Wednesday, April 3, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీరాజోవాచ
దేవాసురనృణాం సర్గో నాగానాం మృగపక్షిణామ్
సామాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వాయమ్భువేऽన్తరే

తస్యైవ వ్యాసమిచ్ఛామి జ్ఞాతుం తే భగవన్యథా
అనుసర్గం యయా శక్త్యా ససర్జ భగవాన్పరః

స్వాయంభువ మన్వంతరములో దేవ దానవ సిద్ధ సాధ్యుల సృష్టి జరిగినదని (అనుసర్గ) చెప్పావు. దానిని విస్తారముగా తెలుసుకోవాలనుకుంటున్నాను.

శ్రీసూత ఉవాచ
ఇతి సమ్ప్రశ్నమాకర్ణ్య రాజర్షేర్బాదరాయణిః
ప్రతినన్ద్య మహాయోగీ జగాద మునిసత్తమాః

మంచి ప్రశ్న అడిగావని అభినందించి ఇలా చెప్పాడు శుకుడు

శ్రీశుక ఉవాచ
యదా ప్రచేతసః పుత్రా దశ ప్రాచీనబర్హిషః
అన్తఃసముద్రాదున్మగ్నా దదృశుర్గాం ద్రుమైర్వృతామ్

ప్రాచీన బర్హి పది మంది కుమారులు ప్రాచేతసులు తపస్సు నుంచి బయటకు వచ్చి చూస్తే భూమి కనపడక కేవలం చెట్లతో కప్పబడి ఉనంది

ద్రుమేభ్యః క్రుధ్యమానాస్తే తపోదీపితమన్యవః
ముఖతో వాయుమగ్నిం చ ససృజుస్తద్దిధక్షయా

అది చూసిన వారికి కోపం వచ్చెసింది. తమ తపః ప్రభావముతో నొటి నుండి అగ్నినీ వాయువునూ విడిచిపెట్టారు

తాభ్యాం నిర్దహ్యమానాంస్తానుపలభ్య కురూద్వహ
రాజోవాచ మహాన్సోమో మన్యుం ప్రశమయన్నివ

ఇలా వారు చెట్లను తగలబెడుతూ ఉంటే చంద్రుడు (చెట్లకు అధిపతి) వచ్చి

న ద్రుమేభ్యో మహాభాగా దీనేభ్యో ద్రోగ్ధుమర్హథ
వివర్ధయిషవో యూయం ప్రజానాం పతయః స్మృతాః

దీనములైన చెట్లకు మీరు ద్రోహం చేయకూడదు. మీరు సృష్టిని పెంచాలనుకుంటున్నారు. అలాంటి వారు సృష్టిలో భాగమైన చెట్లను నరకరాదు.

అహో ప్రజాపతిపతిర్భగవాన్హరిరవ్యయః
వనస్పతీనోషధీశ్చ ససర్జోర్జమిషం విభుః

మీరిప్పుడు ప్రజాపతులు. ఇదంతా ప్రజాపతి పతి అయిన శ్రీమన్నారాయణుడు ఈ సకల వృక్ష సంపదను పెంచాడు. పితృదేవతలకిచ్చే ఆహారమైన ఊర్జన్మూ, దేవతలకిచ్చే ఆహారమైన "ఇష"ను కల్పించాడు. (ఈ రెండూ చంద్రుడు ఇస్తాడు. అందుకే అమా అనే సూర్యుని కిరణం వచ్చినప్పుడు, ఆ రోజు చంద్రుడు అమా అనే కిరణము కింద ఉంటాడు. ఆ అమా అనే కిరణములో ఉన్న చంద్రుడు వృక్షాలను పోషిస్తాడు. అందుకే అమావాస్యనాడు చెట్లను ముట్టరాదు, పగలైనా రాత్రైనా. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు చెట్లను పోషిస్తూ ఉంటాడు)

అన్నం చరాణామచరా హ్యపదః పాదచారిణామ్
అహస్తా హస్తయుక్తానాం ద్విపదాం చ చతుష్పదః

కదలకుండా ఉండేవి కదిలేవాటికీ కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్నవాటికీ చేతులు లేనివి చేతులు ఉన్నవాటికీ నాలుగు కాళ్ళు ఉన్నవి రెండు కాళ్ళు ఉన్నవాటికీ ఆహారం.

యూయం చ పిత్రాన్వాదిష్టా దేవదేవేన చానఘాః
ప్రజాసర్గాయ హి కథం వృక్షాన్నిర్దగ్ధుమర్హథ

మీరు తండ్రి చేత ఆజ్ఞ్యాపించబడీ, దేవ దేవుడైన విష్ణువుచేతా చెప్పబడి సృష్టిని పెంచడానికి వచ్చిన మీరు ఇలా వృక్షాలను దహించవేయరాదు

ఆతిష్ఠత సతాం మార్గం కోపం యచ్ఛత దీపితమ్
పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహైః

సజ్జనుల మార్గాన్ని అనుసరించి మండుతున్న కోపాన్ని చల్లార్చండి. తాతలూ తండ్రులూ ముత్తాతలూ ఒక ధర్మాన్ని ఏర్పరచారు. ఎవరికెవరెవరు రక్షకులో చెప్పారు

తోకానాం పితరౌ బన్ధూ దృశః పక్ష్మ స్త్రియాః పతిః
పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానాం బుధః సుహృత్

పిల్లలకు తల్లి తండ్రులూ
కంటికి రెప్ప
స్త్రీలకు భర్తలు
ప్రజలకు రాజు
బిక్షకులకు దాత
రహస్యం తెలియాలనుకున్నవాడికి పండితుడు రక్షకులు

అన్తర్దేహేషు భూతానామాత్మాస్తే హరిరీశ్వరః
సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వమేవం వస్తోషితో హ్యసౌ

శరీరములో లోపల దాగి ఉన్న ఆత్మకు అంతర్యామి అయిన పరమాత్మ రక్షకుడు.
ప్రపంచం మొత్తం అతని ఇల్లే. అలాంటి పరమాత్మను మీరు సంతోషిమప్చేసారు. భగవంతుని అనుగ్రహాన్ని పొందిన మీరే ప్రపంచాన్ని భగవదాలయముగా తెలియలేకుంటే ఇంకెవరికి తెలుస్తుంది

యః సముత్పతితం దేహ ఆకాశాన్మన్యుముల్బణమ్
ఆత్మజిజ్ఞాసయా యచ్ఛేత్స గుణానతివర్తతే

ఆకాశం నుండి వాయువు వచ్చినట్లుగా మనశారీరం నుండి వచ్చే కోపాన్ని గెలవ గలిగిన వాడే ప్రకృతిని గెలిచి గుణములను దాటగలుగుతాడు

అలం దగ్ధైర్ద్రుమైర్దీనైః ఖిలానాం శివమస్తు వః
వార్క్షీ హ్యేషా వరా కన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతామ్

ఇంతవరకూ కాల్చినవి చాలు. మిగిలినవాటిని క్షేమముగా ఉంచండి. వారి అమ్మాయిని మీకు ఇస్తున్నాము. ఈమెను భార్య్గా స్వీకరించండి

ఇత్యామన్త్ర్య వరారోహాం కన్యామాప్సరసీం నృప
సోమో రాజా యయౌ దత్త్వా తే ధర్మేణోపయేమిరే

ఇలా పలికి చంద్రుడు మారిషను వారికిచ్చి వెళ్ళిపోయాడు. వారు ఆమెను యధావిధిగా వివాహం చేసుకున్నారు

తేభ్యస్తస్యాం సమభవద్దక్షః ప్రాచేతసః కిల
యస్య ప్రజావిసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః

వారి నుండి ఆమెకు దక్షుడు పుట్టాడు. అతనిచేత మూడు లోకాలు నిండిపోయేంత సృష్టి పెరిగింది.

యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సలః
రేతసా మనసా చైవ తన్మమావహితః శృణు

దక్షునికి పుత్రికలంటే ప్రేమ ఎక్కువ. అతను మనసుతో కొందరిని రేతస్సుతో కొందరినీ సృష్టించాడు. అది విను

మనసైవాసృజత్పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః
దేవాసురమనుష్యాదీన్నభఃస్థలజలౌకసః

బ్రహ్మ కూడా మొదట అందరినీ మనస్సుతోటే సృష్టించాడు. దేవ రాక్షస ఆకాశ చారులు జలచరులు భూచరులను మనసుతో సృష్టించాడు

తమబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః
విన్ధ్యపాదానుపవ్రజ్య సోऽచరద్దుష్కరం తపః

ఈ సృష్టిని ఏమి చేయాలో తెలియక వింధ్యపాదము వద్దకు వెళ్ళి

తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరమ్
ఉపస్పృశ్యానుసవనం తపసాతోషయద్ధరిమ్

అఘమర్షణ తీర్థం వద్ద తపస్సు చేసాడు.

అస్తౌషీద్ధంసగుహ్యేన భగవన్తమధోక్షజమ్
తుభ్యం తదభిధాస్యామి కస్యాతుష్యద్యథా హరిః

పరమాత్మను హంస గుహ్య స్తోత్రముతో తపస్సు చేసాడు. ఆ ప్రజాపతి (దక్షుడు) ఈ స్తోత్రం చేసాడు. ఆ స్తోత్రాన్ని నీకు నేను చెబుతాను. ఈ స్తోత్రానికి మెచ్చే పరమాత్మ దక్ష ప్రజాపతికి వరమిచ్చాడు.

శ్రీప్రజాపతిరువాచ
నమః పరాయావితథానుభూతయే గుణత్రయాభాసనిమిత్తబన్ధవే
అదృష్టధామ్నే గుణతత్త్వబుద్ధిభిర్నివృత్తమానాయ దధే స్వయమ్భువే

నీవు అన్నిటికంటే (ప్రకృతి జీవులకంటే) విలక్షణమైనవాడవు. నీ అనుభూతి వాస్తవమైనది సత్యమైంది. మనము లోకములో దేన్ని హాయి అంటున్నామో అదే బాధగా మారుతుంది. ఏది బాధ అనుకుంటామో అదే కొద్ది సేపట్లో ఆనందముగా మారుతుంది. మానవులు దు@ఖాన్నే సుఖమని అనుకుంటారు. పరమాత్మ మాత్రం నిత్యం సత్యమైన అనుభూతి కలవాడు. గుణ త్రయం భాసించడానికి నీవే నిమిత్తం. నీ నివాసం ఎవరికీ (ప్రకృతితో సంబంధం ఉన్నవారికి) కనపడదు. ఇంతటి వాడని కొలవలేము. అటువంటి పరమాత్మకు నమస్కారం.

న యస్య సఖ్యం పురుషోऽవైతి సఖ్యుః సఖా వసన్సంవసతః పురేऽస్మిన్
గుణో యథా గుణినో వ్యక్తదృష్టేస్తస్మై మహేశాయ నమస్కరోమి

ఒకే పురములో (శరీరము) ఇద్దరున్నారు. దహరాకాశములో జీవుడున్నాడు, ఏ మిత్రుని మత్రి జీవుడు తెలుసుకోలేడో అటువంటి పరమాత్మకి నమస్కారం. తనతో ఉంటున్న రంగు తనలో ఉన్న గుణము తనకు ఎలా తెలీదు, మనకు మనలో ఉన్న పరమాత్మ తెలీడు.

దేహోऽసవోऽక్షా మనవో భూతమాత్రామాత్మానమన్యం చ విదుః పరం యత్
సర్వం పుమాన్వేద గుణాంశ్చ తజ్జ్ఞో న వేద సర్వజ్ఞమనన్తమీడే

పంచ భూతములూ శరీరమూ, ఇదంతా ఒక రధమైతే, శరీరం ఒక ఇరుసు వంటిది, పంచభూతాలు చతుర్దశ ఇంద్రియాలు దానికి అవయవాలు. మన గురించీ మనం తెలుసుకోలేము, పరమాత్మ గురించీ తెలుసుకోలేము. శరీరముతో సంబంధం ఏర్పడేంత వరకూ జీవుడికీ ఇందిర్యాలూ శరీరాలూ వేరూ తాను వేరనీ తెలుసు. తెలిసి కూడా ఆ విషయాన్ని తెలియకుండా అవుతున్నాడు. శరీర సంబంధం ఏర్పడ్డాక విడిగా ఉన్న దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, సర్వజ్ఞ్యుడైన పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు. అటువంటి పరమాత్మకు నమస్కారం.

యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్టస్మృతిసమ్ప్రమోషాత్
య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచిసద్మనే నమః

అక్కడ సూర్యుడూ నక్షత్రాలూ చంద్రుడూ తారకలూ పరమాత్మ తేజస్సు వెనక ఉండేవే. అలాంటి చోటుని శుచి సద్మ అంటారు. పరిశుద్ధమైన నివాసం, పరంధామం, పరమపదం. పరమాత్మ మనకు తెలియబడాలంటే మనకు తెలిసినవన్నీ తెలియకుండా పోవాలి. చూచినదీ తలచినదీ పూర్తిగా మూసుకుపోవాలి, వాటి అంశకూడా స్పృశించకూడదు. మనం జగత్తును వేటితో తెలుసుకుంటున్నామో అలాంటి వాటితో పరమాత్మ తెలియబడడు. ప్రత్యక్ష అనుమాన ఉపమానముల వలన తెలియబడడు. శబ్దము కూడా పరమాత్మ ఇలా ఉండవచ్చు అని మాత్రమే చెబుతుంది. మనం చూసినదీ తెలిసినదీ అంతరించినప్పుడే తనకు తాను తన సంకల్పముతో తెలియబడుతున్నాడో అటువంటి పరమాత్మకు నమస్కారం. పరమాత్మ ఎవరికి తెలియబడాలి అని సంకల్పిస్తాడో వాడికి తెలియబడతాడు.

మనీషిణోऽన్తర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః
వహ్నిం యథా దారుణి పాఞ్చదశ్యం మనీషయా నిష్కర్షన్తి గూఢమ్

అన్నిటికంటే ముందుంటాండు, స్పష్టముగా ఉంటాడు ప్రకాశమానముగా ఉంటాడు కానీ ఆయన కనపడడు. ప్రత్యక్షముగా ఇంద్రియ గోచరం కాడు. అంతర్యామిగా హృదయములో ఉంటాడు. పరమాత్మ యొక్క శక్తులు (పర వ్యూహ విభవ అంతర్యామి అరచ, హృదయమూ కంఠమూ శిరస్సు, అకార ఉకార మకారం, త్రివృత్ అంటే ఓంకారం). ఎవరికీ తెలియని కనపడని వాడిని ఎలా గుర్తుపట్టాలి? కట్టెలో నిప్పు కనపడదు. కానీ అందులో నిప్పు ఉంటుంది. అరణిని మధించినట్లు పరమాత్మను తెలుసుకోగోరేవారు తమను మదించుకుంటారు, ఇంద్రియాలను నియమింపచేసి, శరీర ఇంద్రియాలను మనసునూ శుష్కింపచేసి, ఇంద్రియాల జోలికి వెళ్ళకుండా విషయాలకు లోబడకుండా తపస్సు చేస్తే కట్టెలో ఉన్న అగ్ని ఎలా ఐతే బయటకు కనపడుతుందో పరమాత్మ కూడా మన దృష్టికి గోచరమవుతాడు.

స వై మమాశేషవిశేషమాయా నిషేధనిర్వాణసుఖానుభూతిః
స సర్వనామా స చ విశ్వరూపః ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః

ఎవరికీ చెప్పడానికి వీలు లేనంత శక్తి గలవాడు పరమాత్మ(ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః). ఎన్ని రకాల మాయలున్నాయో వాటిని తొలగించి సత్యమూ నిత్యమైన నుభూతిని ఇచ్చినవాడు. పరమాత్మ సాక్షాత్కారం జరింగిన తరువాత ప్రకృతి బంధములో ఉన్నా అది మనను బాధించదు వామ్యోహింపచేయదు. అన్ని పేర్లూ ఆయనే. అన్ని రూపాలూ ఆయనే. అటువంటి పరమాత్మ నాయందు ప్రసన్నుడగుగాక.ఎన్ని రకముల మాయలు ఉన్నాయో వాటిని తొలగించి సత్యమూ నిత్యమూ అయిన తక సాక్షాత్కారాన్నిచ్చేవాడు

యద్యన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసోత యస్య
మా భూత్స్వరూపం గుణరూపం హి తత్తత్స వై గుణాపాయవిసర్గలక్షణః

ఆయన వేటికీ అందడు. వాక్కుతో మనసుతో బుద్ధితో ఇంద్రియములతో గానీ మనం అనుకునే స్వరూపమేదీ సత్యం కాదు. మనం చెప్పే రూపాలన్నీ గుణములతో కూడి ఉన్నది. పరమాత్మ ప్రళయకాల స్వరూపుడు. మనకా స్వరూపము తెలియదు. మనకు తెలిసినది జగత్తులోనిది.

యస్మిన్యతో యేన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ
పరావరేషాం పరమం ప్రాక్ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకమ్

ఈ ప్రపంచములో ఎన్ని రకముల కార్యములు జరుగుతున్నాయో దేనితో దేనిలో దేని వలన దేనికోసం జరుగుతున్నాయో ఎవరి వలన జరుగుతున్నాయో, ఏది ఏ రకముగా చేయబడుతున్నదో చేయించబడుతున్నదో అందరికంటే ముందువారికంటే ముందువారు తరువాత వారి కంటే తరువాతి వాడు. ఈయన మొదట ఉండేవాడు. ఆయనను మించి ప్రపంచానికి వేరే కారణం లేదు.ఆయనే ఉపాదాన నిమిత్త సహకారీ కారణం.

యచ్ఛక్తయో వదతాం వాదినాం వై వివాదసంవాదభువో భవన్తి
కుర్వన్తి చైషాం ముహురాత్మమోహం తస్మై నమోऽనన్తగుణాయ భూమ్నే

చెప్పేవారికీ చెప్పినది కాదని వాదించేవారికీ, ఔనని నిరూపించేవారికీ , ఈ మూటికీ కారణం కూడా పరమాత్మే . ఎలాంటి మహా పండితులకు కూడా ఆత్మ మోహాన్ని ఎవరు కలిగిస్తారో ఆ పరమాత్మకు నమస్కారం. యోగమూ సాంఖ్యమూ అంటూ ఒక్కో మతములో ఉంది. కొందరు పరమాత్మలేడని అంటారు.

అస్తీతి నాస్తీతి చ వస్తునిష్ఠయోరేకస్థయోర్భిన్నవిరుద్ధధర్మణోః
అవేక్షితం కిఞ్చన యోగసాఙ్ఖ్యయోః సమం పరం హ్యనుకూలం బృహత్తత్

యోగ సాంఖ్యములలో వారు చెప్పినవి వారికి నిజమనే అనిపిస్తుంది.

యోऽనుగ్రహార్థం భజతాం పాదమూలమనామరూపో భగవాననన్తః
నామాని రూపాణి చ జన్మకర్మభిర్భేజే స మహ్యం పరమః ప్రసీదతు

పుట్టవలసిన అవసరం లేని పరమాత్మ, ఆయన భక్తులను అనుగ్రహించడానికి, పేరూ రూపమూ లేని వాడు పేరు పెట్టుకుని ఏ పనులూ చేయవలసిన అవసరం లేని వాడు కర్మలను చేస్తున్నాడు. అటువంటి పరమాత్మ అనుగ్రహిచుగాక

యః ప్రాకృతైర్జ్ఞానపథైర్జనానాం యథాశయం దేహగతో విభాతి
యథానిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాం మనోరథమ్

ప్రకృతి సంబంధముతో వచ్చిన గుణములు మనను పాడు చేయకుండా మనలో ఆయన కాపలాగా ఉంటాడు. మనసు శరీరములో ఉన్నంతవరకే ప్రకాశిస్తుంది.వాయువు కూడా అగ్నికి తోడైతే అగ్ని బాగా మండుతుంది.శరీరములో ఉన్న మనసు మనకు ఎలా మనస్సు ఉన్నదని తెలియజేస్తుందో, దేహముండగా ఆత్మనీ పరమాత్మనీ తెలుసుకోని వారు ఆయనను తెలుసుకోవడానికి ప్రాకృతమైన బోధనతో అందని పరమాత్మ స్వరూపాన్ని ఆచార్య కృపతో ఎలా తెలియబడుతుందో, ఘటము భిన్నమవగానే కుండలో ఉన్న వాయువు బయట వాయువుతో కలిసినట్లు శరీరము లేనప్పుడు ఆత్మ ఆత్మలో కలుస్తుంది. ఇలాంటి పరమాత్మ నా కోరిక తీర్చాలి

శ్రీశుక ఉవాచ
ఇతి స్తుతః సంస్తువతః స తస్మిన్నఘమర్షణే
ప్రాదురాసీత్కురుశ్రేష్ఠ భగవాన్భక్తవత్సలః

ఇలా అఘమర్షణ క్షేత్రములో స్తోత్రం చేయబడి పరమాత్మ దక్షునికి ప్రత్యక్షమయ్యాడు

కృతపాదః సుపర్ణాంసే ప్రలమ్బాష్టమహాభుజః
చక్రశఙ్ఖాసిచర్మేషు ధనుఃపాశగదాధరః

వైకుంఠములో పరమాత్మ అష్టభుజములతో ఉంటాడు

పీతవాసా ఘనశ్యామః ప్రసన్నవదనేక్షణః
వనమాలానివీతాఙ్గో లసచ్ఛ్రీవత్సకౌస్తుభః

మహాకిరీటకటకః స్ఫురన్మకరకుణ్డలః
కాఞ్చ్యఙ్గులీయవలయ నూపురాఙ్గదభూషితః

త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్త్రిభువనేశ్వరః
వృతో నారదనన్దాద్యైః పార్షదైః సురయూథపైః

గరుత్మంతుని మీద వచ్చి, ఎనిమిది ఆయుధాలతో పీతాంబరధారి నీల మేఘశ్యాముడు ప్రసన్నమైన చూపులు కలవాడై, వనమాల హారముగా కలిగి, శ్రీవత్సం కలవాడై, కుండలములూ అందెలూ అన్ని ధరించి, మూడులోకాలూ మోహింపచ్సే రూపముతో నారదాదులతో స్తోత్రం చేయబడుతూ, కొందరు ఆ స్తోత్రాలను అనువచిస్తూ,

స్తూయమానోऽనుగాయద్భిః సిద్ధగన్ధర్వచారణైః
రూపం తన్మహదాశ్చర్యం విచక్ష్యాగతసాధ్వసః

దక్షుడు సాష్టాంగపడి శిరస్సుతో పాదాలను సృశించాడు. పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్నానన్న పరమానందము కలవాడై

ననామ దణ్డవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతిః
న కిఞ్చనోదీరయితుమశకత్తీవ్రయా ముదా
ఆపూరితమనోద్వారైర్హ్రదిన్య ఇవ నిర్ఝరైః

కొండ వాగు మీద నుంచి నీరు వస్తుంటే ఆ ప్రవాహాన్ని అరికట్టడానికి కాలువ చేసినట్లుగా, పరమాత్మ కృప అనే నీరు గుండెనిండా నిండి ఉంది,

తం తథావనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిమ్
చిత్తజ్ఞః సర్వభూతానామిదమాహ జనార్దనః

అందరి మనసులో ఏముందో తెలుసుకునే పరమాత్మ, పరమభక్తుడు సంతానము కోరే ప్రజాపతి అయిన దక్షుని మనసులో ఏముందో తెలుసుకొని ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ
ప్రాచేతస మహాభాగ సంసిద్ధస్తపసా భవాన్
యచ్ఛ్రద్ధయా మత్పరయా మయి భావం పరం గతః

నీవు తపస్సుతో సిద్ధి పొందావు. పరమ భక్తితో నాయందు నిశ్చల భావాన్ని ఉంచుకున్నావు. నీవింత గొప్ప తపస్సు చేసావు కాబట్టి నేను మెచ్చాను

ప్రీతోऽహం తే ప్రజానాథ యత్తేऽస్యోద్బృంహణం తపః
మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః

నా విభూతులు లోకమంతా విస్తరించాలి, సంసారం విడిచి నన్ను సేవించడానికే అందరి మనసు కలగాలి అని నాకోరిక

బ్రహ్మా భవో భవన్తశ్చ మనవో విబుధేశ్వరాః
విభూతయో మమ హ్యేతా భూతానాం భూతిహేతవః

బ్రహ్మాదులందరూ నా విభూతులే. అవే సకల జగత్తు పుట్టుకకూ కారణమవుతున్నాయి.

తపో మే హృదయం బ్రహ్మంస్తనుర్విద్యా క్రియాకృతిః
అఙ్గాని క్రతవో జాతా ధర్మ ఆత్మాసవః సురాః

తపస్సే నా హృదయం శరీరం క్రియా స్వరూపం అవయవాలు

అహమేవాసమేవాగ్రే నాన్యత్కిఞ్చాన్తరం బహిః
సంజ్ఞానమాత్రమవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః

అన్నిటికంటే ముందూ తరువాతా మధ్యా నేనే ఉన్నాను. నా కంటే ముందూ ఎవరూ లేరు, నేను లేనిదీ ఏదీ లేదు. మొదలు నేనొక్కడినే ఉన్నాను.

మయ్యనన్తగుణేऽనన్తే గుణతో గుణవిగ్రహః
యదాసీత్తత ఏవాద్యః స్వయమ్భూః సమభూదజః

ఇలా ఎవరైతే అనంత కళ్యాణ గుణములు కలిగిన నా యందు కొన్ని గుణాలను తీసుకుని ఆ గుణాలు ఉన్నవాడిగా నా విగ్రహాలను కొందరు తయారు చేసి ఆరాధిస్తున్నారు. దాన్ని పోగొట్టడానికే నా నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించాను.

స వై యదా మహాదేవో మమ వీర్యోపబృంహితః
మేనే ఖిలమివాత్మానముద్యతః స్వర్గకర్మణి

తనను సృష్టించింది సృష్టిని పెంచడానికే అని తెలుసుకుని సృష్టి కర్మలో నిమగ్నమయ్యాడు. ఆయన కూడా ఘోరమైన తపస్సు చేసాడు

అథ మేऽభిహితో దేవస్తపోऽతప్యత దారుణమ్
నవ విశ్వసృజో యుష్మాన్యేనాదావసృజద్విభుః

ఆ తపః ప్రభావముగానే నవ ప్రజాపతులను సృష్టించాడు.

ఏషా పఞ్చజనస్యాఙ్గ దుహితా వై ప్రజాపతేః
అసిక్నీ నామ పత్నీత్వే ప్రజేశ ప్రతిగృహ్యతామ్

ఈమే పంచజనుని యొక్క పుత్రిక అసిక్ని. ఈమెను నీవు భార్యగా స్వీకరించు.

మిథునవ్యవాయధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః
మిథునవ్యవాయధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి

త్వత్తోऽధస్తాత్ప్రజాః సర్వా మిథునీభూయ మాయయా
మదీయయా భవిష్యన్తి హరిష్యన్తి చ మే బలిమ్

మీరిద్దరూ అన్నోన్యముగా కాపురం చేసినందు వలన కొందరు మానసికముగా కాపురం చేఇన్సందు వలన కొంతమందీ, ఇలా చాలా మంది సంతానం కలుగుతారు
మానసిక వ్యాపారముతో సంతానం కలుగుతుంది ఇదంతా నా మాయతో, అన్న నియమం కేవలం నీకు మాత్రమే. మిగతా వారందరికీ మిధునముతోనే సంతానం కలుగుతుంది.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త్వా మిషతస్తస్య భగవాన్విశ్వభావనః
స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవాన్తర్దధే హరిః

ఇలా చెప్పి దక్షుడు చూస్తుండగా స్వప్నములో దొరికిన వస్తువులాగ అంతర్ధానమయ్యాడు.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం మూడవ అధ్యాయం


శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
నిశమ్య దేవః స్వభటోపవర్ణితం ప్రత్యాహ కిం తానపి ధర్మరాజః
ఏవం హతాజ్ఞో విహతాన్మురారేర్నైదేశికైర్యస్య వశే జనోऽయమ్

ఇది విని పరీక్షిత్తు అడిగాడు "మీరొక అంశాన్ని వదిలిపెట్టారు. విష్ణు భటులు విడిపించి యమలోకానికి యమభటులను పంపేసారు. అది వారు తమ ప్రభువుకు నివేదించలేదా? విన్న యమధర్మరాజు ఏమి చేసాడు."

యమస్య దేవస్య న దణ్డభఙ్గః కుతశ్చనర్షే శ్రుతపూర్వ ఆసీత్
ఏతన్మునే వృశ్చతి లోకసంశయం న హి త్వదన్య ఇతి మే వినిశ్చితమ్

సకల చరాచర జగత్తు మృత్యు వశములో ఉంటుంది. అలాంటప్పుడు తమ వారిని విష్ణు భక్తులు వెళ్ళగొడితే ఆయన ఎలా ఊరుకున్నాడు. ఇంతవరకూ యముని ఆజ్ఞ్య కొట్టబడినట్లు ఎక్కడా లేదు. అలాంటి యముని ఆజ్ఞ్య ఉల్లంఘించబడితే ఏమి జరిగింది

శ్రీశుక ఉవాచ
భగవత్పురుషై రాజన్యామ్యాః ప్రతిహతోద్యమాః
పతిం విజ్ఞాపయామాసుర్యమం సంయమనీపతిమ్

పరమాత్మ భక్తులతో అడ్డగించబడిన యమభటులు స్వామితో ఇలా అన్నారు

యమదూతా ఊచుః
కతి సన్తీహ శాస్తారో జీవలోకస్య వై ప్రభో
త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తిహేతవః

ఈ ప్రపంచాన్ని శాసించే వారెందరున్నారు. వారు వారు ఆచరించే కర్మకనుగుణమైన ఫలితాన్ని ప్రసాదించేవారెందరున్నారు.

యది స్యుర్బహవో లోకే శాస్తారో దణ్డధారిణః
కస్య స్యాతాం న వా కస్య మృత్యుశ్చామృతమేవ వా

మాకు తెలిసి శాసకుడు ఒకడే ఉండాలి. చాలా మంది శాసకులు ఉంటే, ప్రతీ శాసకుడు తమ వారిని కాపాడాలి అనుకుంటే తప్పు చేసిన వారు శిక్షించబడరు, తన వాడు కాదనుకుంటే తప్పు చేయని వారు కూడా శిక్షించబడతారు. ఎవరికి నరకం ఎవరికి మోక్షం వస్తుంది అన్నది నీవల్లే తెలియాలి కదా.

కిన్తు శాస్తృబహుత్వే స్యాద్బహూనామిహ కర్మిణామ్
శాస్తృత్వముపచారో హి యథా మణ్డలవర్తినామ్

చాలామంది శాసకులుంటే శాసక్త్వం నామమాత్రమై (ఉపచారమాత్రమై) అపరాధమే పని చేస్తుంది (అపరాధులే శాసకులవుతారు). మండలాధికారులకు వారి మండలములో వారేది చెప్తే ధర్మాధర్మాలతో పనిలేకుండా అదే శాసనం

అతస్త్వమేకో భూతానాం సేశ్వరాణామధీశ్వరః
శాస్తా దణ్డధరో నౄణాం శుభాశుభవివేచనః

అందరికీ నీవే ఈశ్వరుడవని మాకు తెలుసు, శాసకుడవు, దండధారివి, పుణ్యపాపములను తెలుసుకొని తగిన రీతిలో శిక్ష విధించగలవాడవు నీవే. ఇలాంటి నీ శాసనం కూడా నివారించబడినది. అంటే లోకములో శాసనం లేదని అర్థం.

తస్య తే విహితో దణ్డో న లోకే వర్తతేऽధునా
చతుర్భిరద్భుతైః సిద్ధైరాజ్ఞా తే విప్రలమ్భితా

దివ్యమంగళ విగ్రహముతో నలుగురు పురుషులొచ్చి

నీయమానం తవాదేశాదస్మాభిర్యాతనాగృహాన్
వ్యామోచయన్పాతకినం ఛిత్త్వా పాశాన్ప్రసహ్య తే

నరకలోకముకు మాచే తీసుకుపోబడుతున్న మా పాశాలను చేదించారు.

తాంస్తే వేదితుమిచ్ఛామో యది నో మన్యసే క్షమమ్
నారాయణేత్యభిహితే మా భైరిత్యాయయుర్ద్రుతమ్

మేము తెలియదగినదని మీరనుకుంటే మేము వినదగినవారమని మీరనుకుంటే నారాయణ అన్న మాత్రన వారొచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి కారణం ఏమిటీని అడిగితే

శ్రీబాదరాయణిరువాచ
ఇతి దేవః స ఆపృష్టః ప్రజాసంయమనో యమః
ప్రీతః స్వదూతాన్ప్రత్యాహ స్మరన్పాదామ్బుజం హరేః

యమ దూతలు విష్ణు దూతలను వెళ్ళగొట్టినా ఏమీ అనకుండా వచ్చినందుకు యముడు సంతోషించాడు, పరమాత్మ పాద పద్మాలను స్మరిస్తూ ఇలా అన్నాడు

యమ ఉవాచ
పరో మదన్యో జగతస్తస్థుషశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వమ్
యదంశతోऽస్య స్థితిజన్మనాశా నస్యోతవద్యస్య వశే చ లోకః

నీకూ నాకే కాదు సకల చరాచర జగత్తుకూ అసలైన శాసకుడు ఒకడున్నాడు, నేను కాదు. స్థావర జంగమాదులైన సకల జగత్తుకూ ఈశ్వరుడు ఒకడున్నాడు. ఆ పరమాత్మ యందే సకల జగత్తూ ఇమిడి ఉన్నది. వస్త్రములో నిలువు దారాలూ అడ్డదారాలూ ఉంటాయి. నిలువు దారాలలో అడ్డదారాలు జొప్పిస్తారు. నిలువు దారాలు ప్రోతం. అడ్డదారాలు ఓతం. ఎలా ఐతే వస్త్రములో దారాలు కూరుస్తారో ఈ పరమాత్మలో జగత్తంతా ఇమిడి ఉన్నది. ఈ జగత్తు ఒకదానికి మరొకటి ఆధారమని అనిపిస్తుంది. నిలువుదారం లేకుంటే అడ్డదారాలు కూర్చబడవు. ఎవరికి వారే మేమే శాసకులమనుకుంటారు ఇలా దారాలు చూసినప్పుడు అనుకున్నట్లు. ఈ దారాలను దగ్గరకు ఏర్చీ కూర్చు వస్త్రముగా చేసినవాడు మూలం.నిలువు దారాలు మేము గొప్పా అని, అడ్డదారాలు మేము గొప్పా అనుకుంటే మరి వాటిని కూర్చినవాడినేమని అనాలి? పత్తి చెట్టు నాటి పెంచి పోషించి గింజలను తీసి వేరు చేసి దారాలను తీసి ఏర్చి కూర్చి వస్త్రం తయారు చేస్తే నిలువు, అడ్డ దారాలు "మాతోటే వస్త్రం తయారయ్యిందని" అనుకున్నట్లు ఉంటుంది మనం "నేను బలవంతున్నీ, బుద్ధి కలవాడినీ, ఆరోగ్యవంతున్నీ, బుద్ధిమంతున్ని" అని అనుకుంటాము.

తన కడుపులో ఉన్న జీవునికి ఇంద్రియాలూ మనసు తొడిగి వాడిని పంపిస్తే వాడు "నేను తెలివైన వాడిని అనుకున్నట్లు ఉంటుంది". ఆయనలో సకల చరాచర జగత్తు కూర్చబడినదీ, పేర్చబడినది. సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు పరమాత్మ యొక్క సహస్రాంశతో జరుగుతున్నాయి. మనందరికీ ఆయన ముక్కు తాడు వేసి పట్టుకున్నాడు.

యో నామభిర్వాచి జనం నిజాయాం బధ్నాతి తన్త్ర్యామివ దామభిర్గాః
యస్మై బలిం త ఇమే నామకర్మ నిబన్ధబద్ధాశ్చకితా వహన్తి

మనందరినీ పేర్లతో కట్టేస్తాడు. నేను మనిషినీ దేవతనీ రాక్షసున్నీ అని. నమాలనే ధామాలతో (దారాలతో) కట్టి వేసాడు తాళ్ళతో గోవులను కట్టెసినట్లుగా. తమ పేర్లతో కర్మలతో జీవులందరూ ఆ పరమాత్మకే ఆరాధన జరుపుతారు. మనం చేసే అన్ని పనులూ భగవత్ ఆరాధనా రూపముగా ఉండాలి. ఇష్టమున్నా లేకున్నా పరమాత్మ చెప్పినట్లే మనం వింటూ ఉంటాము.

అహం మహేన్ద్రో నిరృతిః ప్రచేతాః సోమోऽగ్నిరీశః పవనో విరిఞ్చిః
ఆదిత్యవిశ్వే వసవోऽథ సాధ్యా మరుద్గణా రుద్రగణాః ససిద్ధాః

వీరందరూ

అన్యే చ యే విశ్వసృజోऽమరేశా భృగ్వాదయోऽస్పృష్టరజస్తమస్క
యస్యేహితం న విదుః స్పృష్టమాయాః సత్త్వప్రధానా అపి కిం తతోऽన్యే

వీరే కాక ప్రజాపతులు దేవతాధిపతులు, రజస్సూ తమస్సూ అంటని భృగ్వాదులు కూడా పరమాత్మ మాయని దాటలేరు. ఆయనౌ వాక్కుతో గానీ మనసుతో హృదయముతో గానీ ప్రాణులు తెలియలేరు

యం వై న గోభిర్మనసాసుభిర్వా హృదా గిరా వాసుభృతో విచక్షతే
ఆత్మానమన్తర్హృది సన్తమాత్మనాం చక్షుర్యథైవాకృతయస్తతః పరమ్

ఆయన మన హృదయములోనే అంతర్యామిగా ఉన్నాడు. కన్ను ఎదురుగా ఉన్న రూపాన్ని కన్నులో చూస్తుంది. కన్ను ఏ రూపాన్ని చూస్తుందో ఆ రూపం కనుగుడ్డులో కూడా కనపడుతుంది. అందులో పడితేనే మనకు రూపం కనిపిస్తుంది. కానీ మనం కంటి గుడ్డులో ఉన్న రూపాన్ని చూడలేము, ఎదురుగునా ఉన్నదానినే చూడగలం.

తస్యాత్మతన్త్రస్య హరేరధీశితుః పరస్య మాయాధిపతేర్మహాత్మనః
ప్రాయేణ దూతా ఇహ వై మనోహరాశ్చరన్తి తద్రూపగుణస్వభావాః

అలాగే మనం హృదయములో ఉన్న పరమాత్మను చూడలేము. పరమాత్మ సర్వతంత్ర స్వతంత్ర్యుడు. ఆయన పరుడు మాయాధిపతి. అలాంటి పరమాత్మ దూతలు ఈ లోకములో సంచరిస్తూ ఉంటారు. పరమాత్మ రూపమూ గుణమూ స్వభావమూ కలిగి ఉంటారు వారు. ఎదుటి వారు బాధపడుతూ ఉంటే చూడలేకపోయే వారు, వారు.

భూతాని విష్ణోః సురపూజితాని దుర్దర్శలిఙ్గాని మహాద్భుతాని
రక్షన్తి తద్భక్తిమతః పరేభ్యో మత్తశ్చ మర్త్యానథ సర్వతశ్చ

పరమాత్మ యొక్క దుర్దర్శలింగాని (చిహ్నములు) రూపములూ ఇవన్నీ పరమాత్మకు అత్యంత ప్రియమైన వారికి కూడా వస్తాయి. అలాంటి వారు ఇలాంటి రూపాన్ని కాపాడతారు. ఆ రూపములో వచ్చి రక్షిస్తుంటారు. నా నుంచే కాదు, పరమాత్మ భక్తులకు ఎవరు ఆపద కలిగేప్పుడు వారు వెళ్ళి రక్షిస్తారు

ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణీతం న వై విదురృషయో నాపి దేవాః
న సిద్ధముఖ్యా అసురా మనుష్యాః కుతో ను విద్యాధరచారణాదయః

మీరు చెప్పిన ధర్మ మర్యాద లోకములో సరిపోతుంది గానీ ఆయన వద్ద కాదు. ధర్మమును పరమాత్మే ఏర్పరచాడు. అలాంటి ధర్మాన్ని ఋషులు గానీ దేవతలు గానీ సిద్ధులూ విద్యాధరులూ గంధర్వులూ మానవులు కిమంపురుషులూ తెలియజాలరు.

స్వయమ్భూర్నారదః శమ్భుః కుమారః కపిలో మనుః
ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్

పరమాత్మ యొక్క మాయను తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. స్వయమ్భూర్నారదః శమ్భుః కుమారః కపిలో మనుః, ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్. మా పన్నెండు మందికి మాత్రమే భగవత్ ధర్మం తెలుసు.

ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః
గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే

పరమ రహస్యమైనదీ పరిశుద్ధమైనదీ ఎంత కష్టపడ్డా తెలియనిది, అలాంటి ధర్మాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు.

ఏతావానేవ లోకేऽస్మిన్పుంసాం ధర్మః పరః స్మృతః
భక్తియోగో భగవతి తన్నామగ్రహణాదిభిః

ఈ ప్రపంచములో ఇదే ధర్మం. పరమాత్మ యొక్క నామ సంకీర్తనం కథా శ్రవణం పరమాత్మ గుణాను సంధానమే పరమాత్మ ఆరాధన. పరమాత్మ యందు భక్తి యోగమే ధర్మం. తక్కినదంతా అధర్మం.

నామోచ్చారణమాహాత్మ్యం హరేః పశ్యత పుత్రకాః
అజామిలోऽపి యేనైవ మృత్యుపాశాదముచ్యత

పరమాత్మ నామం పలికితే కలిగే ఫలితం మీరే చూసారు. అజామీలుడు కేవలం ఒక్క సారి నారాయణ అంటేనే మీ పాశాలు ఎగిరిపోయాయి. ఇంతకన్నా పరమాత్మ నామ కీర్తన గురించి చెప్పేదేముంది.

ఏతావతాలమఘనిర్హరణాయ పుంసాం
సఙ్కీర్తనం భగవతో గుణకర్మనామ్నామ్
విక్రుశ్య పుత్రమఘవాన్యదజామిలోऽపి
నారాయణేతి మ్రియమాణ ఇయాయ ముక్తిమ్

మానవుల సర్వపాపాలు పోవడానికి ఇదొక్కటి చాలు. పరమాత్మ పేర్లు ఆయన ఆచరించిన కర్మలు పరమాత్మ గుణములు.  నామం గానీ గుణం కానీ కర్మను కానీ ఈ మూటిలో దేన్ని ఆచరించినా మానవులు తమ పాపాన్ని తొలగించుకుంటారు

ప్రాయేణ వేద తదిదం న మహాజనోऽయం
దేవ్యా విమోహితమతిర్బత మాయయాలమ్
త్రయ్యాం జడీకృతమతిర్మధుపుష్పితాయాం
వైతానికే మహతి కర్మణి యుజ్యమానః

మరి ఇంత సులభమైతే నరకానికి అందరూ ఎందుకు పోతున్నారు. గొప్పవాళ్ళు కూడా పరమాత్మ యొక్క మాయా దేవితో మోహించబడిన బుద్ధి గల వారు ఈ విషయాన్ని తెలియలేరు. మకరందాన్ని అందించే వేదాన్ని (మనసును ఊరించే) చూసి అందరూ మోహములో పడతారు. అది చూసి విశాలమైన పనులు చేస్తాడు (వ్రతాలూ నోములూ ఉపవాసాలు) గానీ, పెద్ద పెద్ద పనులు (యాగాలూ యజ్ఞ్యాలూ) చేయాలంటాడు గానీ గొప్పవారు కూడా పరమాత్మ నామాన్ని జపించలేరు. వేదములో మునిగి జడ మతులవుతున్నారు.

ఏవం విమృశ్య సుధియో భగవత్యనన్తే
సర్వాత్మనా విదధతే ఖలు భావయోగమ్
తే మే న దణ్డమర్హన్త్యథ యద్యమీషాం
స్యాత్పాతకం తదపి హన్త్యురుగాయవాదః

మంచి బుద్ధి కలవారు ఇలా విషయాన్ని పరిశీలించి పరమాత్మ యందు తమ భావాన్ని నిలుపుతారు. అలాంటి వారు నా దండమును పొందరు. వారు పాపమును చేసినా పరమాత్మ నామోచ్చారణే ఆ పాపమును తొలగిస్తుంది.

తే దేవసిద్ధపరిగీతపవిత్రగాథా
యే సాధవః సమదృశో భగవత్ప్రపన్నాః
తాన్నోపసీదత హరేర్గదయాభిగుప్తాన్
నైషాం వయం న చ వయః ప్రభవామ దణ్డే

ఇలాంటి మహాత్ములు దేవతల చేతా సిద్ధుల చేతా మహానుభావులచేతా గానం చేసే గాధను కలిగి ఉంటారు. వీరు సాధువులు సమదర్శులు. పరమాత్మను మాత్రమే ఆశ్రయించిన వారు. అలాంటి వారి దగ్గరకు మాత్రం మీరు వెళ్ళకండి. వారి చుట్టూ పరమాత్మ గద ఉండి వారిని కాపాడుతూ ఉంటుంది. అలాంటి వారికి మేము శిక్ష విధించలేము. వారాచరించిన పాపం కూడా వారిని శిక్షించలేదు.

తానానయధ్వమసతో విముఖాన్ముకున్ద
పాదారవిన్దమకరన్దరసాదజస్రమ్
నిష్కిఞ్చనైః పరమహంసకులైరసఙ్గైర్
జుష్టాద్గృహే నిరయవర్త్మని బద్ధతృష్ణాన్

మీరు ఎలాంటి వారిని తీసుకు రావాలంటే, పరమాత్మ పాద పద్మ మకరంద రసమును స్వీకరించడానికి ఎవరు విముఖముగా ఉంటారో అలాంటి వారిని తీసుకు రండి. పరమ దరిద్రులు (నిష్కిఞ్చనైః - పరమాత్మ తప్ప వేరే దిక్కు లేని వారు, భగవంతుని కంటే భిన్నమైన రక్షణ, భగవంతుని దయ కన్నా భిన్నమైన ఆస్తి లేనివారు), పరమాత్మ పాద పద్మ మకరందాన్ని కోరేవారు కాకుండా మిగిలిన వారికి నరకమార్గం మీద ఆశ ఎక్కువ. ఇల్లు అనే నరక మార్గాన్ని కోరేవారిని, దాని మీద ఆశ పెంచుకున్నవారినీ మీరు బంధించాలి.

జిహ్వా న వక్తి భగవద్గుణనామధేయం
చేతశ్చ న స్మరతి తచ్చరణారవిన్దమ్
కృష్ణాయ నో నమతి యచ్ఛిర ఏకదాపి
తానానయధ్వమసతోऽకృతవిష్ణుకృత్యాన్

పరమాత్మను ఆశ్రయించని వాడంటే పూజ చేయకపోయినా గుడికి వెళ్ళకపోయినా, పరమాత్మ నామాన్ని కూడా ఎవరి నాలుక పలకదో, ఒక్క సారి కూడా పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరించదో అటువంటి వారిని పట్టుకు రండి. ఏ ఒక్క సారీ పరమాత్మ యొక్క ఏ చిన్న సేవా చేయని వారిని పట్టుకు రండి.

తత్క్షమ్యతాం స భగవాన్పురుషః పురాణో
నారాయణః స్వపురుషైర్యదసత్కృతం నః
స్వానామహో న విదుషాం రచితాఞ్జలీనాం
క్షాన్తిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే

మీరు వారి చర్యకు అడ్డు చెప్పకున్నా కొంతసేపైనా వారితో వాదన చేసారు కాబట్టి తన పురుషులకెదురుగా వాదనకు దిగి మాట్లాడిన మన తెలివి మానిన పనిని ఆ పరమాత్మ క్షమించుగాక. మా మనుషులు చేసిన దాన్ని స్వామి క్షమించుగాక. మహానుభావులకు అంజలి జోడించడమే అన్ని క్షమలకూ మూలము. (అంజలి - అం జలయతి. అకారమంటే శ్రీమన్నారాయణుడు. పరమాత్మను కూడా కరిగించేది.) తప్పు చేసినందు వలన కలిగిన కోపం క్షమాపణ వేడితే తొలగిపోతుంది.

తస్మాత్సఙ్కీర్తనం విష్ణోర్జగన్మఙ్గలమంహసామ్
మహతామపి కౌరవ్య విద్ధ్యైకాన్తికనిష్కృతమ్

నిరంతర పరమాత్మ నామ సంకీర్తనం సకల జగత్తుకూ మంగళం కలిగిస్తుంది. మహామాహా పాతకములకు కూడా ఒకే ఒక పరిహారం పరమాత్మ నామ సంకీర్తనం

శృణ్వతాం గృణతాం వీర్యాణ్యుద్దామాని హరేర్ముహుః
యథా సుజాతయా భక్త్యా శుద్ధ్యేన్నాత్మా వ్రతాదిభిః

ఏదో పేరుకు రకరకాల వ్రతాలు చేస్తే మనసు పరిశుద్ధమవదు. పరమాత్మ అనంతమైన గుణములూ పరాక్రమములూ విన్న వారికీ చెప్పేవారికీ చదివేవారికీ మనసు పవిత్రమవుతుంది. ఈ మూడూ లేకుండా మేము వ్రతం చేస్తున్నామని పదిమందికీ చూపేవారి మనసు పవిత్రం కాదు.

కృష్ణాఙ్ఘ్రిపద్మమధులిణ్న పునర్విసృష్ట
మాయాగుణేషు రమతే వృజినావహేషు
అన్యస్తు కామహత ఆత్మరజః ప్రమార్ష్టుమ్
ఈహేత కర్మ యత ఏవ రజః పునః స్యాత్

అందుకే పరమాత్మ పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదా (భక్తుడు) పొరబాటున కూడా ప్రకృతి గుణముల యందు ఆసక్తుడు కాడు, ఇరుక్కోడు. పరమాత్మ పాదాలను స్మరించని వాడు కోరికలతో కొట్టబడి తనకంటిన మురికిని తొలగించుకోవడానికి ప్రయత్నించి మరికాస్త మురికి అంటించుకుంటాడు. ఆ కర్మతో మరి కాస్త బురద అంటుతుంది కానీ ఉన్న బురద పోదు. భగవత్సేవ కన్నా భిన్నమైన దానితో ఉన్న పాపాలు పోక పోగా కొత్త పాపాలు వస్తాయి

ఇత్థం స్వభర్తృగదితం భగవన్మహిత్వం
సంస్మృత్య విస్మితధియో యమకిఙ్కరాస్తే
నైవాచ్యుతాశ్రయజనం ప్రతిశఙ్కమానా
ద్రష్టుం చ బిభ్యతి తతః ప్రభృతి స్మ రాజన్

తన యజమాని చెప్పిన విషయాలని విన్న యమ కింకరులు విస్మయాన్ని పొందారు. అప్పటినుంచీ పరమాత్మ భక్తుల పేర్లు పలకడానికే చూడటానికే భయపడుతున్నారు.

ఇతిహాసమిమం గుహ్యం భగవాన్కుమ్భసమ్భవః
కథయామాస మలయ ఆసీనో హరిమర్చయన్

ఇది పరమ రహస్యమైన ఇతిహాసం. దీన్ని మలయ పర్వతం మీద అగస్త్య మహాముని (రావణున్ని చంపించినవాడు, ఖర్దూషణులను చంపేందుకు వైష్ణవమనే ధనువు ఇచ్చినవాడు, వాతాపిని జీర్ణం చేసుకున్నవాడు)చెప్పాడు.  ఇది పరమ ప్రమాణం.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
ఏవం తే భగవద్దూతా యమదూతాభిభాషితమ్
ఉపధార్యాథ తాన్రాజన్ప్రత్యాహుర్నయకోవిదాః

ఇది విన్న ధర్మము బాగా తెలిసిన వారైన విష్ణు దూతలు ఇలా పలికారు

శ్రీవిష్ణుదూతా ఊచుః
అహో కష్టం ధర్మదృశామధర్మః స్పృశతే సభామ్
యత్రాదణ్డ్యేష్వపాపేషు దణ్డో యైర్ధ్రియతే వృథా

ప్రజానాం పితరో యే చ శాస్తారః సాధవః సమాః
యది స్యాత్తేషు వైషమ్యం కం యాన్తి శరణం ప్రజాః

ధర్మం సభను అధర్ములు పాలిస్తున్నారే. పాపం చేయని వారిని శిక్షిస్తున్నారే. పాలకులే అధర్మం ఆచరిస్తే ప్రజల గతి ఏమి కావాలి.

యద్యదాచరతి శ్రేయానితరస్తత్తదీహతే
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

ఉత్తముడైన వాడు ఏమి చేస్తే మిగిలిన వారు అదే పని చేస్తారు

యస్యాఙ్కే శిర ఆధాయ లోకః స్వపితి నిర్వృతః
స్వయం ధర్మమధర్మం వా న హి వేద యథా పశుః

పిల్లవాడు తండ్రి ఒడిలో తల పెట్టుకుని పరిపూర్ణ విశ్వాసముతో ఉన్నప్పుడు ఆ తండ్రే (తల్లే) తిని వేస్తే? పశువుకు ఎలా ధర్మం తెలియదో ధర్మాన్ని పరిపాలించే ధర్మరాజే అధర్మముగా ప్రవర్తిస్తే ఇక ధర్మమేది.

స కథం న్యర్పితాత్మానం కృతమైత్రమచేతనమ్
విస్రమ్భణీయో భూతానాం సఘృణో దోగ్ధుమర్హతి
అయం హి కృతనిర్వేశో జన్మకోట్యంహసామపి
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః

మైత్రీ భావముతో తనను తాను అర్పించిన వ్యక్తికి తానెలా నమ్మదగినవాడవుతాడు. దయ ఉన్నవాడెవడూ ద్రోహం చేయకూడదు. పరమ దయాళువైన యముడే దయలేని వాడిగా ప్రవర్తిస్తే లోకములో ఎవరు దిక్కు. మీరు ఇతను చేసిన తప్పులను చెబుతున్నారు గానీ ఇతను తొలగించుకున్న కోటి జన్మల పాపాన్ని గురించి చెప్పట్లేదు

ఏతేనైవ హ్యఘోనోऽస్య కృతం స్యాదఘనిష్కృతమ్
యదా నారాయణాయేతి జగాద చతురక్షరమ్

అన్ని రకాల పాపములకూ "నారాయణ" అన్న నామాన్ని చెప్పి అన్ని పాపాల నిష్కృతినీ సాధించాడు. దొంగతన మద్యపానం మిత్రద్రోహం బ్రాహ్మణ స్త్రీ రాజ గో హత్యలు చేసినవారందరికీ ఒకే పరిహారం. పరమాత్మ నామం ఉచ్చరించుట లేదా పరమాత్మ యందు బుద్ధి నిలుపుట. ఇవి చేస్తే ఏ పాపం పరిగణించబడదు, అన్ని పాపాలూ పరిహరించబడతాయి. వేదమూ వేద పారాయణం యజ్ఞ్యం వ్రతములతో పరమాత్మ యందు మనసు ఉంచకుండా చేస్తే ఏ పరిహారమూ జరగదు. పరమాత్మ నామముచ్చరించడం వలన కలిగే పాప పరిహారం వీటి వలన జరుగదు

స్తేనః సురాపో మిత్రధ్రుగ్బ్రహ్మహా గురుతల్పగః
స్త్రీరాజపితృగోహన్తా యే చ పాతకినోऽపరే

సర్వేషామప్యఘవతామిదమేవ సునిష్కృతమ్
నామవ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతిః

న నిష్కృతైరుదితైర్బ్రహ్మవాదిభిస్తథా విశుద్ధ్యత్యఘవాన్వ్రతాదిభిః
యథా హరేర్నామపదైరుదాహృతైస్తదుత్తమశ్లోకగుణోపలమ్భకమ్

నైకాన్తికం తద్ధి కృతేऽపి నిష్కృతే మనః పునర్ధావతి చేదసత్పథే
తత్కర్మనిర్హారమభీప్సతాం హరేర్గుణానువాదః ఖలు సత్త్వభావనః

పరమాత్మ యందు మనసు ఉంచకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా, పరిహారం చేసిన వెంటనే మనసు పాత దారికే పోతుంది. మనసు మళ్ళీ ఆ దారిలో పోకుండా ఉండడానికి సత్వభావమును నిలిపే పరమాత్మ నామాన్ని కీర్తించడమే అసలైన పరిహారం. అన్ని పాపాలకూ పరిహారం చేసుకున్నాడు కాబట్టి ఇతన్ని మీరు తీసుకెళ్ళరాదు.

అథైనం మాపనయత కృతాశేషాఘనిష్కృతమ్
యదసౌ భగవన్నామ మ్రియమాణః సమగ్రహీత్

సాఙ్కేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుణ్ఠనామగ్రహణమశేషాఘహరం విదుః

పరమాత్మ పేరు ఎలా పలికినా పాపం తొలగుతుంది. పేరుగా పలికినా, పరిహాసముగా పలికినా, గర్వముగా పలికినా,హేళనముగా పలికినా, ఏ భావముతో అన్నా పరమాత్మ పేరు అన్ని పాపాలనూ తొలగిస్తుంది.

పతితః స్ఖలితో భగ్నః సన్దష్టస్తప్త ఆహతః
హరిరిత్యవశేనాహ పుమాన్నార్హతి యాతనాః

పతితుడు గానీ జారిపడిన వాడు గానీ భగ్నుడు గానీ పామూ తేళ్ళు కరవబడినవాడు కానీ ఎండన బడ్డవాడు కానీ, కొట్టబడినవాడు కానీ,

గురూణాం చ లఘూనాం చ గురూణి చ లఘూని చ
ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః

తైస్తాన్యఘాని పూయన్తే తపోదానవ్రతాదిభిః
నాధర్మజం తద్ధృదయం తదపీశాఙ్ఘ్రిసేవయా

అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామ యత్
సఙ్కీర్తితమఘం పుంసో దహేదేధో యథానలః

తుమ్మినా దగ్గినా వశములో లేకుండా పలికినా అలాంటి వారు నరకానికి తగరు. పెద్దపాపాలూ చిన్న పాపాలూ ప్రాయశ్చిత్తాలూ. ఆయా పాపాలు తపస్సు దానమూ యజ్ఞ్యములతో పోతాయి. కానీ నారాయణ నామ స్మరణతో అన్ని పాపాలూ పోతాయి. పరమాత్మ సంకల్పం లేకుండా ఎవరూ పరమాత్మ నామం పలకలేరు. తెలిసి పలికినా తెలియ పలికినా హరినామం పాపాలను పోగొడుతుంది. తెలిసి పడినా తెలియక పడినా ఎండిన గడ్డి మీద నిప్పు పడితే కాలినట్లు

యథాగదం వీర్యతమముపయుక్తం యదృచ్ఛయా
అజానతోऽప్యాత్మగుణం కుర్యాన్మన్త్రోऽప్యుదాహృతః

పెద్ద జబ్బు వచ్చినవాడు తెలియక ఒక మందును ఆహారముతో తీసుకుంటే రోగము పోయినట్లు పరిహారమని తెలియకున్నా పరమాత్మ నామాన్ని కీర్తిస్తే పాపం పోతుంది. మంత్రమును తెలియక పలికినా పాపాన్ని తొలగిస్తుంది.

శ్రీశుక ఉవాచ
త ఏవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృప
తం యామ్యపాశాన్నిర్ముచ్య విప్రం మృత్యోరమూముచన్

ఇలా పలికి విష్ణు దూతలు అజామీళున్ని యమ పాశాల నుంచి రక్షించారు.

ఇతి ప్రత్యుదితా యామ్యా దూతా యాత్వా యమాన్తికమ్
యమరాజ్ఞే యథా సర్వమాచచక్షురరిన్దమ

యమదూతలు వెళ్ళిపోయి యముని వద్ద ఈ జరిగిన విషయాన్ని వివరించారు.

ద్విజః పాశాద్వినిర్ముక్తో గతభీః ప్రకృతిం గతః
వవన్దే శిరసా విష్ణోః కిఙ్కరాన్దర్శనోత్సవః

చనిపోతున్నాననుకున్న సమయములో ఎంత భయంకరులైన యమదూతలను చూచాడో అంత ఆహ్లాదముతో మనసుకు ఆనందం కలిగించే విష్ణు దూతలను కూడా చూచాడు. ఇంకాసేపుంటే అజామీళుడేమైనా మాట్లాడతాడేమో అని విష్ణు దూతలు బయలు దేరి వెళ్ళారు.

తం వివక్షుమభిప్రేత్య మహాపురుషకిఙ్కరాః
సహసా పశ్యతస్తస్య తత్రాన్తర్దధిరేऽనఘ

అజామిలోऽప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః
ధర్మం భాగవతం శుద్ధం త్రైవేద్యం చ గుణాశ్రయమ్

విష్ణు యమ దూతల సంబాషణ విన్న అజామీళుడు పరిశుద్ద్మైన ధర్మమేమిటో సత్వ రజ తమో గుణాలను ఆశ్రయించిన వేద విద్య ఏమిటో రెంటి స్వరూపాన్నీ అర్థం చేసుకుని

భక్తిమాన్భగవత్యాశు మాహాత్మ్యశ్రవణాద్ధరేః
అనుతాపో మహానాసీత్స్మరతోऽశుభమాత్మనః

పరమాత్మ దయవలన తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం చేసుకుని, ఉత్తమ బ్రాహ్మణున్నై శూద్రస్త్రీతో సంసారం చేసి సకల బ్రాహ్మణుల ధర్మాన్నీ భర్ష్టుపట్టించాను. నన్ను నేనే నిందించుకుంటున్నాను. బాలురాలు ఉత్తములారు ధర్మజ్ఞ్యురాలు అయిన భార్యను వేశ్య లాగ మద్యపానం చేయనందుకు వదిలిపెట్టాను.

అహో మే పరమం కష్టమభూదవిజితాత్మనః
యేన విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మనా

ధిఙ్మాం విగర్హితం సద్భిర్దుష్కృతం కులకజ్జలమ్
హిత్వా బాలాం సతీం యోऽహం సురాపీమసతీమగామ్

వృద్ధావనాథౌ పితరౌ నాన్యబన్ధూ తపస్వినౌ
అహో మయాధునా త్యక్తావకృతజ్ఞేన నీచవత్

వృద్ధులైన తల్లి తండ్రులని కృతజ్ఞ్యత రహితున్నైన నేను వదిలిపెట్టాను. ధర్మమును వదిలిపెట్టిన కాముకులు ఎలాంటి యాతన పొందుతారో అలాంటి యాతనను నేను పొందాలి. అయినా ఎలాంటి యాతనా పొందకుండా భగవత్ దూతలను చూచాను. ఇది కలా నిజమా. ఆ యమ దూతలు ఎక్కడికి వెళ్ళారు, ఈ విష్ణు దూతలు ఎక్కడికి వెళ్ళారు

సోऽహం వ్యక్తం పతిష్యామి నరకే భృశదారుణే
ధర్మఘ్నాః కామినో యత్ర విన్దన్తి యమయాతనాః

కిమిదం స్వప్న ఆహో స్విత్సాక్షాద్దృష్టమిహాద్భుతమ్
క్వ యాతా అద్య తే యే మాం వ్యకర్షన్పాశపాణయః

అథ తే క్వ గతాః సిద్ధాశ్చత్వారశ్చారుదర్శనాః
వ్యామోచయన్నీయమానం బద్ధ్వా పాశైరధో భువః

అథాపి మే దుర్భగస్య విబుధోత్తమదర్శనే
భవితవ్యం మఙ్గలేన యేనాత్మా మే ప్రసీదతి



అన్యథా మ్రియమాణస్య నాశుచేర్వృషలీపతేః
వైకుణ్ఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి

క్వ చాహం కితవః పాపో బ్రహ్మఘ్నో నిరపత్రపః
క్వ చ నారాయణేత్యేతద్భగవన్నామ మఙ్గలమ్

సోऽహం తథా యతిష్యామి యతచిత్తేన్ద్రియానిలః
యథా న భూయ ఆత్మానమన్ధే తమసి మజ్జయే

విముచ్య తమిమం బన్ధమవిద్యాకామకర్మజమ్
సర్వభూతసుహృచ్ఛాన్తో మైత్రః కరుణ ఆత్మవాన్

మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయా
విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః

మమాహమితి దేహాదౌ హిత్వామిథ్యార్థధీర్మతిమ్
ధాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః

శూద్ర స్త్రీతో ఇన్ని పాపములు చేసిన నాకు విష్ణు దూతలు కనిపించారంటే పాపముతో బాటు పుణ్యము కూడా చేసి ఉంటాను. ఇన్ని తప్పులు చేసిన నా నాలుక పరమాత్మ నామం గ్రహించిందంటే కొంత పుణ్యం నేను తెలియకుండానే చేసి ఉంటాను. సిగ్గు విడిచిన వాడినీ, భ్రష్టుపట్టిన నేనెక్కడా పరమమంగళమైన పరమాత్మ నామమెక్కడ. ఎలాగా తెలిసింది కాబట్టి నామనో ఇంద్రియాలను నా వశములో ఉంచుకుని మళ్ళీ పాపాంధకారములోకి వెళ్ళకుండా ప్రయత్నిస్తాను. ఇలాంటి అవిద్యాబంధాన్నీ మోహాన్నీ వదిలిపెట్టి, వేశ్య అనే మహామోహం నుండి బయట పడి మంచి మార్గములో నడుస్తాను. ఇంతవరకూ నన్ను ఈ వేశ్య ఒక పెంపుడు మృగములా ఆడుకొంది. నా ప్రియురాలన్న భావనతో ఈ శరీరం యందు వేశ్య యందూ కలిగిన భావాన్ని సంపూర్ణముగా వదిలి, ఒక్క సారి  నారాయణ అంటేనే ఇన్నిపాపాలూ పోయాయని చెప్పారు కాబట్టి నా జీవితమనతా పరమాత్మ నామనుతోనే గడుపుతాను. అవిద్యా అజ్ఞ్యానమునుంచి విడుదల అవుతాను

శ్రీశుక ఉవాచ
ఇతి జాతసునిర్వేదః క్షణసఙ్గేన సాధుషు
గఙ్గాద్వారముపేయాయ ముక్తసర్వానుబన్ధనః

ఇలా అజామీళునికి చక్కని వైరాగ్యం కలిగి, అన్నీ వదిలిపెట్టి గంగా తీరానికి (హరిద్వార్) చేరుకుని

స తస్మిన్దేవసదన ఆసీనో యోగమాస్థితః
ప్రత్యాహృతేన్ద్రియగ్రామో యుయోజ మన ఆత్మని

యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారములతో (తాబేలులా ఇంద్రియములను వెనక్కు మరల్చుకుని) మనసుని ఆత్మలో నిలిపాడు.

తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యాత్మసమాధినా
యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని

పరమాత్మలో ఆత్మను నిలిపి గుణత్రయములను వెనక్కు లాగి అనుభవమే స్వరూపముగా గల పరంధామాన్ని చేరుకున్నాడు

యర్హ్యుపారతధీస్తస్మిన్నద్రాక్షీత్పురుషాన్పురః
ఉపలభ్యోపలబ్ధాన్ప్రాగ్వవన్దే శిరసా ద్విజః

ఇది వరకు చూసిన మహా పురుషులని మళ్ళీ సాక్షాత్కరించుకున్నాడు. ఇది వరకు చూసిన వారిని గుర్తుపట్టి వారికి శిరస్సు వంచి నమస్కరించాడు

హిత్వా కలేవరం తీర్థే గఙ్గాయాం దర్శనాదను
సద్యః స్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినామ్

వారిని చూడగానే గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి, శరీరాన్ని విడిచిపెట్టి, పరమాత్మ పార్శ్వదులైన ఆ పురుషుల స్వరూపాన్ని పొందాడు.

సాకం విహాయసా విప్రో మహాపురుషకిఙ్కరైః
హైమం విమానమారుహ్య యయౌ యత్ర శ్రియః పతిః

భగవ్త్ స్వారూప్యాన్ని పొంది వారితో కలిసి బంగారు విమానాన్ని అధిరోహించి శ్రియః పతి ఉన్న చోటికి వెళ్ళాడు

ఏవం స విప్లావితసర్వధర్మా దాస్యాః పతిః పతితో గర్హ్యకర్మణా
నిపాత్యమానో నిరయే హతవ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్

భోగాభిలాషకు గురై అన్ని ధర్మాలను భ్రష్టు పట్టించి దాసీ పతి అయిన అజామీళుడు నింద్యమైన పనితో పతితుడై కూడా అన్ని వ్రతాలూ వదులుకొని నరకములో పడబోతున్నవాడు కూడా పరమాత్మ నామాన్ని ఒక్కసారి స్వీకరించి ఆ బాధల నుండి విముక్తుడయ్యాడు.

నాతః పరం కర్మనిబన్ధకృన్తనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్
న యత్పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోऽన్యథా

పరమాత్మ నామ సంకీర్తనాన్ని మించినటువంటి సంసారాన్ని విడిపించే సాధనం మరొకటి లేదు. ఒక్క సారి మనః పూర్వకముగా గానీ మనసు లేకుండా గానీ పరమాత్మ నామ సంకీర్తనములో మునిగిపోతే అలాంటి వాడి మనసు త్రిగుణాత్మకమైన వాటిలో చిక్కుకోదు

య ఏతం పరమం గుహ్యమితిహాసమఘాపహమ్
శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్

పరమరహస్యమైన ఇతిహాసం ఇది అన్ని పాపాలను తొలగిస్తుంది. దీన్ని భక్తితో విన్నవాడు

న వై స నరకం యాతి నేక్షితో యమకిఙ్కరైః
యద్యప్యమఙ్గలో మర్త్యో విష్ణులోకే మహీయతే

పొరబాటున కూడా నరకానికి వెళ్ళడు, యమ భటులను కూడా చూడడు. పరమపాపి అయినా పరమాత్మ లోకాన్ని పొందుతాడు

మ్రియమాణో హరేర్నామ గృణన్పుత్రోపచారితమ్
అజామిలోऽప్యగాద్ధామ కిముత శ్రద్ధయా గృణన్

తాను బాగా ప్రేమించిన పుత్రుని పేరు చనిపోయే ముందు పలికి కూడా వైకుంఠానికి వెళ్ళాడంటే శ్రద్ధగా ఈ పరమాత్మ యొక్క కథను విన్నవారి గురించి వేరే చెప్పాలా

Tuesday, April 2, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీపరీక్షిదువాచ
నివృత్తిమార్గః కథిత ఆదౌ భగవతా యథా
క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యదసంసృతిః

ప్రారంభములో మీరు మొత్తం నివృత్తి మార్గమే చెప్పారు. చేసిన ప్రతీ కర్మనూ పరమాత్మార్పణం చేయమని. బ్రహ్మ జ్ఞ్యానముతోటే సంసారం పోతుంది అని చెప్పారు. దానితోబాటు త్రిగుణాత్మకమైన మూడు గుణములలో ఉండే ప్రవృత్తి మార్గం (కర్మ యోగం). కర్మ యోగమంటే ప్రకృతియొక్క గుణ సర్గం.

ప్రవృత్తిలక్షణశ్చైవ త్రైగుణ్యవిషయో మునే
యోऽసావలీనప్రకృతేర్గుణసర్గః పునః పునః

అధర్మలక్షణా నానా నరకాశ్చానువర్ణితాః
మన్వన్తరశ్చ వ్యాఖ్యాత ఆద్యః స్వాయమ్భువో యతః

ప్రియవ్రతోత్తానపదోర్వంశస్తచ్చరితాని చ
ద్వీపవర్షసముద్రాద్రి నద్యుద్యానవనస్పతీన్

ధరామణ్డలసంస్థానం భాగలక్షణమానతః
జ్యోతిషాం వివరాణాం చ యథేదమసృజద్విభుః

అధునేహ మహాభాగ యథైవ నరకాన్నరః
నానోగ్రయాతనాన్నేయాత్తన్మే వ్యాఖ్యాతుమర్హసి

స్వాయంభువ చరిత్రను. ప్రియవ్రత ఉత్తానపాదుల చరిత్రనూ చెప్పారు. ద్వీప వర్ష సముద్ర నదుల వృక్ష ఉద్యానవనాలనూ భూమండలాన్నీ దాని విభాగాన్నీ అధోలోకాలూ నక్షత్రాలను పరమాత్మ ఎలా సృష్టించారో చెప్పారు . తప్పులు చేసినా నరకానికి వెళ్ళకుండా ఉండే మార్గం చెప్పండి.

శ్రీశుక ఉవాచ
న చేదిహైవాపచితిం యథాంహసః కృతస్య కుర్యాన్మనౌక్తపాణిభిః
ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి యే కీర్తితా మే భవతస్తిగ్మయాతనాః

చేయకుండా ఫలితం రాదు. చేసిన ఫలితం పోదు. ఇక్కడి తప్పుకు ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే అక్కడ నరకాలు తప్పవు.ప్రాయశ్చిత్తం కూడా కర్మే.

తస్మాత్పురైవాశ్విహ పాపనిష్కృతౌ యతేత మృత్యోరవిపద్యతాత్మనా
దోషస్య దృష్ట్వా గురులాఘవం యథా భిషక్చికిత్సేత రుజాం నిదానవిత్

త్రికరణాలతో (మనసు మాటా చేతితో) ఆచరించిన పాపములకు ప్రాయశ్చిత్తమును చేయకున్నట్లైతే తప్పకుండా నరకాన్ని చేరతాడు. అతి దారుణమైన యాతనలు అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడే త్వరగా పాపం పరిష్కారమవడానికి ప్రయత్నం చేయాలి. ఈ శరీరానికి మరణం రాకముందే చేసుకోవాలి.. ఈ శరీరముండగా ఏమేమి చేసామో దానికి ఈ శరీరముతోనే ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఇంకో శరీరముతో వాటి ఫలితం అనుభవించాల్సిన అవసరం రాదు. కాబట్టి తప్పుకు వెంటనే పరిహారం చేసుకోవాలి.
రోగము యొక్క మూలం తెలుసుకున్న వైద్యుడు రోగాన్ని బట్టి తగిన మందు ఇస్తాడు. అలా మనం చేసిన తప్పు చిన్నదైతే చిన్న, పెద్దదైతే పెద్దా ప్రాయశ్చిత్తం

శ్రీరాజోవాచ
దృష్టశ్రుతాభ్యాం యత్పాపం జానన్నప్యాత్మనోऽహితమ్
కరోతి భూయో వివశః ప్రాయశ్చిత్తమథో కథమ్

మీరు చెప్పినది తెలియకుండా తప్పు చేసిన వారికి సరిపోతుంది గానీ, అది పాపమని తెస్లిసి అలాంటి దాని గురించి వినీ అలా చేస్తే ఏమవుతుందో చూచీ బుద్ధి పూర్వకముగా చేసినవారికి ప్రాయశ్చిత్తం ఏ విధముగా ఉపయోగపడుతుంది

క్వచిన్నివర్తతేऽభద్రాత్క్వచిచ్చరతి తత్పునః
ప్రాయశ్చిత్తమథోऽపార్థం మన్యే కుఞ్జరశౌచవత్

ఒక చోట తప్పు చేసి మరో చోట ప్రాయశ్చిత్తం చేసి మరో తప్పు చేస్తున్నాడు. ఏనుగు స్నానం లాగ అలాగే మనం కూడా ధర్మం చేసిన వెంటనే అధర్మం చేస్తూనే ఉంటాము. ఐతే ప్రాయశ్చిత్తం వలన లాభం లేదేమో

శ్రీబాదరాయణిరువాచ
కర్మణా కర్మనిర్హారో న హ్యాత్యన్తిక ఇష్యతే
అవిద్వదధికారిత్వాత్ప్రాయశ్చిత్తం విమర్శనమ్

ఒక కర్మను ఆచరించటం వలన వచ్చిన ఫలితం, ఇంకో కర్మను ఆచరించడం వలన తొలగదు. పరిపూర్ణముగా పరిహారం కాదు. ప్రాయశ్చిత్తమంటే కేవలం తాను చేసిన పనిని పరిశీలించుకోవడం మాత్రమే. ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా పనికొస్తుంది గానీ చేసిన తప్పు పరిహారం అవ్వదు. జ్ఞ్యానం లేని వాడు మాత్రమే తప్పులు చేస్తాడు.

నాశ్నతః పథ్యమేవాన్నం వ్యాధయోऽభిభవన్తి హి
ఏవం నియమకృద్రాజన్శనైః క్షేమాయ కల్పతే

తినవలసిన దానిని తిన్నవాడికి వ్యాధులు రావు. ధర్మాన్ని ఆచరించినవాడికి పాపమూ రాదు

తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ
త్యాగేన సత్యశౌచాభ్యాం యమేన నియమేన వా

నియమం తప్పిన వాడికే నరకబాధలు. వెదురు బొంగును అగ్ని కాల్చినట్లుగా తాము చేసిన ఎంత చిన్న తప్పులైనా మహాత్ములు తొలగించుకుంటారు. శమాది మార్గాలు దానికి ఉన్నాయి

దేహవాగ్బుద్ధిజం ధీరా ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః
క్షిపన్త్యఘం మహదపి వేణుగుల్మమివానలః

కేచిత్కేవలయా భక్త్యా వాసుదేవపరాయణాః
అఘం ధున్వన్తి కార్త్స్న్యేన నీహారమివ భాస్కరః

కొందరు భక్తితోటే పరమాత్మను ఆరాధిస్తారు. వారు తప్పునూ ఒప్పునూ తెలియకనే చేస్తారు. పరమాత్మ నామ సంకీర్తన కూడా పరవశముతో చేస్తారు.కోరికలేని వాడు కోరకుండా చేసిన పనికి పాపం అంటదు. కేవల భక్తులై పూర్తిగా పాపాన్ని పోగొట్టుకుంటారు. సూర్యభగవానుడు మంచును తొలగించినట్లుగా వారి పాపాలు తొలగించబడతాయి. దాని వలన పాపం పోతాయి గానీ, ప్రాయశ్చిత్తం వలన కాదు.

న తథా హ్యఘవాన్రాజన్పూయేత తపాదిభిః
యథా కృష్ణార్పితప్రాణస్తత్పురుషనిషేవయా

భగవంతుని  యందు భక్తి కలవారు తప్పులు పోయినట్లు తపస్సు దానమూ యజ్ఞ్యములతో ప్రాయశ్చిత్తము చేస్తే పోవ్. భగవత్ భాగవతారాధనతో పవిత్రులైనట్లుగా ప్రాయశ్చిత్తముతో పవిత్రులము కాలేము.

సధ్రీచీనో హ్యయం లోకే పన్థాః క్షేమోऽకుతోభయః
సుశీలాః సాధవో యత్ర నారాయణపరాయణాః

ప్రపంచములో ఏ పక్కనుండీ ఎలాంటి భయమూ లేకుండా ఉండే మార్గముగా ఇది చెప్పబడింది. పరమాత్మ భక్తులకు ప్రాయశ్చిత్తాలతో పని లేదు. భగవత్ భాగవత ఆచార్య భక్తి కలవారు ప్రాయశ్చిత్తం చేయవలసిన పని లేదు. అది లేని వారు ప్రాయశ్చిత్తం చేసినా ఫలితం లేదు.

ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణపరాఙ్ముఖమ్
న నిష్పునన్తి రాజేన్ద్ర సురాకుమ్భమివాపగాః

పరమాత్మ యందు వైముఖ్యం కలిగిన మనసుతో చేసిన ప్రాయశ్చిత్తం పాపాన్ని పోగొట్టలేదు. మద్యపాత్రను గంగలో ఉంచితే దాని అపవిత్రత పోదు కదా. నదులు సురా కుంభాన్ని పవిత్రం చేయలేనట్లుగా పరమాత్మ విముఖముగా చేసిన ప్రాయశ్చిత్తాలు పవిత్రం చేయలేవు.

సకృన్మనః కృష్ణపదారవిన్దయోర్నివేశితం తద్గుణరాగి యైరిహ
న తే యమం పాశభృతశ్చ తద్భటాన్స్వప్నేऽపి పశ్యన్తి హి చీర్ణనిష్కృతాః

ఒక్క సారి మన మనసును పరమాత్మ పాద పద్మాల యందూ ఆయన గుణాల యందూ ఉంచితే యమున్ని గానీ, పాశధారులైన యమభటులని గానీ కలలో కూడా చూడరు. ఇంక వారికే ప్రాయశ్చిత్తములూ అవసరం లేదు. పరమాత్మ ఏ భావముతో భావించినా పాపం అంటదు. అగ్నిలో ఏది పడ్డా భస్మమైనట్లు.

అత్ర చోదాహరన్తీమమితిహాసం పురాతనమ్
దూతానాం విష్ణుయమయోః సంవాదస్తం నిబోధ మే

దీనికొక ఉదాహరణ ఇస్తాను. విష్ణు యమ దూతలకు జరిగిన సంవాదము చెబుతాను. కన్యా కుబ్జ నగరములో అజామీళుడనే వాడు ఒక శూద్ర స్త్రీకి భార్యగా పెరిగి దాసీ సంబోగముతో ఆచార భ్రష్టుడై

కాన్యకుబ్జే ద్విజః కశ్చిద్దాసీపతిరజామిలః
నామ్నా నష్టసదాచారో దాస్యాః సంసర్గదూషితః

బన్ద్యక్షైః కైతవైశ్చౌర్యైర్గర్హితాం వృత్తిమాస్థితః
బిభ్రత్కుటుమ్బమశుచిర్యాతయామాస దేహినః

దాసీ సగమం వచ్చాక ఆ ఒక్క పాపం వలన అందరూ నిందించే వృత్తిని అవలంబించి అపవిత్రుడై దాసీ కుటుంబాన్ని అపరిశుద్ధమైన మార్గములో పోషించుకుంటూ గడిపాడు

ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్
కాలోऽత్యగాన్మహాన్రాజన్నష్టాశీత్యాయుషః సమాః

ఆ దాసీ పుత్రులను లాలిస్తూ, ఎనభై ఎనిమిది సంవత్సరాలు గడిపాడు.

తస్య ప్రవయసః పుత్రా దశ తేషాం తు యోऽవమః
బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశమ్

ఆ దాసీ యందు పది మంది కుమారులు కలిగారు. అందరికంటే చిన్నవాడికి "నారాయణ" అన్న పేరు పెట్టుకున్నాడు.

స బద్ధహృదయస్తస్మిన్నర్భకే కలభాషిణి
నిరీక్షమాణస్తల్లీలాం ముముదే జరఠో భృశమ్

ముద్దు మాటలాడుతున్న నారాయణుని మాటలను వింటూ కాలం గడుపుతున్నాడు. ఆ పిల్లవాడి మాటలనీ ఆటలనీ సంతోషముగా చూస్తూ వింటూ ఉన్నాడు

భుఞ్జానః ప్రపిబన్ఖాదన్బాలకం స్నేహయన్త్రితః
భోజయన్పాయయన్మూఢో న వేదాగతమన్తకమ్

యముడు అనే వాడొకడున్నాడని కూడా తెలుసుకోలేదు

స ఏవం వర్తమానోऽజ్ఞో మృత్యుకాల ఉపస్థితే
మతిం చకార తనయే బాలే నారాయణాహ్వయే
స పాశహస్తాంస్త్రీన్దృష్ట్వా పురుషానతిదారుణాన్
వక్రతుణ్డానూర్ధ్వరోమ్ణ ఆత్మానం నేతుమాగతాన్
దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయమ్
ప్లావితేన స్వరేణోచ్చైరాజుహావాకులేన్ద్రియః

మృత్యుకాలం వచ్చేసరికి ఎవరు చిన్నవారో వారి మీద ప్రేమ ఉంటుంది. అందుకు ఇతనికి నారాయణుడు జ్ఞ్యాపకం వచ్చాడు. ముగ్గురు యమభటులు పాశము ధరించి వంకర మూతితో భయంకరముగా వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉండి తనను తీసుకు పోవడానికి రాగానే వారిని చూచి భయము పొంది, "నారాయణ" "నారాయణా" "నారాయణా" అంటూ గట్టిగా పిలిచాడు

నిశమ్య మ్రియమాణస్య ముఖతో హరికీర్తనమ్
భర్తుర్నామ మహారాజ పార్షదాః సహసాపతన్
వికర్షతోऽన్తర్హృదయాద్దాసీపతిమజామిలమ్
యమప్రేష్యాన్విష్ణుదూతా వారయామాసురోజసా
ఊచుర్నిషేధితాస్తాంస్తే వైవస్వతపురఃసరాః
కే యూయం ప్రతిషేద్ధారో ధర్మరాజస్య శాసనమ్
కస్య వా కుత ఆయాతాః కస్మాదస్య నిషేధథ
కిం దేవా ఉపదేవా యా యూయం కిం సిద్ధసత్తమాః

తమ ప్రభువైన నారాయణుని పేరు పిలవగానే విష్ణు పార్శ్వదులు వచ్చారు. అప్పటికే యమదూతలు పాశముతో ఇతన్ని లాగుతూ ఉండగా విష్ణు పార్శ్వదులు వారిని నెట్టి వేసారు.

"మేము ధర్మరాజు దూతలం. ఆయన ఆజ్ఞ్యని కాదనడానికి మీరెవరు. దేవతలా ఉపదేవతలా (రాక్షసులా)"

సర్వే పద్మపలాశాక్షాః పీతకౌశేయవాససః
కిరీటినః కుణ్డలినో లసత్పుష్కరమాలినః

సర్వే చ నూత్నవయసః సర్వే చారుచతుర్భుజాః
ధనుర్నిషఙ్గాసిగదా శఙ్ఖచక్రామ్బుజశ్రియః

దిశో వితిమిరాలోకాః కుర్వన్తః స్వేన తేజసా
కిమర్థం ధర్మపాలస్య కిఙ్కరాన్నో నిషేధథ

పుండరీకాషులూ కిరీటములతో ఇపుడే యవ్వనములోకి వచ్చినట్లు ఉన్నారు. శంఖ చక్రాదులతో మీ తేజస్సుతో అన్ని దిక్కుల చీకట్లనూ పొగొడుతున్నారు. మేము ధర్మరాజు కింకరులము. మమ్ము మీరెందుకు నిషేధిస్తున్నారు".

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తే యమదూతైస్తే వాసుదేవోక్తకారిణః
తాన్ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘనిర్హ్రాదయా గిరా

పరమాత్మ అనుచరులు నవ్వుతూ మేఘగంభీర స్వనముతో ఇలా అన్నారు

శ్రీవిష్ణుదూతా ఊచుః
యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః
బ్రూత ధర్మస్య నస్తత్త్వం యచ్చాధర్మస్య లక్షణమ్

మీరు యమధర్మరాజూ అనుచరులని మాకర్ధ్మైంది. ధర్మమంటే ఏమిటొ చెప్పగలరా మీరు. దండన తత్వం గురించి కూడా వివరించండి.

కథం స్విద్ధ్రియతే దణ్డః కిం వాస్య స్థానమీప్సితమ్
దణ్డ్యాః కిం కారిణః సర్వే ఆహో స్విత్కతిచిన్నృణామ్

తప్పు చేసిన వారందరినీ దండిస్తారా. కొందరినే దండిస్తారా. అని అడుగగా.

యమదూతా ఊచుః
వేదప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యయః
వేదో నారాయణః సాక్షాత్స్వయమ్భూరితి శుశ్రుమ

వేదముచే విధించబడినది ధర్మం. వేదం చేత నిషేధించబడినది అధర్మం. వేదమంటే సాక్షాత్ నారాయణుడే. నారాయణుని వలన వచ్చినది వేదం. అయినప్పటికీ వేదం అపౌరుషేయం. నారాయణుని రూపమే వేదం. పరమాత్మ నిశ్వాసమే వేదం.

యేన స్వధామ్న్యమీ భావా రజఃసత్త్వతమోమయాః
గుణనామక్రియారూపైర్విభావ్యన్తే యథాతథమ్

ధరించేదీ ధరించబడేదీ ధర్మం. వృద్ధుడు కట్టెను పట్టుకుంటేనే నడిపిస్తుంది. అలాగే ధర్మం కూడా దానిని ఆచరిస్తేనే అది మనను కాపాడుతుంది. రజస్సు సత్వం తమో అనే భావములు గుణ నామ క్రియ పరమాత్మ చేతనే సృష్టించబడతాయి

సూర్యోऽగ్నిః ఖం మరుద్దేవః సోమః సన్ధ్యాహనీ దిశః
కం కుః స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః

ఎవరికీ తెలియకుండా అతి రహస్యముగా మేము పని చేయగలం అనుకుటారు గానీ. సూర్యుడూ అగ్ని ఆకాశం వాయువు గోవులు చంద్రుడు సంధ్య పగలు దిక్కులూ బ్రహ్మ భూమి కాలమూ ధర్మమూ, ఈ పన్నెండూ దేహం కలవాడిచేత చేయబడే పనులకి సాక్షులు.

ఏతైరధర్మో విజ్ఞాతః స్థానం దణ్డస్య యుజ్యతే
సర్వే కర్మానురోధేన దణ్డమర్హన్తి కారిణః

ఇవి దేహం కలవారు చేసే అధర్మాన్ని తెలుసుకొని చేసిన అధర్మానికి శిక్ష కూడా విధిస్తాయి. ఏ ప్రాణి మరణానికైన ఈ పన్నెంటిలో ఏదో ఒకటి కారణమవుతుంది. వారు వారు చేసిన కర్మకనుగుణముగా శిక్షననుభవిస్తారు.

సమ్భవన్తి హి భద్రాణి విపరీతాని చానఘాః
కారిణాం గుణసఙ్గోऽస్తి దేహవాన్న హ్యకర్మకృత్

ధర్మాన్ని అనుసరించిన వారికి మగళము జరుగుతుంది. కాని వారికి శిక్షపడుతుంది. ధర్మమో అధర్మమో ఏదో ఒకటి చేసే తీరాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉంటే సత్వమూ రజస్సూ తమస్సులలో ఏదో ఒకటి చేయాలి

యేన యావాన్యథాధర్మో ధర్మో వేహ సమీహితః
స ఏవ తత్ఫలం భుఙ్క్తే తథా తావదముత్ర వై

శరీరము కలవాడు కర్మ చేయకుండా ఉండలేడు. ఎవరు వారి గుణ సంగమును బట్టి ధర్మమో అధర్మమో చేసి తీరతాడు. అలా అనుకోవడానికి వాడి గుణము కారణం. ఇలా వారాచరించిన ధర్మాధర్మములకు అనుగుణముగానే ఫలితాన్ని పొందుతాడు. అన్నీ ఇక్కడే పొందడు. కొన్ని పరలోకములలో కూడా పొందుతాడు.

యథేహ దేవప్రవరాస్త్రైవిధ్యముపలభ్యతే
భూతేషు గుణవైచిత్ర్యాత్తథాన్యత్రానుమీయతే

దేవతలలో తేడాలు లాగ, సాత్విక రాజస తామస ప్రాణులు ఉంటాయి. వారాచరించే కర్మను బట్టి వారు సాత్వికులో రాజసికులో తామసికులో చెప్పవచ్చు.

వర్తమానోऽప్యయం కాలో గుణాభిజ్ఞాపకో యథా
ఏవం జన్మాన్యయోరేతద్ధర్మాధర్మనిదర్శనమ్

ఆయా జాతులలో ఉన్న శరీరుల శరీరం ఒకే తీరుగా ఉంటుంది. మరి వారు రాజసులా సాత్వికులా అని ఎలా చెప్పగలం. ఒక్కటే అయిన కాలాన్ని భూత భవిష్యత్ వర్త్మానమనీ. అలాగే రోజులో తెల్లవార్జు ఝామును సాత్వికమనీ, సాయం కాలం వరకూ రాజసమనీ, రాత్రి తామసికమని ఎలా చెప్పగలుగుతున్నాము. ప్రాణులు ఆచరించే పనులను బట్టి. ఆ పనులు ఏ గుణానివో ఆ గుణం కాలానికి ఆపాదిస్తున్నాము. సంబంధం లేని కాలానికే ఆ గుణం ఉన్నప్పుడు కర్తృత్వం ఉన్న ప్రాణికి ఆ గుణం ఉండదా?  ఎలాంటి వారికి పుత్రులుగా పుట్టారు, ఎలాంటి కాలములో పుట్టారు, ఎలాంటి పనులు చేస్తున్నారు.

మనసైవ పురే దేవః పూర్వరూపం విపశ్యతి
అనుమీమాంసతేऽపూర్వం మనసా భగవానజః

యథాజ్ఞస్తమసా యుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి
న వేద పూర్వమపరం నష్టజన్మస్మృతిస్తథా

సామాన్యులు వారి మనస్సును బట్టి ఊహిస్తారు. మనస్సే వారి పూర్వ రూపాన్ని చెబుతుంది. (జాతకములో ద్వాదశాంశ అని ఒకటుంటుంది. అది తెలిస్తే పూర్వ జన్మ గురించి చెప్పవచ్చు). మనసు బట్టే వాడు పూర్వ జన్మలో ఎలాంటి వాడో చెప్పవచ్చు. పరమాత్మ కూడా ఒకడి కర్మ  బట్టే రాబోయే శరీరాన్ని నిర్ణ్యైస్తాడు. జ్ఞ్యానము లేని వాడు, తమో గుణములో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు దేనినీ సేవించలేడు. జ్ఞ్యానం పొంది వెలుతురులో ఉన్నవాడు స్పష్టముగా ఉన్న దానినే సేవిస్తాడు. చీకటిలో ఉన్నవాడు దేనినీ తెలియనట్లుగా పూర్వ జన్మ జ్ఞ్యానమున్నవాడు తరువాత దన్ని గానీ ముందు దాన్ని గానీ తెలుసుకోలేడు.

పఞ్చభిః కురుతే స్వార్థాన్పఞ్చ వేదాథ పఞ్చభిః
ఏకస్తు షోడశేన త్రీన్స్వయం సప్తదశోऽశ్నుతే

ప్రతీ వ్యక్తి తనకు కావలసిన దానిని ఐదింటితో చేస్తాడు. ఐదింటితో చేసి ఐదింటితో తెలుసుకుంటాడు.ఐదింటినీ కూడా ఐదింటితో తెలుసుకుంటాడు. ఒకడు పదహారుతో పదిహేడవది భావించి మూటినీ అనుభవిస్తాడు. ఐదు కర్మేంద్రియములతో ఐదు విషయములను ఆచరిస్తాడు. శబ్ద స్పర్శ రూప రస గంధములను పంచ జ్ఞ్యానేంద్రియములతో తెలుసుకుంటాడు. ఐదు కర్మేంద్రియములతో ఐదు పనులనూ చేస్తాడు. పదహారవది మనస్సు, పదిహేడవది బుద్ధి. మనసుతో చేసె దాన్ని అనుభవించేది బుద్ధి.  ఈ పదహారవ పదిహేడవ దానితోటే కర్తృత్వ కార్యత్వ కరణత్వ భావాలు కలుగుతాయి.

తదేతత్షోడశకలం లిఙ్గం శక్తిత్రయం మహత్
ధత్తేऽనుసంసృతిం పుంసి హర్షశోకభయార్తిదామ్

జ్ఞ్యానెంద్రియ కర్మేంద్రియ పంచ భూతములూ మనసుతో కలిసి ఉన్నది త్రిగుణాత్మకం. ద్రవ్య జ్ఞ్యాన క్రియా శక్తిగా ఉంటుంది. ఈ శక్తి త్రయమే (బుద్ధి) జీవునిలో సంసారాన్ని ప్రవేశింపచేస్తుంది. సంతోషం దుఃఖం భయం ఆర్తి, వీటిని సంసారం కలిగిస్తుంది. ఈ సంసారాన్ని బుద్ధి కలిగిస్తుంది. అదే చేయిస్తుంది, అదే అనుభవిస్తుంది. ఆ అనుభవాన్ని ఆత్మకు ఆపాదిస్తుంది.

దేహ్యజ్ఞోऽజితషడ్వర్గో నేచ్ఛన్కర్మాణి కార్యతే
కోశకార ఇవాత్మానం కర్మణాచ్ఛాద్య ముహ్యతి

అసలు జీవునికి వీటితో సంబంధం లేదు. అసలు ఆత్మ జ్ఞ్యాధికరణం. అది మరచిపోయి అరిషడ్వర్గాలని గెలవలేక, తనకు ఇష్టము లేకున్నా పనులు చేస్తూనే ఉంటాడు. సాలీడు తను వేసుకున్న వల తననే బంధిస్తుందని తెలియక అల్లుకున్నట్లు మనం కూడా మనని బంధించుకుంటాము. ఏ ఒక్కడూ ఏ ఒక్క క్షణం పని చేయకుండా ఉండజాలడు. తన వశములో తాను లేక ఇలాంటి పనులను తాను చేస్తూ ఉంటాడు. తాను కాదు ఆ పని చేసేది. గుణములు చేయిస్తుంటాయి. ఆ గుణములు తన స్వభావము వలన వచ్చినది. మామిడి విత్తనం వేస్తే వేప వస్తుందా? (పక్వానికి వచ్చిన మామిడి చెట్టును గొడ్డలితో కొట్టి అదే స్థానములో వేప చెట్టును నాటి దానిని పాలతో పోషించినా ఆ పండు చేదుగానే ఉంటుంది గానీ తీపిగా ఉండదు - భరతుని వాక్యం రామాయణములో) క్షేత్రం (యోనీ) విత్తనం కాలం - ప్రతీ దానికీ ఈ మూడే కారణం. వీటి బట్టే కర్మ వస్తువూ అనుభవం నిర్ణయించబడి ఉంటాయి.

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్
లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత
యథాయోని యథాబీజం స్వభావేన బలీయసా
ఏష ప్రకృతిసఙ్గేన పురుషస్య విపర్యయః
ఆసీత్స ఏవ న చిరాదీశసఙ్గాద్విలీయతే

కారణం వ్యక్తం కావచ్చు అవ్యక్తం కావచ్చు వ్యక్తావ్యక్తమూ కవొచ్చు గానీ ఆయా క్షేత్రం బీజం ప్రకృతి స్వభావం బట్టే విపరీతముగా ప్రవర్తిస్తాడు.

అయం హి శ్రుతసమ్పన్నః శీలవృత్తగుణాలయః
ధృతవ్రతో మృదుర్దాన్తః సత్యవాఙ్మన్త్రవిచ్ఛుచిః

ఎవరిని ఊర్ధ్వ లోకాలకు పంపాలనుకుంటాడో అలాంటి వాడిచేత అలాంటి పని పరమాత్మే చేయిస్తాడు.

గుర్వగ్న్యతిథివృద్ధానాం శుశ్రూషురనహఙ్కృతః
సర్వభూతసుహృత్సాధుర్మితవాగనసూయకః

ఇతను శచ్చీలం కలవాడు శాస్త్రం చదువుకున్నవాడు మృదుస్వభావి. ఇంద్రియ నిగ్రహం కలవాడు, శుచి శౌచం కలవాడు. గురువులనూ అగ్నినీ భూతములనూ అథితినీ సేవించేవాడు, అహంకారం లేని వాడు, సకల ప్రాణులయందూ మైత్రీభావం కలవాడూ, సజ్జనుడూ, మితబాషి, ఇతరుల గుణాలలో దోషం ఎంచని వాడు.

ఏకదాసౌ వనం యాతః పితృసన్దేశకృద్ద్విజః
ఆదాయ తత ఆవృత్తః ఫలపుష్పసమిత్కుశాన్

దదర్శ కామినం కఞ్చిచ్ఛూద్రం సహ భుజిష్యయా
పీత్వా చ మధు మైరేయం మదాఘూర్ణితనేత్రయా

ఒక సారి పితృ ఆదేశం మీద దర్భలు తీసుకు రావడానికి వనానికి వెళ్ళాడు. పళ్ళనూ పూలనూ సమిధలనూ తీసుకుని వెనకకు బయలుదేరగా, విశ్రమిద్దామని చెట్టుకింద కూర్చుని ఉండగా కాముకుడైన ఒక శూద్రుడు తాననుభవించడానికి ఏర్పాటు చేసుకున్న వేశ్యను చూచాడు.

మత్తయా విశ్లథన్నీవ్యా వ్యపేతం నిరపత్రపమ్
క్రీడన్తమనుగాయన్తం హసన్తమనయాన్తికే

దృష్ట్వా తాం కామలిప్తేన బాహునా పరిరమ్భితామ్
జగామ హృచ్ఛయవశం సహసైవ విమోహితః

స్తమ్భయన్నాత్మనాత్మానం యావత్సత్త్వం యథాశ్రుతమ్
న శశాక సమాధాతుం మనో మదనవేపితమ్

ఆ వేశ్య మద్యపానం చేసి ఎర్రబారిన చూపుతో ఉన్నది. మద్యపానము చేయడముతో బాగా మదించి ఉన్నది. వస్త్రం జారిపోతూ ఉండగా సిగ్గును విడిచి ఉన్న స్త్రీనీ ఆ పురుషున్ని చూచాడు. వారిద్దరూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉండగా పరిపూర్ణ్మైన కామోద్రేకముతో ఆలింగనం చేసుకున్న ఆ జంటను చూడగానే పాండిత్యం శ్రద్దా జ్ఞ్యానం పోయి మధన బాధితుడై

మధ్యాన్నం పన్నెండు నించీ నాలుగు వరకూ అడవికీ అర్థరాత్రి శ్మశానములోకీ అపరరాత్రి నదీ జలమునకూ వెళ్ళకూడదు. ఆయా సమయాలలో అక్కడ అటువంటి పనులు జరుగుతాయి. మధ్యాహ్నం ఎవరూ ఉండరని అడవిలో కొందరు కాముకులు అరణ్యాన్ని శయ్యాగృహముగా వాడుకొంటారు. అర్థరాత్రి భూత ప్రేతములు శ్మశానాన్ని అలా వాడుకొంటాయి, అలాగే అపర రాత్రి సరస్సులూ. అప్పటికీ చదువుకున్నవాడు కాబట్టి నిగ్రహించుకుందామని ప్రయత్నించాడు గానీ సమాధానపరచుకోలేకపోయాడు.

తన్నిమిత్తస్మరవ్యాజ గ్రహగ్రస్తో విచేతనః
తామేవ మనసా ధ్యాయన్స్వధర్మాద్విరరామ హ


తామేవ తోషయామాస పిత్ర్యేణార్థేన యావతా
గ్రామ్యైర్మనోరమైః కామైః ప్రసీదేత యథా తథా


మన్మధుడనే గ్రహం పట్టింది ఇతనికి. ఆ వేశ్యనే కోరుకున్నాడు. ఎలాగూ వేశ్య కాబట్టి తండ్రి సంపాదించిన డబ్బుని (తండ్రి నుంచి నేర్చుకున్న జ్ఞ్యానం శీలం తపస్సూ ధారపోసాడు) ధార్పోసాడు. ఆమెను సంతోషపరచి తాను సంతోషం పొందాడు. అంతవరకూ తనకన్ని రకములుగా సేవచేసిన ధర్మపత్నినీ, అప్రౌఢ (వేశ్య లాగ తనని రజింపచేయలేక పోయినదైన భార్య)

విప్రాం స్వభార్యామప్రౌఢాం కులే మహతి లమ్భితామ్
విససర్జాచిరాత్పాపః స్వైరిణ్యాపాఙ్గవిద్ధధీః

తన భార్య తనకు అలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది అని విడిచిపెట్టాడు. భర్తను తన వశములో ఉంచుకోవడానికి అవసరమైన చేష్టలు చేయలేనిది - అప్రౌఢ.

యతస్తతశ్చోపనిన్యే న్యాయతోऽన్యాయతో ధనమ్
బభారాస్యాః కుటుమ్బిన్యాః కుటుమ్బం మన్దధీరయమ్

ఉత్తమ కులములో పుట్టినది. మాయోపాయములతో భర్తను వశం చేసుకోవాలన్న భావన అటువంటి స్త్రీలకు కలదు. ఆ వేశ్యను పోషించడానికి ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని వైపులనుంచీ ధనాన్ని తీసొచ్చాడు, ధర్మముగా అధరమముగా కూడా సంపాధించాడు. బుద్ధి తక్కువ వాడై ఆమె సంతానాన్ని పోషించాడు.

యదసౌ శాస్త్రముల్లఙ్ఘ్య స్వైరచార్యతిగర్హితః
అవర్తత చిరం కాలమఘాయురశుచిర్మలాత్

తత ఏనం దణ్డపాణేః సకాశం కృతకిల్బిషమ్
నేష్యామోऽకృతనిర్వేశం యత్ర దణ్డేన శుద్ధ్యతి

ఇలా ధర్మాన్నీ శాస్త్రాన్ని ఉల్లంఘించి చాలా కాలం వ్యవహరించాడు. యధేచ్చగా ప్రవర్తిస్తూ చాలా కాలం గడిపి జీవితమంతా పాపముతో గడిపాడు. ఇతను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించడానికి ఇతను తీసుకుపోవడానికి యమధర్మరాజు దగ్గర నుంచి వచ్చాము. చేసిన అపరాధం శిక్షతో పరిశుద్ధమవుతుంది కాబట్టి యమ ధర్మ రాజు పంపాడు

Sunday, March 31, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

రాజోవాచ
మహర్ష ఏతద్వైచిత్ర్యం లోకస్య కథమితి

ఇన్ని రకముల పరిణామాలు ఎందుకు ఉన్నాయి. నరకములన్ని స్వరగ్మనీ ఎందుకు ఉన్నాయి. భగవంతుడు అందరినీ ఒకే తీరుగా ఎందుకు సృష్టించలేదు.

ఋషిరువాచ
త్రిగుణత్వాత్కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్విధాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవన్తి
అథేదానీం ప్రతిషిద్ధలక్షణస్యాధర్మస్య తథైవ కర్తుః శ్రద్ధాయా వైసాదృశ్యాత్కర్మఫలం
విసదృశం భవతి యా హ్యనాద్యవిద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః సృతయః సహస్రశః
ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణానువర్ణయిష్యామః

కర్త త్రిగుణం కాబట్టి, వారి వారి గుణములకు తగిన శ్రద్ధ వారికి ఉంటుంది. వారి వారి కర్మాధికారాన్ని బట్టి వారికి ఫలం ఉంటుంది.  అనంతమైన అవిద్య చేత కోరికలు ఏర్పడతాయి. వాటి కొరకు సృష్టి జరుగుతుంది. సృష్టిలోని వైషమ్యం పరమాత్మ సంకల్పం కాదు, జీవులు చేసుకున్న కర్మ.

రాజోవాచ
నరకా నామ భగవన్కిం దేశవిశేషా అథవా బహిస్త్రిలోక్యా ఆహోస్విదన్తరాల ఇతి

ఈ  నరకాలు అంటారే. అవి కూడా ఒక లోకమేనా? అవి త్రిలోకములలో అంతర్భూతములా, వాటి బయట ఉన్నాయా?

ఋషిరువాచ
అన్తరాల ఏవ త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్యామధస్తాద్భూమేరుపరిష్టాచ్చ
జలాద్యస్యామగ్నిష్వాత్తాదయః పితృగణా దిశి స్వానాం గోత్రాణాం పరమేణ సమాధినా సత్యా ఏవాశిష ఆశాసానా
నివసన్తి

దక్షిణ దిక్కులో భూమికి కిందగా ఉంది నరకం. నీటికన్నా పైన భూమీ కన్నా కింద. అందుకే మూడు వందల అడుగులు దాటి భూమిని త్రవ్వద్దు అంటారు. లేకపోతే అంతకన్నా లోతు ఉన్న నీరు త్రాగితే ఆ ప్రవృత్తే వస్తుంది. అక్కడ పితృదేవతలూ, కింద భూలోకములో తమ తమ గణాలు బాగుండాలని ఉంటారు.

యత్ర హ వావ భగవాన్పితృరాజో వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జన్తుషు
సమ్పరేతేషు
యథాకర్మావద్యం దోషమేవానుల్లఙ్ఘితభగవచ్ఛాసనః సగణో దమం ధారయతి

యముడు పితృ రాజు. మరణించి తన లోకానికి వచ్చినవారు, వారి వారి శరీరములో ఉండగా వారి కర్మానుసారముగా చేసిన పాపాన్ని తన వారితో శిక్షిస్తూ ఉంటాడు. పరమాత్మ ఆజ్ఞ్య మేరకూ తన గణముతో శిక్షిస్తూ ఉంటాడు

తత్ర హైకే నరకానేకవింశతిం గణయన్తి అథ తాంస్తే రాజన్నామరూపలక్షణతో
ऽనుక్రమిష్యామస్తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం
సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః
ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానమితి కిఞ్చ క్షారకర్దమో రక్షోగణ
భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖమిత్యష్టావింశతిర్నరకా వివిధ
యాతనాభూమయః

కొందరు ఈ నరకాలు ఇరవై ఒకటనీ అరవై ఒకటనీ అంటారు. పేర్లూ ఆకారములూ లక్షణములను వివరిస్తాము. తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం
సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానం.
ఇవి కాక ఇంకో ఏడు ఉన్నాయి.క్షారకర్దమో రక్షోగణ భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం. ఇవి యాతనా భూములు.

తత్ర యస్తు పరవిత్తాపత్యకలత్రాణ్యపహరతి స హి కాలపాశబద్ధో యమపురుషైరతి
భయానకైస్తామిస్రే నరకే బలాన్నిపాత్యతే అనశనానుదపానదణ్డతాడన
సన్తర్జనాదిభిర్యాతనాభిర్యాత్యమానో జన్తుర్యత్ర కశ్మలమాసాదిత ఏకదైవ మూర్చ్ఛాముపయాతి తామిస్ర
ప్రాయే

ఎవరెవరికి ఎలాంటి నరకం వస్తుంది. పరుల ధనాన్ని స్త్రీలనూ సంతానాన్ని హరిస్తారో అతను యముని పాశముతో బంధించబడి,  మహా భయంకరులైన యమభటులు తామిశ్రమనే నరకములో పడేస్తారు. ఇలాంటి వారికి శిక్షగా, ఆహరం ఇవ్వరు, నీరూ ఇవ్వరు, కట్టెలతో కొడుతూ ఉంటారు, కొడతానని భయపెడతారు. ఈ జీవుడు దుఃఖాన్ని పొంది ఒక దానికే మూర్చపోతాడు.

ఏవమేవాన్ధతామిస్రే యస్తు వఞ్చయిత్వా పురుషం దారాదీనుపయుఙ్క్తే యత్ర శరీరీ నిపాత్యమానో
యాతనా
స్థో వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవతి యథా వనస్పతిర్వృశ్చ్యమానమూలస్తస్మాదన్ధతామిస్రం
తముపదిశన్తి

అంధ తామిశ్రమనే ఇంకో నరకం ఉంది. భర్తను మోసగించి ఇంకో భార్యను అనుభవించేవాడు. వాడి బుద్ధీ చూపూ నశిస్తుంది. వేర్లు కోసేసిన వృక్షములాగ అవుతాడు. అందుకే ఇది కటిక చీకటి, అంధ తామిశ్రం.

యస్త్విహ వా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుమ్బమేవానుదినం
ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి

"నేను నేనంటూ" భావించి ఇతరులకు ద్రోహం చేస్తూ తన కుటుంబాన్ని మాత్రం పోషించుకునే వాడు రౌరవములో పడతాడు. ఇతరులకు ద్రోహం చేయకూడదు.

యే త్విహ యథైవామునా విహింసితా జన్తవః పరత్ర యమయాతనాముపగతం త ఏవ రురవో
భూత్వా
తథా తమేవ విహింసన్తి తస్మాద్రౌరవమిత్యాహూ రురురితి సర్పాదతిక్రూరసత్త్వస్యాపదేశః

ఇది రౌరవం ఎందుకంటే అక్కడ రురు అన్న జంతువు (ముళ్ళ పంది) వీడిని బాధిస్తుంది. ఇక్కడ జీవి ఈ లోకములో ఉన్నప్పుడు ఏ ఏ జంతువులని హింసించాడో ఆ జంతువులే పరలోకములో జంతువులుగా అవతరించి బాధిస్తాడు. అందుకే అది రౌరవం అంటారు. ఆవుల మందలో వేల ఆవులున్నా ఎలాగైతే దూడ తన తల్లిని గుర్తు పడుతుందో అలాగే కర్తను ఆ కర్మ గుర్తుపడుతుంది. పాము తన దగ్గరకు వెళితేనే ప్రమాదం, కానీ ఈ రురువు అంతకన్నా ప్రమాదకరం

ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదా నామ రురవస్తం క్రవ్యేణ ఘాతయన్తి యః
కేవలం దేహమ్భరః

మహారౌరవం: భయంకరముగా బాధపెట్టిన వారిని జంతువులన్నీ చుట్టూ చేరి జీవుల మాంసాన్ని మెల్ల మెల్లగా తింటూ ఉంటాయి. ఎవడు తన శరీరమును మాత్రమే పోషించుకోవడానికి ప్రయత్నించాడో వాడు ఈ నరకం పాలవుతాడు.

యస్త్విహ వా ఉగ్రః పశూన్పక్షిణో వా ప్రాణత ఉపరన్ధయతి తమపకరుణం పురుషాదైరపి
విగర్హితమముత్ర యమానుచరాః కుమ్భీపాకే తప్తతైలే ఉపరన్ధయన్తి

పక్షుల పశువుల ప్రాణం తీసి బాధపెట్టే రాక్షసుల కంటే హీనుడైన వాడు, అలాంటి వాళ్ళను కుంభీపాకము (పెద్ద మూకుడు నిండా నూనె మసలుతూ ఉంటుంది) లో పడేస్తారు.

యస్త్విహ బ్రహ్మధ్రుక్స కాలసూత్రసంజ్ఞకే నరకే అయుతయోజనపరిమణ్డలే తామ్రమయే తప్త
ఖలే ఉపర్యధస్తాదగ్న్యర్కాభ్యామతితప్యమానేऽభినివేశితః క్షుత్పిపాసాభ్యాం చ దహ్యమానాన్తర్బహిః
శరీర ఆస్తే శేతే చేష్టతేऽవతిష్ఠతి పరిధావతి చ యావన్తి పశురోమాణి తావద్వర్షసహస్రాణి

తల్లి తండ్రులకూ బ్రాహ్మణులకూ బ్రాహ్మణ భక్తులకూ ద్రోహం చేస్తారో పది వేల యోజనాల మండలాకారములో ఉన్న కాల సూత్రమనే నరకములో పడతారు. అది బాగా కాల్చబడిన రాగి పల్లెములా ఉంటుంది. బాగా కాచిన పల్లెములో అట్టూ ఇటూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ మంటలకు తోడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. పెట్టే బాధను తట్టుకోవడానికి ఆకలికి ఆహారం అడుగుతారు. పై శరీరమూ లోపల శరీరం అగ్నితో , జఠరాగ్నితో కాలుతూ ఉంటుంది. కింద కూడా అగ్ని ఉంటుంది. అక్కడే ఉండి పడుకుని పరిగెత్తుతూ ఉంటాడు. ఇలా ఏ ఏ పశువులను చంపారో, ఆ చంపిన పశువులకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటాడు.

యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాఖణ్డం చోపగతస్తమసిపత్రవనం
ప్రవేశ్య కశయా ప్రహరన్తి తత్ర హాసావితస్తతో ధావమాన ఉభయతో ధారైస్తాలవనాసిపత్రైశ్ఛిద్యమాన
సర్వాఙ్గో హా హతోऽస్మీతి పరమయా వేదనయా మూర్చ్ఛితః పదే పదే నిపతతి స్వధర్మహా పాఖణ్డానుగతం
ఫలం భుఙ్క్తే

వేద మార్గమును ఆపద లేనప్పుడు తప్ప బ్రాహ్మణులు తప్పితే, తన మార్గాన్ని తాను విడిచి పెట్టి పాఖండ మార్గాన్ని అవలంబిస్తే, అతిపత్ర వనం అనే నరకములో పడతారు. అక్కడ కొరడాలతో కొడతారు. ఇటూ అటూ పరిగెడుతూ ఉంటారు. కింద ఆకుల లాంటి కత్తులు ఉంటాయి. కింద కాళ్ళు పెట్టడానికీ లెడు ఆగడానికీ లేదు. ఆ కత్తులకు రెండు వైపులా అంచు ఉంటుంది. పదే పదే ఘోరమైన ఆపదతో మూర్చపోతూ ఉంటారు. తన ధర్మాన్ని విడిచి పెట్టి పాఖండ మతాన్ని అనుసరించినందు వలన ఈ ఫలితాన్ని అనుభవిస్తారు.

యస్త్విహ వై రాజా రాజపురుషో వా అదణ్డ్యే దణ్డం ప్రణయతి బ్రాహ్మణే వా శరీరదణ్డం స
పాపీయాన్నరకేऽముత్ర సూకరముఖే నిపతతి తత్రాతిబలైర్వినిష్పిష్యమాణావయవో యథైవేహేక్షుఖణ్డ ఆర్త
స్వరేణ స్వనయన్క్వచిన్మూర్చ్ఛితః కశ్మలముపగతో యథైవేహాదృష్టదోషా ఉపరుద్ధాః

రాజు గానీ రాజు దగ్గర పని చేసిన వారు గానీ, శిక్షించదగని వారిని శిక్షినట్లైతే, బ్రాహ్మణులకి శరీర దండం విధిస్తే సూకర ముఖం అనే నరకం విధిస్తారు. ఆ వరాహాల మూతులు దబ్బనాలలా ఉండి చిల్లులు పొడుస్తూ, పిండబడుతూ (చెరుకు గడలను పిండినట్లుగా) ఉంటారు. మూర్చపోతూ కొందరు, అధికారముగా ఉన్నప్పుడు ఈ లోకములో తప్పు చేయని వారిని ఎలా హింసిస్తారో అవి అన్నీ గుర్తుకు వస్తాయి. తాను బాధించిన వారిని తలచుకుంటారు. తప్పులేని వారినెలా హింసించావో  అలా వారు హింసిస్తారు.

యస్త్విహ వై భూతానామీశ్వరోపకల్పితవృత్తీనామవివిక్తపరవ్యథానాం స్వయం పురుషోపకల్పిత
వృత్తిర్వివిక్తపరవ్యథో వ్యథామాచరతి స పరత్రాన్ధకూపే తదభిద్రోహేణ నిపతతి తత్ర హాసౌ
తైర్జన్తుభిః పశుమృగపక్షిసరీసృపైర్మశకయూకామత్కుణమక్షికాదిభిర్యే కే చాభిద్రుగ్ధాస్తైః
సర్వతోऽభిద్రుహ్యమాణస్తమసి విహతనిద్రానిర్వృతిరలబ్ధావస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః

అంధ కూప నరకం: కొన్ని ప్రాణులు మన నుండి ఏమీ ఆశించక పరమాత్మ ఏర్పాటు చేసిన వసతిని బట్టి బతుతుకూ ఉంటాయి, ఇతరులను బాధించడం వాటికి తెలియదు. పరమాత్మ చేత పోషింపబడేవి, ఇతరులని బాధించబడే వాటిని, ఇతరుల చేత పోషింపబడే వాడు బాధించినట్లైతే పరలోకములో వాడు అంధకూప నరకములో పడతాడు. పరలోకములో పశువులూ మృగములూ జంతువులూ సర్పములూ దోమలూ పేలూ నల్లులు ఈగలు ఇలాంటి వాటి చేత బాధించబడతాడు. నల్లూ ఈగలూ దోమలూ మనని బాధిస్తున్నాయన్న సంగతి వారికి తెలియదు. అందుకు వాటిని మనం చంపకూడదు. వాటిని బాధిస్తే వాటి చేతనే బాధకు గురవుతారు (మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే). ఇలా అవస్థలు పడుతూ చెడిపోయిన శరీరములో జీవుడు ఉండలేక వెళ్ళలేక ఉంటాడో, ఈ నరకములో కూడా నానా యాతనలు పడుతూ ఉంటాడు.

యస్త్విహ వా అసంవిభజ్యాశ్నాతి యత్కిఞ్చనోపనతమనిర్మితపఞ్చయజ్ఞో వాయససంస్తుతః స
పరత్ర కృమిభోజనే నరకాధమే నిపతతి తత్ర శతసహస్రయోజనే కృమికుణ్డే కృమిభూతః స్వయం
కృమిభిరేవ భక్ష్యమాణః కృమిభోజనో యావత్తదప్రత్తాప్రహూతాదోऽనిర్వేశమాత్మానం యాతయతే

కృమిభోజనం: మనం తినేవాటిని మన చుట్టు పక్కల వారికి పంచకుండా తింటే ఈ నరకం వస్తుంది. ఇలా లక్ష యోజనాల విస్తీర్ణములో ఈ నరకం ఉంటుంది. అది కృమి కుండం. పితృ శ్రాద్ధాదులూ యజ్ఞ్య యాగాదులూ (దేవ యజ్ఞ్య పితృ యజ్ఞ్యములు చేయకుండా భుజించిన వాడు) దానములూ చేయని వాడు. ఏ మాత్రం జాలి లేకుండా ప్రేమ లేకుండా తనను తాను హింసించుకుంటాడు.

యస్త్విహ వై స్తేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వాపహరత్యన్యస్య వానాపది
పురుషస్తమముత్ర రాజన్యమపురుషా అయస్మయైరగ్నిపిణ్డైః సన్దంశైస్త్వచి నిష్కుషన్తి

అగ్నిపిండ నరకం. ఇతరుల, బ్రాహ్మణుల దీనుల ధనాన్ని దొంగతనముగా ఆపదలేనప్పుడు అపహరిస్తాడో ఉక్కు పిండములను నిప్పులో కాల్చి శరీరములో కొడుతూ ఉంటారు.

యస్త్విహ వా అగమ్యాం స్త్రియమగమ్యం వా పురుషం యోషిదభిగచ్ఛతి తావముత్ర కశయా
తాడయన్తస్తిగ్మయా సూర్మ్యా లోహమయ్యా పురుషమాలిఙ్గయన్తి స్త్రియం చ పురుషరూపయా సూర్మ్యా

పొందకూడని స్త్రీని పొందిన వాడు, పొందకూడని పురుషున్ని పొందిన స్త్రీని ఒక ఉక్కు స్తంభాన్ని బాగా కాల్చి దానిని ఆలింగనం చేసుకోమని అంటారు. కొరడాలతో కొడుతూ ఉంటారు. మహా వేడి ఉన్న దానిని, పొందకూడని పురుషున్ని పొందిన స్త్రీని పురుషాకారములో ఉన్న స్తంభాన్ని ఆలింగనం చేసుకోమని కొరడాలతో కొడతారు.

యస్త్విహ వై సర్వాభిగమస్తమముత్ర నిరయే వర్తమానం వజ్రకణ్టకశాల్మలీమారోప్య
నిష్కర్షన్తి

వావీ వరసలూ పాటించకుండా (మనుషులతోనే కాకుండా, జంతువులతో కూడా రమించేవారిని) ముళ్ళతో ఉన్న బూరుగు చెట్టును ఎక్కించి కిందకి లాగుతారు.

యే త్విహ వై రాజన్యా రాజపురుషా వా అపాఖణ్డా ధర్మసేతూన్భిన్దన్తి తే సమ్పరేత్య వైతరణ్యాం
నిపతన్తి భిన్నమర్యాదాస్తస్యాం నిరయపరిఖాభూతాయాం నద్యాం యాదోగణైరితస్తతో భక్ష్యమాణా
ఆత్మనా న వియుజ్యమానాశ్చాసుభిరుహ్యమానాః స్వాఘేన కర్మపాకమనుస్మరన్తో విణ్మూత్రపూయశోణిత
కేశనఖాస్థిమేదోమాంసవసావాహిన్యాముపతప్యన్తే

కొందరు రాజులూ రాజ ఉద్యోగులు పుణ్యమును ఆచరించే మర్యాదను ఉల్లంఘిస్తారో ధర్మాన్ని ఆచరించే వారిని నిందిస్తారో వారు వైతరిణీ నదిలో పడతారు. వైతరిణీ అంటే నరకానికి కందకం. ఆ నదిలో మలం మూత్రం దుర్గంధం నెత్తురూ కేశములూ గోళ్ళూ ఎముకలు మధ్యా మాంసం చీము ఉంటాయి. అందులో పడేస్తారు. అక్కడ కొన్ని జంతువులూ క్రిమికీటకాలూ ఉంటాయి. అక్కడ రాక్షసులతో తినబడుతూ ఆత్మ వియోగం లేకుండా ప్రాణములతో ఉన్నట్లే ఉండి "అయ్యో క్షణికమైన ఆనందం లాంటి దాని కోసం ఈ పాపాలు చేసామా" అని బాధపడతారు.

యే త్విహ వై వృషలీపతయో నష్టశౌచాచారనియమాస్త్యక్తలజ్జాః పశుచర్యాం చరన్తి తే చాపి ప్రేత్య
పూయవిణ్మూత్రశ్లేష్మమలాపూర్ణార్ణవే నిపతన్తి తదేవాతిబీభత్సితమశ్నన్తి

బ్రాహ్మణోత్తములూ క్షత్రియులూ వేద వాక్యాలనూ ధర్మాలనూ విడిచిపెట్టి శూద్ర స్త్రీలతో రమించి శౌచమూ ఆచారమూ సిగ్గూ విడిచి  పశుచర్యతో పశువులలాగ ప్రవర్తిస్తారో వారు మల మూత్ర దుర్గంధ శ్లేషముతో ఉన్న సముద్రములో పడవేయబడి దానినే తాగుతూ తింటూ ఉంటారు.

యే త్విహ వై శ్వగర్దభపతయో బ్రాహ్మణాదయో మృగయా విహారా అతీర్థే చ మృగాన్నిఘ్నన్తి
తానపి
సమ్పరేతాన్లక్ష్యభూతాన్యమపురుషా ఇషుభిర్విధ్యన్తి

బ్రాహ్మణులు కొంతమంది కుక్కలనూ గాడిదలనూ పెంచుకుంటారు. అలా పెంచుకునే వారూ, శ్రాద్ధాదులు లేనప్పుడు మృగాలని చంపితే వారు నరకానికి వెళ్ళినప్పుడు, ఎలా ఇక్కడ వీరు బాణాలతో జంతువులను చంపారో అక్కడ యమబటులు వీళ్ళని కొడుతూ ఉంటారు.

యే త్విహ వై దామ్భికా దమ్భయజ్ఞేషు పశూన్విశసన్తి తానముష్మిన్లోకే వైశసే నరకే
పతితాన్నిరయపతయో యాతయిత్వా విశసన్తి

ఎవరైతే డాంబికముగా ఉంటారో, పదిమంది మనను భక్తులనుకోవాలని వచనతో యజ్ఞాలు చేసి పశువులని చంపేవారు నరకానికి వెళ్ళిన తరువాత యజ్ఞ్య పశువును ఎలా బాధించి హింసించి చంపుతారో అక్కడికి వెళ్ళిన తరువాత యమభటులు అలాగే చేస్తారు.

యస్త్విహ వై సవర్ణాం భార్యాం ద్విజో రేతః పాయయతి కామమోహితస్తం పాపకృతమముత్ర రేతః
కుల్యాయాం పాతయిత్వా రేతః సమ్పాయయన్తి

కొందరు తమ భార్యలతో తమ వీర్యమును తాగిస్తారు. అలాంటి పాపం చేసిన వారిని వీర్యముతో ఉన్న బురదలో పడేస్తారు.

యే త్విహ వై దస్యవోऽగ్నిదా గరదా గ్రామాన్సార్థాన్వా విలుమ్పన్తి రాజానో రాజభటా వా
తాంశ్చాపి హి
పరేత్య యమదూతా వజ్రదంష్ట్రాః శ్వానః సప్తశతాని వింశతిశ్చ సరభసం ఖాదన్తి

కొందరు దొంగలు దొంగతనానికి వచ్చి ఊళ్ళకు ఊళ్ళను తగలబెట్టి, విషాన్నం పెడతారు. రాజభటులు కూడా తమ మాట వినని వారిని ఇలాగే చేస్తారు. అలాంటి వారిని వజ్రములాంటి కోరలున్న కుక్కలతో కరిపిస్తారు.

యస్త్విహ వా అనృతం వదతి సాక్ష్యే ద్రవ్యవినిమయే దానే వా కథఞ్చిత్స వై ప్రేత్య నరకే
ऽవీచిమత్యధఃశిరా నిరవకాశే యోజనశతోచ్ఛ్రాయాద్గిరిమూర్ధ్నః సమ్పాత్యతే యత్ర జలమివ స్థలమశ్మ
పృష్ఠమవభాసతే తదవీచిమత్తిలశో విశీర్యమాణశరీరో న మ్రియమాణః పునరారోపితో నిపతతి

అబద్దం ఆడేవాడు, అబద్ద సాక్ష్యం చెప్పేవాడూ, ఎలాంటి గాలీ వెలుతురూ లేని చోట పెద్ద సొరగమునుంచి పర్వత పైభాగం నుంచి పడవేస్తారు. అక్కడ నీరూ భూమీ రెండూ ఉక్కుతో ఉంటాయి. అలాంటి చోట పడ్డప్పుడు నువ్వుల గింజలుగా శరీరం ఐపోతుంది. చావు లేదు కాబట్టి మళ్ళీ లేస్తాడు.

యస్త్విహ వై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపీథస్తత్కలత్రం వా సురాం వ్రతస్థోऽపి వా పిబతి
ప్రమాదతస్తేషాం నిరయం నీతానామురసి పదాక్రమ్యాస్యే వహ్నినా ద్రవమాణం కార్ష్ణాయసం నిషిఞ్చన్తి

బ్రాహ్మణుడు రాజూ వైశ్యుడూ సోమయాగం చేసేవాడు వ్రతములో ఉన్నవాడు కానీ తన వారిని భార్యనూ గానీ తన వారితో గాని సురాపానం చేస్తేలేవకుండా వక్షస్థలం మీద కాలుపెట్టి కాలే నిప్పును నోట్లో పోస్తారు, నిప్పులో బాగా కరిగించిన సీసాన్ని నోట్లో పోస్తారు. మద్యం పానం చేస్తే నాలుకా నోరూ మొత్తం మండుతుంది, ఆ మంటే రుచి ఉందని తాగుతారు. వారికి ఈ శిక్ష.

అథ చ యస్త్విహ వా ఆత్మసమ్భావనేన స్వయమధమో జన్మతపోవిద్యాచారవర్ణాశ్రమవతో
వరీయసో న బహు మన్యేత స మృతక ఏవ మృత్వా క్షారకర్దమే నిరయేऽవాక్శిరా నిపాతితో దురన్తా యాతనా
హ్యశ్నుతే

శరీరముతో జాతితో వృత్తితో విద్యతో గానీ, ఏ రకముగా చూసినా తక్కువగా ఉండేవాడు, ఎక్కువగా ఉండేవాడిని తగిన రీతిలో గౌరవించకుంటే బతికున్నప్పుడూ చనిపోయినవాడితో సమానమే, చనిపోయిన తరువాత కూడా ఒక క్షారకర్దమములో (బురద) త్రల్ల కిందుగా పడేస్తారు.

యే త్విహ వై పురుషాః పురుషమేధేన యజన్తే యాశ్చ స్త్రియో నృపశూన్ఖాదన్తి తాంశ్చ తే పశవ ఇవ
నిహతా యమసదనే యాతయన్తో రక్షోగణాః సౌనికా ఇవ స్వధితినావదాయాసృక్పిబన్తి నృత్యన్తి చ గాయన్తి చ
హృష్యమాణా యథేహ పురుషాదాః

కొంతమంది పురుషమేధం చేసి నరున్ని బలి ఇస్తారు, స్త్రీలు కూడా పురుషులని తిని వేస్తారు (వాడిని నిర్వీర్యుడయ్యేంత వరకూ రమిస్తారు), అలాంటి వారు యమలోకములో రాక్షసులై కసాయి వారిగా (సౌనికా ) ఎలాంటి జాలీ దయా లేకుండా ఒక దబ్బనం గుచ్చి వారి రక్తాన్ని తాగుతారు. అలా త్రాగుతూ నాట్యం చేస్తారు గానం చేస్తారు. ఇక్కడ పురుషులను భుజించేవారు ఎంత ఆనందముగా గానం చేస్తారో వీరు కూడా అంతగానే చేస్తారు.

యే త్విహ వా అనాగసోऽరణ్యే గ్రామే వా వైశ్రమ్భకైరుపసృతానుపవిశ్రమ్భయ్య జిజీవిషూన్శూల
సూత్రాదిషూపప్రోతాన్క్రీడనకతయా యాతయన్తి తేऽపి చ ప్రేత్య యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానః
క్షుత్తృడ్భ్యాం
చాభిహతాః కఙ్కవటాదిభిశ్చేతస్తతస్తిగ్మతుణ్డైరాహన్యమానా ఆత్మశమలం స్మరన్తి

కొందరు ఏ తప్పూ చేయకుండా ఎవరికీ హాని చేయకుండా గ్రామాలలో కానీ అరణ్యాలలో కానీ బ్రతకగోరే జంతువులూ పక్షులనూ ఆటకోసం పొడుస్తూ వినోదిస్తే వారిని యమలోకములో శూలముతో పొడుస్తారు, అన్నమూ పానీయమూ ఉండదు. డేగలూ గద్దలూ పొడిచి శరీర భాగాలను తీసుకుంటాయి

యే త్విహ వై భూతాన్యుద్వేజయన్తి నరా ఉల్బణస్వభావా యథా దన్దశూకాస్తేऽపి ప్రేత్య నరకే
దన్దశూకాఖ్యే నిపతన్తి యత్ర నృప దన్దశూకాః పఞ్చముఖాః సప్తముఖా ఉపసృత్య గ్రసన్తి యథా బిలేశయాన్

ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతర ప్రాణులని కలతకు గురిచేస్తారు. ఏ లాభము ఉండదు దాని వలన. మానవులనే కాకుండా పాములను పట్టి వారి కోరలు తీసి ఆనందిస్తూ ఉంటారు. మిగతా జంతువులతో కూడా అలాగే ఆడిస్తారు తమ వినోదము కోసము. తమ సంతోషం కోసం స్వేచ్చగా ఎవరికీ అపకారం చేయని మృగాలను కట్టివేసి కొట్టి చెప్పినట్లు చేయించుకుని వినోదించేవారు. అలాంటి వారికి సూదులు ఒళ్ళంతా చిలూ చేస్తాయి ఆ జంతువులు. బిలములో ఉన్నవాటిని ఎలా తినేస్తాయో అలా తినేస్తాయి. కరుస్తున్నాయి అంటే అవి మెలుకువగా ఉన్నప్పుడే కరుస్తాయి. తెలిసే బాధిస్తాయి.

యే త్విహ వా అన్ధావటకుసూలగుహాదిషు భూతాని నిరున్ధన్తి తథాముత్ర తేష్వేవోపవేశ్య సగరేణ
వహ్నినా ధూమేన నిరున్ధన్తి

కొందరు గుహలలో సొరంగాలలో చెట్టు తొర్రలలో ఉండే ప్రాణులని పట్టుకుంటారు. వారిని అలాంటి చోటే పట్టుకుని మంట పెడతారు

యస్త్విహ వా అతిథీనభ్యాగతాన్వా గృహపతిరసకృదుపగతమన్యుర్దిధక్షురివ పాపేన
చక్షుషా నిరీక్షతే తస్య చాపి నిరయే పాపదృష్టేరక్షిణీ వజ్రతుణ్డా గృధ్రాః కఙ్కకాకవటాదయః ప్రసహ్యోరు
బలాదుత్పాటయన్తి

ఇంటికొచ్చిన అతిథులనూ యాచకులనూ మహాకోపముతో చూసే వారి కళ్ళను గద్దలు బలవంతముగా లాగేస్తాయి.

యస్త్విహ వా ఆఢ్యాభిమతిరహఙ్కృతిస్తిర్యక్ప్రేక్షణః సర్వతోऽభివిశఙ్కీ అర్థవ్యయనాశచిన్తయా
పరిశుష్యమాణహృదయవదనో నిర్వృతిమనవగతో గ్రహ ఇవార్థమభిరక్షతి స చాపి ప్రేత్య తద్
ఉత్పాదనోత్కర్షణసంరక్షణశమలగ్రహః సూచీముఖే నరకే నిపతతి యత్ర హ విత్తగ్రహం పాపపురుషం
ధర్మరాజపురుషా వాయకా ఇవ సర్వతోऽఙ్గేషు సూత్రైః పరివయన్తి

నేను ధనవంతున్ని అని వంకర చూపు చూస్తూ ఉంటాడు. అందరూ తనను దోచడానికే వస్తారని ప్రతీ వారినీ ప్రతీ చోటా శంకిస్తూ, అర్థం వ్యయమైనప్పుడల్లా చింతిస్తూ శరీరమూ ముఖమూ హృదయమూ మాడి, తృప్తినీ పొందలేక, గ్రహములాగ (దయ్యములాగ) ఆ ధనం చుట్టే ఉండి ఆ డబ్బును కాపాడుకోవడమే తమ పని అనుకొని బ్రతికేవారు. ఇలా ఒక దాన్ని ఏర్పరచాలి, ఏర్పరచిన డబ్బును లాగాలి, లాగిన దాన్ని కాపాడుకోవాలి, అనుకునేవారు సూచీ ముఖం అనే నరకానికి వెళ్ళి, ఈ లోకములో ఉన్నప్పుడు డబ్బును ఎవరికీ దొరకకుండా దాచడానికి బొంతలలో వేసి కుట్టారు కనుక, వారి ఒళ్ళంతా సూది దారాలతోట్బట్టకుట్టేవారిలా (వాయకా ) కుడతారు.

ఏవంవిధా నరకా యమాలయే సన్తి శతశః సహస్రశస్తేషు సర్వేషు చ సర్వ ఏవాధర్మవర్తినో యే
కేచిదిహోదితా అనుదితాశ్చావనిపతే పర్యాయేణ విశన్తి తథైవ ధర్మానువర్తిన ఇతరత్ర ఇహ తు పునర్భవే త
ఉభయశేషాభ్యాం నివిశన్తి

ఇలాంటి నరకములు యమలోకములో వందలూ వేలూ ఉన్నాయి. మనం చేసే ప్రతీ తప్పుకూ ఒక శిక్ష ఉంటుంది. అన్ని రకముల పాపములతో అధర్మముగా ఉండేవారు పుట్టినవారు పుట్టని వారు పుట్టబోయే వారు చేసిన చేస్తున్న చేయబోయే పాపాలకూ నరకాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఒక్కసారే పుట్టరు. పుట్టినవారు చేస్తూ ఉంటారు, పుట్టబోయే వారు చేయబోతారు. అధర్మం చేసిన వారు ఎంతోకొంతైనా ధర్మం చేస్తారు. అలాంటి వారు పుణ్యాన్ని అనుభవించి, పుణ్యం కొంచెం మిగిలాక నరకానికి వచ్చి, అవి అనుభవించి మళ్ళీ పుడతారు. ఎలాంటి పాపం చేసిన వారు మళ్ళీ పుట్టినప్పుడు ఎలాంటి పుట్టుక పుడతారో, అలాంటి పాపం చేసిన వారు ఎలాంటి పనులు చేస్తారో ముందే వారికి తెలుసు కాబట్టి వారి కొరకు నరకములు సిద్ధముగా ఉంటాయి. మళ్ళి పుట్టడములో పాపం మిగిలి ఉండగా పుడతారు. కొందరు పుణ్యము కొద్దిగా మిగిలి ఉండగా పుడతారు.

నివృత్తిలక్షణమార్గ ఆదావేవ వ్యాఖ్యాతః ఏతావానేవాణ్డకోశో యశ్చతుర్దశధా పురాణేషు వికల్పిత
ఉపగీయతే యత్తద్భగవతో నారాయణస్య సాక్షాన్మహాపురుషస్య స్థవిష్ఠం రూపమాత్మమాయా
గుణమయమనువర్ణితమాదృతః పఠతి శృణోతి శ్రావయతి స ఉపగేయం భగవతః పరమాత్మనోऽగ్రాహ్యమపి
శ్రద్ధాభక్తివిశుద్ధబుద్ధిర్వేద

ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. త్యాగం యాగం విరక్తీ ఉండాలి. ఇదంతా బ్రహ్మాండ కోశం. ఇదే పధ్నాలుగు లోకాలుగా వివరించబడింది. ఇది పరమాత్మ శ్రీమన్నారాయణుని స్థూల రూపమే. ఇది ఆత్మ మాయా గుణమయం. పరమాత్మ మాయా (ప్రకృతి )గుణములతో ఉన్నదానిని శ్రద్ధతో ఆదరముతో చదివే వాడూ వినేవాడూ వినిపించేవాడూ, అలాంటివాడు ఆయా వేద పురాణ శాస్త్రములలో పరమాత్మ యొక్క ఏ ఏ రూపాలను వర్ణించారో అవి మన బుద్ధికి అందనివైనా దీన్ని చదివి వినిపించడం వలన పరమాత్మ రూపాన్ని అర్థం చేసుకుంటాడు. ఇవి విని వినిపిస్తే పరమాత్మ గుణము యందు శ్రద్ధా భక్తులు కలిగి బుద్ధి పరిశుద్ధమై పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడు.

శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతిః
స్థూలే నిర్జితమాత్మానం శనైః సూక్ష్మం ధియా నయేదితి

మన బుద్ధిని పరమాత్మ యందు ఉంచాలంటే పరమాత్మ యొక్క స్థూల రూపములో బుద్ధిని ఉంచడం అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు పరమాత్మ సూక్ష్మ రూపములో బుద్ధి నిలుస్తుంది. అప్పుడు పరమాత్మ సూక్ష్మ రూపములో బుద్ధిని నిలపాలి.

భూద్వీపవర్షసరిదద్రినభఃసముద్ర
పాతాలదిఙ్నరకభాగణలోకసంస్థా
గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య
స్థూలం వపుః సకలజీవనికాయధామ

భూ ద్వీప వర్షా సరస్సూ అద్రి నభ సముద్ర పాతాళ మొదలైనవి పరమాత్మ యొక్క అత్యద్భుతమైన స్థూల రూపం. సకల ప్రాణులకూ ఇదే నివాసం, దీన్ని జాగ్రత్తగా నెమరు వేస్తే పరమాత్మ కృపకు పాత్రులవుతాము.

Saturday, March 30, 2013

భూగోళము యొక్క సంక్షేప వర్ణనం

భూగోళము యొక్క సంక్షేప వర్ణనం

జంబూ  ద్వీపములో నవ వర్షాలు. తొమ్మిది వేల యోజనాల వెడల్పు ఒక్కొక్కటీ. మొత్తం ఈ ద్వీపములో మర్యాదా గిరులు (హద్దులు) ఉన్నాయి. గుండ్రముగా ఉన్న భూమిలో నిలువుగా ఒక గీతా అడ్డముగా ఒక గీతా గీస్తే ఆ మధ్య నుండే దానిలో ఇలావృతమనే వర్షముంది. అది నాభి యందు ఉంది, అక్కడ ఉన్న పర్వతం పేరు మేరువు. అది
బంగారములా మెరుస్తూ ఉంటుంది. అది ముప్పై రెండు వేల యోజనాలు వెడల్పు. మొదలు పదహారు వేలు భూమిలోకి పదహారు వేలు. ఇలా వృతమనేది మధ్యలో ఉంది. దానికి ఉత్తరముగా (అంటే మీదకి) మూడు ఉన్నాయి నీలా శ్వేత శృంగవాన్ అని మూడు కొండలు. అక్కడ రమ్యక హిరణ్మయ కురు అనే మూడు వర్షాలు ఇలావృత వర్షం మీద ఉన్నాయి. దానికి ఈ పక్కా ఆ పక్కా ఉప్పు సముద్రం. అది ఒక్కో దానికంటే రెండవది రెండు
వేల యోజనాల ఎక్కువ ఉంటుంది. ఇంక కిందకు వస్తే నిషధం హేమకూటం హిమాలయం అంటే మూడు పర్వతాలు. మధ్యభాగానికి దక్షిణం వైపు ఉంది. అక్కడ హరి వర్షమూ కింపురుష వర్షమూ భారత వర్షమూ ఉన్నాయి. మొదట ఇలా వృతానికి దగ్గరగా ఉన్నది హరి వర్షం, దానికింద కింపురుష, దాని కింద భారత. ఇలా వృత వర్షానికి పడమట వైపు మాల్యవత్ అనే పర్వతం తూర్పు వైపు గంధమాధనమనే పర్వతం ఉన్నాయి. అక్కడ కేతు మాల భద్రాశ్వమనే వర్షం ఉన్నాయి. ఇవి మొత్తం తొమ్మిది వర్షముల యొక్క సంస్థానం. వీటిలో మందరమూ మేరు మందరమూ సుపార్శ్వమూ కుముదమూ అని మధ్యలో ఉన్న మేరుపర్వతానికి దగ్గరలో దాని అంత ఎత్తుకాకుండా దానికి కాపలాగా అన్నట్లుగా ఈ నాలుగు పర్వతాలూ ఉన్నాయి. తామర మధ్య చుట్టూ ఉన్న రేకులలాగ. ఈ నాలుగు పర్వతాల మీదా నాలుగు చెట్లున్నాయి మామిడీ నేరేడు కదంబ మర్రి చెట్లు. ఈ పర్వతాలు కొన్ని వేల యోజనాల ఎత్తు ఉన్నాయి, ఎన్నో శాఖలు కలిగి ఉన్నాయి, విశాలమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మంచి నీళ్ళ సరస్సు ఒకటి తేనే సరస్సు ఒకటి చెరుకు సరస్సు పాల సరస్సూ ఉన్నాయి. అక్కడ దేవతల ఉద్యానాలు ఉన్నాయి - నందనం చైత్రథం వైభ్రాజకం సర్వతోభద్రమని. అక్కడి దేవతలందరూ వారి వారి భార్యలతో కలిసి వచ్చి విహరిస్తూ ఉంటారు.

ఈ మందర పర్వతం మీద కొండంత మామిడి పళ్ళు పండుతాయి. అవి రాలి కిందపడి వాటి రసం పారుతూ ఉంటుంది. అదే అరుణోదా అనే నది మందర గిరి శిఖరం నుండి ఇలావృత వర్షమునకు వస్తుంది ఆ నది. దానిని చుట్టుపక్కలా ఉండే యక్షులు అనుభ్వైస్తూ ఉంటారు. మరొక పర్వతం (దక్షిణ భాగం మీద ఉన్న కొండమీద) జంబూ అనే నేరేడు చెట్టు చాలా ఎత్తుగా ఉండి ఏనుగంత నేరేడు పళ్ళు కిందపడి వాటి రసం పారి, మేరు మందర శిఖరం కంటే ఎత్తైన దానినుండి ఇలావృతానికి దక్షిణముగా పారుతోంది. ఈ రెండు వైపులా ఉన్న మట్టి ఈ నేరేడు పళ్ళు రసములు తగలడం వలన బంగారములా మెరుస్తూ ఉంటుంది. మెరవడం చేతనూ ఆ మట్టి చేతనే బంగారం రావడం చేతనూ దానికి జాంబూనదం అని పేరు పెట్టారు. ఆ జంబూ నది ఒడ్డులో బంగారం పండుతుంది.

మహా కదంబనే మర్రి చేట్టు సుపార్శ్వమనే పర్వతం మీద ఉంది, దానిలోంచి ఐదు మంచి మధు ధారలు ప్రవహిస్తూ ఉండి ఇలా వృతాన్ని సుగంధబరితము చేస్తూ ఉంటాయి. కుముదమునండు శత్వల్మమని ఒక మర్రి చేట్టు ఉంది. దాని నుంచి కిందకి, ఇలావృతానికి ఉత్తరముగా ఒక నది పారుతూ ఉంటుంది. ఇలా మేరువూ, నాలుగు పర్వతాలూ, నాలుగు పర్వతాల మీద నాలుగు చెట్లూ, వాటి నుంచి వచ్చిన నాలుగు నదులు.
ఈ మేరువుకు తూర్పు వైపున జఠరమూ దేవకూపమనే రెండు పర్వతాలున్నాయి. అవి పద్దెనిమిద్వేల యోజనాలు దూరముగా ఉండి ఎత్తుగా ఉంటాయి, మేరువు పర్వతానికి తూర్పు వైపున పవనా పారివాత్రమని రెండు పర్వతాలున్నాయి. ఇలా చుట్టూ ఎనిమిది.
 మొదట నాలుగు కొండలూ, తరువాత ఒక్కో దానికీ రెండేసి కొండలూ. ఇది మొత్తం రేకులు గల పూవులా ఉంటుంది.
మేరు పర్వత శిఖరం మీద బ్రహంగారి పట్టణముంది. ఆ పట్టణం కొన్ని వేల యోజనాల పొడవు, సమ చతురస్రముగా ఉంటుంది. దానికి చుట్టూ లోకపాలకు ఎనమండుగురూ పట్టణాలలో ఉన్నారు. శ్రీమహావిష్ణువు వామనుడుగా వచ్చి కొలిచినప్పుడు, ఆయన ఎడమపాదం పైకి చాస్తే ఆయన బొటన వేలు పైకి వెళ్ళి ఆ మీద భాగానికి తగిలితే, అది చిట్లితే దానిలో ఉన్న జలం లోపలికి వస్తే, ఆ జలం ఆకాశం మీద నుండి కిందకి పడ్డాయి గనుక, ఆ వచ్చిన నదికి విష్ణు పది అని పేరు, ఆకాశానికి విష్ణు పాదం అని పేరు.
అక్కడే మన వంశమునకు మూల పురుషుడైన ద్రువుడు భక్తియోగముతో చాలా కాలం ఎప్పుడు  పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకే చివరలను ద్రువాలంటారు (ఉత్తరద్రువం దక్షిణ ద్రువం), మీదకు మేరువని పేరు.ద్రువుని కింద సప్తర్షులుంటారు. ఆ సప్తర్షులు ఆయనను సేవిస్తూ జటాజూటములతో మోక్షమునందు ఇచ్చ కలవారి ఉంటారు. అనేక సహస్ర కోటి విమానాలతో దేవతలు చంద్రమండలాన్ని ఆవరించి బ్రహ్మలోకములో ఉంటారు. ఆకాశములోంచి వచ్చిన ఈ నది నాలుగు రకముల నీరు నిండగా, సీతా, అలకనందా, చక్షు, భద్రా అని నాలుగు నదులుగా పారింది. సీత అనే నది బ్రహ్మలోకం నుండి కేసరాచలమ  అనే బంగారు శిఖరం నుండి, కిందకి పారుతూ గంధమాధనమనే పర్వత శిఖరం మీద పడి భద్రాశ్వమనే తూర్పు నుంచి ఉప్పు సముద్రములో కలుస్తుంది. అలాగే మాల్యవత్ అనే పర్వత శిఖరం మీద నుండి పడి, ఏమాత్రం వేగం తగ్గకుండా,
వడిగా, కేతుమాలమనే వర్షానికి, చక్షు అనే రెండవ నది పడమటి దిక్కుగా ప్రవహించి సముద్రములో కలుస్తుంది. భద్రా అనే నది మేరు శిఖరం నుండి కిందకు పడి ఉత్తర శిఖరమునుండి పడి కురుదేశమును ఆక్రమించి సముద్రములో కలుస్తుంది.
అలకనందా అనే నది, ఈ మేరువు యొక్క పైభాగం (దక్షిణం) వైపు వచ్చి బ్రహ్మ సదనం అనే బదరికాశ్రమం కొండలన్నీ దాటి హిమాలయ శిఖరం నుంచి భారత వర్షమునకు వచ్చి దక్షిణం వైపు సముద్రములో కలుస్తోంది.
ఎన్నో నదులూ నదములూ ఉన్నాయి గానీ మిగిలిన క్షేత్రములేవీ కర్మ క్షేత్రములు కావు. అక్కడ భగవంతుని ఆరాధించడానికి యజ్ఞ్యము లాంటి ఉండవు. భారత దేశం మాత్రం కర్మ క్షేత్రం. మిగిలినవి భోగ భూములు.
మనుష్యులకు వయస్సు చాలా ఎక్కువ ఉండేది. త్రేతా యుగములో సమానమైన కాలం జరుగుతూ ఉండేది. ఈ తొమ్మిది వర్షాలలో కూడా శ్రీమన్నారాయణుడు అధిదైవముగా ఉంటాడు. ఇలావృతమనే వర్షములో పరమ శివుడు దేవత. ఆయన ఒక్కడే అక్కడ మగవాడు.
అక్కడ ఎవరు వెళ్ళిన పార్వతి శాపం వలన ఆడవారిగా మారుతారు. అక్కడ భవాని(పార్వతి) పరిపాలకురాలు. అక్కడ తామస మూర్తి అయిన సంకర్షణ మూర్తి  ఉంటాడు. తన శక్తితో దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలావృత వర్షమువారు ఆయనను కీరిస్తారు.
"ప్రళయమునకు అధిష్ఠాన దేవత అయిన ఆదిశేషుడు, రుద్రుడు. తనను సేవించిన వారి శరణు ఇచ్చే పాదపదములు కలవాడు, సంసారములో ఉన్న వారికి మోక్షం ఇచ్చేవాడు. సమస్తలోకముల పుట్టుకా నిలకడా అంతమూ చేసే వాడు, తనకు అవి లేని వాడు ఆయన. "భద్రాశ్వ వర్షము పడమటి వైపు ఉంది, అక్కడ హయగ్రీవ మూర్తి అధిదైవత. "ఓం నమో భగవతే ధర్మాయాత్మవిశోధనాయ నమ ఇతి" అని ధ్యానం చేస్తారు. ఏమి ఆశ్చర్య కరమైనవి ఆయన చేష్టలు. ఆయనే సృష్టిస్తాడూ దహిస్తాడు.
హరి వర్షములో నరహరి ఉంటాడు. ఇక్కడ మహాభాగవతుడైన ప్రహ్లాదుడుంటాడు. "ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్ష్రౌమ్"  ఈ మంత్రముతో ఆరాధిస్తూ ఉంటాడు. నరసింహ మూర్తిని ఉపాసన చేసే మంత్రం. లోకానికి మేలు కలుగుగాకా, నీచుల మీద మాకు కోపం రాకుండుగాక, అందరు
ఒకరికి ఒకరు మంచి కలగాలని కోరుకొను గాక, మా మనసు ఎప్పుడు భగవత్ తత్వాన్ని సేవించు గాక. ఇంద్రియములను గోచరం కానీ సర్వత్ర వ్యాపించి ఉన్న భగవంతుని యందు మా మనసు నిలుచు గాక. ఇల్లూ వాకలీ పిల్లలూ డబ్బూ ఇవే బతుకు అన్న స్థితి  రాకుండుగాక. భగవత్ భక్తుల సేవకే ఇవన్నీ ఉపయోగపడాలి. ఎవరికైతే భగవంతుని యందు ప్రీతి కలుగుతుందో అక్కడకు అందరు దేవతలూ వచ్చి అన్ని గుణాలతో వచ్చి
కూర్చుంటారు. ఆ భక్తి లేకపోతే అవేవీ రావు. మంచి గుణములు కావాలంటే "లోపలకు" వెళ్ళాలి. శరీరమున్న మనందరకూ లోపల వ్యాపించి ఆ భగవానుడు ఉన్నాడు. చేపకు నీరు ఎంత అవసరమో మనకు భగవంతుడు అంత అవసరం. ఆయనను విడిచిఎట్టేసి, ఇల్లూ, భార్యా అని అంటున్నాము. గొప్పతనం కలవారి యందు (భగవానుని యందు) మనసు లగ్నం కాలేదు. దాని వలన గొప్పతనం రాదు, ముసలితనం వస్తుంది. మనసు దాని మీద ఉంచకు.
ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం దుఃఖం పగా అహంకారం అన్నీ కావాలనిపించడం, భయం, యాచించడం, మనో బాధలూ, వీటన్నిటికీ ఇల్లు భార్య మీద మనసు పెట్టుకోవడం కారణం. ఇది పోవాలంటే ఆ నృసింహావతారాన్ని సేవించాలి.
కేతుమాలములో భగవానుడు ప్రద్యుమ్నుడుగా ఉంటాడు. కాముడంటే మన్మధుడు, ఆయనే ప్రద్యుమ్నుడు. ఆ వర్షములో ఉండేవారికి ఆనందం కలిగిస్తూ ఉంటాడు. గర్భములో ఉండే పిల్లలు సంవత్స్రం ఉంటారు అక్కడ. అక్కడ భగవంతుని మాయా మయమైన రూపాన్ని లక్ష్మీ దేవి రాత్రి వేల కుమార్తెలతో పగటి వేల భర్తలఓ కలిసి సేవిస్తూ ఉంటుంది.
"ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ
సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం
చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ
సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్"
ఓం అనగా నేను భగవానునికే చెందిన వాడను. ఇతరుల కొరకు కాదు. మాలో ఉండే ఇంద్రియాలను ప్రేరణ చేసేవాడివి. సర్వ గుణాలతో కూడిన సమస్త పదార్థాలతో గుర్తింపబడే రూపం కలవాడివి నీవు. అకూతి (చేసే పనులు) చిత్తీ (జ్ఞ్యానం) చేతస్సు (సంకల్పం అధ్యవసాయం) విశేషాణాం (భూమి) వీటికి నీవే ఆధారం నీవే. షోడశకలాయ - జ్ఞ్యాన కర్మ పంచభూతాలకు మనసుకూ అధిపతి. సమస్తలోకాలనూ నిలిపేవాడు. మనం తినే అన్నమే మనను తింటుంది. అన్నమయుడు, అమృతమయుడు (ఈలోకములో పరలోకములో భోగం ఇచ్చేవాడు) సహః అంటే మనసులో దార్ధ్యం. ఓజస్సు అంటే ఇంద్రియ బలం. బలమంటే శరీర బలం. కాంతాయ - చూస్తే ప్రేమించాలనిపిస్తుంది. కామాయ - ప్రీతి కలుగుతోందంటే ఆయన ఉండబట్టి కలుగుతోంది. భర్తగా ఆయనను పొందాలని, మిగతావారిని సేవించరు. లోపల ఉన్న వాడొక్కడే భర్త. ఎవ్వరి వలనా ఎప్పుడూ భయం పొందని వాడు భర్త. ఎక్కడ భయం ఉన్నా భయం లేకుండా కాపాడతాడు.  అటువంటి నీవు మాకు కూడా భక్తుల శిరసు మీద ఉంచిన హస్తముంచి కాపాడు
రమ్యక వర్షములో మత్స్య మూర్తిని ఆరాధిస్తాడు. "ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్త్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి" అని ఆరాధిస్తారు. హిరణ్మయ ద్వీపములో స్వామి తాబేలు రూపములో ఉంటాడు. అర్యముడు (పితృగణాధిపతి) సేవిస్తాడు. సంసారమును దాటించేవాడు. అనేక గుణములు గలవాడు. సముద్రములో మందర పర్వతం అడుగున ఉన్నాడు గానీ ఎవరికీ కనపడడు. మన శరీరములో శరీరం అడుగున, నాభికి అడుగున, కూర్మాకార నాడీ మండలములో భగవంతుడు ఉంటారు. అందుకే దేవాలయములో తాబేలు ఉంటుంది. ఏ రూపమూ లేని వాడు.
కురు వర్షము ఉత్తర దేశములో వరాహ స్వామి ఉంటాడు. ఆయనను భూదేవి సేవిస్తూ ఉంటుంది. "ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్త్వగుణవిశేషణాయానుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమోऽవస్థానాయ నమస్తే". ఆయన శరీరమంతా యజ్ఞ్యమే. అగ్ని కర్రలలో దాగి ఉంటుంది. అలాగే నీవు కూడా మాలో ఉన్నావు. కర్రలోంచి అగ్ని తీసినట్లుగా మనస్సనే కవ్వముతో మధిస్తే వెలిక్కి వస్తావు.  మనం చేసే సర్వ వ్యాపారాలను ఆయనకు అర్పిస్తే ఆయన వెలికి వస్తాడు. సముద్రములో మునిగి ఉన్న నన్ను విలాసముగా నీ కోర చివరపై ఉంచి వెలికి  తీసావు.
కింపురుష వర్షములో రామచంద్రుడు అధి దైవం. లక్ష్మణాగ్రజుడైన సీతారామున్ని పాదముల దగ్గర హనుమ నిలుబడి ఉండగా కింపురుషులు సేవిస్తారు. ఉత్తమ నడువడి కలవాడు, పెద్దలు చెప్పిన ప్రకారముగా శాస్త్రము చెప్పిన ప్రకారముగా నడిచే మనస్తత్వం కలవాడు, రాజ్యాన్ని ఉపాసించిన వాడు (ఆయన రాజ్యాన్ని ఆరాధించాడు), లోకములో మంచితనానికి గీటురాయి, వేదమే శరణ్యమని నమ్మే వారికి దేవుడు, పురుషులలో మహాపురుషుడు, రాజులలో మహారాజు, ఆయన రాజాధిరాజు. కేవల సత్వ రజస్ తమో గుణాలకు అతీతమైన, ఊర్ములు లేని, క్లేశములు లేని వానినీ, అహంకారం లేని స్వామిని, మర్త్య రూపములో దిగి వచ్చిన స్వామి, జగత్ ప్రభువైన నీవు సీతమ్మ కోసం బాధపడ్డావు. నీ జన్మ నిజము కాదు. మా మాటలకందేది కాదు. ఎవరూ నిన్ను తెలుసుకోలేడు. అందరినీ నీవు వైకుంఠానికి తీసుకుని వెళ్ళావు. చిన్న గడ్డీ చీమా కూడా పరంపదానికి వెళ్ళావు.
భారత వర్షములో నర నారాయణులు ప్రధానం. అందుకే నారాయణ నారాయణ అంటూ ఉంటాము. భార్త దేశములో ఉండే దైవం నర నారాయణులు. స్వామి బదరికాశ్రమములో తపస్సు చేస్తున్నాడు. నారదుల వారు నర నారాయణున్ని సేవిస్తూ ఉంటారు. సాంఖ్య యోగముతో సేవిస్తూ ఉంటారు. ఉపశం లీలాయ - కోరికలన్నీ ఉపశమిస్తాయి. సన్యసించిన వారు అస్తమానం నారాయణా అంటూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఉవ్వెత్తున లేచే కోరికలు తగ్గుతాయి. దిక్కులేని వారికి దిక్కు ఆయన. డబ్బులేని వారికి డబ్బు ఆయన. అకించన విత్తం. ఉపాయం లేని వారికి నారయణ మంత్రమే ఉపాయం. సమస్తమైన నిత్య పదార్థములలోపల ఉండువాడు, వాటిని ఆధారముగా చేసుకుని ఉండేవాడు. లోపలా వెలుపలా వ్యాపించి ఉంటాడు. సన్యాసులకు గురువు ఆయన. ఆత్మారాములకు అధిపతి. ఈ లోకములో పైలోకములో వస్తువుల మీద కోరికతో ఉండి వాటి గురించి ఆలోచిస్తూ ఉండి, "ఎప్పుడు చచ్చిపోతామో" అన్న భయముతో కష్టపడుతూ ఉంటాము. అన్నిటిలో ఉన్న నారాయణున్ని తెలుసుకోకుంటే శ్రమంతా వ్యర్థం కదా. నీ అనుగ్రహం చేత ఇంతకాలం మాలో ఉన్న అహంకారం చేదించబడు గాక.
భారత వర్షములో అనేక నదులూ పర్వతాలూ ఉన్నాయి. మలయమూ గంధమాధనం త్రికూటము మైనాకం శ్రీశైలమూ వేంకటాచలమూ గోవర్ధనమూ, మొదలైన పర్వతాలున్నాయి. ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి గోదావరీ నర్మదా కృష్ణా, త్రిసామ సరస్వతి చంద్రభాగ మొదలైన ఎన్నో నదులు ఉన్నాయి. ఈ భారత వర్షములో ఎవరు జన్మిస్తారో వారు అదృష్టవంతులు. అన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు నారాయణుడని తెలుసుకున్నవారు వారిలో ఉన్న అవిద్యా గ్రంధిని చేదిస్తారు. భారత దేశములో పుట్టిన వారెంత అదృష్టవంతులు. ఎక్కడకు వెళ్ళినా భగవంతుడు జ్ఞ్యాపకం వస్తారో. శ్రమపడే క్రతువులూ నోములూ దానాలు అక్కర్లేదు. నారాయణ పాద పంకజ ధ్యానం చాలు. కల్ప కాలం బతికి ఎన్నో ఉత్తమమైన స్థానాలు పొందిన వారు కన్నా క్షణ కాలం ఆయుష్షు ఉన్నా భారత భూమిలో పుట్టాలి. ఒక్కసారి "నాదేమి కాదు తండ్రీ" అని తరించగలం. ఎక్కడ శ్రీమన్నారాయణుని కథా ప్రసంగం ఉండదో, ఎక్కడ భగవత్ భక్తులు ఉండరో, ఎక్కడ నారాయణున్ని ఆరాధించే యజ్ఞ్యములు చేయరో, అది ఆదరించే స్థలం కాదు. ఎవరైతే అన్నీ నారాయణునికి అన్నీ అర్పిస్తారో వారికి మరలా జనం ఉండదు. కోరితే ఇచ్చే వాడైన నారాయణుడు, మళ్ళీ మనం ఎవరినీ యాచించనవసరం లేకుండా చేస్తాడు. మళ్ళీ మనం యాచకులం కాకుండా చేస్తాడు. కోరికలు పుట్టే మనసులో కోరికల ఊట ఊరకుండా ఉండటానికి ఆయన తన వేలితో అడ్డు వేస్తాడు. అటువంటిది మన భారతదేశము. అందులో జన్మ కలిగి మేము స్వామిని సేవించగాక.

ఈ జంబూ ద్వీపం ఎంత వెడల్పూ పొడువూ ఉన్నదో అంత వెడల్పూ పొడవూ గల ఉప్పు సముద్రం ఉన్నది. మేరూ పర్వతం మధ్యలో ఉంది, దాని చుట్టు జంబూ ద్వీపమనే ప్రదేశం, దాని చుట్టూ ఉప్పు సముద్రం. ఆ ఉప్పుసముద్రం ఎంత ఉన్నదో అంత పొడుగూ అంత వెడల్పూ గల ప్లక్ష్య ద్వీపం ఉంది. దీనికి అది అగడ్తలా ఉంది. సముద్రమునకు అవతల ప్లక్ష్య ద్వీపం. ప్లక్ష్య ద్వీపం బంగారు కాంతితో ఉంటుంది. అక్కడ అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియవ్రతుని కుమారుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు ఏడుగురు కుమారుడు. వారికి ఏడు పేర్లు కల వర్షాలని ఇచ్చేశాడు. జంబూ ద్వీపము లాగే అక్కడా పర్వతాలూ నదులూ ఉన్నాయి. అక్కడ కూడా నాలుగు వర్ణాలు ఉంటాయి. ఇక్కడ ప్లక్ష్యమనే చెట్టు ఎక్కువ.

ప్లక్ష్యం తరువాత చెరుకు సముద్రం. దాని తరువాత శాల్మల ద్వీపం. శాల్మలీ (బూరుగు) అని ఒక చెట్టు ఉంది. అక్కడా ఏడు ద్వీపాలూ, నదులూ పర్వతాలూ ఉన్నాయి.
ఇది దాటాక్ కలూతో చేసిన సముద్ర. తరువాత నేతితో నిండిన సముద్రం. దాని తరువాత కుశ ద్వీపం. ఇక్కడ దర్బలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రియవ్రతుని ఒక కుమారుడు తన ఏడుగురు కుమారులకూ ఏడు ద్వీపాలుగా ఇచ్చాడు.
దీనికవతల క్రౌంచ ద్వీపం, దానికవతల పాల సముద్రం. అక్కడ వరుణున్ని ఆరాధిస్తారు. అక్కడ కూడా ప్రియవ్రతుని  ఒక కుమారుడు, తన ఏడుగురు కుమారులకూ ఇచ్చాడు. పాల సముద్రానికి అవతల శాఖ సముద్రం ఉంది. తరువాత పెరుగు మీద ఉండే తేట లాంటి సముద్రం. ఇక్కడ శాఖమనే కూర పెరుగుతుంది, కాబట్టి దానికి శాఖమని పేరు.
తరువాత పెరుగు మీద నిండిన తేటతో సముద్రం. తరువాత పుష్కర సముద్రం. తరువాత మంచినీటి సముద్రం. అక్కడ మానసోత్తర పర్వతం ఉంది. దాని తరువాత ఏముందో ఎవరికీ తెలియదు. నాలుగు దిక్కులా నాలుగు పట్టణాలున్నాయి. ఇంద్రుడు వరుణునికి కుబేరునికి యమునికి. పర్వతాక్నికి చివర సూర్యుని రథం తిరుగుతూ ఉంటుంది.
మేరువూ మానస పర్వతం, రెండూ చక్రం తిరగడానికి ఇరుసులాగ పని చేస్తాయి. దాని మీద సూర్యుడు తిరుగుతాడు. సూర్యుని కదలిక మీద మనకు రాత్రీ పగలూ ఉంటుంది. ఆ వర్షములో ఉండేవారు కేవలం బ్రహ్మ రూపి అయిన స్వామిని కర్మలతో ఆరాధిస్తూ ఉంటారు. మనలోపల ఉన్న భగవంతుని పని చేసి మనం ఆయనను సేవించాలి.
లోకాలోకమని ఒక కొండ. ఇవతలి వైపు వెలుగూ, అవతల వైపు చీకటి ఉంటుంది. దానికి అవతల హద్దు మేరువు, ఇవతల హద్దు మానసోత్తర పర్వతం. ఇక్కడునుంచి అక్కడి దాకా ఉన్నదే మనకు తెలిసిన భూమి. దీని తరువాత బంగారు రంగుతో కాంచన భూమి, దాని పైన అద్దములా ప్రకాశిస్తూ ఉండేది ఒకటి ఉంటుంది. అక్కడ పడినదేదీ కనపడదు, పడిన వస్తువు వెనక్కు రాదు. మేరువు నుంచీ మానసోత్తరం వరకూ ఉన్న భూమి కోటీ యాభై ఏడున్నర లక్షల యోజనాలు. ఎనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల జాగా ఉంది. ఆపైన అద్దములా మెరిసేది కూడా అంతే వైశాల్యం గలది. ఈ మూడింటికీ అవతలకు వెళితే అక్కడ జ్యోతిర్మండలాలు ఉంటాయి. మెరిసే గ్రహాలు.

అక్కడ లోకాలను కాపాడే ఇంద్ర వరుణ యమ కుబేరులు ఉన్నారు. భగవానుడు తన యోగ మాయతో వీటిని సృష్టించి తన పరివారముతో కాపాడుతున్నాడు. ఈ విధముగా గుండ్రముగా ఉండే ఈ వలయములో తొమ్మిది వర్షములూ, వీటిలో ద్వీపములతో సముద్రాలతో కూడి ఉన్నది, మొత్తం యాభై కోట్ల యోజనాలు. దీని నంతటినీ అండమంటారు. ఇరవై ఐదు కోట్ల యోజనాలొక పక్కా, ఇరవై ఐదు కోట్ల యోజనాలొక పక్కా ఉంటాయి. దీనిని అండమంటారు. సూర్యుడు దీని మధ్యన  ఉంటాడు. ఈ చివరా ఆచివరా ఉందేవి ద్రువాలు. మేరువూ మనసోత్తరములూ. ఈ రెంటి ఇరుసు మీదా తిరుగుతూ ఉంటుంది. యాభైకోట్లలో ఈ పక్క ఇరవై ఐదూఉ ఈ పక్క ఇరవై ఐదు కోట్లు వస్తుంది.

దీనికి పైనున్నవి స్వర్గమూ మోక్షములూ. కింద ఉండేవి పాతాళాది లోకాలు. సర్వ జీవులకూ సూర్యుడే ఆత్మ.

అంతరిక్షము యొక్క సంక్షేప వర్ణనం

అంతరిక్షము యొక్క సంక్షేప వర్ణనం

భూమికి పైనా కిందా ఉండే లోకాల మధ్య ఉన్నదానిని అంతరిక్షం అంటారు. భూః భువః సువః లోకాలని ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు తిరుగుతూ ఉండడములోనే ఉత్తరాయాణ దక్షిణం విశువత్ (రాత్రి పగల్లు సమానముగా ఉండటం). చుట్టూ ఉండే వాటిని పన్నెండు భాగాలుగా విడదీసి పన్నెండు రాశులుగా చేసి. మేషములో సూర్యుడు ప్రవేశించి మకరములోకి రావడానికి మధ్యలో తులలోకి వస్తాడు. అలా తులలోకి వచ్చినపుడు రాత్రి పగల్లు సమానముగా ఉంటాడు. మేషమునుంచి సూర్యుడు మిథునము ... కన్యా రాశిలోకి వచ్చేసరికి రాత్రి తరుగుతుంది. తులనుంచి వృశ్చుకములో ప్రవేశించేసరికి దక్షిణాయనం, రాత్రి ఎక్కువ ఉంటుంది.
మానసోత్తరపర్వతము తూర్పు వైపు ఇంద్రుని పట్టణం రాజధాని, దక్షిణం వైపు యముడు, ఉత్తరం వైపు కుబేరుడు పడమర వైపు వరుణుడు. సూర్య ప్రవృత్తి బట్టి ఉదయం మధ్యాన్నం రాత్రీ అంటున్నము. ఎక్కడ బయటకు సూర్యుడు కనిపిస్తాడో, అక్కడ ఒక తాడు పెట్టి కొలిస్తే, అవతలి వైపు ఉండే చోట సూర్యుడు అస్తమిస్తాడు. ఏక రేఖ మీద ఉదయాస్తమాలు జరుగుతాయి. పదిహేను ఘడియలకొక ఝాము. పడమటికి వెళ్ళినపుడు సూర్యుడు కనపడకుండా పోతాడు. ఈ చుట్టూ ఉన్న గ్రహమండలం ముప్పైనాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు తిరుగుతుంది.
ఈ సూర్యుని రథమే కాల చక్రం, ఏడు గుఱ్ఱాలు. దానికి పన్నెండు అరలు (రేకులు) ఉన్నాయి. పన్నెండు మాసాలు. ఆరు నేములున్నాయి. ఆరు ఋతువులు. మూడు నాభులు (వేసవి వర్ష శీతా కాలాలు) సూర్యుడు నడిచే యంత్రము ఎప్పుడూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు నడుస్తూ ఉంటే అరుణుడు (అందుకే సూర్యుడు ఉదయించినా అస్తమించినా ఎర్రదనం వస్తుంది) వాలఖిల్యులు సూర్య సూక్తాన్ని చదువుతూ ఉంటారు. దేవతలూ యక్షులూ నాగులూ గుంపులుగా ఉండి సూర్యుని ఉపాసన చేస్తూ ఉంటారు. సూర్యునికి మేరువూ ద్రువునికీ ప్రదక్షిణం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. రాశులు వాటికి వ్యతిరేక దిశలో అప్రదక్షిణముగా తిరుగుతూ ఉంటాయి. కుడి నుంచి ఎడమకొస్తాయి.
చక్రముతోబాటే అక్కడ ఉన్న గ్రహములు తిరుగుతూ ఉంటాయి. కుమ్మరి కుండ మీద ఈగ వాలితే కుండతో బాటు తిరుగుతూ ఉంటాయి.
పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రములో ఉంటే చైత్రం. విశాఖ నక్షత్రములో పూర్ణిమనాడు ఉంటే- వైశాఖ, జ్యేష్ట - జ్యేష్ఠా, ఉత్తరా/పూర్వాషాడ నక్షత్రం - ఆషాడ మాసం, ఉత్తరా/పూర్వా భాద్ర - భాద్రపద మాసం, అశ్వినీ నక్షత్రములో పూర్ణిమ నాడు ఉంటే- ఆశ్వియుజ మాసం, కృతిక నక్షత్రములో పూర్ణిమనాడు ఉంటే - కార్తీక మాసం, మృగశీర్ష - మార్గశీర్ష, పుష్య - పుష్య, మఖ - మాఘ, ఫాల్గుణీ నక్షత్రం - పాల్గుణ మాసం.
ఒక సారి ఈ చక్రమంతా తిరిగ్తే ఒక సంవత్సరం. చద్రుని చుట్టూ తిరిగితే పరివత్సరం, బృహస్పతి చుట్టూ తిరిగ్తే ఇడావత్సరం, నక్షత్రాల చుట్టూ తిరిగితే - విద్వత్సరం.
చంద్రుడు సూర్యమండలానికి పైన ఉన్నాడు. అది లక్ష యోజనాల పైన ఉన్నది. వెన్నెల నిండిన పక్షములో దేవతలకూ వెన్నెల క్షీణించే పక్షం పితృదేవతలకు ప్రీతి. ముప్పై ముహూర్తాలు ఒక నక్షత్రం తిరుగుతుంది. దేవతలకూ పితృదేవతలకూ మనుష్యులకూ లతలకూ పక్షులకూ అన్నిటికీ పోషణాన్ని అందిస్తాడు.
చంద్రునికి చుట్టూ మూడు లక్షల యోజనాల మేర ఇరవై ఏడు నక్షత్రాలు. అభిజిత్ అనేది ఇర్వై ఎనిమిదవ నక్షత్రం. ఆకడే శుక్రుడూ, బుధుడూ ఉన్నాడు. దాని పైన కుజుడు (అంగారకుడు) బృహస్పతీ శనీ ఇలా అందరూ ఒకరికన్నా ఒకరు రెండు లక్షల యోజనాల దూరములో ఉంటారు.
పదకొండు లక్షల యోజనల పైన భగవానుని పరమపదమున్నదని అంటారు.

మేడీ స్తంభం - పశువులను కట్టే ఒక కర్ర. అలాగే ఈ మండలాలన్నీ ద్రువునికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ జ్యోతిర్మండలాలన్నీ శింశుమారమనే రూపములో ఉంటాయి. దాని తోక దగ్గర ద్రువుడు ఉంటాడు. దాని వెనక ప్రజాపతీ అగ్ని ఇంద్రుడు ధర్మ. కటి యందు సప్తర్షులు. వంగిన శరీరం దగ్గర నక్షత్రాలు.సర్వ గ్రహమండలములూ మృగాకారములో ఉన్నారు. ఇది భగవంతుని సర్వదేవతా మయమైన రూపము. మనకు వెలుగునిచ్చేవాడు ఆధారముగా ఉన్నవాడు సూర్యభగవానుడు. ఆయనకు నమస్కార్మ్ చేస్తే ఆయనలో ఉన్న నారాయణునికి నమస్కారం చేసినట్లు.

రాహువూ కేతువూ సూర్యమండలం కిందన ఉంటాడు. సూర్యుని కాంతి వ్యాపిస్తున్న తరువాత రాహువు ఉంటాడు. సూర్య చంద్ర మండలానికి కిందన రాహువు ఉంటాడు. కాని అక్కడ స్వామి చక్రం ఉండటం వలన ఎక్కువ సేపు ఉండలేడు.  ఈ వరుసలో నక్షత్ర - గ్రహ - చంద్ర - సూర్య - సిద్ధ చారణులు ఉండే లోకాలు - యక్ష రాక్షస పిశాచాలు ఉండేవి - భూమి.
అలాగే కింద ఏడు లోకాలున్నాయి. స్వర్గాది విహారాలు అనుభవించిన తరువాత మాయ చేత ఆవరించబడిన వారు భూమి కిందలోకాలలో వస్తారు. అక్కడ ఇంద్రియాలకు ఆనందం కలిగించే సన్నివేశాలూ, చెట్లూ, నదులూ ఉంటాయి.కంటికీ మనసుకీ ఉత్సవం కలిగించే కాంతులు.
అక్కడ ఒక పాము ఉంటుంది. అంతా చీకటిగా ఉన్నా, పాముల తల మీద మణుల వలన అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ దివ్య ఔషధులూ రసాయనాలు ఉంటాయి. అక్కడ రోగాలూ ముసలితనం చెమటా ఏమీ ఉండవు.
వారికి చావు అనేది ఎప్పుడొస్తుందో తెలియదు. భగవానుని చక్రం మాత్రమే వారిని వధిస్తుంది. అక్కడ వారికి భయం వలనే పురుడు వస్తుంది. అతలం అనేది మీద లోకం. అక్కడ మయుడి కొడుకు బలుడు ఉంటాడు. అతడు మాయను సృష్టించాడు. ఇంద్రజాలాలు అవి ఇక్కడనుంచి వచ్చినవే. ఒకసారి అతను ఆవలిస్తే మూడు రకాలైన అందమైన ఆడవారు వచ్చారు. వారు ముగ్గురే లోకములో విచ్చలవిడిగా తిరిగి, మగవారికంటే ఎక్కువగా తిరిగి, ఎవరిని పడితే వారిని ప్రేమించేవారు కొందరూ, తమ భర్తను విడిచి మిగతావారితో తిర్గేవారు కొందరు. ఈ మూడు జాతులూ పుట్టాయి. స్వైణ్యః కామిన్యః పుంశ్చల్యః అని. వారు ఆలోకములో బంగారం అంటే మోజు. వారు బంగారముతో పురుషులను లోభపెట్టి, వారిని గాఢాలింగనం చేసుకుని ఆనందింపచేస్తూ ఉంటారు. పురుషులు వారిని ఆనందింపచేసి మధాందుడై గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.
దాని కింద వితల లోకములో హాఠకేశ్వరుడు శివుడు ఉంటాడు. భూత గణాలతో పార్వతీ దేవితో ఉంటాడు. హాటకీ నది అక్కడ ఉంటుంది. అక్కడ చిత్రభానువు (అగ్ని) వాయువుతో కలిసి అక్కడ జలాన్ని పానం చేస్తూ ఉండటం వలన అది బంగారం అవుతూ ఉంటుంది.
దానికింద సుతలం అనే లోకం. అక్కడ విలోచనుని కుమారుడు బలి పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ద్వారం దగ్గర భగవానుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆ బలి చక్రవర్తి భగవంతుని యందు మనసు నిలిపి భగవంతుని నామం చెప్పుకుంటూ పాపం పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇది సుతల లోకం. ఇలా ఆయన దాస్యం కావాలనే ప్రహ్లాదుడు కోరుకున్నాడు.
తరువాత తలాతల లోకములో మయుడనే రాక్షసుడు, త్రిపురాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం చేత అక్కడ ఉండేవారికి మహాసుఖాలు లభిస్తాయి
మహాతలములో ఒక శిరస్సూ అనేక శిరస్సులూ కల పాములుంటాయి. దాని అడుగున రసాతలం ఉంటుంది. అక్కడి వారు భగవంతుని ప్రేమించిన వారిని ద్వేషిస్తారు. దాని కింద పాతాళం ఉంది. అక్కడ నాగాధిపతులు ఉంటారు.
అట్టడుగున మూల దేశములో ముప్పై వేల యోజనాల దూరములో సంకర్షణుడు వేయిపడగలు కలిగి ఉంటాడు. ప్రళయం వచ్చినపుడు ఆయన పదకొండు రుద్రులను బయటకు పంపిస్తాడు. అక్కడ ఉండే నాగములన్నీ స్వామి అనంతుని పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఆయనను సేవిస్తూ ఉంటారు. లోకాలను మోస్తూ కాపాడుతూ ప్రళయములో ఉపశమిస్తూ ఉంటారు. నారదుడు ఈయనను స్తోత్రం చేస్తూ ఉంటారు.
భూః భువః సువః లోకాల మధ్యనే ఉంటాయి నరకాలు. భూమి కిందన ఉంటాయి. పితృ దేవతలకు అధిపతి యముడు ఉంటాడు. ఆయన తన లోకానికి వచ్చిన వారిని వారి వారి దోషాలకు తగిన శిక్షను అనుభవింపచేస్తూ ఉంటాడు.