరు.

అథాపి మేऽవినీతస్య క్షాత్త్రం ఘోరముపేయుషః
సురుచ్యా దుర్వచోబాణైర్న భిన్నే శ్రయతే హృది

క్షత్రియున్నైన నాకు గర్వం ఉంది. సురుచి అన్న మాటలకు చీలిన హృదయం అతకదు.

పదం త్రిభువనోత్కృష్టం జిగీషోః సాధు వర్త్మ మే
బ్రూహ్యస్మత్పితృభిర్బ్రహ్మన్నన్యైరప్యనధిష్ఠితమ్

మూడు లోకాల కన్నా ఉన్నత స్థానం అడగబోవుతున్నను. ఏమి చేస్తే అది పొందగలుగుతానో అది చెప్పండి. నాన్న ఒడిని కాదు నేను కోరేది. ఎవరూ పొందని ఉత్తమ స్థానం నాకు కావాలి.

నూనం భవాన్భగవతో యోऽఙ్గజః పరమేష్ఠినః
వితుదన్నటతే వీణాం హితాయ జగతోऽర్కవత్

నీవు పరమాత్మ నుండి పుట్టిన బ్రహ్మగారి యందు పుట్టిన వాడివి. వీణను మీటుతూ మీరు లోక హితము కోరి జగత్తంతా సూర్యునిలాగ తిరుగుతారు.

మైత్రేయ ఉవాచ
ఇత్యుదాహృతమాకర్ణ్య భగవాన్నారదస్తదా
ప్రీతః ప్రత్యాహ తం బాలం సద్వాక్యమనుకమ్పయా

పిల్లవాడి పట్టుదల చూచి ఈ సద్వాక్యాన్ని చెప్పాడు

నారద ఉవాచ
జనన్యాభిహితః పన్థాః స వై నిఃశ్రేయసస్య తే
భగవాన్వాసుదేవస్తం భజ తం ప్రవణాత్మనా

ధర్మార్థకామమోక్షాఖ్యం య ఇచ్ఛేచ్ఛ్రేయ ఆత్మనః
ఏకం హ్యేవ హరేస్తత్ర కారణం పాదసేవనమ్

నీ తల్లి చెప్పినదే ఉత్తమమైన మార్గము. పరమాత్మ  యందే మనసు ఉంచి పక్కకు పోనీయకుండా ఆయనను సేవిస్తూ ఉండటమే అన్ని లోకాలలో ఉన్న అన్ని ప్రాణులకూ ఏ పురుషార్థం కావాలన్నా మార్గము.

తత్తాత గచ్ఛ భద్రం తే యమునాయాస్తటం శుచి
పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేః

యమునా తీరానికి చేరు. అది పరంపవిత్రమైనది. యమునా తీరములో మధువనం ఉంది. (అదే తరువాత మధురా, సిద్ధాశ్రమం).  అక్కడ ఎప్పుడూ పరమాత్మ ఉంటాడు

స్నాత్వానుసవనం తస్మిన్కాలిన్ద్యాః సలిలే శివే
కృత్వోచితాని నివసన్నాత్మనః కల్పితాసనః

ఆ పవిత్రమైన నదిలో ప్రతీ సంధ్యలో స్నాన సంధ్యలు చేస్తూ మనసుని ప్రశాంతము చేసుకుని

ప్రాణాయామేన త్రివృతా ప్రాణేన్ద్రియమనోమలమ్
శనైర్వ్యుదస్యాభిధ్యాయేన్మనసా గురుణా గురుమ్

ఓంకారముతో ప్రాణాయామము చేసి. ఓంకారములో ఉన్న "అ" "ఉ" "మ" తో ప్రాణాయామం చేయి. కుంభకానికి కొన్ని సార్లు, రేచకాన్ని కొన్నిసార్లు పూరాన్ని కొన్ని సార్లు ఓంకారముతో చేస్తూ ప్రాణ ఇంద్రియ మనో మలాన్ని పోగోట్టుకో. మనసుని ఏకాగ్రముగా పరమాత్మ వైపు తిప్పాలి. మొదట గురువుగారిని ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. పరమాత్మని బోధించే మంత్రాన్ని జపించాలంటే మొదలు మంత్రం బోధించిన గురువుని ధ్యానించాలి. గురువు ద్వారానే పరమాత్మని ధ్యానం చేయాలి.

ప్రసాదాభిముఖం శశ్వత్ప్రసన్నవదనేక్షణమ్
సునాసం సుభ్రువం చారు కపోలం సురసున్దరమ్

నిరంతరం అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్న ప్రసన్నమైన ముఖమూ ప్రసన్నమైన చూపు కలవాడు. చక్కని ముఖము గలవాడు. దేవతలకు కూడా ఈయన సుందరుడు

తరుణం రమణీయాఙ్గమరుణోష్ఠేక్షణాధరమ్
ప్రణతాశ్రయణం నృమ్ణం శరణ్యం కరుణార్ణవమ్

నవ యువకుడు, సుందరమైన అవయములు కలవాడు. కిందిపెదవి పైపెదవి కన్నుల కొనలూ ఎర్రగా ఉన్నవాడు. అరచేతులు అరికాళ్ళు కనులూ పెదవులూ ఎర్రగా ఉండడం చతుర్ తామ్రం. గోళ్ళ కొనలు కూడా ఎర్రగా ఉంటే పంచతామ్రం.

శ్రీవత్సాఙ్కం ఘనశ్యామం పురుషం వనమాలినమ్
శఙ్ఖచక్రగదాపద్మైరభివ్యక్తచతుర్భుజమ్

శ్రీవత్సమనే పుట్టుమచ్చా, మెడలో వనమాల ఉన్నవాడు. నాలుగు భుజాలూ, శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నవాడు.

కిరీటినం కుణ్డలినం కేయూరవలయాన్వితమ్
కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససమ్

కేయూరములూ, పట్టు వస్త్రములూ,

కాఞ్చీకలాపపర్యస్తం లసత్కాఞ్చననూపురమ్
దర్శనీయతమం శాన్తం మనోనయనవర్ధనమ్

బంగారు మొలతాడు, ఎన్ని సార్లు చూచినా మళ్ళీ చూడాలనిపించేవాడు, ప్రశాంతముగా ఉన్నవాడు, మనసునీ చూపునీ ఉద్ధరించే రూపం

పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతామ్
హృత్పద్మకర్ణికాధిష్ణ్యమాక్రమ్యాత్మన్యవస్థితమ్

మణులతో అలంకరించబడిన పాదాలు. హృదయములో మధ్య స్థానములో ఉండి, అక్కడినుంచి పైకెక్కి ఆత్మలో చేరుతాడు.

స్మయమానమభిధ్యాయేత్సానురాగావలోకనమ్
నియతేనైకభూతేన మనసా వరదర్షభమ్

స్నానం చేసి యమ నియమాదులని చేసి ఈ రూపాన్ని ధ్యానం చేయి. ఆయన కనపడితేనే కళ్ళు తెరు. ఆయన కనులలో చూపులలో ప్రీతి ఉంటుంది. నియమముగా ఒకే విధానముతో మనసుతో ధ్యానం చేయి

ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః
నిర్వృత్యా పరయా తూర్ణం సమ్పన్నం న నివర్తతే

పరమ మంగళ ప్రదమైన ఈ రూపాన్ని ధ్యానం చేస్తున్న మనసుని ఆయనదగ్గరకు పంపు. ఇలాంటి పరమానందం పొందిన మనసు అక్కడి నుండి మళ్ళీ రాదు.

జపశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ
యం సప్తరాత్రం ప్రపఠన్పుమాన్పశ్యతి ఖేచరాన్

నన్ను ఆశ్రయించావు కాబట్టి పరమ రహస్యమైన మంత్రాన్ని చెబుతున్నాను, దీన్ని ఏడు రోజులు జపము చేస్తే ఆకాశములో సంచరించే యక్ష రాక్షస భూత ప్రేత పిశాచ దేవ సిద్ధ మొదలైన వారిని చూడవచ్చు. ఏడు రోజులు జపిస్తే అంతరిక్ష చారులు కనిపిస్తారు.

ఓం నమో భగవతే వాసుదేవాయ
మన్త్రేణానేన దేవస్య కుర్యాద్ద్రవ్యమయీం బుధః
సపర్యాం వివిధైర్ద్రవ్యైర్దేశకాలవిభాగవిత్

ద్రవ్యారాధన ఈ మంత్రముతోనే చేయాలి ( పుష్పం సమర్పయామి ...) దేశ కాలానికి అనుగుణముగా అర్చనను ఆచరించాలి.

సలిలైః శుచిభిర్మాల్యైర్వన్యైర్మూలఫలాదిభిః
శస్తాఙ్కురాంశుకైశ్చార్చేత్తులస్యా ప్రియయా ప్రభుమ్

పవిత్ర జలమూ మాలలూ మొదలైన వాటితోనూ, తులసీ మొదలైన వాటితోనూ అర్చన చేయాలి

లబ్ధ్వా ద్రవ్యమయీమర్చాం క్షిత్యమ్బ్వాదిషు వార్చయేత్
ఆభృతాత్మా మునిః శాన్తో యతవాఙ్మితవన్యభుక్

పరమాత్మ విగ్రహం ఉంటే అది పెట్టుకుని చేయి లేకపోతే భూమిలో జలములో సూర్యునిలో పెట్టుకుని, ముఖ్యమైంది మనసు పరమాత్మ యందు ఉంచి చేయాలి. మౌనం వహించి చేయాలి. ఆహారం మితముగా తీసుకోవాలి.

స్వేచ్ఛావతారచరితైరచిన్త్యనిజమాయయా
కరిష్యత్యుత్తమశ్లోకస్తద్ధ్యాయేద్ధృదయఙ్గమమ్

పరమాత్మ అవతారాలతో చరిత్రతో మాయతో సకలలోకాలకు మంగళాన్నిస్తున్నా, ప్రతీ వారి హృదయములో ఉన్న స్వామిని ధ్యానం చేయాలి.

పరిచర్యా భగవతో యావత్యః పూర్వసేవితాః
తా మన్త్రహృదయేనైవ ప్రయుఞ్జ్యాన్మన్త్రమూర్తయే

ఇంతకు ముందు ఉన్న ఋషులు ఎలాంటి పరిచర్యలు చేసారో నీవూ అలాంటి పరిచర్యలే చేయాలి. అన్ని పరిచర్యలూ మంత్రముతోటే (ఓంకారముతో) చేయాలి. పరమాత్మ కూడా మంత్ర మూర్తే. మంత్ర మూర్తి అయిన పరమాత్మకు మంత్ర హృదయమైన ఓంకారముతో చేయాలి

ఏవం కాయేన మనసా వచసా చ మనోగతమ్
పరిచర్యమాణో భగవాన్భక్తిమత్పరిచర్యయా

త్రికరణములతో మనసులో ఉన్న పరమాత్మను సేవించాలి. పరమాత్మ యందు భక్తి కలిగిన సేవతో

పుంసామమాయినాం సమ్యగ్భజతాం భావవర్ధనః
శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినామ్

చక్కగా సేవించే వారికి మనసులో భక్తి భావాన్ని పెంచుతాడు, మాయ,కపటమూ లేని వారికి. మనం కోరుకున్న ధర్మార్థ కామ మోక్షాలలో ఏది మనకు శ్రేయస్సో దాన్ని మనకు ప్రసాదిస్తాడు

విరక్తశ్చేన్ద్రియరతౌ భక్తియోగేన భూయసా
తం నిరన్తరభావేన భజేతాద్ధా విముక్తయే

మొదట ఇంద్రియాలకు వైరాగ్యాన్ని నేర్పాలి.

ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపార్భకః
యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణచర్చితమ్

ఇలా నారదుడు చెప్పగానే ఆయనకు నమస్కరించి ప్రదక్షిణ చేసి పరమాత్మ పాదములచే నలగబడిన మధువనానికి వెళ్ళాడు

తపోవనం గతే తస్మిన్ప్రవిష్టోऽన్తఃపురం మునిః
అర్హితార్హణకో రాజ్ఞా సుఖాసీన ఉవాచ తమ్

ఇలా పిల్లవానిని తపోవనానికి పంపి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నారదుడు సుఖాసీనుడైన తరువాత తండ్రితో ఇలా అన్నాడు

నారద ఉవాచ
రాజన్కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యతా
కిం వా న రిష్యతే కామో ధర్మో వార్థేన సంయుతః

నీవు ఏమి దీర్ఘముగా ఆలోచిస్తున్నావు. నీ ముఖము వాడిపోయింది. అర్థముతో కామముతో కూడుకుని ఉన్న ధర్మం నశించకుండా ఉందా?

రాజోవాచ
సుతో మే బాలకో బ్రహ్మన్స్త్రైణేనాకరుణాత్మనా
నిర్వాసితః పఞ్చవర్షః సహ మాత్రా మహాన్కవిః

బ్రహ్మన్, నా కుమారుడు చిన్నపిల్లవాడు. నగరము నుంచి అరణ్యములోకి వెళ్ళగొట్టబడ్డాడు. స్త్రీమీద వ్యామోహముతో దయను విడిచిపెట్టి తల్లినీ పిల్లవాడినీ దూరము చేసుకున్నాను. అర్భకుడైన పిల్లవాడిని మృగాలు హాని చేయగలవు

అప్యనాథం వనే బ్రహ్మన్మా స్మాదన్త్యర్భకం వృకాః
శ్రాన్తం శయానం క్షుధితం పరిమ్లానముఖామ్బుజమ్

నిద్రపోయినపుడో అలసి ఉన్నపుడో ఆకలిగొన్నప్పుడో ఏమరపాటుగా ఉన్నప్పుడు మృగాలు భక్షిస్తే ఎంత అనర్థం

అహో మే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ
యోऽఙ్కం ప్రేమ్ణారురుక్షన్తం నాభ్యనన్దమసత్తమః

స్త్రీ చేత ఓడింపబడ్డాను. పిల్లవాడు ఒడిలో కూర్చోబోతుంటే నేను అభినందించలేదు. నేను అభినందించి ఉంటే ఆమె అలా మాట్లాడి ఉండేది కాదు
ఆడవారికి మగవారికంటే 16 రెట్లు తెలివి 32 రెట్లు ఆకలి కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటాయి. వారి బుద్ధి ఎక్కువ ఉంది కాబట్టి బుద్ధి తక్కువ ఉన్నట్లు మరిపిస్తుంది.

నారద ఉవాచ
మా మా శుచః స్వతనయం దేవగుప్తం విశామ్పతే
తత్ప్రభావమవిజ్ఞాయ ప్రావృఙ్క్తే యద్యశో జగత్

అప్పుడు నారదుడు, నీవు నీ కుమారుని గురించి ఏ మాత్రమూ విచారించవలసిన పనిలేదు. ఆయనను మీరు కాపాడాల్సిన పని లేదు. అతనిని భగవానుడే కాపాడుతున్నాడు, దేవతలు కాపాడుతున్నారు. నీకు నీ కుమారుని ప్రభావం తెలియదు. కొద్ది రోజుల్లో అతని కీర్తిని ప్రపంచం మొత్తం వ్యాపింపచేస్తావు

సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభుః
ఐష్యత్యచిరతో రాజన్యశో విపులయంస్తవ

అష్ట దిగ్పాలకులు కూడా చేయలేని కార్యం చేసి ఇక్కడికి వస్తాడు. అతను చేసే  పని వలన నీకు పేరు వస్తుంది. త్వరలోనే అతను నగరానికి వస్తాడు

మైత్రేయ ఉవాచ
ఇతి దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతీపతిః
రాజలక్ష్మీమనాదృత్య పుత్రమేవాన్వచిన్తయత్

ఇది విన్నాక మహారాజుకు మరికాస్త ప్రేమ పెరిగింది. రాజ్య సంపదలు పక్కకు నెట్టివేసి పిల్లవాని కొరకు ఎదురుచూస్తున్నాడు

తత్రాభిషిక్తః ప్రయతస్తాముపోష్య విభావరీమ్
సమాహితః పర్యచరదృష్యాదేశేన పూరుషమ్

నారదుని చేత మంత్రోపదేశం పొంది యమునా నదికి వెళ్ళి నిశ్చయమైన మనసు గలవాడై, ఆ రాత్రి ఉపవాసముండి సావధానముతో నారదుడు చెప్పినది చెప్పినట్లుగా స్వామిని ఆరాధించాడు

త్రిరాత్రాన్తే త్రిరాత్రాన్తే కపిత్థబదరాశనః
ఆత్మవృత్త్యనుసారేణ మాసం నిన్యేऽర్చయన్హరిమ్

మనసుని నియమించాలంటే వాయువునూ ఆహారాన్ని గెలవాలి. ఒక నెల రోజులపాటు ప్రతీ మూడు రోజులకూ కపిథ్థ (బదరీ) లేక రేగు పళ్ళనూ, తన శరీరములో ప్రాణం ఉండేట్లుగా చూసుకుని తినేవాడు. శరీరములోంచి జీవుడు బయటకు వెళ్ళకుండా ఉండేందుకు ఆహారం తీసుకోవాలి
తన శరీరములో ప్రాణం ఉండటానికి అనుగుణముగా తింటూ హరిని అర్చిస్తూ గడిపాడు

ద్వితీయం చ తథా మాసం షష్ఠే షష్ఠేऽర్భకో దినే
తృణపర్ణాదిభిః శీర్ణైః కృతాన్నోऽభ్యర్చయన్విభుమ్


తరువాత ఆరు రోజులకొకసారి చెట్లకు రాలిన ఆకులని తింటూ , మూడవ నెల వచ్చేసరికి తొమ్మిది రోజులకొకసారి జలం మాత్రం ఆహారం తీసుకుంటూ సమాధిలో ఉండి పరమాత్మను ఆరాధించాడు,

తృతీయం చానయన్మాసం నవమే నవమేऽహని
అబ్భక్ష ఉత్తమశ్లోకముపాధావత్సమాధినా


చతుర్థమపి వై మాసం ద్వాదశే ద్వాదశేऽహని
వాయుభక్షో జితశ్వాసో ధ్యాయన్దేవమధారయత్


నాలగవ నెలలో పన్నెండు రోజులకొకసారి వాయువును ఆహారముగా తీసుకుని ప్రాణాయామముతో పరమాత్మని ధ్యానం చేస్తూ

పఞ్చమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజః
ధ్యాయన్బ్రహ్మ పదైకేన తస్థౌ స్థాణురివాచలః

ఐదవ నెలలో వాయువును కూడా మానేసి, నిలబడి ఒంటికాలిమీద, ఒక రాయిలాగ గడిపాడు

సర్వతో మన ఆకృష్య హృది భూతేన్ద్రియాశయమ్
ధ్యాయన్భగవతో రూపం నాద్రాక్షీత్కిఞ్చనాపరమ్

పంచభూతములూ, జ్ఞ్యానేంద్రియములూ కర్మేంద్రియములూ మనసు బుద్ధీ చిత్తమూ అంతఃకరణం అహంకారం ఈ ఇరవై ఒకటినీ తీసుకుని ఒకచోట ఉంచి, దాన్ని ఆత్మలో ఉంచి, ఆ ఆత్మను పరమాత్మలో లగ్నం చేసాడు. మనసునికి అన్నిటి నుండీ ఆకర్షించి (సర్వతో మన ఆకృష్య) విషయములనుండీ భూతముల నుండీ తన్మాత్రముల నుండీఇ ఆకర్షించి, నారదుడు చెప్పిన స్వామియొక్క సుందరమైన రూపం యందు ఉంచి పరమాత్మ రూపం కంటే ఇంక మరి దేన్నీ చూడలేదు. ఏ కొంచెం కూడా చూడలేదు

ఆధారం మహదాదీనాం ప్రధానపురుషేశ్వరమ్
బ్రహ్మ ధారయమాణస్య త్రయో లోకాశ్చకమ్పిరే

ప్రకృతీ మహత్తు అహంకారమూ అన్నిటికీ ఆధారమైనా, ప్రకృతి పురుషులకు అధిపతి ఐనా,  స్థూల సూక్ష్మములకు ఈశ్వరుడైన వానిని హృదయములో ఉంచుకున్నాడు. ప్రకృతి పురుషులకు వేరైన పరమాత్మ, ప్రకృతి పురుషులకు మూలమైన పరమాత్మ, ప్రకృతి పురుషులతో కలిసి ఉన్న పరమాత్మను హృదయములో ఉంచుకుని ధ్యానం చేస్తూ ఉంటే లోకాలన్నీ వణికిపోయాయి.

యదైకపాదేన స పార్థివార్భకస్తస్థౌ తదఙ్గుష్ఠనిపీడితా మహీ
ననామ తత్రార్ధమిభేన్ద్రధిష్ఠితా తరీవ సవ్యేతరతః పదే పదే

దృవుడు మొత్తం శరీరాన్ని కుడికాలి బొటన వేలిపై పెట్టి భూమిపై నిలబడ్డాడు. ఏనుగు నిలబడిన పడవలాగ ఒక భాగం భూమి వంగిపోయింది. ధృవుని ఒంటి కాలి బొటని వేలుపడితే భూమి కూడా ఆ భాగం అలా వంగిపోయింది

తస్మిన్నభిధ్యాయతి విశ్వమాత్మనో ద్వారం నిరుధ్యాసుమనన్యయా ధియా
లోకా నిరుచ్ఛ్వాసనిపీడితా భృశం సలోకపాలాః శరణం యయుర్హరిమ్

అనన్యభావముతో ధ్యానం చేస్తున్నాడు. లోకములో అందరికీ ప్రాణ వాయువు ఆగిపోయింది. ప్రాణవాయువైన పరమాత్మను తనలో కట్టివేసాడు, తన ప్రాణ వాయువును ఆపాడు.దీనితో లోకాలలో ఎవరికీ ప్రాణ వాయువు అందలేదు

దేవా ఊచుః
నైవం విదామో భగవన్ప్రాణరోధం చరాచరస్యాఖిలసత్త్వధామ్నః
విధేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యమ్

ఎందరో భక్తులను చూచాము గానీ ఇలాంటి ప్రాణ నిరోధం ఇంతవరకూ తెలియము. సకల చరాచర ప్రాణులందరికీ ఓజస్సు బలమూ సహః నీవు. మాకు కలిగిన ఈ ఆపద నుండి రక్షించు

శ్రీభగవానువాచ
మా భైష్ట బాలం తపసో దురత్యయాన్నివర్తయిష్యే ప్రతియాత స్వధామ
యతో హి వః ప్రాణనిరోధ ఆసీదౌత్తానపాదిర్మయి సఙ్గతాత్మా

ఏమి భయపడకండి. ఇదివరకు ఎవరూ చేయని ఘోరతపస్సు చేస్తున్న పిల్లవాడి తపసును నేను ఆపుతాను. మీరు మీఇళ్ళకు వెళ్ళండి. ధృవుడు తన ప్రాణాన్ని నాలో నిలిపాడు. అతను నాయందు మనసు లగ్నం చేసి ఉన్నాడు.

Monday, February 18, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఏడవ అధ్యాయం


శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఏడవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఇత్యజేనానునీతేన భవేన పరితుష్యతా
అభ్యధాయి మహాబాహో ప్రహస్య శ్రూయతామితి

మహాదేవ ఉవాచ
నాఘం ప్రజేశ బాలానాం వర్ణయే నానుచిన్తయే
దేవమాయాభిభూతానాం దణ్డస్తత్ర ధృతో మయా

ప్రజాపతేర్దగ్ధశీర్ష్ణో భవత్వజముఖం శిరః
మిత్రస్య చక్షుషేక్షేత భాగం స్వం బర్హిషో భగః

పూషా తు యజమానస్య దద్భిర్జక్షతు పిష్టభుక్
దేవాః ప్రకృతసర్వాఙ్గా యే మ ఉచ్ఛేషణం దదుః

బాహుభ్యామశ్వినోః పూష్ణో హస్తాభ్యాం కృతబాహవః
భవన్త్వధ్వర్యవశ్చాన్యే బస్తశ్మశ్రుర్భృగుర్భవేత్

నాకు పెద్దపట్టింపు లేదు ఈ విషయములో. పసిపిల్లలు చేసే తప్పులను పెద్దలు కట్టడి చేస్తారు గానీ అవి మనసులో భావించరు. నాకు వారు చేసిన పనికి కోపం లేదు. భగవంతుని మాయ ఆవరించి వారు ఆ పనులు చేస్తూ ఫలితాన్ని అనుభవిస్తారు. దక్షుని తల హోమం చేసిన మాట వాస్తవమే గానీ, ఆ యజ్ఞ్యములో చంపడానికి ఒక మేకను తీసుకు వస్తారు, ఆ మేక శిరోభాగమూ వృషణములూ తీసేసే మిగిలిన భాగాన్ని తీసి ఆ శరీరాన్ని వలిచి దాని హృదయ దేశములో ఉండే అపా అనే పల్చని పొర తీసి మంత్రములతో అభిమంత్రించి హోమం చేస్తారు. అది వాసన చూసిన వారికి పాపములు పోతాయి. ఆ మేక యొక్క తలను తీసి దక్షునికి అంటించండి. యజమానుల యొక్క పళ్ళతో (యజ్ఞ్యం చేసే యజమానులు) ఏదైనా తింటే అది పూషకు వెళ్ళిపోతుంది, అందుకే యజమానులు తాగాలి గానీ నమలకూడదు. పూష యజమాని దంతాలతో తింటారు. చేతులూ కాళ్ళూ ఊడిన వారికి అశ్వినీ దేవతల బాహువులూ పూష యొక్క హస్తములూ రక్షించాలి. ఈ అధ్వర్యువ్లు అందరూ ఎప్పటిలాగ ఉండాలని చేయించి అందరికీ స్వస్థత చేకూర్చాడు. అందరూ వారి వారి అవయములతో లేచారు. చూసి సంతోషించాడు. అందరూ పరమ శివున్ని ప్రశంసించారు.

మైత్రేయ ఉవాచ
తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీఢుష్టమోదితమ్
పరితుష్టాత్మభిస్తాత సాధు సాధ్విత్యథాబ్రువన్

తతో మీఢ్వాంసమామన్త్ర్య శునాసీరాః సహర్షిభిః
భూయస్తద్దేవయజనం సమీఢ్వద్వేధసో యయుః

యజ్ఞ్యములకు కావలసిన పనులన్నీ పూర్తిచేసి శంకరుడు చెప్పినట్లుగా ఋతిక్కులు మేక తలను తెచ్చి దక్షుని శరీరానికి ఉంచారు.

విధాయ కార్త్స్న్యేన చ తద్యదాహ భగవాన్భవః
సన్దధుః కస్య కాయేన సవనీయపశోః శిరః

సన్ధీయమానే శిరసి దక్షో రుద్రాభివీక్షితః
సద్యః సుప్త ఇవోత్తస్థౌ దదృశే చాగ్రతో మృడమ్

తలకాయ అంటించగానే శంకరుడు ఆయన వేపు కృపతో చూడగానే దక్షుడు బ్రతికాడు. నిదురించిన వాడు లేచినట్లు వెంటనే లేచి వెంటనే శంకరున్ని చూచాడు.

తదా వృషధ్వజద్వేష కలిలాత్మా ప్రజాపతిః
శివావలోకాదభవచ్ఛరద్ధ్రద ఇవామలః

శనర్కున్ని ద్వేషించ పాపముతో మురికి అంటిన దక్షుడు, శంకరుడు ఆయన్ను చూచిన చూపుతో పవిత్రుడయ్యాడు శరత్కాలములో నీటి మడుగువలె

భవస్తవాయ కృతధీర్నాశక్నోదనురాగతః
ఔత్కణ్ఠ్యాద్బాష్పకలయా సమ్పరేతాం సుతాం స్మరన్

విషయం అర్థమైంది దక్షునికి. ఆయన మీద ప్రేమతో భక్తితో నోట మాట పెగలక గొంతు బొంగురుపోయింది. తన కూతురు జ్ఞ్యాపకం వచ్చింది.

కృచ్ఛ్రాత్సంస్తభ్య చ మనః ప్రేమవిహ్వలితః సుధీః
శశంస నిర్వ్యలీకేన భావేనేశం ప్రజాపతిః

శంకరుని దృష్టితో వచ్చిన మనసుతో అతి కష్టం మీద మనసుని నిగ్రహించుకుని కల్మషం లేని స్వచ్చమైన భావనతో స్తోత్రం చేసాడు

దక్ష ఉవాచ
భూయాననుగ్రహ అహో భవతా కృతో మే
దణ్డస్త్వయా మయి భృతో యదపి ప్రలబ్ధః

స్వామీ! నా చేత అవమానింపబడ్డా మీరు నన్ను అనుగ్రహించారు. తప్పు చేసిన వారిని దండించడం అనుగ్రహమే.

న బ్రహ్మబన్ధుషు చ వాం భగవన్నవజ్ఞా
తుభ్యం హరేశ్చ కుత ఏవ ధృతవ్రతేషు

పరమాత్మ స్వరూపులనీ భక్తులనీ ఎవ్వరూ అవమానించలేరు. అలా ఒక వేళ ఎవరైనా చేసినా ఆ బాధ అవమానించినవారికే కానీ అవమానింపబడ్డవారికి కాదు.

విద్యాతపోవ్రతధరాన్ముఖతః స్మ విప్రాన్
బ్రహ్మాత్మతత్త్వమవితుం ప్రథమం త్వమస్రాక్
తద్బ్రాహ్మణాన్పరమ సర్వవిపత్సు పాసి
పాలః పశూనివ విభో ప్రగృహీతదణ్డః

నీవు ప్రపంచాన్ని కాపాడటానికీ, పరమాత్మ తత్వాన్ని వ్యాపింపచేయడానికి, వేదాలను ఆచరించే బ్రాహ్మణోత్తములను ముఖము నుండి సృష్టించావు. అలాంటి ధర్మ రక్షకులనూ ధర్మ పాలకులనూ ధర్మ వ్యాపకులనూ నీవే అన్ని ఆపదలలో ముందుండి కాపాడతావు, పశు పాలకులు పశువులని కాపాడినట్లు

యోऽసౌ మయావిదితతత్త్వదృశా సభాయాం
క్షిప్తో దురుక్తివిశిఖైర్విగణయ్య తన్మామ్
అర్వాక్పతన్తమర్హత్తమనిన్దయాపాద్
దృష్ట్యార్ద్రయా స భగవాన్స్వకృతేన తుష్యేత్

నీవే పరమాత్మవని తత్వము తెలియని నేను చెడు మాటలతో నిన్ను లెక్కించకుండా ఆక్షేపించాను. అలా నరకములో పడుతున్న వాడిని అయిన నన్ను చల్లని చూపుతో కాపాడావు.  నీకు సంతోషం కలిగించే పనులు మేము చేయగలమా? నీభక్తులను కాపాడగలిగానన్న సంతోషముతో నీవే సంతోషించాలి గానీ మేము చేసేవాటితో నిన్ను సంతోషింపలేము

మైత్రేయ ఉవాచ
క్షమాప్యైవం స మీఢ్వాంసం బ్రహ్మణా చానుమన్త్రితః
కర్మ సన్తానయామాస సోపాధ్యాయర్త్విగాదిభిః

ఇలా శంకరునికి క్షమాపణ చెప్పి  బ్రహ్మ అనుమతి తీసుకుని ఉపాధ్యాయులూ ఋత్విక్కులూ కలిసి ఆగిపోయిన యజ్ఞ్యాన్ని చేసారు

వైష్ణవం యజ్ఞసన్తత్యై త్రికపాలం ద్విజోత్తమాః
పురోడాశం నిరవపన్వీరసంసర్గశుద్ధయే

యజ్ఞ్యము యొక్క దోషం తొలగి పరిశుద్ధి చెందడానికి వైష్ణవ యజ్ఞ్యం చేసారు. భూత ప్రేత పిశాచాలతో వీరుని యొక్క సంబంధం వలన కలిగిన దోషం పోవడానికి త్రికపాలం (మూడు మొకుళ్ళలో గోధుమలు వేయించి నేయి కలిపిన దాన్ని పురోదాసం)వైష్ణవ యజ్ఞ్యాన్ని చేసారు

అధ్వర్యుణాత్తహవిషా యజమానో విశామ్పతే
ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః

అధ్వర్యువు పరిశుద్ధమైన మనసుతో అర్పిస్తే స్వామి ఆవిర్భవించాడు.

తదా స్వప్రభయా తేషాం ద్యోతయన్త్యా దిశో దశ
ముష్ణంస్తేజ ఉపానీతస్తార్క్ష్యేణ స్తోత్రవాజినా

పరమాత్మ తన దివ్య తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేస్తూ అందరి కన్నులను చీకట్లు గమ్ముతూ స్తోత్రములే రెక్కలుగా గల గరుత్మంతునితో (గరుత్మంతునికి ఒక రెక్క ఋగ్వేదం ఇంకో రెక్క సామ వేదం. గరుడుడంటే వేదమే) అక్కడికి వచ్చాడు.

శ్యామో హిరణ్యరశనోऽర్కకిరీటజుష్టో
నీలాలకభ్రమరమణ్డితకుణ్డలాస్యః
శఙ్ఖాబ్జచక్రశరచాపగదాసిచర్మ
వ్యగ్రైర్హిరణ్మయభుజైరివ కర్ణికారః

పరమాత్మ నీల మేఘ శ్యాముడు, బంగారు రంగు కలవాడు, సూర్యుని కాంతిని తలదన్నే కిరీటముతో శొభించేవాడు, నల్లని ముంగురులు అనే తుమ్మెదలచే అలంకరించబడిన కుండలములతో శొభించేవాడు. హిరణ్యమైన శంఖమూ పద్మమూ శరమూ ధనసూ గదా ఖడ్గము చక్రమూ చర్మమూ ధరించిన అష్టభుజములు గలవాడు అయిన పరమాత్మ ఆవిర్భవించాడు. యజ్ఞ్యశాల పద్మమైతే, దానిలో పుప్పొడి ఉండే స్థానం యందు ఆవిర్భవించాడు

వక్షస్యధిశ్రితవధూర్వనమాల్యుదార
హాసావలోకకలయా రమయంశ్చ విశ్వమ్
పార్శ్వభ్రమద్వ్యజనచామరరాజహంసః
శ్వేతాతపత్రశశినోపరి రజ్యమానః

ఆయన రాకతో సకల చరాచర జగత్తు ఆనందములో తేలియాడుతుంది, ఎందుకంటే ఆయన నవ్వుతున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు నవ్వుతున్నాడంటే అమ్మవారు వక్షస్థలములో ఉంది, దానికి ప్రాకారముగా అన్నట్లు వనమాల ఉంది. దైవ కృపనూ, ఔదార్యాన్ని చెప్పే చిరునవ్వుతో ప్రకాశించే కళ్ళతో ప్రపంచాన్ని ఆనందింపచేస్తూ, రెండు పక్కలా రెండు రాజహంసలు రెక్కలనూ ఊపుతూ ఉన్నాయి. రెక్కల చామరముతో వీస్తున్నాయి ఆ రెండు రాజ హంసలు. పైన చంద్రుడు శ్వేతాతపత్రం పట్టాడు.

తముపాగతమాలక్ష్య సర్వే సురగణాదయః
ప్రణేముః సహసోత్థాయ బ్రహ్మేన్ద్రత్ర్యక్షనాయకాః

ఇలా వేంచేసిన పరమాత్మను చూచిన దేవతలు బ్రహ్మ ఇంద్రియ యక్ష నాయకులందరూ లేచి నమస్కారం చేసారు.

తత్తేజసా హతరుచః సన్నజిహ్వాః ససాధ్వసాః
మూర్ధ్నా ధృతాఞ్జలిపుటా ఉపతస్థురధోక్షజమ్

పరమాత్మ తేజస్సుతో వారి తేజస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. మాట్లాడటానికి మాటలు రావడం లేదు. తొట్రుబాటు పడుతున్నారు. రెండు చేతులూ శిరస్సు మీద ఉంచి జోడించి స్వామిని సమీపించారు

అప్యర్వాగ్వృత్తయో యస్య మహి త్వాత్మభువాదయః
యథామతి గృణన్తి స్మ కృతానుగ్రహవిగ్రహమ్

బ్రహ్మ రుద్రేంద్రాదులు ఎవరి అనుగ్రహముతో తరువాత పుట్టినవారో, ఎవరి అనుగ్రహముతో బుద్ధి వికసించిందో, ఆ పరమాత్మ దయతో ప్రత్యక్షమవ్వగానే అందరూ ఒక్కో స్తోత్రముతో స్తోత్రం చేసారు, వారి వారి బుద్ధికి అందినట్లు

దక్షో గృహీతార్హణసాదనోత్తమం
యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుమ్
సునన్దనన్దాద్యనుగైర్వృతం ముదా
గృణన్ప్రపేదే ప్రయతః కృతాఞ్జలిః

దక్షుడు పరమాత్మకు అర్ఘ్యమూ పార్ఘ్యమూ పూజా అర్పించి, సకల ప్రజాపతులకూ పతి అయిన స్వామిని స్తోత్రం చేస్తున్నారు. సునందుడు నదుడూ జయుడూ విజయుడూ మొదలైన పార్శ్వదులతో కూడిన స్వామిని చేతులు జోడించి వినయముతో ఇలా స్తోత్రం చేసాడు

దక్ష ఉవాచ
శుద్ధం స్వధామ్న్యుపరతాఖిలబుద్ధ్యవస్థం
చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయామ్
తిష్ఠంస్తయైవ పురుషత్వముపేత్య తస్యామ్
ఆస్తే భవానపరిశుద్ధ ఇవాత్మతన్త్రః

ప్రజాపతిని అయిన నేను సృష్టి చేస్తున్నాను. కానీ మేము నిమిత్త మాత్రులం. సృష్టి చేసేది నీవు. ఏ కల్మ్షం అంటని పరిశుద్ధుడవు నీవు. నీ దగ్గర, నీ లోకములో ఎవరి బుద్ధీ ఎవరి జ్ఞ్యానమూ ఎవరి శక్తీ పని చేయవు. సూర్యుడు గానీ చంద్రుడు గానీ అగ్ని కానీ ఎవరూ ప్రకాశించరు. నీ కంతితో వీరందరు ప్రకాశిస్తారు గానీ నిన్ను ప్రకాశింపచేసేవారెవ్వరూ లేరు. అన్ని బుద్ధులూ ప్రభావాలు శక్తులూ నీ దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోతాయి. నీవు కేవలం జ్ఞ్యాన స్వఊపుడివి. ఏకం - ఏకమేవాద్వితీయం బ్రహ్మ. నీ దగ్గర తప్ప అభయం అనేది ఎక్కడా ఉండదు. నీవే అభయం.మాయను నీవే నిషేధిస్తావు. మాయను అంటకుండా ఉన్న నీవు ఆ మాయతోనే జగత్తుని సృష్టిస్తావు, ఆ మాయతో జగత్తులో జీవుడిగా జేరతావు. ఆ ప్రకృతిలో ఆ మాయలో నీవే ఉంటావు. అన్ని మురికులూ అంటినవాడివలే ఉంటావు కానీ నీకు ఏమీ అంటదు.

ఋత్విజ ఊచుః
తత్త్వం న తే వయమనఞ్జన రుద్రశాపాత్
కర్మణ్యవగ్రహధియో భగవన్విదామః
ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం
జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థాః

ఈ శ్లోకం వీలైనంతగా రోజూ చదువుకోవాలి

సదస్యా ఊచుః
ఉత్పత్త్యధ్వన్యశరణ ఉరుక్లేశదుర్గేऽన్తకోగ్ర
వ్యాలాన్విష్టే విషయమృగతృష్యాత్మగేహోరుభారః
ద్వన్ద్వశ్వభ్రే ఖలమృగభయే శోకదావేऽజ్ఞసార్థః
పాదౌకస్తే శరణద కదా యాతి కామోపసృష్టః

ఈ సంసారం అనే అరణ్యం నుండి ఎప్పుడు బయటపడతాము? నీ పాదాలనే నావను ఎప్పుడు చేరతాము? మనమందరం బాటసారులం. సంసారమే బాటలో అందరూ బాటసారులం. భవాటవీ వర్ణనం అని రహూగణ భరత సంవాదములో ఉంటుంది. సంసారమనే అరణ్యం గురించి మూడు అధ్యాయాలలో ఉన్న భావాన్ని ఈ ఒక్క శ్లోకములో ఉంది.  ఈ సంసారమనే దారిలో పడ్డ మనకు రక్షగా ఎవరు లేరు. ఈ సంసారములోకి అందరూ ఒంటిగానే వస్తారు. ఇక్కడ ఏ రక్షణా లేదు (అశరణి).
ఆ దారి కూడా చాలా కష్టమైనది (ఉరుక్లేశములు). ఈ సంసారమంతా పెద్ద కష్టాలే. గర్భప్రవేశం గర్భవాసం జన్మ, వృద్ధాప్యం, వ్యాధి, మరణం. ఇదే సంసారం. అయినా అడుగేసుకుంటూ వెళదామంటే యముడు (మృత్యువు) అనే భయంకరమైన పాములు ఉన్నాయి. కొండల మీద నుండి పారే నీరు పాము కాటుకు మందు. అలాంటి నీరైనా దొరుకుతుందా సంసారములో. అక్కడ ఉండేవన్నీ ఎంద్డమావులే (విషయ మృగ తృష్ణ).శబ్దాది విషయములనే ఎండమావుల యందు ఉండే తృష్ణ.
శరీరం ఒక బరువు, ఇళ్ళు ఇంకో బరువు. పెద్దల దగ్గరకు వెళ్ళాలన్నా అడ్డు వచ్చేవి ఈ రెండే.అయిన వెళదామనుకుంటే ఉన్నవన్నీ గోతులే. ద్వంద్వాలనే గోతులు - శీతోష్ణ, సుఖ దుఖ, లాభ నష్ట, మాన అవమాన, క్షుత్ పిపాస. ఎలాంటి వాడైనా వీటిని తప్పించుకుని బయటకి పోలేడు.  దుష్టులనే కౄర మృగాలు. దుఃఖమనే దావాగ్ని వస్తుంది. మూర్ఖుల సాయం దొరుకుతుంది. ఇలా కోరికతో చుట్టుముట్టినవాడు, రక్షణ ఇచ్చేవాడివి అయిన నీ పాదాలకు ఎప్పుడు చేరతాడు. నీ అనుగ్రహం ఉంటేనే జేరతాడు

రుద్ర ఉవాచ
తవ వరద వరాఙ్ఘ్రావాశిషేహాఖిలార్థే
హ్యపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే
యది రచితధియం మావిద్యలోకోऽపవిద్ధం
జపతి న గణయే తత్త్వత్పరానుగ్రహేణ

వరదా! ఉత్తమమైన పాదములయందు ఆశించే కోరికలను ప్రధానం చేసే నీ పాద పద్మములను కోరికలు లేనివారైన మునులు కూడా ఆశ్రయిస్తున్నారు . ఏమి అక్కరలేని వారి చేత కూడా నీవు పూజించబడతావు. "ఏ కోరికలు కలగకూడదని సేవిస్తారు"
అలాంటి నీ పాద పద్మములయందు మనసు లగ్నం చేసిన వాడిని అవిద్య ఆవరించదు, అజ్ఞ్యానం కమ్మదు. సాంసారిక విషయాలలో మునిగి ఉన్నవారు చేసిన ధూషణలు నేను లెక్క చేయను. నేను నిన్నే, నీ దయతో ధ్యానం చేస్తూ, జపం చేస్తూ ఉన్నాను. నిరంతరం నీ నామాన్నే జపిస్తూ ఉంటాను.

భృగురువాచ
యన్మాయయా గహనయాపహృతాత్మబోధా
బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపన్తః
నాత్మన్శ్రితం తవ విదన్త్యధునాపి తత్త్వం
సోऽయం ప్రసీదతు భవాన్ప్రణతాత్మబన్ధుః

అతి గాఢమైన నీ మాయ చేత ఆత్మ జ్ఞ్యానం అపహరించబడి బ్రహ్మాదులందరూ కూడా నీ మాయన్ అనే చీకటిలో నిద్రపోతుంటారు. ఇప్పటికీ నీ తత్వాన్ని వారు కూడా తెలుసుకోలేకున్నారు. నీ తతవం నీవు అనుగ్రహిస్తేనే తెలుస్తుంది. నీవు ప్రణతాత్మబంధువ్వి. ఆశ్రయించినవారికి ఆత్మ బంధువువి.

బ్రహ్మోవాచ
నైతత్స్వరూపం భవతోऽసౌ పదార్థ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్
జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో మతస్త్వమ్

ఇపుడు సాక్షాత్కరించిన నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎంతమంది చూడగలరు? మేమంతా జ్ఞ్యానమున్నవారం, అర్థమున్నవారం, గుణవంతులం, మమ్మల్ని అందరూ ఆశ్రయిస్తారు. కానీ నీవు ఈ నాలిగింటికీ అవతల ఉన్నావు. నీవు జ్ఞ్యానానికీ, ధనానికీ, గుణాలకీ, "నేను అందరికీ ఆశ్రయిస్తున్నాను" అనే అభిమానానికీ అవతల ఉంటాడు. నిన్నాశ్రయించే గుణము అహంకారం ఉన్నంతవరకూ రాదు. అది తొలగే వరకూ నీవు మాకు కనపడవు. దేహాత్మాభిమాన పోయిన తరువాతే పరమాత్మ కనపడతాడు. అది కూడా పరమాత్మే పోగొట్టాలి.

ఇన్ద్ర ఉవాచ
ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానన్దకరం మనోదృశామ్
సురవిద్విట్క్షపణైరుదాయుధైర్భుజదణ్డైరుపపన్నమష్టభిః

నీవు అచ్యుతుడవు. నిన్ను ఆశ్రయించినవాడు జారిపడడు. సకల ప్రపంచాన్ని సృష్టించే నీ ఆకారం మనసుకూ కనులకూ రెంటికీ ఆనందాన్ని కలిగించేది. దేవతలను రక్షించడానికీ, రాక్షసులను సంహరించడానికి తగిన ఆయుధాలు ధరించిన అస్టభుజములు కలిగినందుకు మీ రూపం మాకు ఆనందాన్ని కలగచేస్తోంది.

పత్న్య ఊచుః
యజ్ఞోऽయం తవ యజనాయ కేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్య దక్షకోపాత్
తం నస్త్వం శవశయనాభశాన్తమేధం యజ్ఞాత్మన్నలినరుచా దృశా పునీహి

నిన్ను ఆరాధించడానికే దక్షుడు ఈ యజ్ఞ్యాన్ని తలపెట్టాడు. ఆయన మీద క్రుద్ధుడైన పరమేశ్వరుడు ధ్వంసం చేసాడు. ప్రస్తుతం యజ్ఞ్యం శ్మశానములా ఉంది. హవిస్సులూ హోమాలూ మొదలైన మేధలు (పూజలు) ఆగిపోయాయి. పవిత్రమైన కాంతిగల నీ చూపుతో ఈ యజ్ఞ్యాన్ని ఉద్ధరించాలి.

ఋషయ ఊచుః
అనన్వితం తే భగవన్విచేష్టితం యదాత్మనా చరసి హి కర్మ నాజ్యసే
విభూతయే యత ఉపసేదురీశ్వరీం న మన్యతే స్వయమనువర్తతీం భవాన్

యమమూ నియమమూ ఇలా వేదాలాఉ స్మృతులూ బోధించిన అన్ని మార్గాలు అవలంబించిన మాకు కూడా సంసారమునుండి బయటపడటం చేతగావట్లేదు. వాటిని వదలలేకపోతున్నాము. నీవు ఇలాంటి కర్మబద్ధులైమైన వారందరిలో ఉంటావు. కరమలోనూ కర్తలోనూనీవే ఉన్నావు.అయినా నీకు రెండూ అంటవు.
అన్నిలోకాలవారు సంపద చేకూరాలని లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నారు. అలాంటి లక్ష్మి నీ వెంటపడుతూ ఉంటే నీవు ఆమెను లెక్కించటమే లేదు. అంటే సంపదలు కోరని వారికే సంసారాన్ని అంటదు.

సిద్ధా ఊచుః
అయం త్వత్కథామృష్టపీయూషనద్యాం మనోవారణః క్లేశదావాగ్నిదగ్ధః
తృషార్తోऽవగాఢో న సస్మార దావం న నిష్క్రామతి బ్రహ్మసమ్పన్నవన్నః

నీ క్థామృత నదిలో మా మనసనే ఏనుగు ఈదులాడుతోంది ఎందుకంటే కష్టమనే దావాగ్ని వలన మంటపుట్టి బాగా దప్పి గొని ఉంది. ఒక సారి దానిక్లో మునిగాక దావాగ్ని ఎక్కడ ఉందో గుర్తే లేడు. మళ్ళీ బయటకు వస్తే ఎక్కాడ ఆ దావాగని ముట్టుకుంటుందో అని మా మనసు అక్కడినుచి బయటకు రావట్లేదు. ఒకసరి పరమాత్మ దగ్గరకు వెళ్ళినవాడు బ్రహ్మ్హభావాన్ని పొందినట్లుగా బయటకు రావడం లేదు

యజమాన్యువాచ
స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియా కాన్తయా త్రాహి నః
త్వామృతేऽధీశ నాఙ్గైర్మఖః శోభతే శీర్షహీనః కబన్ధో యథా పురుషః

నీకు స్వాగాతం. మహానుభావా ప్రసన్నుడవు కా. నెకు నమస్కారం.నీవు శ్రీనివాసుడవు. అమ్మవారితో కలిసి మమ్ములను కాపాడు. నీవు లేకుణ్డా ఎన్ని అంగములతో చేసినా యజ్ఞ్య్హం శోభించదు తల లేని మొందేములాగ.

లోకపాలా ఊచుః
దృష్టః కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే యేన విశ్వమ్
మాయా హ్యేషా భవదీయా హి భూమన్యస్త్వం షష్ఠః పఞ్చభిర్భాసి భూతైః

ఈనాటికి నీవు మాకళ్ళకు కనపడ్డావు. మా కళ్ళు చెడును మాత్రమే చూస్తాయి. వాటికి కనపడ్డావు. నిన్ను నీవూ చూస్తావు, మమ్మల్నీ చూస్తావు, ప్రపంచాన్నీ చూస్తావు/చూపుతావు. దృశ్యమూ ద్రష్టా ఒకఏ అని నీవు చూస్తావు. మేము అది రెండుగా చూస్తాము. ఇదంతా నీ మాయనే.నీవు ఐదుభూతాలకు కనపడే ఆరవ వాడిక్వి. యజ్ఞ్యములతో నీవు స్తోత్ర్మ్ చేయబడతావు.

యోగేశ్వరా ఊచుః
ప్రేయాన్న తేऽన్యోऽస్త్యముతస్త్వయి ప్రభో విశ్వాత్మనీక్షేన్న పృథగ్య ఆత్మనః
అథాపి భక్త్యేశ తయోపధావతామనన్యవృత్త్యానుగృహాణ వత్సల
జగదుద్భవస్థితిలయేషు దైవతో బహుభిద్యమానగుణయాత్మమాయయా
రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తితభ్రమగుణాత్మనే నమః

నీకు శత్రువూ లేడూ ప్రీతి  పాత్రుడూలేడుల్. సకల జగత్తుకూ ఆత్మగా ఉన్న నీ నుడి జగత్తుని విడిగా చూసేవాడు నిన్ను దర్శించలేడు.  ప్రపంచమూ పరమాత్మా వేరని భావించేవారికి నీవు సాక్షాత్కరించవు. మాకు ప్రపంచం వేరు నీవు వేరు అన్న అజ్ఞ్యానమున్నా నీవు ప్రసాదించిన రవ్వంత భక్తి ఉంది. అనన్య భక్తితో నిన్ను సేవించిన వారిని అనుగ్రహిస్తావు.నీవు భక్త వత్సలుడివి . పలురకములుగా మారే నీ మాయతో రాజసముతో సృష్టి, తామసముతో సంహారం, సాత్వికముతో రక్షణ చేస్తావు. దీనితోనే నీవే బ్రహ్మగా శివునిగా విష్ణువుగా భాసిస్తుంటే మీరు వేరనే భావం మాకు కలుగుతోంద్. అది కలిగించేవాడివీ తొలగించేవాడివీ నీవే. అలాంటి నీకు నమస్కారం.



బ్రహ్మోవాచ
నమస్తే శ్రితసత్త్వాయ ధర్మాదీనాం చ సూతయే
నిర్గుణాయ చ యత్కాష్ఠాం నాహం వేదాపరేऽపి చ

ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలౌ. శ్రితసత్త్వాయ  సత్వ గుణాన్ని ఆశ్రయించిన, ధర్మాది అష్ట గుణాలకూ కారణమైన, హేయగుణములులేని వాడవైన నీవు ఎక్కడ ఉన్నవో నాకు కూడా తెలీదు, ఇతరులకూ తెలియదు

అగ్నిరువాచ
యత్తేజసాహం సుసమిద్ధతేజా హవ్యం వహే స్వధ్వర ఆజ్యసిక్తమ్
తం యజ్ఞియం పఞ్చవిధం చ పఞ్చభిః స్విష్టం యజుర్భిః ప్రణతోऽస్మి యజ్ఞమ్

నేను ఎంతో మంది చేసే యజ్ఞ్యములలో ఆజ్యముని మోస్తున్నాను. అది నీ తేజస్సు వల్లనే. దాని వలననే నా తేజస్సు పెరిగింది.
ఐదు రకములైన యజుర్వేద మంత్రాలతో ఆరాధించబడుతున్నావు. దేవ పితృ ఋషి అతిథి భూత యజ్ఞ్యాలతో  ఆరాధించబడేవాడివి నీవే. యజ్ఞ్యములో నాకు అగ్నిత్వాన్ని కల్పించినదీ నీవే. ఐదు రకముల సూక్తములతో ఆరాధించబడే నిన్ను నేను నమస్కరిన్స్తున్నాను.  ఏ ఏ దేవత ఏ పని చేసినా అది పరమాత్మ చేయించినదే అని ఈ స్తోత్రానికి అర్థం


దేవా ఊచుః
పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం
త్వమేవాద్యస్తస్మిన్సలిల ఉరగేన్ద్రాధిశయనే
పుమాన్శేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మపదవిః
స ఏవాద్యాక్ష్ణోర్యః పథి చరసి భృత్యానవసి నః

ప్రళయములో సృష్టిని మొత్తం కడుపులో పెట్టుకుని మొదటివాడివైన నీవు నీటిలో ఆదిశెషుని మీద పురుషుడిగా నిదురించుచున్నావు. ఆ స్థితిలో కూడా నీ హృదయములో ఉన్న సిద్ధులందరూ నీ ఆధ్యాత్మిక స్థితిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ప్రళయములో అన్ని నీలోదాచుకుని మొదటి పురుషుడిగా భాసించేనీవు ఆ స్తోత్రాన్ని వింటూ ఉండే నీవు మా కళ్ళకు కనపడ్డావంటే అది నీఎ సంకల్పమే , మా గొపదనం కాదు. సేవకులమైన మమ్ము కాపాడుతున్నావు

గన్ధర్వా ఊచుః
అంశాంశాస్తే దేవ మరీచ్యాదయ ఏతే బ్రహ్మేన్ద్రాద్యా దేవగణా రుద్రపురోగాః
క్రీడాభాణ్డం విశ్వమిదం యస్య విభూమన్తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ

నీ అంశాంశాదులైన వారే మరీచులు, బ్రహ్మాదులూ. నీవు నృత్యం చేస్తావు. ఘట నృత్యం. ప్రపంచనం అనే కుండ మీద నీవు నృత్యం చేస్తున్నావు. అలాంటి నీకు నమస్కారం.

విద్యాధరా ఊచుః
త్వన్మాయయార్థమభిపద్య కలేవరేऽస్మిన్
కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథైః స్వైః
క్షిప్తోऽప్యసద్విషయలాలస ఆత్మమోహం
యుష్మత్కథామృతనిషేవక ఉద్వ్యుదస్యేత్

నీ మాయతో ఈ శరీరములో ఒక ప్రయోజనాన్ని ఆశించి "నాదీ నేనూ"అనే అహంకారం కలవారమైన, మేముగా ఏర్పరచుకున్న అడ్డదారిలో పడి చెడు విషయాల మీద ప్రీతితో శరీరమే ఆత్మ అనే మోహములో ఉన్నాము. ఇలాంటి ఆత్మ మోహం తొలగిపోవాలంటే, మూర్చ పోవాలంటే అమృతపు చుక్కలు నోట్లోవేసుకున్నట్లు, నీ కథామృతాన్ని సేవించడమే మార్గం

బ్రాహ్మణా ఊచుః
త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశః స్వయం త్వం హి మన్త్రః సమిద్దర్భపాత్రాణి చ
త్వం సదస్యర్త్విజో దమ్పతీ దేవతా అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశుః

యజ్ఞ్యం హవిస్సు మంత్రం అగ్నిహోత్రుడు పాత్రలూ ఋత్విక్కూ అగ్నిహోత్రం స్వధా సోమరసం పశువూ అన్నీ నీవే. ఎందుకంటే ఇవన్నీ వచ్చినవి భూమిలోంచి. ఆ భూమిని నీవే దంష్ట్రలతో ఏనుగు పద్మాన్ని తీసినట్లుగా అందరూ నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే పైకి ఉద్ధరించావు. అపుడు నీవు యజ్ఞ్యమూర్తివై ఉన్నావు.

త్వం పురా గాం రసాయా మహాసూకరో దంష్ట్రయా పద్మినీం వారణేన్ద్రో యథా
స్తూయమానో నదల్లీలయా యోగిభిర్వ్యుజ్జహర్థ త్రయీగాత్ర యజ్ఞక్రతుః

స ప్రసీద త్వమస్మాకమాకాఙ్క్షతాం దర్శనం తే పరిభ్రష్టసత్కర్మణామ్
కీర్త్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశ తే యజ్ఞవిఘ్నాః క్షయం యాన్తి తస్మై నమః

నీవు ప్రసన్నుడవు కావలసింది.  మంచి అన్న ప్రతీదీ వదిపిపెట్టిన వాళ్ళం. నీ దివ్య నామాన్ని కెర్తన చేస్తే యజ్ఞ్యమ్య్లో వచ్చిన అన్ని విఘ్నాలూ తొలగిపోతాయి.

మైత్రేయ ఉవాచ
ఇతి దక్షః కవిర్యజ్ఞం భద్ర రుద్రాభిమర్శితమ్
కీర్త్యమానే హృషీకేశే సన్నిన్యే యజ్ఞభావనే

రుద్రుని చేత ధ్వంసం చేయబడిన యజ్ఞ్యాన్ని దక్షుడు పరమాత్మ దగ్గర ఉండగా, పరమాత్మను అందరూ స్తోత్రం చేస్తూ ఉంటే యజ్ఞ్య్నాన్ని పూర్తిగావించారు.

భగవాన్స్వేన భాగేన సర్వాత్మా సర్వభాగభుక్
దక్షం బభాష ఆభాష్య ప్రీయమాణ ఇవానఘ

అందరిభాగాలు తనవే అయిన పరమాత్మ యజ్ఞ్యములో తన భాగము తాను తీసుకున్నాడు. ప్రీతి చెందిన వాడిలా దక్షునితో మాట్లాడాడు.

శ్రీభగవానువాచ
అహం బ్రహ్మా చ శర్వశ్చ జగతః కారణం పరమ్
ఆత్మేశ్వర ఉపద్రష్టా స్వయన్దృగవిశేషణః

బ్రహ్మ విష్ణు మహేశ్వరులమైన మేము ఈ జగత్తుకు కారణం. మేమే ఆత్మ, మేమే ఈశ్వరులం , చొసేవాళ్ళమూ మేమే. నాకెలాంటి గుణాలూ లేవు.

ఆత్మమాయాం సమావిశ్య సోऽహం గుణమయీం ద్విజ
సృజన్రక్షన్హరన్విశ్వం దధ్రే సంజ్ఞాం క్రియోచితామ్

సంసారములో ఉండీ కూడా ఆ దోషాలు అంటని వాడిని నేను. నేనే నా మాయను ఆశ్రయించి ఆయా గుణాలని తీసుకుంటాను . ఆయా గుణాలు తీసుకున్నప్పుడు ఏ గుణం తీసుకుంటే ఆ ఆకారం ధరించి ఆ పని చేస్తాను. ఆయా పనికి తగిన పేరును నేను వహిస్తాను. నేనే బ్రహ్మనూ రుద్రున్నీ విష్ణువునీ

తస్మిన్బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని
బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేనాజ్ఞోऽనుపశ్యతి

ఇలా ఒక్కడినే అయిన నా యందు బ్రహ్మ రుద్రుడూ జీవుడూ లోకములూ పరమాత్మా వేరు అని అజ్ఞ్యానులు చూస్తారు

యథా పుమాన్న స్వాఙ్గేషు శిరఃపాణ్యాదిషు క్వచిత్
పారక్యబుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః

మనిషి, నేను వేరు నా తల వేరు, నా కాళ్ళు వేరు అని అనుకోరో ప్రపంచం వేరూ పరమాత్మ వేరని నావాడెవడూ అనుకోడు.

త్రయాణామేకభావానాం యో న పశ్యతి వై భిదామ్
సర్వభూతాత్మనాం బ్రహ్మన్స శాన్తిమధిగచ్ఛతి

గుణములని బట్టి ఉన్న పేరును బట్టి ఎవరైతే భేధాలను చూడరో వారు శాంతిని పొందుతారు. శాంతిని  పొందాలంటే వారంతా నా వారు అని తెలుసుకోవాలి. అంతా నేనే అని తెలుసుకున్నవాడు మాత్రమే శాంతిని పొందుతాడు

మైత్రేయ ఉవాచ
ఏవం భగవతాదిష్టః ప్రజాపతిపతిర్హరిమ్
అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతోऽయజత్

ఇలా ప్రజాపతి పతిని ఆజ్ఞ్యాపిస్తే స్వామిని ఆరాధించి , అక్కడి దేవతలనూ, ఇక్కడి దేవతలనూ (భూ దేవతలు - బ్రాహ్మణులు). శంకరునికీ ఆయన భాగాన్ని ఇచ్చాడు. ఇతర దేవతలకు కూడా ఆయా భాగాలు ఇచ్చాడు

రుద్రం చ స్వేన భాగేన హ్యుపాధావత్సమాహితః
కర్మణోదవసానేన సోమపానితరానపి
ఉదవస్య సహర్త్విగ్భిః సస్నావవభృథం తతః

ఋత్విక్కులూ ఇతర బ్రాహ్మణులూ పరమాత్మ అనుగ్రహముతో అవభృత స్నానం చేసారు.

తస్మా అప్యనుభావేన స్వేనైవావాప్తరాధసే
ధర్మ ఏవ మతిం దత్త్వా త్రిదశాస్తే దివం యయుః

దేవతలు కూడా ధర్మం యందు  బుద్ధి ఉంచి తమ తమ లోకాలకు వెళ్ళారు

ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరమ్
జజ్ఞే హిమవతః క్షేత్రే మేనాయామితి శుశ్రుమ

దక్షుని పుత్రిక అయిన సతీ దేవి శరీరాన్ని విడిచిపెట్టి హిమవంతుని భార్య అయిన మేనకు పుట్టింది అని వింటున్నాము. మరో జన్మలో కూడా ఆమె శంకరున్నే వరించింది.

తమేవ దయితం భూయ ఆవృఙ్క్తే పతిమమ్బికా
అనన్యభావైకగతిం శక్తిః సుప్తేవ పూరుషమ్

ఏతద్భగవతః శమ్భోః కర్మ దక్షాధ్వరద్రుహః
శ్రుతం భాగవతాచ్ఛిష్యాదుద్ధవాన్మే బృహస్పతేః

ఇది దక్ష యజ్ఞ్య్నాన్ని ధ్వంసం చేసిన కథా. బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడి ద్వారా ఈ కథను విన్నాను.

ఇదం పవిత్రం పరమీశచేష్టితం యశస్యమాయుష్యమఘౌఘమర్షణమ్
యో నిత్యదాకర్ణ్య నరోऽనుకీర్తయేద్ధునోత్యఘం కౌరవ భక్తిభావతః

ఈ దక్ష యజ్ఞ్ గాధ పరమాత్మ చేష్టితం. కీర్తినీ ఆయువునీ ఇస్తుంది అన్నిపాపాలను పోగొడుతుంది. ఎవరు దీన్ని నిత్యమూ వింటారో చెబుతారో భక్తిభావముతో సంసారాన్ని విడిచిపెడతాడు
పాప రాశిని మర్దించేది ఈ చరితం. దీన్ని ఎవరు రోజు వింటారో చెబుతారో వారికి భక్తి కలిగి వారి పాపం పోతుంది. దక్ష చరిత్ర మనకు పరమాత్మ యందు భక్తిని కలిగిస్తుంది. పరమాత్మ ఏర్పరచిన వ్యవస్థను ఎవరు భంగపరచినా ఫలితం అనుభవించక తప్పదు. ఒక అంశతో సృష్టీ, ఒక అంశతో సంహారం, ఇంకో అంశతో స్థితీ చేస్తున్నాడు. వీరిలో ఏ ఒక్కరిని అవమానించినా ఆ అవమానం స్వామికే.