Friday, March 8, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఇతి సన్దిశ్య భగవాన్బార్హిషదైరభిపూజితః
పశ్యతాం రాజపుత్రాణాం తత్రైవాన్తర్దధే హరః

శంకరుడు ప్రాచేతసులచే పూజించబడి వారందరూ చూస్తుండగా అంతర్థానమయ్యాడు

రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః
జపన్తస్తే తపస్తేపుర్వర్షాణామయుతం జలే

పరమాత్మ యొక్క స్తోత్రమైన రుద్రగీతను ప్రచేతసులందరూ కూడా జపం చేస్తూ పదివేల సంవత్సరాలు సరస్సులో తపస్సు చేసారు

ప్రాచీనబర్హిషం క్షత్తః కర్మస్వాసక్తమానసమ్
నారదోऽధ్యాత్మతత్త్వజ్ఞః కృపాలుః ప్రత్యబోధయత్

పూర్తిగా కర్మల యందే మనసు లగ్నము చేసిన ప్రాచీన బర్హి దగ్గరకు కృపాళువైన నారదుడు వచ్చాడు. జ్ఞ్యానానికి వైరాగ్యానికీ పనికి రాని కర్మ కర్మ కాదు. ధర్మమాచరిస్తున్నట్లు ఉంటుంది అది భగవదారాధనా రూపము కాదు. నారదుడు ఆధ్యాత్మ తత్వాన్ని బాగా తెలిసినవాడు. ఆయన ప్రాచీన బర్హి వద్దకు బోధించడానికి వచ్చాడు.

శ్రేయస్త్వం కతమద్రాజన్కర్మణాత్మన ఈహసే
దుఃఖహానిః సుఖావాప్తిః శ్రేయస్తన్నేహ చేష్యతే

మహారాజా! నీవాచరించే కర్మతో నీకెలాంటి శ్రేయస్సు కావాలనుకుంటున్నావు. దుఃఖనివృత్తికీ సుఖము కలగడానికీ ఐతే నీవు చేసే యజ్ఞ్య యాగాదుల వలన అది రాదు.

రాజోవాచ
న జానామి మహాభాగ పరం కర్మాపవిద్ధధీః
బ్రూహి మే విమలం జ్ఞానం యేన ముచ్యేయ కర్మభిః

కర్మలాచరించడం వినా వేరే ఉపాయం నాకు తెలియదు. పరిశుద్ధమైన జ్ఞ్యానాన్ని మాకు ఉపదేశించండి. ఆ జ్ఞ్యానముతో నేను కర్మ విముక్తున్ని కావాలి.

గృహేషు కూటధర్మేషు పుత్రదారధనార్థధీః
న పరం విన్దతే మూఢో భ్రామ్యన్సంసారవర్త్మసు

కపట ధర్మాలతో కూడి ఉన్న గృహములలో మేమందరమూ ఉన్నాము. గృహస్థుడు ఏ ఫలమూ లేకుండా కర్మలు చేయడు. అథితులను గౌరవించినా దానాలు చేసినా అధ్యయన అధ్యాపన యజనాది కర్మలూ ఫలితాన్ని ఆశించే చేస్తాడు. గృహస్థ ధర్మము కేవలం పుత్రులూ భార్యా ధనము యందే పురుషార్థము కలిగి ఉంటుంది. మూఢులై పరతత్వాన్ని తెలియజాలడు. సంసార మార్గములో మాటిమాటికీ తిరుగుతూ ఉంటాడు.

నారద ఉవాచ
భో భోః ప్రజాపతే రాజన్పశూన్పశ్య త్వయాధ్వరే
సంజ్ఞాపితాఞ్జీవసఙ్ఘాన్నిర్ఘృణేన సహస్రశః

ఎన్నడైనా నీవు చేస్తోన్న పని గురించి ఆలోచించావా. యజ్ఞ్యముల పేరుతో ప్రాణుల సమూహమును దయ విడిచి సంహరించావు.

ఏతే త్వాం సమ్ప్రతీక్షన్తే స్మరన్తో వైశసం తవ
సమ్పరేతమయఃకూటైశ్ఛిన్దన్త్యుత్థితమన్యవః

నీవు చేసిన హింసను తలచుకుంటూ నీవెప్పుడు వస్తావా అని కోపముతో ఎదురుచూస్తూ ఉంటాయి. ఇన్ని వేల పశువులు చుట్టూ మూగి అవయవాలు లాగేయడానికోసము ఎదురు చూస్తూ ఉంటాయి

అత్ర తే కథయిష్యేऽముమితిహాసం పురాతనమ్
పురఞ్జనస్య చరితం నిబోధ గదతో మమ

ఈ విషయం నీకు అర్థం కావాలంటే ఒక ఇతిహాసాన్ని చెబుతాను. దీన్ని పురంజన ఉపాఖ్యానమంటారు. నేను జాగ్రత్తగా చెబుతాను, నీవు కూడా అంత జాగ్రత్తగానే వినాలి. (పురంజనుడంటే పురమునూ, లేదా ఇల్లును కట్టుకునేవాడు. జీవాత్మకు ఇల్లంటే శరీరము. శరీరము రావడానికవసరమైన కర్మలు చేసేవాడు. )
భగవత్తత్వమూ  భగవత్సేవ పరమపదమూ - ఈ మూడూ తెలియకుండా మనం చేసే పనులు మనము అనుకోని ఫలితాన్నిస్తాయి.

ఆసీత్పురఞ్జనో నామ రాజా రాజన్బృహచ్ఛ్రవాః
తస్యావిజ్ఞాతనామాసీత్సఖావిజ్ఞాతచేష్టితః

ఈ పురంజనుడికి పేరు కూడా తెలియని ప్రాణ మిత్రుడున్నాడు. పేరే కాదు, ఆ స్నేహితుడేమి చేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ స్నేహితుడికి మాత్రం ఈ పురంజనుడి గురించి బాగా తెలుసు. తన కర్మలతో తనకు నివాసముగా ఉన్న శరీరమేర్పరచుకున్న వాడు పురంజనుడు. ఈ పురంజనుడు చాలా పెద్ద పేరున్నవాడు. ఇతనికీ కీర్తి బాగా ఉంది. అలాంటి జీవునికి మిత్రుడు పరమాత్మ. హితమును మాత్రమే (ప్రియమును కాదు) కోరేవాడు మిత్రుడు. సంసారములో ఉండే మనం ఆయన పేరే తెలుసుకోలేము. అంతే కాదు ఆయన ఏమి చేస్తున్నాడో కూడా తెలియదు. పరమాత్మకు అవిజ్ఞ్యాతా అన్న నామం ఉన్నది. భక్తుల దోషాలు తెలియని వాడు అని అర్థం. ఆయన ఏమి చేస్తాడో మనకు తెలియదు. ఆయన మనలోపల ప్రవేశించి మననందరినీ శాసిస్తాడు.

సోऽన్వేషమాణః శరణం బభ్రామ పృథివీం ప్రభుః
నానురూపం యదావిన్దదభూత్స విమనా ఇవ

ఈ రాజు తన నివాసాన్ని కోరి భూమి అంతటా సంచరిస్తున్నాడు (జీవాత్మకూడా తానాచరించిన కర్మలకు యోగ్య్మైన శరీరాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. శరీరానికి భోగాయతనం అని పేరు. మనమాచరించే కర్మలకనుభవించవలసిన భోగానికి శరీరమే ఉపకరణం. అన్నిటికంటే పెద్ద రహస్యమిదే. ఏదీ అంటని తాను, ఏదీ పట్టని తాను శరీరమనే ఒక సంచీలో ఉన్నాడు, ఆ సంచీకొచ్చే మార్పులన్నీ తనవనుకుంటాడు. )
ఇంత వెతికినా తగిన శరీరం దొరకలేదు. తిర్యక్ స్థావరములు కూడా శరీరాలే. ఈ పురాలన్నీ చూసాడు గానీ ఇవేవీ నాకనుగుణమైనవి కావు అనుకున్నాడు. అలా తిరస్కరించుకుంటూ వెళ్ళాడు

న సాధు మేనే తాః సర్వా భూతలే యావతీః పురః
కామాన్కామయమానోऽసౌ తస్య తస్యోపపత్తయే
స ఏకదా హిమవతో దక్షిణేష్వథ సానుషు
దదర్శ నవభిర్ద్వార్భిః పురం లక్షితలక్షణామ్

హిమవత్పర్వతానికి దక్షిణ ప్రాంతములో ఉన్న పట్టణాన్ని చూచాడు. ఆ నగరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి. నగరానికి కావలసినవి రావడానికి అవసరం లేనివి పోవడానికి ఉన్నాయి ఆ ద్వారాలు.

ప్రాకారోపవనాట్టాల పరిఖైరక్షతోరణైః
స్వర్ణరౌప్యాయసైః శృఙ్గైః సఙ్కులాం సర్వతో గృహైః

ఆ నగరానికి ప్రాకారాలున్నాయి, ప్రాకారానికి కూడా కాపలాగా అగడ్తలున్నాయి, తోరణాలున్నాయి. ప్రాకారాలంటే చర్మము. తోటలు శరీరము మీద ఉన్న రోమాలు. అందులో వేడి నీళ్ళు లోపల ఉన్న రక్తము. కనుబొమలు తోరణాలు. కళ్ళు కిటికీలు. ఆరు చక్రాలు ఆరు గదులు.
బంగారు వెండి ఇత్తడి శిఖరాలున్నాయి. ఇదే సాత్విక రాజస తామస గుణాలు. గోపురము యజమాని యొక్క గొప్ప తనాన్ని చెబుతుంది. గుణాలను బట్టి జీవుని కర్మలను చెబుతాము.

నీలస్ఫటికవైదూర్య ముక్తామరకతారుణైః
క్లృప్తహర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ

ఎరుపు తెలుపు వైఢూర్య ముక్త మరకత అరుణ అనే ఏడు మణులు ( ఇవి మన శరీరములో సత్ప ధాతువులు)

సభాచత్వరరథ్యాభిరాక్రీడాయతనాపణైః
చైత్యధ్వజపతాకాభిర్యుక్తాం విద్రుమవేదిభిః

హృదయమూ వక్షమూ కంఠమూ మొదలైనవి సభామండపం, ఆస్థానము (హృదయము), ప్రథాన ద్వారము. ఇందులో ఆడుకునేవీ ఉన్నాయీ, అంగళ్ళూ ఉన్నాయి. చక్షురాది ఇంద్రియములే క్రీఎడాయతనములు. సుషుమ్నా నాడి ముక్తి మార్గము. ఇదే ఆధారం ( మూలాధారము) పెద్దా చిన్నా ఎముకలూ స్తంభాలుగా, నరాలు తాళ్ళుగా ఉన్నాయి.

పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే
నదద్విహఙ్గాలికుల కోలాహలజలాశయే

పురమునకు అవతల ఉన్న తోటలో తుమ్మెదలూ కోకిలలూ విహంగములూ ఉన్నాయి, కొన్ని క్రిములూ కీటకాలూ ఉన్నాయి. మన శరీరములో కూడా ఎన్నో క్రిములూ కీటకాలూ ఉన్నాయి.

హిమనిర్ఝరవిప్రుష్మత్ కుసుమాకరవాయునా
చలత్ప్రవాలవిటప నలినీతటసమ్పది

హిమవత్పరవత సెలయేటి నీటితో వచ్చే చల్లటి గాలితో తోటలో సుగంధాలు వస్తూ ఉన్నాయి. క్రిములే కాకుండా కౄరమృగాలు కూడా ఉన్నాయి.

నానారణ్యమృగవ్రాతైరనాబాధే మునివ్రతైః
ఆహూతం మన్యతే పాన్థో యత్ర కోకిలకూజితైః

అక్కడే మునులూ వారి ఆశ్రమాలూ ఉన్నాయి. వాటి వలన అరణ్య మృగాలు వచ్చినా బాధించవు. తోటలూ కోకిలలూ మొదలైనవి ఆకర్షిస్తూ ఉన్నాయి.

యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమామ్
భృత్యైర్దశభిరాయాన్తీమేకైకశతనాయకైః

అలాంటి ఉద్యాన వనములో భగవత్సంకల్పముతో ఒక యువతి వచ్చింది. యువతి అంటే ఇక్కడ బుద్ధి. భార్యనూ లేదా బుద్ధిని మనం కోరి తెచ్చుకోలేము. మనం ఇది వరకు ఆచరించిన కర్మలకు ఎలాంటి బుద్ధి (లేదా భార్య రావాలో అలాంటి భార్యే వస్తుంది) . ఇది దైవ సంకల్పం వలన వచ్చింది.
ఆ అమ్మై ఒక్కతే రాలేదు. ఆమెకు పది మంది సేవకులు ఉన్నారు. ఆ పది మందికీ కూడా ఒక్కొక్కరికీ ఒక్కో సేవకుడూ ఉన్నాడు. ( ఆ పది మందీ ఇంద్రియాలు, వారికుండే ఒక్కో వందమంది సేవకుల సమూహం ఇంద్రియ ప్రవృత్తులు)

అఞ్చశీర్షాహినా గుప్తాం ప్రతీహారేణ సర్వతః
అన్వేషమాణామృషభమప్రౌఢాం కామరూపిణీమ్

ఐదు తలల పాము ఉంది ( ఐదు వాయువులు), దానికి కూడా కాపలాదారుడున్నాడు. ఆమె పతిని కోరుతున్నది. కామ రూపి అయిన ఆమె

సునాసాం సుదతీం బాలాం సుకపోలాం వరాననామ్
సమవిన్యస్తకర్ణాభ్యాం బిభ్రతీం కుణ్డలశ్రియమ్

చక్కని కను ముక్కు తీరు, పలు వరుస కపోలములూ, సమానముగా ఉన్న చెవులు యొక్క ఆభరణాలు గలది. (మంచి వారిని చూస్తే వింటే అవి మంచివవుతాయి. మంచి బుద్ధి ఉన్న కనులు మంచి కనులు. మంచినే చూడాలనుకునే కనులు).

పిశఙ్గనీవీం సుశ్రోణీం శ్యామాం కనకమేఖలామ్
పద్భ్యాం క్వణద్భ్యాం చలన్తీం నూపురైర్దేవతామివ

పట్టు పీతాంబరం కట్టుకున్నది. నడుము మధ్యము. పూర్వోత్తర భాగములకు సంధి. స్వర్గ నరకాలకు సంధి. పైకి వెళితే స్వర్గం, కిందకి వెళితే నరకం. బలముగా ఉన్న కాళ్ళు కలది. (నడిచే బుద్ధి)

స్తనౌ వ్యఞ్జితకైశోరౌ సమవృత్తౌ నిరన్తరౌ
వస్త్రాన్తేన నిగూహన్తీం వ్రీడయా గజగామినీమ్

బాల్య యవ్వన మధ్య అవస్థను గుర్తు చేసే స్తనములు

తామాహ లలితం వీరః సవ్రీడస్మితశోభనామ్
స్నిగ్ధేనాపాఙ్గపుఙ్ఖేన స్పృష్టః ప్రేమోద్భ్రమద్భ్రువా

బుద్ధి యొక్క ఇన్ని రకముల శక్తులను చూచాడు. నడుస్తూ నడుస్తూ ఓరకంట వాడిని ప్రేమపూర్వకమైన కనుబొమ్మల తీరు కలిగి ఓర చూపుతో చూసింది. (అంటే బుద్ధి కావాలని మనమనుకోమూ, మనము కావాలని బుద్ధి అనుకుంటుంది)

కా త్వం కఞ్జపలాశాక్షి కస్యాసీహ కుతః సతి
ఇమాముప పురీం భీరు కిం చికీర్షసి శంస మే

విశాలమైన నేత్రము కలదానా, నీవెవరవు ఎవరి దానవు ఇక్కడకెలా వచ్చావు, ఇల్లు వదిలి కోటలోకి ఏమి చేయాలనుకొని వచ్చావు.

క ఏతేऽనుపథా యే త ఏకాదశ మహాభటాః
ఏతా వా లలనాః సుభ్రు కోऽయం తేऽహిః పురఃసరః

పది మంది బటులు ఉన్నారు, వంద మంది స్త్రీలు ఉన్నారు, వెనక పాము కూడా నడుస్తోంది

త్వం హ్రీర్భవాన్యస్యథ వాగ్రమా పతిం విచిన్వతీ కిం మునివద్రహో వనే
త్వదఙ్ఘ్రికామాప్తసమస్తకామం క్వ పద్మకోశః పతితః కరాగ్రాత్

నీవు భూమివా పార్వతివా సరస్వతివా లక్ష్మివా.మునిలాగ అరణ్యములో ఏకాంతములో తపస్సు చేస్తున్నావా, భర్తకోసం వెతుకుతున్నావా.

నాసాం వరోర్వన్యతమా భువిస్పృక్పురీమిమాం వీరవరేణ సాకమ్
అర్హస్యలఙ్కర్తుమదభ్రకర్మణా లోకం పరం శ్రీరివ యజ్ఞపుంసా

నీవు పైన చెప్పిన వారిలో ఎవెత్తవూ కావు. నీ పాదములు భూమికి అంటుకొని ఉన్నాయి. నిరంతరం నీ పాదాలను ఆశ్రయించాలనుకున్న భక్తుల కోరికను తీర్చడానికి వారిని అనుగ్రహించి వచ్చావా అంటే నీ చేతిలో పద్మము లేదే? ఐనా నీవు పైన చెప్పిన వారిలో ఎవత్తెవూ కావు. దేవతవు కూడా కావు. యజ్ఞ్య వరాహ స్వామితో భూమిలాగ, శ్రీమన్నారాయణునితో అమ్మవారిలాగ నీవు నాతో కలిసి ఈ నవద్వారాలు గల నగరాన్ని ప్రవేశిస్తే బాగుంటుంది.

యదేష మాపాఙ్గవిఖణ్డితేన్ద్రియం సవ్రీడభావస్మితవిభ్రమద్భ్రువా
త్వయోపసృష్టో భగవాన్మనోభవః ప్రబాధతేऽథానుగృహాణ శోభనే

నీ ఓరచూపుతో నా మనసు చలించినది.కొంచెం సిగ్గూ కొంచెం ప్రేమా, ఇవనీ తొణికిసలాడే కనుబొమ్మల కదలికతో కాల్చబడిన మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు. నీవు నన్ను అనుగ్రహించవలసింది.

త్వదాననం సుభ్రు సుతారలోచనం వ్యాలమ్బినీలాలకవృన్దసంవృతమ్
ఉన్నీయ మే దర్శయ వల్గువాచకం యద్వ్రీడయా నాభిముఖం శుచిస్మితే

సిగ్గుతో తలను వంచుకుని ఉన్నావు. నీ తల ఎత్తి సుందరమైన మధురముగా మాట్లాడే నీ ముఖమును నాకు చూపవలసింది అని పురంజనుడు పురంజనిని కోరాడు.

నారద ఉవాచ
ఇత్థం పురఞ్జనం నారీ యాచమానమధీరవత్
అభ్యనన్దత తం వీరం హసన్తీ వీర మోహితా

ఇలా (అధీరవత్ యాచమానం) దీనుడై యాచించాడు (ఆమె లేకుంటే జీవించలేనట్లుగా దైన్యం కోల్పోయిన వాడిలా) అలా అడగడముతో అభినందించింది (స్త్రీ తన భర్త చేతగాని వాడై ఉండాలి, తన మీదే ఆధారపడి ఉండాలి, నిత్యం తనని బతిమలాడుతూ ఉండాలి, అని ఆలోచిస్తుంది, అందుకే పురుషులను గృహపాలః అని బిరుదు. కానీ భర్తచేత స్త్రీ బతిమలాడించుకుంటే భర్తకు అమంగళం. ఉదా: కైక, దశ్రధుడు. ) పురంజనుడు దీనుడిలా యాచించడాన్ని అభినందించింది. ఈమె కూడా అతనిని మోహించింది. మగవారి కన్నా ఆడవారికే కామం ఎక్కువగా ఉంటుంది కానీ బయటపడకుండా మగవారిచేతే మొదట అడిగించుకుంటారు

న విదామ వయం సమ్యక్కర్తారం పురుషర్షభ
ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతమ్

నన్నెవరు చేసారో నా గోత్రమేమిటో నాకీ పేరు ఎవరు పెట్టారో నన్నెక్కడికి ఎవరు వచ్చేట్లు చేసారో తెలీదు (మనకు ప్రేమ ఎపుడు పుడుతుందో శాంతం ఎప్పుడు పుడుతుందో తెలీదు. శాంతముగా ఉన్నవారొక్కసారి కోపావేశానికి గురవుతుంటారు.) ఇక్కడ ఉన్నాను అన్న విషయం మాత్రం తెలుసు

ఇహాద్య సన్తమాత్మానం విదామ న తతః పరమ్
యేనేయం నిర్మితా వీర పురీ శరణమాత్మనః

అంతకు మించి ఇంకేమీ తెలీదు. నీకూ నాకూ అనుకూలముగా ఉన్న ఈ నగరాన్ని ఎవరు నిర్మించారో కూడా తెలీదు. (బుద్ధి చెప్పినట్లే జీవుడూ, స్త్రీ చెప్పినట్లే పురుషుడూ వింటాడు).

ఏతే సఖాయః సఖ్యో మే నరా నార్యశ్చ మానద
సుప్తాయాం మయి జాగర్తి నాగోऽయం పాలయన్పురీమ్

వీరంతా నా చెలికత్తెలూ మిత్రులూ. ఈ సర్పం నేను నిదురపోయినప్పుడు నాకే ఆపద రాకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. (ఇదే ప్రాణ వాయువు. దీని ప్రాముఖ్యం చెప్పడానికి బృహదారకణ్యములో మొదటి భాగములో రెండో అధ్యాయం దేవదానవ యుద్ధములో దేవతలు ఒక్కో ఇంద్రియాన్ని ఆశ్రయిస్తారు. ఆ ఇంద్రియములో చేరి బలము సంపాదించాలని. అక్కడికి రాక్షసులు కూడా వచ్చి ఆశ్రయిస్తారు. ఫలము సగం ఇటూ అటూ ఉంటుంది. దేవతలు చివరికి ప్రాణ ఇంద్రియాన్ని ఆశ్రయిస్తారు. అక్కడికి రాక్షసులు రాలేక ఓడిపోతారు. ఈ కథ అర్థమేమిటంటే ఇంద్రియములు చెడూ మంచీ రెండూ చేస్తాయి. కన్ను చూడవలసిన దాన్ని చూడాలి. ఒక వేళ ఆసురీ ప్రవృత్తి చేరితే చూడకూడని దాన్ని చూస్తుంది. ఏ ఇంద్రియమైనా ఇంతే. కానీ ప్రాణం సకల ఇంద్రియాలనూ తన శక్తితో బలోపేతం చేస్తుంది. వేద సిద్ధాంతమేమిటంటే, ఇంద్రియాలంటూ ఏమీ లేవు. ఉన్నది ప్రాణమే. అందుకే ఆ ముఖ్య ప్రాణాన్ని ఆరాధన చేయాలి, నియమించాలి. అదే ప్రాణాయామం. అప్పుడు ఏ ఏ ఇంద్రియాలకు ఎంత శక్తి అవసరమో అంత ఆహారం వేళుతుంది. ఈ ప్రాణాన్ని పరబ్రహ్మగా ఆరాధించగలుగుటే మోక్షం) అందుకే అందరూ నిదురపోయినా ప్రాణము నిద్రపోదు.)

దిష్ట్యాగతోऽసి భద్రం తే గ్రామ్యాన్కామానభీప్ససే
ఉద్వహిష్యామి తాంస్తేऽహం స్వబన్ధుభిరరిన్దమ

అదృష్టం బాగుండి నీవు నా దగ్గరకు వచ్చావు. అలాంటి నీ కోరికను నేను మన్నిస్తాను. నిన్ను వివాహం చేసుకుంటాను. నేనొక్కదాన్నే రాను నా బంధువులతో వస్తాను.

ఇమాం త్వమధితిష్ఠస్వ పురీం నవముఖీం విభో
మయోపనీతాన్గృహ్ణానః కామభోగాన్శతం సమాః

ఈ తొమ్మిది ద్వారాలు గల నగరాన్ని అధిష్టించు. నేను నీతో నూరు సంవత్సరాల కామ భోగాన్ని అనుభవిస్తాను.

కం ను త్వదన్యం రమయే హ్యరతిజ్ఞమకోవిదమ్
అసమ్పరాయాభిముఖమశ్వస్తనవిదం పశుమ్

ఇన్ని మంచి గుణాలు కల నిన్ను కాక ఎవరిని కోరుకుంటాను. "రేపు" అంటే తెలియని వాడిని ఏ స్త్రీ కోరుతుంది. (బాగా సంపాదించి కూడబెట్టినవాడినే స్త్రీ కోరుతుంది). అసమ్పరాయా (సమ్పరాయా - మృత్యువు) - చాలా కాలం జీవించి ఉండాలన్న దీర్ఘాయుష్మంతున్నీ బలాడ్యున్నీ సంపదలున్న వాడినీ కోరుతుంది. వైరాగ్యముతో ఉన్న వాడిని ఏ భార్యా కోరదు. ఇహమూ పరమూ తెలిసిన నిన్ను కాక నేను మరెవరిని కోరుకుంటాను.

ధర్మో హ్యత్రార్థకామౌ చ ప్రజానన్దోऽమృతం యశః
లోకా విశోకా విరజా యాన్న కేవలినో విదుః

గృహస్థాశ్రమానికి మొదట కావలసినది ధర్మం. దాని తరువాత అర్థకామాలు. నిశ్చింతగా అనుభవించడమే భోగము. అది ధర్మము చేతనే వస్తుంది. అనుభవించే వస్తువు మీద అనుభవించేవాడు ఏకాగ్రతతో ఉండాలి, భయము ఉండకూడదు. అర్థాన్ని ధర్మముతో ముడివేస్తేనే అది సాధ్యమవుతుంది. ధర్మము వలన అర్థమును సంపాదించి, అర్థము వలన కోరిక తీర్చుకుంటేనే మోక్షమ్ము. కామము మోక్షము మీద ఉండాలి, ధర్మముతో అర్థాన్ని సంపాదించాలి.
ఈ గృహస్థాశ్రమములో ఈ మూడూ ఉన్నాయి, సంతానమూ కలుగుతుందీ, చివరకు మోక్షం కూడా వస్తుంది. కీర్తి వస్తుంది. సక్రమముగా గృహస్థాశ్రమం పాటించినవారు శోకమూ మాలిన్యమూ కలిగి ఉండరు. నిర్మలులవుతారు. ఈ గృహ్స్థాశ్రమం గురించి నివృత్తి మార్గములో ఉన్నవారికి (కేవలులు) ఏమి తెలుసు

పితృదేవర్షిమర్త్యానాం భూతానామాత్మనశ్చ హ
క్షేమ్యం వదన్తి శరణం భవేऽస్మిన్యద్గృహాశ్రమః

ధర్మబద్ధముగా ఉంటే ఈ గృహస్థాశ్రమమే పితృదేవతలకు, దేవతలకూ ఋషులకూ మానవులకూ ఇతర ప్రాణులకూ తనకూ క్షేమం కలిగిస్తుంది. (పితృ దేవ ఋషి భూత అథితి ఋణము ఉంటుంది)
ఈ ప్రపంచములో గృహాశ్రమమే క్షేమాన్ని కలిగిస్తుంది

కా నామ వీర విఖ్యాతం వదాన్యం ప్రియదర్శనమ్
న వృణీత ప్రియం ప్రాప్తం మాదృశీ త్వాదృశం పతిమ్

నాలాంటి అమ్మాయి నీలాంటి అబ్బాయిని కాక వేరేవరిని కోరుతుంది. ప్రసిద్ధి పొందినవాడవు, సుందరుడవు.

కస్యా మనస్తే భువి భోగిభోగయోః స్త్రియా న సజ్జేద్భుజయోర్మహాభుజ
యోऽనాథవర్గాధిమలం ఘృణోద్ధత స్మితావలోకేన చరత్యపోహితుమ్

విశాలమైన నీ వక్షస్థలాన్ని ఆశ్రయించాలని ఏ యువతి కోరుకోదు.జాలి (ఘృణ) కేవలం ప్రీతితో కోరికతో చిరునవ్వుతో కూడిన చూపుతో మనసులో ఉన్న బాధను తొలగించగలిగేది. అలాంటి నీ భుజాలను వక్షస్థలాన్ని ఏ స్త్రీ కోరుకోదు

నారద ఉవాచ
ఇతి తౌ దమ్పతీ తత్ర సముద్య సమయం మిథః
తాం ప్రవిశ్య పురీం రాజన్ముముదాతే శతం సమాః

ఇలా ఇద్దరూ మాట్లాడుకున్నారు. పరస్పర ఒప్పందం చేసుకున్నారు. ఆ నగరాన్ని ప్రవేశించి నూరు సంవత్సరాలు ఆనందముగా ఉన్నారు. జీవుడూ బుద్ధీ శరీరములో చేరారు. తాను ఆచరించిన కర్మకు అనుగుణమైన బుద్ధే వస్తుంది. బుద్ధిః కర్మానుసారిణి. తనకర్మకు ఏ ఫలితం పొందాలో ఆ బుద్ధే పుడుతుంది. బుద్ధి జీవునితో కలిస్తే పరమాత్మ కంటే  భిన్నమైన దాని యందే కోరికపుడుతోంది. జాగ్రత్ స్వప్న సుషుప్తి మరణావస్థలో ఉన్న దోషాలను కింద చెబుతున్నాడు. మనము మేలుకొని ఉన్నప్పుడు చేసే తప్పులేమిటి?

ఉపగీయమానో లలితం తత్ర తత్ర చ గాయకైః
క్రీడన్పరివృతః స్త్రీభిర్హ్రదినీమావిశచ్ఛుచౌ

పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, అవి చూస్తూ వింటూ తిరుగుతూ, స్త్రీల సంబంధముతో, ఆషాడమాసములో (చుచౌ) (మబ్బూ వానా మెరుపూ గృహస్థును కలచి వేస్తాయి. అప్పుడు విహరించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది)  అందరితో కలిసి సరస్సుకు వెళ్ళాడు
ఇందులో మనకు గానమూ నాట్యమూ సేవకులూ సరస్సు , ఈ నాలుగూ శ్రవనేంద్రియ చక్సురింద్రియముల వ్యాపారాల గురించి చెబుతాయి. బుద్ధి జీవుడిని ఇంద్రియ సుఖానుభూతికి ప్రేరేపిస్తున్నాయి.

సప్తోపరి కృతా ద్వారః పురస్తస్యాస్తు ద్వే అధః
పృథగ్విషయగత్యర్థం తస్యాం యః కశ్చనేశ్వరః

నగరమునకు తొమ్మిది ద్వారాలున్నాయి. ఈ తొమ్మిది ద్వారాలలో ఏడు పైన, కింద రెండూ ఉన్నాయి. ఈ ద్వారాలెందుకంటే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళడానికి (శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలనుభవించడానికి).

పఞ్చ ద్వారస్తు పౌరస్త్యా దక్షిణైకా తథోత్తరా
పశ్చిమే ద్వే అమూషాం తే నామాని నృప వర్ణయే

ఈ ఏడు ద్వారాలలో కూడా ముందర ఐదు ద్వారాలున్నాయి, రెండు పక్కల రెండు ద్వారాలున్నాయి. తూరుపు దిక్కున రెండు ద్వారాలున్నాయి

ఖద్యోతావిర్ముఖీ చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే
విభ్రాజితం జనపదం యాతి తాభ్యాం ద్యుమత్సఖః

ఖద్యోతా (ఖః - సూర్యుడు. సూర్యునితో ప్రకాశింపచేయడం వలన చూచేవి. దక్షిణ నేత్రానికి ఖద్యోత అని పేరు) అవిర్ముఖి  (అవిః ప్రకటం ముఖం - కుడి కన్ను కంటే ఎడమ కన్నే బాగా చూస్తుంది. కుడి కన్ను దైవ కార్య క్రమాలకూ ఎడమ కన్ను లౌకిక కార్యాలకూ. లౌకికాన్ని బాగా చూసేది ఎడమ కన్ను. గ్రంధాలు చదివే వాడికి మొదలు ఎడమ కన్ను దెబ్బ తింటుంది. లౌకికముగా బాగా ఉండేవాడికి మొదట కుడికన్ను దెబ్బతింటుంది. చూచే వారికి ఎడమకన్ను ఎక్కువ ప్రకాశమిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఎక్కువ చూపేది కుడి కన్ను. ఎడమ కన్ను ఎక్కువ చూపించినట్లనిపిస్తుంది ఎడమ కన్నుది భ్రాంతి, కుడి కన్నుది వాస్తవం)
ద్యుమత్సఖః - ఈ రాజు విభ్రాజితమనే పట్టణానికి వెళ్ళాడు. విభ్రాజితమంటే ప్రకాశం. సూర్యుని సహాయముతో రెండు కన్నుల ద్వారా వెలుగును చూస్తాడు.

నలినీ నాలినీ చ ప్రాగ్ద్వారావేకత్ర నిర్మితే
అవధూతసఖస్తాభ్యాం విషయం యాతి సౌరభమ్

ఇంకో రెండు ద్వారాలున్నాయి. దక్షిణ వామ నాసికలు. నలమంటే చిధ్రము (రంధ్రము). అవధూతసఖ (వాయు స్నేహము). వాయు స్నేహముతో సుగంధమనే ఊరిలోకి వెళుతుంది. గంధాన్ని చూడాలంటే దాన్ని అందించేది వాయువు. వాయువు గంధాన్ని మోసుకొచ్చి నాసికకు అందిస్తాడు. అందుచే వాయువు స్నేహితుడు

ముఖ్యా నామ పురస్తాద్ద్వాస్తయాపణబహూదనౌ
విషయౌ యాతి పురరాడ్రసజ్ఞవిపణాన్వితః

నోరు ముఖ్యద్వారం. ఇదే ప్రధాన ద్వారం. తక్కిన ద్వారాల సౌకర్యాన్నీ అసౌకర్యాన్నీ చెప్పేది ఇదే. ఇక్కడ చాలా దుకాణాలకు వెళ్ళీ చాలా వస్తువులు తీసుకుని వస్తాడు. బహూదనౌ - బహు ఔదనం - అన్నం. ఆపణ - అంగడి, పణమంటే వ్యవహారము. వ్యవహారానికీ అన్నానికీ ఇది నేను తింటాను అనడానికీ ఇదే ద్వారము. వ్యవహారానికీ అన్నానికీ రెంటికీ ఇదే మార్గము.
ఈ ద్వారము గుండా వెళ్ళేప్పుడు రసజ్ఞ్యుడు విపణీ కూడా వస్తారు. రసజ్ఞ్యుడంటే రుచి తెలిసిన వాడు, విపణాన్వితః - కొనుగోలు చేసేవాడూ, లేదా మాట్లాడే వాడు. ఈ ఇద్దరూ మిత్రులు (నాలుక రెండు విషయాలు చేస్తుంది, ఈ రుచి కావాలి అని చెబుతుంది, ఆ రుచినీ చూస్తుంది)

పితృహూర్నృప పుర్యా ద్వార్దక్షిణేన పురఞ్జనః
రాష్ట్రం దక్షిణపఞ్చాలం యాతి శ్రుతధరాన్వితః

దక్షిణ ఉత్తర ద్వారాలు రెండు. దక్షిణ ద్వారానికి పేరు పితృః. పితృ లోక ప్రాప్తి సాధనమైన వేదాలని వినేది దక్షిణ ద్వారము (దక్షిణ కర్ణం). దీఎనికి పేరు పితృః. దక్షిణ కర్ణము వామ కర్ణము కన్నా బలముగా ఉంటుంది, అందుకే శాస్త్రము వినడానికి ఆ చెవి పనికొస్తుంది. శాస్త్ర శ్రవణ సాధనం. వాస్తవముగా పరమాత్మను పొందే ఫలాన్నిచ్చేది నివృత్తి కర్మ. నివృత్తి కర్మను ప్రసాదించే వేదాంత శాస్త్రాన్ని వినడానికి పనికొచ్చేది వామ కర్ణం. వేద పూర్వ  భాగం దక్షిణ కర్ణం. ఉత్తర మీమాంస వామ కర్ణం. వేదాంతము కంటే వేదాంతమును వినాలీ, వేదాంతములో ప్రవర్తించాలంటే అంతకు ముందు ఉన్న ఆశ్రమాల యందు విరక్తి కలగాలి. అలా కలగాలంటే ఆ ఆశ్రమములో ఉన్న మంచి చెడులు తెలియాలి. కర్మ ఆచరిస్తే గానీ అందులో ఉన్న మంచీ చెడులు అర్థం కావు. విరక్తి సహజముగా కలగాలి. ఎవరికి వారే తెలుసుకోవాలి. వైరాగ్యం కలగడానికి ముందు ఉన్న శాస్త్రములే దృఢములు. ఆ విషయాలను వినడానికి వినే కర్ణం బలముగా ఉండాలి. అందుకే కుడి చెవి పితృః. జ్ఞ్యానము కలిగాక బలం తక్కువ ఉన్నా సమస్య ఉండదు.

దేవహూర్నామ పుర్యా ద్వా ఉత్తరేణ పురఞ్జనః
రాష్ట్రముత్తరపఞ్చాలం యాతి శ్రుతధరాన్వితః

దక్షిణ దిక్కున ఉన్న పంచాలమునకు వెళ్ళాడు (పంచ - ఐదు అలం - చాలు. శబ్ద స్పర్శ రూప రస గ్రధ విషయాలు చాలు). శ్రుతి ధరునితో (శబ్దాన్ని సహాయముగా చేసుకుని) అక్కడికి వెళ్ళాడు. శరణాగతి సంబంధించిన శాస్త్రాన్ని కూడా ఆచార్యులు కుడి చెవిలోనే చెబుతారు. పరమాత్మను ఆశ్ర్యైంచడానికి కావల్సిన చెవి కుడి చెవి. విరక్తి కలిగాక ఎడమ చెవి.

మనకు కావలసిన శబ్ద స్పర్శ రూప రస గంధములను వినడానికి వాక్కు ఎంత ప్రధానమో చెవి కూడా అంతే ప్రధానం. పంచ విషయాలకు తృప్తి కలిగించే విధానన్ని బోధించే శబ్దములు మనము చెవులతోనే వింటాము.

ఆసురీ నామ పశ్చాద్ద్వాస్తయా యాతి పురఞ్జనః
గ్రామకం నామ విషయం దుర్మదేన సమన్వితః

కింది ద్వారము పేరు ఆసురి. ఇది గ్రామ్యమనే విషయాన్ని పొందుతుంది. (ఇదే ఉపస్థ ఇంద్రియం). ఇది దుర్మదుడనే (మదము) స్నేహితుడితో కలిసి ఉంటుంది.

నిరృతిర్నామ పశ్చాద్ద్వాస్తయా యాతి పురఞ్జనః
వైశసం నామ విషయం లుబ్ధకేన సమన్వితః

ఇంకో ద్వారం నిరృతి. ఇది మృత్యు ద్వారము. (అపానము. పాయు. మల విసర్జన ద్వారము).

అన్ధావమీషాం పౌరాణాం నిర్వాక్పేశస్కృతావుభౌ
అక్షణ్వతామధిపతిస్తాభ్యాం యాతి కరోతి చ

ఇందులో రెండు ద్వారాలున్నాయి (ఇంద్రియాలు). కానీ అవి మూసివేయబడి ఉన్నాయి. చూసేవి కావు గాని పని మాత్రం చేస్తాయి. అవి పాణి, పాద. ఇవి గుడ్డివి (చూడలేవు) గానీ పనులు చేస్తాయి. కాని ఇవి జ్ఞ్యానము లేనివి. నిర్వాక్పేశస్కృతావుభౌ - దీనికి మాట కూడా లేదు. పేశస్కృత్ : తన చేయి తనే నరుక్కుంటుంది. తన కాలు తననే గోతిలో పడేస్తుంది. గుడ్డిగా వ్యవహరించి తన ద్వారాన్ని తానే మూసుకుంటుంది. ఈ రెంటితో వండుతాడు (యాతి) పని చేస్తాడు (కరోతి)

స యర్హ్యన్తఃపురగతో విషూచీనసమన్వితః
మోహం ప్రసాదం హర్షం వా యాతి జాయాత్మజోద్భవమ్

ఈ అన్ని ఇంద్రియాలూ ఉంటే సరిపోదనీ, వీటికొక కేంద్రం కావాలి. దీనికొక అంతః పురం ఉండాలి. రాజూ రాణీ కలిసి ఉండాలి. అదే హృదయం. ఈ అంతఃపురములో పరిచారకులతో సేవకులతో దాసులతో ఉన్నాడు. జీవుడికి ఒక ఆంతరంగిక స్నేహితుడు ఉన్నాడు. మనసు. ఈ మనస్సు అన్నిట్లోనూ ఉంది. మనసనే స్నేహితుడితో జీవుడు ఉంటాడు. విషూచీ - సర్వతా వ్యాపించి ఉండేది. భార్య బుద్ధి, భర్త జీవుడు పుత్రుడు ఇంద్రియ వృత్తులూ, వీరిని వెంటబెట్టుకుని మనస్సు తోడు తీసుకుని హృదయములోకి ప్రవేశించాడు.
ఇందులో వెళ్ళి మోహాన్ని అనుగ్రహాన్నీ హర్షం (తమో సత్వ రజో గుణాలకనుగుణముగా ) పొందుతాడు.

ఏవం కర్మసు సంసక్తః కామాత్మా వఞ్చితోऽబుధః
మహిషీ యద్యదీహేత తత్తదేవాన్వవర్తత

కర్మలకు ఆసక్తుడై మోహించబడతాడు. అంతః పురములోకి వెళ్ళిన రాజు ఆమె (బుద్ధి) చెప్పినట్లు విన్నాడు. ఆమె ఏమి చేస్తే అది చేసాడు. భార్య ఏమి కోరితే అది చేసాడు. ఎలా ఉండమంటే అలా ఉన్నాడు. అడిగిందల్లా ఇచ్చాడు

క్వచిత్పిబన్త్యాం పిబతి మదిరాం మదవిహ్వలః
అశ్నన్త్యాం క్వచిదశ్నాతి జక్షత్యాం సహ జక్షితి

క్వచిద్గాయతి గాయన్త్యాం రుదత్యాం రుదతి క్వచిత్
క్వచిద్ధసన్త్యాం హసతి జల్పన్త్యామను జల్పతి

క్వచిద్ధావతి ధావన్త్యాం తిష్ఠన్త్యామను తిష్ఠతి
అను శేతే శయానాయామన్వాస్తే క్వచిదాసతీమ్

క్వచిచ్ఛృణోతి శృణ్వన్త్యాం పశ్యన్త్యామను పశ్యతి
క్వచిజ్జిఘ్రతి జిఘ్రన్త్యాం స్పృశన్త్యాం స్పృశతి క్వచిత్

క్వచిచ్చ శోచతీం జాయామను శోచతి దీనవత్
అను హృష్యతి హృష్యన్త్యాం ముదితామను మోదతే

విప్రలబ్ధో మహిష్యైవం సర్వప్రకృతివఞ్చితః
నేచ్ఛన్ననుకరోత్యజ్ఞః క్లైబ్యాత్క్రీడామృగో యథా

ఆమె మద్యపానం చేస్తే ఇతనూ చేసాడు, తింటే తిన్నాడు పాడితే పాడాడు ఏడిస్తే ఏడిచాడు నవ్వితే నవ్వాడు, పరిగెత్తుతుంటే వెంట పరిగెత్తాడు, నిలబడితే నిలబడ్డాడు. అంటే బుద్ధి చెప్పినట్లు విన్నాడు. పడుకుంటే పడుకున్నాడు కూర్చుంటే కూర్చుంటాడు వింటే వింటాడూ చూస్తే చూస్తాడు వాసన చూస్తే వాసన చూసాడు తాకితే తాకుతాడు ఏడిస్తే పరమ దీనుడిలా ఏడుస్తాడు నవ్వితే నవ్వుతాడు సంతోషిస్తే బాగా సంతోషిస్తాడూ ఆనందిస్తే ఆనందిస్తాడు
ఇలా భార్యతో అన్ని రకాలా వంచించబడి తన స్వభావాన్ని మరచిపోయాడు. చేసిన దాన్ని చేయడమే తప్ప స్వయముగా ఆలోచించడమూ చేయడమూ మరచిపోయాడు అవిజ్ఞ్యానముతో. నపున్సకుడిలా ఎదుటివాడు చెప్పినట్లు విన్నాడు ఒక క్రీడా మృగములా (పెంపుడు జంతువులా)
ఇలా పరిపూర్తిగా వంచించబడి ఆమెకు దాసుడయ్యాడు

Tuesday, March 5, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై నాలగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై నాలగవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
విజితాశ్వోऽధిరాజాసీత్పృథుపుత్రః పృథుశ్రవాః
యవీయోభ్యోऽదదాత్కాష్ఠా భ్రాతృభ్యో భ్రాతృవత్సలః

పృధు చక్రవర్తి మోక్షానికి వెళ్ళడముతో అతని కుమారుడు విజితాశ్వుడు రాజయ్యాడు. అతను గొప్ప కీర్తి కలవాడు. చక్రవర్తి అయిన తరువాత ఇంకా తమ్ములు ఉన్నారు కాబట్టి ఆ నలుగురికీ రాజ్యములో భాగాలిచ్చాడు.

హర్యక్షాయాదిశత్ప్రాచీం ధూమ్రకేశాయ దక్షిణామ్
ప్రతీచీం వృకసంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభుః

తూర్పు దిక్కును హర్య్క్షునికీ ధూమ్రకేశునికి దక్షిణ ప్రతీచునికి పశ్చిమం ఉత్తర దిక్కు ద్రవిణునికి

అన్తర్ధానగతిం శక్రాల్లబ్ధ్వాన్తర్ధానసంజ్ఞితః
అపత్యత్రయమాధత్త శిఖణ్డిన్యాం సుసమ్మతమ్

ఇంద్రుని వలన విజితాశ్వుడు అంతర్ధాన శక్తిని తెచ్చుకుని. శిఖండిని అన్న భార్య యందు ముగ్గురు పుత్రులు

పావకః పవమానశ్చ శుచిరిత్యగ్నయః పురా
వసిష్ఠశాపాదుత్పన్నాః పునర్యోగగతిం గతాః

పావక పవమాన శుచిః ఈ మూడూ అగ్నులు వశిష్టుని శాపము వలన (హవిస్సును తీసుకోవడములో క్రమము తప్పడము వలన క్రమము తప్పేవారిగా, మానవులుగా పుట్టమని శపించాడు) మానవులుగా పుట్టి యోగమార్గాన్ని అవలంబించి స్వస్థిని పొందారు

అన్తర్ధానో నభస్వత్యాం హవిర్ధానమవిన్దత
య ఇన్ద్రమశ్వహర్తారం విద్వానపి న జఘ్నివాన్

నభస్వతి అన్న భార్య యందు హవిర్ధానుడనే కుమారుడు పుట్టాడు. తన గుర్రాన్ని హరించిన ఇంద్రుని చూచి కూడా హాని కలిగించకుండా విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరును బిరుదుగా పొందాడు

రాజ్ఞాం వృత్తిం కరాదాన దణ్డశుల్కాదిదారుణామ్
మన్యమానో దీర్ఘసత్త్ర వ్యాజేన విససర్జ హ

అంతర్ధానుడు కూడా రాజ్యపరిపాలన పాప భూయిస్ఠము (పన్నులు వసూలు చేయాలి, శిక్షించాలి, బహిష్కరించాలి, జరిమానా విధించాలి,) అని దాన్ని వదిలిపెట్టి నదీ తీరములోకి వెళ్ళి దీర్ఘ సత్రం చేసాడు. రాజ్యం మీద విరక్తి కలిగి సత్రం ప్రారంభించాడు

తత్రాపి హంసం పురుషం పరమాత్మానమాత్మదృక్
యజంస్తల్లోకతామాప కుశలేన సమాధినా

దీర్ఘ సత్రం ఆచరిస్తూ కూడా ఆత్మ ధృక్ (ఆత్మసాక్షాత్కారాన్ని పొదిన వాడు) అయి, హంస అయిన పరమాత్మను (హంస అంటే సంసారాన్ని తొలగించేవాడు, సంసారములో ఉన్న మురికిని తీసేసేవాడు )పురుషుడైన (అందరి శరీరములో ఉన్న) పరమాత్మ అయిన వాడిని పూజిస్తూ హవిస్సునిస్తూ పరమ కుశలమైన సమాధి మార్గములో వైఖుంఠాన్ని చేరాడు

హవిర్ధానాద్ధవిర్ధానీ విదురాసూత షట్సుతాన్
బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతమ్

హవిర్ధానుడికి ఆరుగురు కుమారులు.

బర్హిషత్సుమహాభాగో హావిర్ధానిః ప్రజాపతిః
క్రియాకాణ్డేషు నిష్ణాతో యోగేషు చ కురూద్వహ

బరిషత్ (దర్భలను పరిచినవాడు ) హవిర్ధాని యొక్క పుత్రుడు, యోగములో దిట్ట, యాగాదులు బాగా తెలిసినవాడు

యస్యేదం దేవయజనమనుయజ్ఞం వితన్వతః
ప్రాచీనాగ్రైః కుశైరాసీదాస్తృతం వసుధాతలమ్

యజ్ఞ్యముల ద్వారా పరమాత్మ ఆరాధన చేస్తున్న ఇతనికి సకల భూమండలము ప్రాచీనాగ్రమైనది (తూర్పు అగ్రముగా పరచబడింది). పుణ్యక్షేత్రం పుణ్యారణ్యమూ పుణ్యతీర్థములో దర్భలతో నింపేశాడు

సాముద్రీం దేవదేవోక్తాముపయేమే శతద్రుతిమ్
యాం వీక్ష్య చారుసర్వాఙ్గీం కిశోరీం సుష్ఠ్వలఙ్కృతామ్
పరిక్రమన్తీముద్వాహే చకమేऽగ్నిః శుకీమివ

సముద్రుని పుత్రిక శతద్రుతి ఇతని భార్య. ఆమెను వివాహం చేసుకున్నప్పుడు, అగ్నిహోత్రునికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆమె సౌందర్యము చూసి అగ్నిహోత్రుడు ఆమెను అభిలషించాడు (సప్తర్షులు యజ్ఞ్యం నిర్వహించినపుడు ఋషులు వారి భార్యలతో ప్రదక్షిణం చేసినపుడు అగ్నిహోత్రుడు వారిమీద వ్యామోహపడ్డాడు. ఆ వేదనతో అగ్నిహోత్రుడు చిక్కిపోయి, హవిస్సులను కూడా తీసుకోవట్లేదు. అది గమనించిన భార్య ఆయా భార్యల రూపములో వ్యవహరించింది. అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు. ఋషులు ఆ విషయం తెలియక తమ భార్యలనూ అగ్నిహోత్రునీ శపించాడు. అగ్నిహోత్రుని భార్య నచ్చజెప్పడం వలన ఋషులు శాపాన్ని ఉపసంహరించారు. అప్పటినుంచీ భార్యాభర్తలు ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిహోత్రునికి కళ్ళు కనపడకుండా ఉండాలన్న శాపమిచ్చారు. ఈ విషయం శంకరుడు స్కాంధ పురాణములో చెప్పాడు. అగ్నీ వాయువూ శంకరుని అంశలే. అందుకే కుమారస్వామి ఆరుగురి నుంచి జన్మించాడు: భూమి, భూమి భరించలేకపోతే అగ్ని, వాయువు, నీరు, శంకరుడు ఇలా ఆరుగురినుంచి షడ్యః అని కుమారస్వామి పుట్టాడు. అందుకే కృత్తికలు ఆరుగురు వచ్చారు. కుమారస్వామి అగ్ని పుత్రుడయ్యాడు. అలాగే హనుమంతుడు వాయు పుత్రుడు. అగ్నీ వాయువూ శంకరుడూ ఒకరే.  )
అలాగే ఇక్కడ కూడా అంత పరిశుద్ధుడైన అగ్నిహోత్రుడు కూడా మోహించేంత సౌందర్యవంతురాలు

విబుధాసురగన్ధర్వ మునిసిద్ధనరోరగాః
విజితాః సూర్యయా దిక్షు క్వణయన్త్యైవ నూపురైః

వీఎరంతా ఆమె నడకను చూచి మూర్చపోయారు.

ప్రాచీనబర్హిషః పుత్రాః శతద్రుత్యాం దశాభవన్
తుల్యనామవ్రతాః సర్వే ధర్మస్నాతాః ప్రచేతసః

శతద్రుతికీ ప్రాచీన బర్హికీ పదిమంది పుట్టారు. వీరందరికీ ఒకటే పేరు - ప్రాచేతసులు (ఈ పదిమందికీ ఒకే భార్య). వీరంతా ధర్మాచరణతో పరిశుద్ధులు

పిత్రాదిష్టాః ప్రజాసర్గే తపసేऽర్ణవమావిశన్
దశవర్షసహస్రాణి తపసార్చంస్తపస్పతిమ్

భార్యకోసమని తపించమని తండ్రి ఆజ్ఞ్యాపిస్తే తపస్సుకోసం సముద్ర ప్రాంతానికి వెళ్ళారు. పరమాత్మను పదివేల సంవత్సరాలు తపస్సుచే ఆరాధించాలని వెళ్ళారు

యదుక్తం పథి దృష్టేన గిరిశేన ప్రసీదతా
తద్ధ్యాయన్తో జపన్తశ్చ పూజయన్తశ్చ సంయతాః

మంత్రమేదీ లేకుండా తపస్సుకోసం వెళుతున్నారని శంకరుడు దయతలచి వారికి మంత్రముపదేశించాడు.

విదుర ఉవాచ
ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్పథి సఙ్గమః
యదుతాహ హరః ప్రీతస్తన్నో బ్రహ్మన్వదార్థవత్

దారిలో ప్రచేతసులకి శంకరునితో కలయిక ఎలా జరిగింది. ఆయన ప్రత్యక్షం కావాలని వీరు కోరారా? లేక శంకరుడే ప్రసన్నుడయ్యాడా.

సఙ్గమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణామ్
దుర్లభో మునయో దధ్యురసఙ్గాద్యమభీప్సితమ్

శరీరం పొందినవాడికి శంకరునితో సమాగమం దుర్లభము. ఆయనను దర్శించాలని మునులందరూ ధ్యానము చేసి కూడా పొందలేకపోయారు. అలాంటి దర్శనం వీరెలాపొందారు

ఆత్మారామోऽపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే
శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్భవః

ఆయన ఆత్మారాముడు, లోకకళ్యానం కొరకు అమ్మవారితో కలిసి సంచరిస్తూ ఉంటాడు.

మైత్రేయ ఉవాచ
ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః
దిశం ప్రతీచీం ప్రయయుస్తపస్యాదృతచేతసః

తండ్రిమాటను పాలించి సాధువులై తపస్సు యందు మనసు లగ్నం చేసి పశ్చిమదిక్కుకు బయలుదేరారు.

ససముద్రముప విస్తీర్ణమపశ్యన్సుమహత్సరః
మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్నసలిలాశయమ్

అలా వెళుతున్నవారికి సముద్రము దగ్గర విశాలమైన సరస్సు కనిపించింది. చాలా గొప్ప సరస్సు, మత్స్యాదులతో శోభిస్తోంది. మహానుభావుల మనస్సు వలె స్వచ్చముగా ఉంది.

నీలరక్తోత్పలామ్భోజ కహ్లారేన్దీవరాకరమ్
హంససారసచక్రాహ్వ కారణ్డవనికూజితమ్

హంసలూ కారణ్డవములూ చక్రవాకములూ

మత్తభ్రమరసౌస్వర్య హృష్టరోమలతాఙ్ఘ్రిపమ్
పద్మకోశరజో దిక్షు విక్షిపత్పవనోత్సవమ్

పూల చెట్లూ తుమ్మెదలూ, వాటి ఝంకారమూ, పద్మముల కోశములో ఉండే పుప్పొడిని వాయువు అంతా వెదజల్లుతోంది.

తత్ర గాన్ధర్వమాకర్ణ్య దివ్యమార్గమనోహరమ్
విసిస్మ్యూ రాజపుత్రాస్తే మృదఙ్గపణవాద్యను

ఇంత సుందరమైన సరస్సు చూస్తున్నవారికి కనులకే కాక, అక్కడి నుండి వచ్చే సంగీతముతో చెవులకీ ఆనందం కలిగింది. మృదంగములూ మొదలైన వాటి ద్వని వ్యాపించి ఉండటముతో చూచి ఆశ్చర్యము పొందారు

తర్హ్యేవ సరసస్తస్మాన్నిష్క్రామన్తం సహానుగమ్
ఉపగీయమానమమర ప్రవరం విబుధానుగైః

ఇలా ఆశ్చర్యం పొందుతుండగానే దేవతలు గానం చేస్తుండగా, వారు వెంట రాగా, అప్పుడే కాచిన బంగారములా మెరుస్తూ

తప్తహేమనికాయాభం శితికణ్ఠం త్రిలోచనమ్
ప్రసాదసుముఖం వీక్ష్య ప్రణేముర్జాతకౌతుకాః

మూడు కన్నులు గలవాడు, ప్రసన్నమైన చూపుతో ఉన్నాడు. ఆ భక్తవత్సలుడికి అందరూ నమస్కరించారు.

స తాన్ప్రపన్నార్తిహరో భగవాన్ధర్మవత్సలః
ధర్మజ్ఞాన్శీలసమ్పన్నాన్ప్రీతః ప్రీతానువాచ హ

ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించే శంకరుడు. ధర్మజ్ఞ్యులైన ప్రచేతసులతో ఇలా అన్నాడు

శ్రీరుద్ర ఉవాచ
యూయం వేదిషదః పుత్రా విదితం వశ్చికీర్షితమ్
అనుగ్రహాయ భద్రం వ ఏవం మే దర్శనం కృతమ్

ప్రాచీన బర్హి కుమారులైన మీరేమి చేయాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీరడగకపోయినా మిమ్ములని అనుగ్రహించదలచి

యః పరం రంహసః సాక్షాత్త్రిగుణాజ్జీవసంజ్ఞితాత్
భగవన్తం వాసుదేవం ప్రపన్నః స ప్రియో హి మే

సత్వ రజో తమస్సు గుణాలు కలది ప్రకృతి, ఆ ప్రకృతి కంటే జీవునికంటే ఎవరు పరుడో ఆయనని శరణు పొందినవాడంటే నాకు చాలా ఇష్టము

స్వధర్మనిష్ఠః శతజన్మభిః పుమాన్విరిఞ్చతామేతి తతః పరం హి మామ్
అవ్యాకృతం భాగవతోऽథ వైష్ణవం పదం యథాహం విబుధాః కలాత్యయే

నూరు జన్మలు తన ధర్మం తాను అనుష్ఠిస్తే బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అక్కడ కొన్నాళ్ళు ఉండి నా లోకాన్ని పొందుతాడు. అక్కడ ఒక కోటి సంవత్సరాలు ఉన్నాక వైఖుంఠానికి వెళ్తాడు. ప్రళయకాలములో దేవతలతో కలిసి నేను కూడా విష్ణువును చేరినట్లు మీరు కూడా అక్కడికి చేరతారు. శివసాయుజ్యం ద్వారానే వైకుంఠానికి వెళ్తారు

అథ భాగవతా యూయం ప్రియాః స్థ భగవాన్యథా
న మద్భాగవతానాం చ ప్రేయానన్యోऽస్తి కర్హిచిత్

మీరు పరమ భాగవతులు కాబట్టి నాకు పరమాత్మ అంటే ఎంత ప్రీతో మీరన్నా అంతే ప్రీతి. నాకు భాగవతోత్తములకంటే ప్రీతిపాత్రులు ఇంకొకరు లేరు.

ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మఙ్గలం పరమ్
నిఃశ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి వః

నేను మీకొక మంత్రోపదేశం చేస్తాను. దేనితో కలిసి ఉండనటువంటిదీ (వివిక్తం ), పరమాత్మ స్వరూపాన్ని బోధించేదీ, పవిత్రమూ మంగళమూ అన్నిటికీ పరమైనదీ. దీన్ని చెబుతాను మీరు వినండి

మైత్రేయ ఉవాచ
ఇత్యనుక్రోశహృదయో భగవానాహ తాఞ్ఛివః
బద్ధాఞ్జలీన్రాజపుత్రాన్నారాయణపరో వచః

చేతులు జోడించిన వారితో, ఇలా భగవానుడైన శంకరుడు అన్నాడు.

శ్రీరుద్ర ఉవాచ
జితం త ఆత్మవిద్వర్య స్వస్తయే స్వస్తిరస్తు మే
భవతారాధసా రాద్ధం సర్వస్మా ఆత్మనే నమః

ఇదంతా రుద్రగీత. మోక్ష ప్రదం
ఆత్మజ్ఞ్యానం కలవారి రక్షణకు పూనుకునే వారికి స్వస్తికలిగించేవాడా! వారి భారములను వహించేవాడా! వారికి శుభం కలిగించేవాడా! నీకు జయము. నాకు కూడా స్వస్తి కలగాలి. విషయానందము వలన కలిగే ప్రతీ ఫలమూ తాత్కాలికమే. అనుభవించేప్పుడు ఆనందముగా ఉండి తరువాత దుఃఖముగా మారుస్తుంది. మీరు సిద్ధమూ. ప్రపంచ విషయాలన్నీ సాధ్యములు. పరమాత్మ ఎవరి ప్రయత్నముతో ఏప్రడినవాడు కాడు. మనం ఒక రూపన్ని చూసినా, ఏదైనా తిన్నా, ఇవన్నీ సాధ్యములు, అంటే మన ప్రయత్నము వలన కలిగేవి. ప్రయత్నము వలన కలిగేవి ప్రయత్నములాగ తాత్కాలికములే. మనిషి గానీ మనిషి చేసే ప్రయ్త్నాలు కానీ ఎల్లకాలం ఉండవు. కనీ పరమాత్మ సహజముగా ఏర్పడినవాడు. ఆయనా ఆయన అనుభవిణ్చే ఆనందం నిలిచి ఉంటుంది. పరమాత్మ ఆనందానుభూత విషయాలు నిత్యములూ. అలాంటి నీ ఆనందాన్ని సాధించే భక్తి మాలో స్థిరముగా ఉండేట్లు ఉంచమని భగవంతుని అడగాలి. ఎందుకలా కోరాలంటే ఆయన అందరికీ ఆత్మ. శరీరం పోయినా ఆత్మ అలాగే ఉంటుంది. నీ ఉనికితోనే ఆత్మ ఉంటుందీ శరీరమూ ఉంటుంది. పరమాత్మ దేని దేనిలో ఉంటే అవి అన్నీ ఆయన శరీరాలే. వాటికి ఆత్మభూతుడు పరమాత్మ. అన్నిటికీ ఆత్మవైన నీకు నంసకారం

నమః పఙ్కజనాభాయ భూతసూక్ష్మేన్ద్రియాత్మనే
వాసుదేవాయ శాన్తాయ కూటస్థాయ స్వరోచిషే

పరమాత్మ పద్మనాబుడు - కార్యావస్థలో (కార్యావస్థ అంటే ప్రపంచం) ఉన్న ప్రపంచాన్ని సూచించేవాడు (లోకాత్మకం పంకజం). పంచ భూతములూ తన్మాత్రములూ పది ఇంద్రియములూ అన్నీ నీవే. కార్యకారణాలలో నీవు అంతర్యామిగా ఉన్నావు. జగత్తంతా నీలో ఉందీ, నీవు అందరిలో ఉన్నావు, కాబట్టి నీవు వాసు. అలా ఉండటము వలన కలిగే ఏ దోషమూ అంటను వాడు, ప్రకాశించేవాడివీ, జ్యోతిస్వరూపుడివి కాబట్టి దేవ. నీవు వాసుదేవుడవు. ప్రకృతి సంబంధమైన ఏ ఉపద్రవములూ లేని వాడవు. షడూర్ములూ లేని వాడవు. ఊర్మి అంటే తరంగాలు. నీవు నిర్వికారుడివి. కూటస్థుడవు. స్వయంప్రకాశశీలుడివి. నిత్య అసంకుచిత అపరిచ్చిన ప్రకాశశీలుడవు.

సఙ్కర్షణాయ సూక్ష్మాయ దురన్తాయాన్తకాయ చ
నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాన్తరాత్మనే

నీవు సంకర్షణుడవు. అంతక రూపములో ప్రళయానికి కూడా నీవే కారణం. నీవు మాత్రం సూక్ష్ముడివే. నీకు నామ రూపాలు ఉండవు. ఇప్పుడూ ఉండవు, ప్రళయకాలములోనూ ఉండవు. నిరంతరమూ అంతరాత్మగానే ఉంటావు. ఉపసంహరించబడని వాడవు. ప్రకృతి తన ఆకారాన్ని ఉపసంహరించుకుంటుంది, జీవుడు కూడా ఉపసంహరిస్తాడు. ఉపసంహరణంటే కార్యావస్థ కారణావస్థలో చేరడం.
విశ్వప్రబోధాయ - సకల ప్రపంచమునకు జ్ఞ్యాన భిక్ష పెట్టినవాడవు. వేద శాస్త్ర పురాణాలని అందించినవాడవు. వేదం నీ నిశ్వాస.
ప్రద్యుమ్నాయాన్తరాత్మనే - సకల అవతార తత్వం ప్రద్యుమ్నుడు.

నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే

ఎవ్వరిచేతా అరికట్టబడని వాడవు. ఈయనే హృషీకేశుడు. ఇంద్రియములూ, వాటి అధిపతీ ఆయనే. మనం చేసే పాపాలను పుణ్యాలను ఉంచకుండా చేసేవాడు. అంతటా నిండి ఉన్నవాడు. శోకరహితుడవు (నిభృతాత్మనే)

స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషదే నమః
నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తన్తవే

స్వర్గానికీ మోక్షానికీ నీవే మార్గం. ఇష్టాపూర్తములు కూడా నీవే. పవుత్రమైన భక్తుల హృదయములో ఉంటాడు - శుచిషద్.
హిరణ్యవీర్యాయ - అగ్నిహోత్రుడవు, ఋత్విక్, హోత అధ్వర్యువూ ఉద్గాత

నమ ఊర్జ ఇషే త్రయ్యాః పతయే యజ్ఞరేతసే
తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే

ఊర్జ అంటే పితృదేవతల భోజనం (స్వధాకారము). దేవతల భోజనాన్ని ఇష అంటారు (స్వాహా కారము). పరమాత్మే పితృదేవతలకూ దేవతలకూ అన్నం. హవిస్సూ హవిర్భోక్తా హవిస్సు ఇచ్చేవాడు. యజ్ఞ్యపతి యజమాని యజ్ఞ్యమూ ఆయనే.
రయ్యాః పతయే - వేదాలకు అధిపతి
యజ్ఞరేతసే - యజ్ఞ్యఫలం కూడా పరమాత్మే. కర్త కర్మ క్రియా ఈ మూడూ పరమాత్మ.
తృప్తిదాయ చ జీవానాం - అన్ని రకముల ప్రాణులకు ఎవరికి ఎలాంటి తృప్తి కలగాలంటే ఇచ్చేది పరమాత్మే. ఆయన అనుగ్రహముతోనే తృప్తిపొందుతారు. ఆ పొందే తృప్తి కూడా పరమాత్మే.
సర్వరసాత్మనే - కార్యమూ కారణమూ పరమాత్మే. ఈ రెంటినీ జ్ఞ్యానులు చూస్తారు. ప్రపంచములో పరమాత్మని, పరమాత్మలో ప్రపంచాన్ని చూడగలగడం. కటు లవణ ఆంల తిక్తం కషాయం మొదలైన షడ్రసాలు, శృంగార హాస్యాది నవరసాలు మొత్తం కలిపి పదిహేను రసాలు. ఈ పదిహేనే మనము వాడే పదిహేను తిథులు. ప్రతిపత్తునాడు కారం విదియ నాడు పులుపూ తదియనాడు ఉప్పూ తినకూడదు. అలాగే చవితి కటు కషాయం తిత్కం. దీని తరువాత సప్తమినాడు శృంగారానుభవం, అష్టమి నాడు హాస్యానుభవం, నవమి నాడు వీఎర రసము ఇలా రసాలు తొమ్మిది. అమావాస్యా పూర్ణిమ నాడు శాంతం. ఇవి రసాలు. కానీ పరమాత్మ సర్వ రసాలు. మనకు తృప్తి కలిగేది రసానుభవముతోనే, ఆ రసమే పరమాత్మ.

సర్వసత్త్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే
నమస్త్రైలోక్యపాలాయ సహ ఓజోబలాయ చ

అన్ని ఆత్మలూ, ఆత్మల శరీరమూ పరమాత్మే. స్థవీయసే - స్థూలము. విశేషాయ - పృధ్వీ స్వరూపాయ. పృధివిలో గంధమూ, జలములో రసమూ. అన్ని ఆత్మలకూ ఆయన దేహము (ప్రళయకాలములో) . అన్ని దేహములకూ ఆయన ఆత్మ. ఈయన మూడులోకాలను రక్షించేవాడు. బలము (ధారణ సామర్ధ్యం, శరీర బలం) ఓజః (ప్రవృతి సామర్ధ్యం) సహః (తేజస్సు, ప్రకాశ సామర్ధ్యం) కలవాడు

అర్థలిఙ్గాయ నభసే నమోऽన్తర్బహిరాత్మనే
నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరివర్చసే

అర్థలిఙ్గాయ  -- శబ్దస్వరూప్డు (అర్థమునకు లింగము లేదా అర్థమునకు కారణం),
నభసే - శబ్దమూ ఆయనే, శబ్దానికి కారణమైన ఆకాశమూ ఆయనే.
నమోऽన్తర్బహిరాత్మనే - శబ్దమంటే బయట ఉండేది, ఆకాశమంటే లోపల ఉండేది. వెలుపల శబ్దముగా లోపల ఆకాశముగా ఉంటాడు. శబ్దము నోటినుండి పుట్టి చెవికి చేరుతుంది. అంటే శబ్దం పుట్టేది ఆకాశమునుండే చేరేదీ ఆకాశములోకీ, వినగలిగేదీ ఆకాశము వలనే. మన అభిప్రాయాన్ని చెప్పే శబ్దమూ (అర్థమూ) ఆకాశమూ ఆయనే. లోపలా వెలుపలా ఆయనే ఉంటాడు.
అన్ని పవిత్రములకంటే పవిత్రుడు. అన్ని పదార్థాలను చూచేది ఆయనతోనే. చూడవలసినదీ ఆయననే. కనుల ఎదురుగా ఏ వస్తువు ఉన్నా చూడవలసినది తదంతర్యామిని. అముష్మై - ఈలోకమువాడూ ఆలోకము వాడూ ఆయనే
భూరివర్చసే  - సాటిలేని వర్చస్సు కలవాడు. వస్తువుకీ కంటికీ మధ్య ఉండే వెలుతురు స్వామే. వస్తువూ కన్నూ, కంటికీ వస్తువుకీ మధ్య వెలుతురూ ఆయనే.

ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణే
నమోऽధర్మవిపాకాయ మృత్యవే దుఃఖదాయ చ

ప్రవృత్తి కర్మా నివృత్తి కర్మా రెండూ ఆయనే. కర్మను భగవదారాధనగా చేయడం ఒక మార్గం (భరతుడు), కర్మను వదిలేసి భగవదారాధన చేయడమింకో మార్గం(లక్ష్మణుడు). ఈ రెండూ ఆయనే. నిత్య కర్మే కాకుండా నైమిత్తిక కర్మలైన శ్రాద్ధాదులూ ఆయనే. భోక్తా  భోగ్యమూ తృప్తీ ఆయనే. పితృదేవతా, పితృదేవతలకోసం చేసే శ్రాద్ధాది కర్మలూ ఆయనే. కర్మ కర్మ చేత ఆరాధించబడే వాడూ, కర్తా, ఫలమూ అన్నీ పరమాత్మే.
నమోऽధర్మవిపాకాయ - ధర్మ విపాకమంటే పుణ్యం, అధర్మ విపాకం పాపం. తప్పు చేస్తే అది తానే అయి మనని నరకానికి పంపిస్తాడు. ఒప్పు చేస్తే అది కూడా తానే అయి స్వర్గానికి పంపిస్తాడు . ఈ రెండూ ఆయనకే అర్పిస్తే మోక్షానికి పంపిస్తాడు.
మృత్యవే  - మృత్యువంటే సంసారము. యమ రూపములో ఫలితం ఇచ్చేవాడు ఆయనే. దుఃఖమునిచ్చే మృత్యువూ ఆయనే. దుఃఖమూ, పాపమూ ఆయనే.

నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే
నమో ధర్మాయ బృహతే కృష్ణాయాకుణ్ఠమేధసే
పురుషాయ పురాణాయ సాఙ్ఖ్యయోగేశ్వరాయ చ

ధర్మాదులకు కారణమూ కార్యమూ  పరమాత్మే. ధర్మాదులకు పరమాత్మే ప్రభువు. (ధర్మే మతిర్భవతు వః పురుషోత్తమానాం| స హ్యేక ఏవ పరలోకగతస్య బన్ధుః| అర్థాః స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమానా| నైవ ప్రభావముపయాన్తి న చ స్థిరత్వమ్|)
పరలోకానికి వెళ్ళేవాడికి ధర్మమొక్కటే బంధువు. సంపదలూ స్త్రీలని మనమెంతగా సేవించినా వారు ఆప్తులు కారు. ఇది భారతానికి మొదటి శ్లోకం. భారతానికి ఇది ఫలశృతి.

నీవే స్వాయంభువ మన్వాదులవు. మనవే అంటే మంత్ర రూపాయ అని కూడా వస్తుంది.
నమో ధర్మాయ బృహతే - అంతకన్నా పెద్ద ధర్మం లేదు. అకుణ్ఠమేధసే - అసంకుచిత జ్ఞ్యాన స్వరూపుడు.
సాఙ్ఖ్యయోగేశ్వరాయ  - ఈయనే కపిలుడూ, చతుర్ముఖ బ్రహ్మ.

శక్తిత్రయసమేతాయ మీఢుషేऽహఙ్కృతాత్మనే
చేతఆకూతిరూపాయ నమో వాచో విభూతయే

సృష్టీ రక్షణ సంహార శక్తీ గలవాడు. మీఢుషే - ఈయనే సూర్యుడు (వర్షాన్నిచ్చేవాడు) వర్షమూ ఎండా పరమాత్మ స్వరూపమే.
అహఙ్కృతాత్మనే - అహంకారమే శరీరముగా కలవాడు. చేతఆకూతిరూపాయ - చూసే కన్నూ చూడబడే రూపమూ ఆయనే. ధ్యానములో ఆత్మా పరమాత్మ ఒక్కటిగా భాసిస్తారు. అనుభవ దశలో ఇద్దరూవిడిగా భాసించరూ. ఇంద్రియ జ్ఞ్యానం విషయ జ్ఞ్యానం విడిగా భాసించదు. విషయాలు ఇంద్రియాలు విడిగా ఉంటాయి. ఇంద్రియాలు విషయాన్ని తీసుకుంటాయి. ఆ గ్రహించబడిన విషయములని గ్రహించే ఇంద్రియములనుండి వేరు చేయగలమా? ఉదా: రూపాన్ని చూసాక చూసిన తరువాత ఆ అనుభవాన్ని రూపాన్ని వేరు చేయగలమా? పాలూ తీయగా ఉంటాయీ, చక్కెరా తీయగా ఉంటుంది. రెండూ కలిస్తే ఆ తీపి దేనినుంచీ వచ్చింది. చక్కెర తీపినీ పాల తీపినీ వేరుగా చొఓడగలమా.  విడి విడిగా ఉన్నప్పుడు ఆ తీపీ ఈ తీపీ వేరుగా అనిపించినా రెండు కలిస్తే వాటిని విడిగా చూపలేము. అలాగే మనం పరమాత్మ వేరు నేను వేరూ అనుకుంటాము కానీ ఆయన ధ్యానములో పడ్డ తరువాత ధ్యానములో రెండూ వేరుగా ఉండవు (అనుభవించే వస్తువూ అనుభవించే కర్తా ).
ఇదే (విశిష్ట) అద్వైతం. అనుభవ దశలో ఈ రెండూ విడిగా భాసించవు.
ఆయనే మనో వాక్కాయ రూపుడు.
చేతఆకూతిరూపాయ - ఈయన వాక్కునకు విభూతి. వక్కుకు అందని వాడు. శబ్దాతిగః శబ్ద సహః - శబ్దము చెప్పగలదానికంటే అవతల ఉన్నవాడు, ఏ పేరుతో పిలిచినా పలికే వాడు.

దర్శనం నో దిదృక్షూణాం దేహి భాగవతార్చితమ్
రూపం ప్రియతమం స్వానాం సర్వేన్ద్రియగుణాఞ్జనమ్

ఇది వరకు పరమభాగవతోత్తములకు సాక్షాత్కరింపచేసిన దివమంగళ విగ్రహాన్ని మాకు దర్శింపచేయు. నీ వారికి నీ రూపం పరమ ప్రీతి పాత్రమైనది. అన్ని ఇంద్రియ గుణాలను ప్రకటింపచేసేది నీవే (సర్వేన్ద్రియగుణాఞ్జనమ్).

స్నిగ్ధప్రావృడ్ఘనశ్యామం సర్వసౌన్దర్యసఙ్గ్రహమ్
చార్వాయతచతుర్బాహు సుజాతరుచిరాననమ్

నల్లని మబ్బు వంటి రూపము. అన్ని రకముల సౌంద్రయ్ములూ నీలోనే అభివ్యక్తమవుతాయి. సుందర విశాలమైన నాలుగు భుజాలు, చక్కని పలువరసతో ఉన్న ముఖము

పద్మకోశపలాశాక్షం సున్దరభ్రు సునాసికమ్
సుద్విజం సుకపోలాస్యం సమకర్ణవిభూషణమ్

పుండరీకాక్షుడూ, చక్కని కనుబొమ్మలూ ముక్కూ, కపోలము (చెంపలు), నోరు, చెవులూ, వాటి భూషణాలు

ప్రీతిప్రహసితాపాఙ్గమలకై రూపశోభితమ్
లసత్పఙ్కజకిఞ్జల్క దుకూలం మృష్టకుణ్డలమ్

సంతోషముతో కలిగే చిరునవ్వుతో కూడిన క్రీగంటి చూపు. కనులలో చిరునవ్వు తొణికిసలాడేది నీ చూపు. ముగుర్లు నీ కళ్ళ మీద పడుతూ ఉంటాయి. పసుపుపచ్చని పీతాంబరమూ, శుభ్రమైన కుండలాలు

స్ఫురత్కిరీటవలయ హారనూపురమేఖలమ్
శఙ్ఖచక్రగదాపద్మ మాలామణ్యుత్తమర్ద్ధిమత్

కిరీట కంకణ హార మొలతాడు,శంఖ చక్ర గదా పద్మ వనమాలాతో

సింహస్కన్ధత్విషో బిభ్రత్సౌభగగ్రీవకౌస్తుభమ్
శ్రియానపాయిన్యా క్షిప్త నికషాశ్మోరసోల్లసత్

సింహం లాంటి స్కంధం కలవాడు, కాంతికలవాడు,ఆ కంఠానికున్న మణి మణికే అలంకారం. అనపాయి అయిన అమ్మవారి చేత ఒరిపిడి రాయిగా ఉంచుకున్న ఉరస్సు.

పూరరేచకసంవిగ్న వలివల్గుదలోదరమ్
ప్రతిసఙ్క్రామయద్విశ్వం నాభ్యావర్తగభీరయా

ఉచ్చ్వాస నిశ్వాసలతో కదులుతున్న సుందరమైన రేఖలు ఉదరములో గలవాడు. గంభీరమైన సుడులు తిరిగే సుడులు గలవాడు. కడుపులో ఉన్న లోకాలు బయటకు రావడం వలన ఏర్పడ్డట్లు ఉన్న సుడులు

శ్యామశ్రోణ్యధిరోచిష్ణు దుకూలస్వర్ణమేఖలమ్
సమచార్వఙ్ఘ్రిజఙ్ఘోరు నిమ్నజానుసుదర్శనమ్

బంగారపు కాంతిని తలపింపచేసే పట్టు పీతాంబరముతో శోభించే పిరుదులు.పాదములూ పిక్కలూ మోకాలు అరికాలు సమముగా ఉన్నవి. మోకాల్లు పిక్కలూ లోపలకూ. ఊరువులు బయటకు ఉండాలి. తొడలకంటే మోకాళ్ళు లోపలకూ, మోకాళ్ళ కంటే పిక్కలు లోపలకి, పిక్కల కంటే పాదములు ముందుకీ, పిక్కల కంటే మడమలు లోపలకూ ఉండాలి.

పదా శరత్పద్మపలాశరోచిషా నఖద్యుభిర్నోऽన్తరఘం విధున్వతా
ప్రదర్శయ స్వీయమపాస్తసాధ్వసం పదం గురో మార్గగురుస్తమోజుషామ్

శరత్కాలములో ఉండే పద్మ రేకులతో సమానమైన పాదముల చేత గోళ్ళ కాంతులతో మాలో ఉన్న పాపాన్ని తొలగిస్తున్న పాదముచేత, అజ్ఞ్యానికి దారి చూపే వాడివైన నీకు నీ రూపం చూపవల్సింది

ఏతద్రూపమనుధ్యేయమాత్మశుద్ధిమభీప్సతామ్
యద్భక్తియోగోऽభయదః స్వధర్మమనుతిష్ఠతామ్

మనశ్శుద్ధి కావాలంటే పరమాత్మ యొక్క ఈ రూపాన్ని ధ్యానం చేయాలి. తమ ధర్మాన్ని అనుష్ఠానం చేసే వారికి భక్తి యోగమే ప్రధానం.
ఆతం శుద్ధి కోసం ఇపుడు నేను చెప్పిన రూపాన్ని ధ్యానం చేయండి. బ్రాహ్మణ క్షత్రియాదులు గానీ, బ్రహ్మచర్యాది వర్ణాశ్రమాలు గలవారు గానీ తమ తమ వర్ణాశ్రమాలనుష్ఠించే వారికి అభయమిచ్చేది భక్తియోగం మాత్రమే.భయమంటే భ్రష్టమవడం. ఉదా: స్నాన సంధ్యాదులు మానడం.

భవాన్భక్తిమతా లభ్యో దుర్లభః సర్వదేహినామ్
స్వారాజ్యస్యాప్యభిమత ఏకాన్తేనాత్మవిద్గతిః

నీవు ఎవ్వరికీ అందుబాటులో ఉండవు. భక్తి ఉన్న వారికి మాత్రం కనపడతావు. స్వారాజ్యానికి నీవు అభిమతము. కైవల్యాన్ని కూడా పక్కకి జరిపి ఏకాంతమైన నీ మోక్ష సామ్రాజ్యాన్నీ నీవు అందజేయగలవు
భక్తి కలవారికి తప్ప మిగతావారికి మీరు దుర్లభులు. ఆత్మ జ్ఞ్యానులకు మీరే ఉపాయము

తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా
ఏకాన్తభక్త్యా కో వాఞ్ఛేత్పాదమూలం వినా బహిః

సజ్జనులకు కూడా పొందశక్యము కాని వాడవు, కష్టపడి ప్రయత్నించినా లభించవు. నిన్నెవ్వరూ ఆరాధించలేరు. అనన్య భక్తి మాత్రమే నిన్ను చేరే మార్గము. ంజమైన భక్తుడు మోక్షాన్ని కూడా కోరడు. భక్తుడు కోరేది నీ పాదమూలాన్నే

యత్ర నిర్విష్టమరణం కృతాన్తో నాభిమన్యతే
విశ్వం విధ్వంసయన్వీర్య శౌర్యవిస్ఫూర్జితభ్రువా

అరణం - చరణము. పరమాద్మ పాద మూలాన్ని శరణముగా తీసుకున్నవాడు యమున్ని కూడా లెక్కించడు. సకల ప్రపంచనమునూ తన పరాక్రమముతో ధ్వంసం చేసే యమున్ని కూడా పరమాత్మ పాదాలను శరణు వేడినవాడు లెక్కించడు.

క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః

పరమాత్మ భక్తులతో అరక్షణం కలిసి ఉండటం కలిగిన వాడు స్వర్గాన్ని మోక్షాన్ని కూడా లెక్కించరు. స్వర్గ మోక్షాలనే పరిగనించని వారు మానవుల కోరికలను పరిగణిస్తారా. నిరంతర పరమాత్మ దర్శనం కోరుకునే వారు ఎప్పుడూ పరమాత్మ భక్తులతో కలిసి ఉండేలా చూడమని కోరతాడు

అథానఘాఙ్ఘ్రేస్తవ కీర్తితీర్థయోరన్తర్బహిఃస్నానవిధూతపాప్మనామ్
భూతేష్వనుక్రోశసుసత్త్వశీలినాం స్యాత్సఙ్గమోऽనుగ్రహ ఏష నస్తవ

పాపములను నశింపచేసే పాదములు గలవాడు. ఆయన పాదములకు తీర్థం ఆయన కీర్తే. (పవిత్రాణాం చ పవిత్రం). నీ తీర్థముతో కీర్తితో అంతర్దోషమూ బహిర్దోషమూ (దేహమూ మనసు) రెండూ తొలగించబడతాడు. సత్వ గుణము కలిగి అన్ని ప్రాణుల మీదా దయ కలిగి ఉండేవారితో సమాగమం కలిగి ఉండాలి. నీ పాద తీర్థముతో కీర్తి తీర్థముతో మానసిక శారీరిక శుద్ధి పొందిన వారు. కామ క్రోధాదులకు లోబడని వారు, అన్ని జీవుల మీద దయ చూపే వారు, ఇలాంటి వారితో సంగం కావాలి

న యస్య చిత్తం బహిరర్థవిభ్రమం తమోగుహాయాం చ విశుద్ధమావిశత్
యద్భక్తియోగానుగృహీతమఞ్జసా మునిర్విచష్టే నను తత్ర తే గతిమ్

భాగవత సంగం వలన ప్రయోజనమేమిటి? భగవంతుని భక్తిచే అనుగ్రహించబడిన వారి వలన రజస్సు తమస్సు తొలగిపోయి కేవలం సత్వ గుణం మాత్రమే ప్రకాశకమవుతుంది. పరమాత్మ భక్తులతో కలిసి ఉన్నవారికి విషయాల యందు ఆశ పోతుంది, శుద్ధ సత్వమవుతుంది మనస్సు లోపలా వెలుపలా . శబ్దాది విషయాల యందు ఆశ కలిగి ఉండడు. అజ్ఞ్యానమయమైన వాటిలోకి ఆ మనసు చేరదు. అలాంటి వారు నిన్ను పొందుతారు. మనసుకున్న అన్ని మురుకులూ తొలగుతాయి, విషయాల మీద ఆశా పోతుంది

యత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్నవభాతి యత్
తత్త్వం బ్రహ్మ పరం జ్యోతిరాకాశమివ విస్తృతమ్

అంతర్భిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ సకల ప్రపంచం ఎవరిలో కనపడుతోందో ఎవరు ప్రపంచములో కనపడుతున్నారో అది నీవే. ఆకాశమన్నిటిలో ఉండి కూడా వాటి మాలిన్యం అంటనట్లు నీకు కూడా ఏ దోషాలూ అంటవు.

యో మాయయేదం పురురూపయాసృజద్బిభర్తి భూయః క్షపయత్యవిక్రియః
యద్భేదబుద్ధిః సదివాత్మదుఃస్థయా త్వమాత్మతన్త్రం భగవన్ప్రతీమహి

విశిష్టమైన బాగా వ్యాపించి ఉన్న యోగ మాయతో ఈ ప్రపంచాన్ని సృష్టించి రక్షించి నశింపచేస్తున్నాడు. ఇవన్నీ ఏ వికారమూ లేకుండా చేస్తున్నాడు. ఆయనే ఉపాదాన నిమిత్త సహకారీ కారణం. కుండ చేసేప్పుడు మట్టి  ఉపాదానం, కుండ చేసే వాడు నిమిత్త కారణం, వానికి సహాయం చేసే వారు సహకారీ కారణం. సృష్టి చేసే పరమాత్మ తానే ఈ మూడు అవుతాడు.
మనకు భయము కలగడానికి కారణం భేధ బుద్ధి. ఉన్నది ఒకటే ఐనప్పుడు అక్కడ వికారం కలగడానికి వీలు లేదు. కర్తృత్వమే సహకారీ ఉపాదాన నిమిత్త కారణాలు. జ్ఞ్యానం కలిగితే ఈ భేధ బుద్ధి పోతుంది.
నిన్ను ఆరాధించే మాకు నీ యధార్థ స్వరూపం ఇలా అవగతం కావాలి

క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజన్తి సిద్ధయే
భూతేన్ద్రియాన్తఃకరణోపలక్షితం వేదే చ తన్త్రే చ త ఏవ కోవిదాః

అష్టాంగయోగాలూ తపస్సులూ యజ్ఞ్యాలతో ఈ విధముగానే పరమాత్మను ఆరాధిస్తారు సిద్ధిని పొందడానికి. ఎవరు నీ ఈ స్వరూపాన్ని తపస్సమాధులూ స్వాధ్యాయాలతో కోరుతారో వారే తెలిసినవారు . నిజమైన జ్ఞ్యానులు నిన్నుమాత్రమే తమ అఖిల కర్మలతో శమదమాలతో ఆరాధిస్తారు. వారికి ఇంకొకరు కనపడరు
భూతేన్ద్రియాన్తఃకరణోపలక్షితం - పంచ భూతాలూ జ్ఞ్యాన కర్మేంద్రియాలతో మనసుతో కనపడేది నీవే. వేరే దేవతలన్నిటి కన్నా ముందు ఇవి పుట్టించబడ్డాయి పరమాత్మ చేత. అన్ని భూతేంద్రియ అంతః కరణాలతో ఎవరిని చూడగలమే వాడినే ధ్యానం చేస్తాము. అలా చేస్తేనే వారు పండితులు.

త్వమేక ఆద్యః పురుషః సుప్తశక్తిస్తయా రజఃసత్త్వతమో విభిద్యతే
మహానహం ఖం మరుదగ్నివార్ధరాః సురర్షయో భూతగణా ఇదం యతః

నీవొక్కడవే ఆది పురుషుడవు. సృష్టి కంటే పూర్వం నీవొక్కడివే ఉన్నావు. ప్రళయావస్థలో యోగ నిద్రలో ఉంటావు. సృష్టి చేయాలని సంకల్పించిన నీవు ప్రకృతి నుండి గుణ త్రయాలను క్షోభింపచేసావు. దాగి ఉన్న గుణ త్రయాలు అప్పుడు బయటకు వచ్చాయి. అందులో సత్వ రజో తమస్సులు వచ్చాక, అందులోంచి మహత్తు, దాని నుండి అహంకారమూ, దాని నుండి పంచ్భూతములు, పంచ జ్ఞ్యానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, దాని నుంచి మిగతా సృష్టి వచ్చింది. ఎవరూ పుట్టక ముందూ ఉన్నదీ, అందరూ పుట్టాక ఉన్నదీ నీవొక్కడవే.

సృష్టం స్వశక్త్యేదమనుప్రవిష్టశ్చతుర్విధం పురమాత్మాంశకేన
అథో విదుస్తం పురుషం సన్తమన్తర్భుఙ్క్తే హృషీకైర్మధు సారఘం యః

నీవే యోగ శక్తితో సృష్టించావు, అందులో నీవు ప్రవేశించావు. నాలు రకముల శరీరాలను, దేవ మానవ అసుర తిర్యక్ శరీరాలను సృష్టించి, ఆ శరీరమనే పురములోకి ప్రవేశించావు. అందుకే నీవు పురుషుడవయ్యావు. నాలుగు రకముల పురములలో ప్రవేశించావు కాబట్టి నిన్ను పురుషుడంటున్నారు. ఈ పురము చతుర్విధం. లోపలా బయటా ఉన్నవాడు ఒకడే. అందరిలో ఉన్న అనుభవాలు అనుభవించేది ఆయనే. జఠరాగ్ని రూపములో ఉన్నదీ ఆయనే. రసముగా ఉన్నదీ ఆయనే. మనమనుభవించే ఇంద్రియాలు ఆయనే. మన లోపల ఉండి "మనం మనం" అని చెప్పుకునే ఇంద్రియాలను అనుభవించేది ఆయన. సార్ఘం మధు - తేనెటీగ రకరకాల పుష్పాల నుండి కూడబెడుతుంది. కాని అది మాత్రం తినదు. అలాగే మనం తింటున్నామని, చూస్తున్నామని అనుకున్నా నిజముగా తినేదీ చూసేదీ ఆయనే.

స ఏష లోకానతిచణ్డవేగో వికర్షసి త్వం ఖలు కాలయానః
భూతాని భూతైరనుమేయతత్త్వో ఘనావలీర్వాయురివావిషహ్యః

కాలమనే రూపము తీసుకుని మహావేగము కలవాడవై మొత్తం నీవే మింగి వేస్తావు. ప్రాణులతోటి ప్రాణుల రాకపోకలు జరిపేది నీవే. భూతలని  భూతములతోనే సంహరిస్తావు. పుట్టడానికి ఒకరూ రక్షించడానికి ఒకరూ సంహరించడానికి ఒకరూ కారణం అనిపించేట్లు భూతలని సృష్టించి, వాటిలో నీవే ఉండి ఆ పనులు చేస్తావు. మహా వేగం కలవాడవై ప్రాణులని ప్రాణులతో ఆకర్షిస్తుంటావు. నీ కార్యములతోనే కారణాన్నూహించాలి.

ప్రమత్తముచ్చైరితి కృత్యచిన్తయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసమ్
త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లేలిహానోऽహిరివాఖుమన్తకః

నోరు తెరిచి నాలుక బాగా చాపుతూ ఎర కోసం ఎదురు చూస్తున్న పాములాగ మమ్మల్ని నీవు నోటిలో వేసుకుంటున్నావు. మేము ఎప్పుడూ ప్రమత్తముగా ఉంటాము. నేను అనుకున్న పనులన్నీ పూర్తి చేసే దాకా నాకు మృత్యువు రాదు అని ప్రమత్తుడై మానవుడు భ్రమిస్తాడు. చేయవలసిన పనులను గురించి ఆలోచిస్తూ ఉండుట వలన ప్రమత్తులవుతారు మానవులు.
శబ్ద స్పర్శ రూప రస గంధముల యందు లాలస కలిగి ఉంటాము. దాని వలన విషయాల మీద వ్యామోహం కలిగి ఉంటాము.  నీవు ఏమాత్రం ఏమరపాటులేకుండా ఉండి ఏమరపాటుతో ఉన్న మమ్మల్ని మింగివేస్తావు. ఎలుకను పాము ఎంత వేగముగా వచ్చి పడుతుందో నీవు కూడా అలాగే పడతావు.

కస్త్వత్పదాబ్జం విజహాతి పణ్డితో యస్తేऽవమానవ్యయమానకేతనః
విశఙ్కయాస్మద్గురురర్చతి స్మ యద్వినోపపత్తిం మనవశ్చతుర్దశ

అందుకే ఇవన్నీ తెలిసిన్వాడెవడైనా నీ పాద పద్మాలను విడిచిపెడతాడా? ఆదరమూ అదారమూ అని భావన నీకుండదు. మానావమానములకు నిల్యమైన శరీరము కలవారు ఇది తెలిస్తే నీ పాదాలు తప్ప వేరేదాన్ని పట్టుకుంటాడా? మా తండ్రిగారైన బ్రహ్మగారూ, నాతో పుట్టిన మనువులూ ఎలాంటి శంకా లేకుండా నిన్నే ఆరాధిస్తున్నారు. అలాంటి నీ పాదపద్మాలని ఏ పండితుడైనా విడిచిపెడతాడా. అందరికీ పొందదగిన వాడవు నువ్వు.

అథ త్వమసి నో బ్రహ్మన్పరమాత్మన్విపశ్చితామ్
విశ్వం రుద్రభయధ్వస్తమకుతశ్చిద్భయా గతిః

పండితులకూ జ్ఞ్యానులకూ నీవే అభయాన్నిచ్చేవాడవు. ప్రళయభయముతో ఉన్న వారికి నీవే అభయమిచ్చేవాడవు.

ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనన్దనాః
స్వధర్మమనుతిష్ఠన్తో భగవత్యర్పితాశయాః

మీరు ఈ విషయాన్ని ఈ మంత్రాలనూ జ్ఞ్యానాన్ని ధ్యానం చేయండి. మీకు మేలు కలుగు గాక. పరిశుద్ధులై సేవించండి. శరీర మలో వాక్కు మలము లేకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ త్రికరణ శుద్ధితో దీన్ని జపించండి.

తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వవస్థితమ్
పూజయధ్వం గృణన్తశ్చ ధ్యాయన్తశ్చాసకృద్ధరిమ్

అందరిలో అంతరాత్మగా ఉన్నవాడిని పూజించండీ, కీర్తించండీ, ధ్యానించండి.

యోగాదేశముపాసాద్య ధారయన్తో మునివ్రతాః
సమాహితధియః సర్వ ఏతదభ్యసతాదృతాః

మీరు ఈ యోగాదేశాన్ని పొంది ధ్యానం చేసి మునులుగా సావధాన చిత్తులై అందరూ ఆదరముతో దీన్ని అభ్యసించండి

ఇదమాహ పురాస్మాకం భగవాన్విశ్వసృక్పతిః
భృగ్వాదీనామాత్మజానాం సిసృక్షుః సంసిసృక్షతామ్

దీన్ని ఇదివరకు మా తండ్రిగారైన బ్రహ్మగారు సృష్టి చేయగోరిన భృగువాదులకు చెప్పారు.

తే వయం నోదితాః సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరాః
అనేన ధ్వస్తతమసః సిసృక్ష్మో వివిధాః ప్రజాః

ఇలా ఉపదేశించబడిన మేము అజ్ఞ్యానము తొలగి సృష్టి చేసాము

అథేదం నిత్యదా యుక్తో జపన్నవహితః పుమాన్
అచిరాచ్ఛ్రేయ ఆప్నోతి వాసుదేవపరాయణః

ఈ మంత్రాన్ని సర్వ దేశ సర్వకాలాలలో సర్వావస్థలో ధ్యానం చేసిన వారు పరమాత్మ మీద పరిపూర్ణముగా మనసు ఉంచిన వారై ఆయనను చేరతారు.

శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిఃశ్రేయసం పరమ్
సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవమ్

 అన్ని శ్రేయస్సులకంటే ఉత్తమ శ్రేయస్సు జ్ఞ్యానము. కష్టాల కడలిని జ్ఞ్యానమనే పడవలో సులభముగా దాటగలరు

య ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవమ్
అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ

నేను పాడిన పరమాత్మ యొక్క ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో చదివితే ఎంత కష్టపడ్డా ఆరధించరాని పరమాత్మను ఇది విన్నవాడు ఆరాధించగలుగుతాడు.

విన్దతే పురుషోऽముష్మాద్యద్యదిచ్ఛత్యసత్వరమ్
మద్గీతగీతాత్సుప్రీతాచ్ఛ్రేయసామేకవల్లభాత్

ఇది జపం చేసి ఏమి కోరుకుంటాడో అది పొందుతాడు. నేను గానము చేసిన దాన్ని గానము చేసినందు వలన, గానము చేసిన నాకూ విన్న మీకు ప్రియుడు ఒక్కడే కాబట్టి మీకూ నాకూ కావలసినది ఆయనే ఇస్తాడు. అందరికీ ప్రియుడు ఆయనే.

ఇదం యః కల్య ఉత్థాయ ప్రాఞ్జలిః శ్రద్ధయాన్వితః
శృణుయాచ్ఛ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబన్ధనైః

ప్రాతః కాలమే లేచి చేతులు జోడించిన్ శ్రద్ధ కలవారై విన్నా వినిపించినా అన్ని కర్మ బంధముల నుండీ విడుదలవుతారు

గీతం మయేదం నరదేవనన్దనాః పరస్య పుంసః పరమాత్మనః స్తవమ్
జపన్త ఏకాగ్రధియస్తపో మహత్చరధ్వమన్తే తత ఆప్స్యథేప్సితమ్

పరమ పురుషుడైన పరమాత్మ స్తోత్రాన్ని నేను గానం చేసాను. సావధాన మనసు కలవారై దీన్ని జపిస్తూ గొప్ప తపస్సు చేయండి. తపస్సు ముగిసిన తరువాత ఆ పరమాత్మ నుండి మీరు కోరికను పొందుతారు.

Monday, March 4, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

                                                      ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
దృష్ట్వాత్మానం ప్రవయసమేకదా వైన్య ఆత్మవాన్
ఆత్మనా వర్ధితాశేష స్వానుసర్గః ప్రజాపతిః

ఈ పృధు చక్రవర్తి "నేను వృద్ధున్నయానని" తెలుసుకున్నాడు. తన కుటుంబమూ సంతానన్మూ రాజ్యమూ ప్రజలనూ బాగా పెంచాడు కాబట్టి

జగతస్తస్థుషశ్చాపి వృత్తిదో ధర్మభృత్సతామ్
నిష్పాదితేశ్వరాదేశో యదర్థమిహ జజ్ఞివాన్

స్థావర జంగములకి వృత్తి కల్పించాడు. మంచివారి ధర్మాన్ని పరిపాలించినవాడు (మంచివారిని తమ పని తాము చేసుకొనేలా చూచాడు). తాను దేని కోసం పుట్టాడో ఆ పని పూర్తి చేసాడు. పరమాత్మ ఆజ్ఞ్యను నిర్వర్తించాడు.

ఆత్మజేష్వాత్మజాం న్యస్య విరహాద్రుదతీమివ
ప్రజాసు విమనఃస్వేకః సదారోऽగాత్తపోవనమ్

తన కుమారులకు తన కుమార్తే (భూమి) భారాన్ని అప్పగించాడు. భూమి విలపిస్తున్నట్లుగా ఉన్నది. ఇంతటి ఉత్తముడైన మహారాజు వెళుతున్నందుకు ప్రజలు కూడా బాధ పడుతున్నారు. భార్యతో కలిసి ఒంటిగా వెళ్ళాడు (మంత్రులూ సేనాపతులూ ఎవరూ వెంటలేరు). దీన్ని వానప్రస్థం అంటారు

తత్రాప్యదాభ్యనియమో వైఖానససుసమ్మతే
ఆరబ్ధ ఉగ్రతపసి యథా స్వవిజయే పురా

ఆ తపో వనములో వానప్రస్థ సమ్మతమైన అన్ని నియమాలను స్వీకరించాడు. భూమిని గెలిచేప్పుడు ఎంత పట్టుదలతో చేసాడో తపస్సు కూడా అంతే ఉగ్రముగా చేసాడు.

కన్దమూలఫలాహారః శుష్కపర్ణాశనః క్వచిత్
అబ్భక్షః కతిచిత్పక్షాన్వాయుభక్షస్తతః పరమ్

కందమూలాలు ఎండిన ఆకులు తింటూ గడిపాడు. ఆ తరువాత నీటినీ, ఆ తరువాత వాయువూఉ భక్షించాడు

గ్రీష్మే పఞ్చతపా వీరో వర్షాస్వాసారషాణ్మునిః
ఆకణ్ఠమగ్నః శిశిరే ఉదకే స్థణ్డిలేశయః

వేసవి కాలములో పంచాగ్నుల నడుమ తపస్సు చేసాడు. వర్షం పడుతున్నప్పుడు బయట ఉండీ, చలికాలములో గొంతులోతు నీటిలో నిలబడి  ఇలా శీతోష్ణ బాధలను తట్టుకుంటూ

తితిక్షుర్యతవాగ్దాన్త ఊర్ధ్వరేతా జితానిలః
ఆరిరాధయిషుః కృష్ణమచరత్తప ఉత్తమమ్

మౌనముగా అంతరింద్రియ నిగ్రహము కలిగి ప్రశాంతముగా ఉండి, ప్రాణాయామ పరాయణుడై పరమాత్మను ఆరాధించదలచి ఉత్తమమైన తపస్సును ఆచరించాడు

తేన క్రమానుసిద్ధేన ధ్వస్తకర్మమలాశయః
ప్రాణాయామైః సన్నిరుద్ధ షడ్వర్గశ్ఛిన్నబన్ధనః

ఇలా పద్దతి ప్రకారం తపస్సు ఆచరిస్తుంటే మనసులో ఉన్న ప్రకృతి సంబంధమైన అన్ని దోషాలూ తొలగిపోయాయి. ఆశయః - కోశం. జీవుడు ఉన్న సంచీ జీవ కోశము. అన్ని కర్మలూ పోయి పరిశుద్ధమైన అంతఃకరణం కలవాడయ్యాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ప్రాణాయామముతో గెలిచాడు. మనలో ఉండే కామాదులు పోవాలంటే ప్రాణాయామమే మంచి దారి. శారీరకమే కాదు, మనసు యొక్క ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మనసు వశములో ఉంటుంది. మనసులో కామాదులు కలగవు. షడ్వర్గాన్ని పోగొట్టాలంటే ప్రధానమైన మార్గం ప్రాణాయామం. శరీర బంధాన్ని అలా తొలగించుకున్నాడు

సనత్కుమారో భగవాన్యదాహాధ్యాత్మికం పరమ్
యోగం తేనైవ పురుషమభజత్పురుషర్షభః

సనత్కుమారుడు చెప్పిన ఆధ్యాత్మ యోగమార్గాన్ని ఆచరిస్తూ, ఆయన చెప్పిన యోగమార్గముతో అదే యోగాన్నాశ్రయించి భగవదారాధన చేయడం మొదలుపెట్టాడు

భగవద్ధర్మిణః సాధోః శ్రద్ధయా యతతః సదా
భక్తిర్భగవతి బ్రహ్మణ్యనన్యవిషయాభవత్

ప్రాణాయామముతో శరీర బంధాన్ని శరీర స్పృషనూ మనసులో ఆశనూ కామ క్రోధాధి షడ్వర్గాలను జయిస్తే మనము భగవద్ధర్మాలు ఆచరించేవాడవుతాడు. ఇలా నిరంతరం పరమాత్మను సేవించడానికి ప్రయత్నశీలుడయ్యాడు. పరమాత్మ యందు అనన్యభక్తి కలిగింది - మరొకదాన్ని సేవించకుండా ఉండే భక్తి కలిగింది.

తస్యానయా భగవతః పరికర్మశుద్ధ
సత్త్వాత్మనస్తదనుసంస్మరణానుపూర్త్యా
జ్ఞానం విరక్తిమదభూన్నిశితేన యేన
చిచ్ఛేద సంశయపదం నిజజీవకోశమ్

నిరంతరం పరమాత్మ సేవ చేయడం వలన పరిశుద్ధ మనసు కలిగి అనన్య భక్తి కలిగి, పరమాత్మ యందు నిరంతర స్మరణ కలిగి జ్ఞ్యానమూ విరక్తీ కలింగింది (స్వస్వరూప జ్ఞ్యానం). ఈ తీక్షణమైన జ్ఞ్యానముతో జీవమునకూ జీవునికీ కోశమైన ప్రకృతితో సంబంధం పోతుంది. తపసు బాగా చేసి నియమాలాచరిస్తే నిరంతర స్మరణా, దాని వలన భక్తీ, దాని వలన విరక్తీ, దాని వలన జ్ఞ్యానమూ కలిగి జీవకోశం పోతుంది.

ఛిన్నాన్యధీరధిగతాత్మగతిర్నిరీహస్
తత్తత్యజేऽచ్ఛినదిదం వయునేన యేన
తావన్న యోగగతిభిర్యతిరప్రమత్తో
యావద్గదాగ్రజకథాసు రతిం న కుర్యాత్

ఇతర విషయ జ్ఞ్యానమంతా పోయి ఆత్మ స్వరూపమేమిటో తెలుసుకొని ఎలాంటి ఆసక్తీ ఆశా లేనివాడై, దాన్ని (శరీరాన్ని శరీర బంధాన్నీ) విడిచిపెడతాడు. ఏ జ్ఞ్యానముతో శరీర బంధాన్ని విడిచిపెడతాడో ఆ జ్ఞ్యానాన్ని కూడా వదిలిపెడతాడు. శరీరం వేరూ ఆత్మ వేరనే జ్ఞ్యానము కలిగినా పరమాత్మ యందు ప్రీతి కలిగిన నాడే యోగము కలిగినట్లు గుర్తు. పరమాత్మ కథల యందు ఎంత వరకూ ప్రీతి చూపరో అంతవరకూ యతి యోగమార్గములో జాగ్రత్త లేనట్లు గుర్తు( అంతవరకూ తప్పటడుగులేస్తూ ఉంటాడు)

ఏవం స వీరప్రవరః సంయోజ్యాత్మానమాత్మని
బ్రహ్మభూతో దృఢం కాలే తత్యాజ స్వం కలేవరమ్

ఇలా జీవాత్మలో పరమాత్మనుంచి, తాను పూర్తిగా పరమాత్మ స్వరూపాన్ని అలవరచుకొని కాల క్రమములో తన శరీరాన్ని విడిచిపెట్టాడు.

సమ్పీడ్య పాయుం పార్ష్ణిభ్యాం వాయుముత్సారయఞ్ఛనైః
నాభ్యాం కోష్ఠేష్వవస్థాప్య హృదురఃకణ్ఠశీర్షణి

మల ద్వారమును మడమతో గాలి బయటకు రాకుండా ఆపి, వాయువును పైకి తీసుకుని వెళ్ళి  (ఇడా పింగళలతో ఉన్న సుషుమ్నా నాడిని కదిలించాలంటే పాయు ద్వారాన్ని మూసి వేయాలి, అపుడు వాయువు పైకి వస్తుంది) నాభికి తీసుకువచ్చీ, ఉదరమూ హృదయమూ కంఠమూ చుబుకమూ ఆస్యమూ నాసాగ్రమూ భ్రూమధ్యమూ బ్రహ్మకపాలం వరకూ తీసుకు వచ్చాడు.

ఉత్సర్పయంస్తు తం మూర్ధ్ని క్రమేణావేశ్య నిఃస్పృహః
వాయుం వాయౌ క్షితౌ కాయం తేజస్తేజస్యయూయుజత్

బ్రహ్మకపాలములో వాయువును ఉంచి, "ఆశ వదులుకొని" (ప్రకృతి యందు ఏమాత్రమూ ఆశ లేకుండా ఉంటేనే మోక్షం లభిస్తుంది) . శరీరములో ఉన్న వాయువును పంచభూతాలలో ఉన్న వాయువుగా స్మరించాడు, భూమిని పంచభూతాలలో ఉన్న భూమిగా, అలా పంచభూతాత్మకమైన శరీరాన్ని పంచభూతాలలో కలిపాడు. అలా దేనితో దాన్ని కలిపాడు

ఖాన్యాకాశే ద్రవం తోయే యథాస్థానం విభాగశః
క్షితిమమ్భసి తత్తేజస్యదో వాయౌ నభస్యముమ్

రంధ్రాలని ఆకాశములో జలాన్ని జలములో ఆయా స్థానాలలో ఏర్పాటుచేసాడు. తామసాహంకారం (భూతాది) నుండి పంచభూతాలు ఎలా పుట్టాయో అందులోనే చేరుతాయి. భూమి జలములో జలము అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశములో ఆకాశము మహత్ తత్వములో (ఈ పంచభూతములు మహత్ తత్వములోంచి వచ్చిన తామసాహంకారమునుండి పుట్టినవి. మళ్ళీ వాటిలోనే కలిపాడు)

ఇన్ద్రియేషు మనస్తాని తన్మాత్రేషు యథోద్భవమ్
భూతాదినామూన్యుత్కృష్య మహత్యాత్మని సన్దధే

మనస్సుని ఇంద్రియములలో ఉంచాడు (మనసూ ఇంద్రియములూ రెండూ సాత్వికాహంకారం నుండే పుట్టాయి. ఇంద్రియాలు మనసుని ఆశ్రయిస్తాయి. విషయములు ఇంద్రియాలను ఇంద్రియాలు మనసునూ ఆకర్షిస్తాయి. ఉదా: శబ్దం చెవిని ఆక్రషిస్తుంది, చెవి మనసును ఆకర్షిస్తుంది మనసు బుద్ధిని ఆకర్షిస్తుంది. ఇంద్రియములు మనసును ఆకర్షిస్తాయి కాబట్టి మనసుని ఇంద్రియాలలో ఉంచాడు.) ఏ ఇంద్రియము ఏ గుణాన్ని గ్రహిస్తుందో ఆ గుణము ఏ మాత్రతో పుట్టిందో దానిలో పడేసాడు. శబ్దమునుండి పుట్టింది ఆకాశం, ఆకాశం యొక్క ఇంద్రియం శ్రోత్రం. శ్రోత్రేంద్రియం శబ్ద తన్మాత్రములో స్పర్శేంద్రియం రూప తన్మాత్రలో .... శబ్దాన్ని గ్రహించేది శ్రోత్రం కాబట్టి శ్రోత్రాన్ని శబ్ద తన్మాత్రలో ఉంచాడు. ఇలా అన్నిటినీ ఉంచి, వాటిని తామసాహంకారములో ఉంచి, వాటిని మహత్ తత్వములో, దాన్ని ప్రకృతి తత్వములో, దాన్ని ఆత్మ తత్వములో, దాన్ని పరమాత్మ తత్వములో ఉంచాడు.

తం సర్వగుణవిన్యాసం జీవే మాయామయే న్యధాత్
తం చానుశయమాత్మస్థమసావనుశయీ పుమాన్
నానవైరాగ్యవీర్యేణ స్వరూపస్థోऽజహాత్ప్రభుః

ఇలాంటి అన్ని గుణాలూ కలిగి ఉండే ప్రకృతిని ప్రకృతి సంబంధముతో వచ్చిన జీవుని యందు. అలాంటి జీవుని ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మలో చేర్చాడు. ఇలా జ్ఞ్యాన వైరాగ్య బలముతో తన స్వరూపాన్ని తాను ఏర్పరచుకుని శరీరాన్ని వదిలిపెట్టాడు

అర్చిర్నామ మహారాజ్ఞీ తత్పత్న్యనుగతా వనమ్
సుకుమార్యతదర్హా చ యత్పద్భ్యాం స్పర్శనం భువః

అతని పత్ని ఐన అర్చి, భూమి మీద పాదము కూడా మోపజాలని సుకుమారి, అరణ్యానికి వచ్చి తపస్సు చేస్తోన్న భర్తకు సేవ చేసింది. భర్త చేసే వ్రతాన్ని చూస్తూ భర్తను సేవిస్తూ వానప్రస్థముతో బాధను ఏ మాత్రము తెలుసుకోలేకపోయింది. పూర్తిగా బక్క చిక్కిపోయినా ఆమెకు బాధ కలగలేదు

అతీవ భర్తుర్వ్రతధర్మనిష్ఠయా శుశ్రూషయా చార్షదేహయాత్రయా
నావిన్దతార్తిం పరికర్శితాపి సా ప్రేయస్కరస్పర్శనమాననిర్వృతిః

భర్త యొక్క చేతి స్పర్శతో కలిగిన సంతోషముతో  బాధ తెలియలేదు

దేహం విపన్నాఖిలచేతనాదికం పత్యుః పృథివ్యా దయితస్య చాత్మనః
ఆలక్ష్య కిఞ్చిచ్చ విలప్య సా సతీ చితామథారోపయదద్రిసానుని

భర్త శరీరములో ఉండే అన్ని అవయవాలు తమ ధర్మాన్ని విడిచిపెట్టాయని తెలుసుకుంది. కొద్దిగా విలపించింది. పర్వత శిఖరము మీద చితి ఏర్పాటు చేసి, కొలనులో స్నానం చేసి ఔదార్యకర్మలు గల పృధు మహారాజుకు తర్పణాలిచ్చి,

విధాయ కృత్యం హ్రదినీజలాప్లుతా దత్త్వోదకం భర్తురుదారకర్మణః
నత్వా దివిస్థాంస్త్రిదశాంస్త్రిః పరీత్య వివేశ వహ్నిం ధ్యాయతీ భర్తృపాదౌ

స్వర్గములో ఉన్న దేవతలకు నమస్కారం చేసి మూడు సార్లు ప్రధక్షిణం చేసి భర్త పాదాలను స్మరిస్తూ అదే అగ్నిహోత్రములో చేరింది.

విలోక్యానుగతాం సాధ్వీం పృథుం వీరవరం పతిమ్
తుష్టువుర్వరదా దేవైర్దేవపత్న్యః సహస్రశః

అన్ని భోగాలనుభవించిన సుకుమారురాలు అగ్నిలో ప్రవేశించడం చూసి దేవపత్నులందరూ పొగిడారు

కుర్వత్యః కుసుమాసారం తస్మిన్మన్దరసానుని
నదత్స్వమరతూర్యేషు గృణన్తి స్మ పరస్పరమ్

ఆ మందర పర్వతం మీద పుష్ప వృష్టి కురిపించి దేవ వాద్యాలు మోగిస్తూ ఇలా అనుకున్నారు

దేవ్య ఊచుః
అహో ఇయం వధూర్ధన్యా యా చైవం భూభుజాం పతిమ్
సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ

ఈ మహాత్మురాలు ఎంత ధన్యురాలు. శ్రీమన్నారాయణున్ని లక్ష్మీ దేవి అనుసరించినట్లే సర్వాత్మనా (శరీరమున్నా లేకున్నా) భర్తనే అనుసరించింది.

సైషా నూనం వ్రజత్యూర్ధ్వమను వైన్యం పతిం సతీ
పశ్యతాస్మానతీత్యార్చిర్దుర్విభావ్యేన కర్మణా

ఈ ఒక్క సుకృతముతో పృధు చక్రవర్తి అంత తపస్సూ చేసి ఏ లోకాన్ని పొందాడో ఈమే ఆ లోకాలనే పొందింది. మనం చూస్తుండగానే మనందరినీ దాటి వెళ్ళిపోతోంది కేవలం భర్తృ శుశ్రూష వలన

తేషాం దురాపం కిం త్వన్యన్మర్త్యానాం భగవత్పదమ్
భువి లోలాయుషో యే వై నైష్కర్మ్యం సాధయన్త్యుత

పరమాత్మనాశ్రయించిన మానవులకు పొందరానిదేమైనా ఉందా? కామనా రహితముగా పనిని చేసే వారు, అల్పాయుష్కులైనా కోరికలను వదిలిపెట్టిన వారు ఎంత గొప్ప వారు.

స వఞ్చితో బతాత్మధ్రుక్కృచ్ఛ్రేణ మహతా భువి
లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విషజ్జతే

మోక్షసాధనమైన శరీరాన్ని పొందీ మళ్ళీ శరీరాన్నిచ్చే విషయాలను చింతించేవాడు ఆత్మ వంచన చేసుకున్నవాడు. ఆత్మకు ద్రోహం చేసినవాడు. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి మానవ జన్మ వస్తే విషయముల యందు ఆసక్తి కనపర్చిన వాడు ఆత్మద్రోహి

మైత్రేయ ఉవాచ
స్తువతీష్వమరస్త్రీషు పతిలోకం గతా వధూః
యం వా ఆత్మవిదాం ధుర్యో వైన్యః ప్రాపాచ్యుతాశ్రయః

ఇలా దేవతా స్త్రీలు పొగుడుతూ ఉంటే అర్చి తన భర్త లోకానికి వెళ్ళింది. (గురు వెళ్ళిన లోకానికి వెళ్ళడం శిష్యుడికీ భర్త వెళ్ళిన లోకానికి వెళ్ళడం భార్యకు మోక్షము కన్నా విశేషము)

ఇత్థమ్భూతానుభావోऽసౌ పృథుః స భగవత్తమః
కీర్తితం తస్య చరితముద్దామచరితస్య తే

ఇంత గొప్పవాడు పరమాత్మకు ప్రీతి పాత్రుడు ఈ పృధువు

య ఇదం సుమహత్పుణ్యం శ్రద్ధయావహితః పఠేత్
శ్రావయేచ్ఛృణుయాద్వాపి స పృథోః పదవీమియాత్

అద్భుతమైన ఆ చైత్రను ఇప్పటివరకూ చెప్పుకున్నాము. ఈ చరిత్రను శ్రద్ధతో సావధానముతో చదివిన వాడూ వినిపించేవాడూ విన్నవాడూ కూడా పృధు చక్రవర్తి వెళ్ళిన లోకానికి వెళ్తాడు

బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వీ రాజన్యో జగతీపతిః
వైశ్యః పఠన్విట్పతిః స్యాచ్ఛూద్రః సత్తమతామియాత్

ఈ చరిత్రను విన్న బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సునూ క్షత్రియుడు రాజ్యాన్నీ, వైశ్యుడు వ్యాపారములో రాణిస్తాడు శూద్రుడు ఉత్తముడవుతాడు.

త్రిః కృత్వ ఇదమాకర్ణ్య నరో నార్యథవాదృతా
అప్రజః సుప్రజతమో నిర్ధనో ధనవత్తమః

ఆదరముతో ఈ చరిత్రను మూడు సార్లు వింటే సంతానము లేని వారికి సంతానం కలుగుతుంది. ధనము లేని వారికి ధనమూ

అస్పష్టకీర్తిః సుయశా మూర్ఖో భవతి పణ్డితః
ఇదం స్వస్త్యయనం పుంసామమఙ్గల్యనివారణమ్

అంతంతమాత్రం పేరున్నవాడు మంచి పేరును పొందుతాడు, పరమ మూర్ఖుడు పండితుడవుతాడు. అన్ని శుభాలకూ మూలమూ, పురుషుల అశుభాన్ని తొలగిస్తుంది.

ధన్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం కలిమలాపహమ్
ధర్మార్థకామమోక్షాణాం సమ్యక్సిద్ధిమభీప్సుభిః
శ్రద్ధయైతదనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరమ్

ధన్యమైనదీ కీర్తినిస్తుంది ఆయుష్యాన్నిస్తుంది మోక్షాన్నిస్తుంది కలిమలాన్ని పోగొడుతుంది, ధర్మమునూ అర్థమునూ కామమునూ మోక్షమునూ కోరేవారికి సిద్ధి కలిగిస్తుంది. ఈ చరిత్రను శ్రద్ధగా వినాలి. చతుర్విధ పురుషార్థాలను ఇస్తుంది

విజయాభిముఖో రాజా శ్రుత్వైతదభియాతి యాన్
బలిం తస్మై హరన్త్యగ్రే రాజానః పృథవే యథా

యుద్ధానికి వెళ్ళేముందు ఈ చరిత్రను పారాయణం చేస్తే చంపడానికి వచ్చిన రాజులు అర్ఘ్య పాద్యాలతో వచ్చి పూజించి లొంగిపోతారు.

ముక్తాన్యసఙ్గో భగవత్యమలాం భక్తిముద్వహన్
వైన్యస్య చరితం పుణ్యం శృణుయాచ్ఛ్రావయేత్పఠేత్

విన్నంతసేపూ ఇతర విషయముల యందు సంగమును వదిలి పరమాత్మ యందు భక్తి కలిగినవాడై ఈ చరిత్రను శ్రద్ధతో వింటే

వైచిత్రవీర్యాభిహితం మహన్మాహాత్మ్యసూచకమ్
అస్మిన్కృతమతిమర్త్యం పార్థవీం గతిమాప్నుయాత్

విదురుడికి చెప్పిన ఈ విషయాన్ని విని ఈ చరిత్ర మీద మతి ఉంచితే పృధు చక్రవర్తి వెళ్ళిన లోకానికి వెళ్తాడు

అనుదినమిదమాదరేణ శృణ్వన్పృథుచరితం ప్రథయన్విముక్తసఙ్గః
భగవతి భవసిన్ధుపోతపాదే స చ నిపుణాం లభతే రతిం మనుష్యః

అనుదినమూ ప్రాతఃకాలము ఈ చరిత్రను వింటూ నలుగురికి చెబుతూ అన్ని కోరికలనూ విడిచిపెట్టినవాడు సంసారమనే సముద్రానికి పడవ అయిన పరమాత్మ పాదముల యందు నిశ్చలమైన అచంచలమైన భక్తి కలుగుతుంది.

                                             సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Sunday, March 3, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథులవిక్రమమ్
తత్రోపజగ్ముర్మునయశ్చత్వారః సూర్యవర్చసః

ప్రజలందరూ పృధు చక్రవర్తిని స్తోత్రం చేస్తుంటే సూర్యున్ని కూడా ప్రకాశింపచేసే తేజస్సు కలవారు నలుగురు వచ్చారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు.

తాంస్తు సిద్ధేశ్వరాన్రాజా వ్యోమ్నోऽవతరతోऽర్చిషా
లోకానపాపాన్కుర్వాణాన్సానుగోऽచష్ట లక్షితాన్

ఆకాశమునుండి తమ దివ్యమైన కాంతితో దిగుతున్న ఆ నలుగురు సిద్ధేశ్వరులూ సకల లోకములనూ పవిత్రము చేస్తూ ఉన్న వారిని పరివారముతో ఉన్న మహారాజు చూసాడు

తద్దర్శనోద్గతాన్ప్రాణాన్ప్రత్యాదిత్సురివోత్థితః
ససదస్యానుగో వైన్య ఇన్ద్రియేశో గుణానివ

అలాంటి వారు రాగానే లేచిన ప్రాణాలను తిరిగి తీసుకు రావడానికా అన్నట్లు రాజు కూడా లేచాడు. ఎప్పుడైతే ఆయా విషయములను అనుసరించి ఎలా లేస్తుందో రాజు తన వారందరినీ కూడ గట్టుకుని లేచాడు

గౌరవాద్యన్త్రితః సభ్యః ప్రశ్రయానతకన్ధరః
విధివత్పూజయాం చక్రే గృహీతాధ్యర్హణాసనాన్

పరమాత్మ యొక్క మొదటి సృష్టి వీరు. అంత పెద్దలు వచ్చారని గౌరవముతో తనను తాను నియమించుకున్నాడు, వినయముతో మెడ వంచుకుని ఉన్నాడు. అర్ఘ్య పాద్య ఆచమనీయ సింహాసనాలు ఇచ్చాక యధా విధిగా ఆరాధించాడు

తత్పాదశౌచసలిలైర్మార్జితాలకబన్ధనః
తత్ర శీలవతాం వృత్తమాచరన్మానయన్నివ

వారి పాదములు కడిగి ఆ పాద తీర్థముతో తన శిరోజాలకు ఉన్న చిక్కుని తొలగించుకున్నాడు. తాము ఇలా చేస్తేనే తక్కిన వారు అలా చేస్తారు. తమకంటే ముందు ఉన్న శీలవంతులు ఎలా నడిచారో అలా వారు కూడా నడుస్తూ

హాటకాసన ఆసీనాన్స్వధిష్ణ్యేష్వివ పావకాన్
శ్రద్ధాసంయమసంయుక్తః ప్రీతః ప్రాహ భవాగ్రజాన్

బంగారు సింహాసనము మీద అగ్నిహోత్రములా కూర్చున్న వారిని శ్రద్ధతో నియమముతో పూజించి సంతోషించి, శంకరునికి అన్నలు అయిన ఆ సనకాదులను శ్రద్ధతో నియమముతో ప్రీతితో భక్తితో జాగ్రత్తగా ఇలా మాట్లాడాడు.

పృథురువాచ
అహో ఆచరితం కిం మే మఙ్గలం మఙ్గలాయనాః
యస్య వో దర్శనం హ్యాసీద్దుర్దర్శానాం చ యోగిభిః

అన్ని శుభములకూ నిలయమైన మీరు వచ్చారంటే నేను ఏ పుణ్యము చేసాను. యోగులకు కూడా దర్శనమీయని మీ దర్శనమయ్యిందంటే నేను పెద్ద పుణ్యమే చేసుకుని ఉంటాను

కిం తస్య దుర్లభతరమిహ లోకే పరత్ర చ
యస్య విప్రాః ప్రసీదన్తి శివో విష్ణుశ్చ సానుగః

తన పరివారముతో ఉన్న విష్ణువూ శంకరుడూ బ్రాహ్మణులూ ప్రసన్నమైనవాడికి లభించరానిదేముంది

నైవ లక్షయతే లోకో లోకాన్పర్యటతోऽపి యాన్
యథా సర్వదృశం సర్వ ఆత్మానం యేऽస్య హేతవః

మీలాంటి వారు అన్ని లోకాలనూ సంచరిస్తూ ఉంటారు గానీ మిమ్ములని లోకములూ చూడలేవు. నిరంతర పరమాత్మ ధ్యానములో ఉన్న మీరు కూడా ఈ లోకాలని చూడరు ఎలా ఐతే అంతరాత్మను అక్కడే ఉన్న ఇంద్రియములూ మనసూ, ఇంద్రియ విషయాలనూ మనసునూ సర్వ వ్యాపి  ఆత్మా చూడలేవో.

అధనా అపి తే ధన్యాః సాధవో గృహమేధినః
యద్గృహా హ్యర్హవర్యామ్బు తృణభూమీశ్వరావరాః

ధనమునకు యోగ్యులూ లేదా ధనము కలవారినీ ధన్యులు అంటారు. కానీ మీలాంటి మహానుభావుల దర్శన స్పర్శలు కలిగితే ధనము లేకున్నా గృహస్థులూ సాధువులూ ధన్యులే. ఎవరి ఇంటిలో ఉత్తముల పాదములను దర్భలతో జలములతో పూజా ద్రవ్యములతో ఆరాధిస్తారో వారు ధనము లేకున్నా ధన్యులే.

వ్యాలాలయద్రుమా వై తేష్వరిక్తాఖిలసమ్పదః
యద్గృహాస్తీర్థపాదీయ పాదతీర్థవివర్జితాః

తీర్థములను కూడా పవిత్రము చేసే పవిత్రమైన పాదాముల తీర్థ స్పర్శ పడని ఇళ్ళు ఎంత ఐశ్వర్యమున్నా పాములు ఉండే వృక్షాల (ఉదా చందన వృక్షం) వంటివి.

స్వాగతం వో ద్విజశ్రేష్ఠా యద్వ్రతాని ముముక్షవః
చరన్తి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహన్తి చ

మీకు స్వాగతం. మీరు మహానుభావులూ, బ్రాహ్మణోత్తములు, మోక్షమును కోరి బాల్యములోనే పెద్ద వ్రతాలను (శరణాగతి వ్రతం) ఆచరించిన వారు

కచ్చిన్నః కుశలం నాథా ఇన్ద్రియార్థార్థవేదినామ్
వ్యసనావాప ఏతస్మిన్పతితానాం స్వకర్మభిః

నేనేంత జాగ్రత్తగా ఉన్నాను అనుకున్నా మాకు కుశలమే లేదు ఎందుకంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు మాత్రమే తెలిసిన వారము. మా జ్ఞ్యానమంతా ఈ ఐదింటి కోసమే. విషయములను పొందే మార్గము తెలుసుకో ప్రయత్నించే మాకు కుశలము లేదు. సంసారములో వ్యసనాలనే  (కష్టాలు) విత్తనాలు విత్తుతాము. దానిలో కర్మలతో పడ్డాము. అలాంటి మాకు క్షేమముంటుందా.

భవత్సు కుశలప్రశ్న ఆత్మారామేషు నేష్యతే
కుశలాకుశలా యత్ర న సన్తి మతివృత్తయః

మీకు  కుశలమా అని ప్రశించడములోనే అర్థము లేదు. ఎందుకంటే మీకు అకుశలము అన్న మాటే లేదు. మీరంతా ఆత్మారాములు. పరమాత్మ యందే రమిస్తూ ఉంటారు. క్షేమమూ అకుశలమూ అన్న ఆలోచనే లేదు. సంసారముంటేనే బాధ.
మీరు క్షేమముగా ఉన్నారా అని అడగనవసరం లేదు

తదహం కృతవిశ్రమ్భః సుహృదో వస్తపస్వినామ్
సమ్పృచ్ఛే భవ ఏతస్మిన్క్షేమః కేనాఞ్జసా భవేత్

మీ మీద నమ్మకం కలిగింది నాకు. తపస్వులైన మీకు నేను సుహృత్. మిమ్మలని ఒక చిన్న మాట అడుగుతున్నాను. ఈ సంసారములో సులభముగా ఎలా క్షేమమును పొందవచ్చు?

వ్యక్తమాత్మవతామాత్మా భగవానాత్మభావనః
స్వానామనుగ్రహాయేమాం సిద్ధరూపీ చరత్యజః

మీరు వచ్చారంటే మాలాంటి వారిని అనుగ్రహించడానికి పరమాత్మే వచ్చాడు. ఈ మాట నిజము. పుట్టుక లేని పరమాత్మ మాలాంటి వారిని అనుగ్రహించడానికి చర రూపములో సిద్ధుడిలాగ వచ్చాడు. మనసు గలవారందరికీ ఆత్మ. అందరికీ అంతర్యామిగా ఉన్న పరమాత్మ. ఆత్మ జ్ఞ్యానన్ని కలిగించేవాడు తన వారిననుగ్రహించడానికి ఈ భూమి మీద సిద్ధుల రూపములో సంచరిస్తూ ఉంటాడు.

మైత్రేయ ఉవాచ
పృథోస్తత్సూక్తమాకర్ణ్య సారం సుష్ఠు మితం మధు
స్మయమాన ఇవ ప్రీత్యా కుమారః ప్రత్యువాచ హ

మంచి మాట విన్న బ్రహ్మ మానస పుత్రులు. పృధువు చెప్పినది సారము, చక్కగా చెప్పాడు, తక్కువ మాటలు చెప్పాడు, వినటానికి సొంపుగా ఉన్న మాటలు చెప్పాడు. అవి విన్న కుమారులలో సనత్కుమారుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు.

సనత్కుమార ఉవాచ
సాధు పృష్టం మహారాజ సర్వభూతహితాత్మనా
భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ

మహారాజా బాగా అడిగావు. నీవడిగినది నీ కోసము కాదు. నీవు అన్నీ తెలిసిన వాడవు.అయినా సకల ప్రాణుల హితమును కోరి అడిగావు. మంచివారెప్పుడూ తమ కోసం దేనినీ అడగరు.

సఙ్గమః ఖలు సాధూనాముభయేషాం చ సమ్మతః
యత్సమ్భాషణసమ్ప్రశ్నః సర్వేషాం వితనోతి శమ్

సజ్జన సంగం ఇద్దరికీ పనికొస్తుంది. మోక్షం కావాలనుకున్న వారికీ సంసారము బాగా ఉండాలి అన్నవారికీ. ఇద్దరికీ సాధు సంగం సమ్మతమే. వారితో మాట్లాడుట అడుగుటా అందరికీ శుభాన్ని కలిగిస్తాయి.

అస్త్యేవ రాజన్భవతో మధుద్విషః పాదారవిన్దస్య గుణానువాదనే
రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలమన్తరాత్మనః

నీకు చెప్పడం పెద్ద కష్టము కాదు. ప్రధానమైన పరమాత్మ యందు భక్తి నీకుంది. పరమాత్మ పాదముల కథలను వినడములో రతి నీకు ఉంది. అన్నీ బాగా ఉన్నవారికి కూడా పరమాత్మ యందు భక్తి ఉండదు. పరమాత్మ పాదారవింద కథామృతము యందు ప్రీతి మనసు యొక్క మలాన్ని పోగొడుతుంది.

శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సధ్ర్యగ్విమృశేషు హేతుః
అసఙ్గ ఆత్మవ్యతిరిక్త ఆత్మని దృఢా రతిర్బ్రహ్మణి నిర్గుణే చ యా

మానవులకు క్షేమము కలగాలంటే ఒకటే మార్గము. ఆత్మ కాని యందు వైరాగ్యం, ఆత్మ యందు రతి. ఇది ఉంటే అందరూ బాగు పడతారు. నిర్గుణుడైన పరమాత్మ యందు దృఢమైన ప్రీతి ఉండాలి. ప్రకృతి యందు శబ్దాది విషయాల యందు విరక్తి ఉండాలి

సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్ఠయా
యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవఃకథయా పుణ్యయా చ

సంసారం యందు విరక్తి ఎలా వస్తుంది? దానికి శ్రద్ధ కావాలి. పరమాత్మ యొక్క ధర్మాలైన దర్శన స్పర్శన కీర్తనలయందు ప్రీతి కావాలి. తత్వాన్నిన్ తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. ఆధ్యాత్మిక యోగ నిష్ఠ ఉండాలి (పరమాత్మ జీవాత్మ ప్రకృతి గురించి తెలుసుకుని వాటిలో ప్రవర్తించడానికి కావలసినయోగం). ఇవాన్నీ వచ్చాక పరమాత్మ యొక్క ఆరాధనతో, అది కలగాలంటే భగవంతుని యందు ప్రీతి కలగాలి. అది కలగాలంటే ఇష్టమున్నా లేకున్నా పరమాత్మ కథలను వింటూ ఉండాలి.

అర్థేన్ద్రియారామసగోష్ఠ్యతృష్ణయా తత్సమ్మతానామపరిగ్రహేణ చ
వివిక్తరుచ్యా పరితోష ఆత్మని వినా హరేర్గుణపీయూషపానాత్

అర్థములు (శద్బాది విషయములు ) ఇంద్రియములూఉ (చర్మమూ మొదలైన ఇంద్రియాలు) వీటితో రమించేవారితో కలిసి ఉండాలనే కోరిక లేకుండా ఉండాలి. అలాంటి వారికి ఇష్టమైన భోగములనీ స్వీకరించవద్దు.
వివిక్తరుచ్యా - ఏకాంతమైన ప్రీతి. పరమాత్మ యందు మాత్రమే ప్రీతి ఉండాలి. సాంసారిక విషయభోగులతో సంబంధములేని ఏకాంతముతో ఉండి పరమాత్మ గుణామృత పానము కంటే మరేమీ నచ్చకూడదు.

అహింసయా పారమహంస్యచర్యయా స్మృత్యా ముకున్దాచరితాగ్ర్యసీధునా
యమైరకామైర్నియమైశ్చాప్యనిన్దయా నిరీహయా ద్వన్ద్వతితిక్షయా చ

కాయిక వాచిక మానసిక అహింస కావాలి. ఎదుటి వాడిని నిందించడం కూడా హింసే. సన్యాసులూ పరమాత్మ నిష్ఠులు, నిరంతరమూ పరమాత్మ నామస్మరణ, పరమాత్మ అవతార కథలనే అమృతాన్ని  యమ నియమములతో ఎలాంటి కోరికా లేకుండా ఎదుటివారిని పొరబాటున కూడా నిందించకుండా దేని యందూ ఆశ లేకుండా ద్వంద్వ తితీక్ష (చలీ వేడీ సుఖమూ దుఃఖమూ ఒక్క లాగే చూడాలి, తట్టుకోగలగాలి)

హరేర్ముహుస్తత్పరకర్ణపూర గుణాభిధానేన విజృమ్భమాణయా
భక్త్యా హ్యసఙ్గః సదసత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాఞ్జసా రతిః

అది కలగాలంటే నిరంతరమూ పరమాత్మ వీర్య చరితమును చెవులకు ఇంపుగా వినాలి. దానితో రోజు రోజుకూ విజృంభించిన భక్తితో సత్తునూ అసత్తునూ తలవకుండా ఆత్మ కాని దాని యందు ప్రకృతి విషయముల యందూ అసంగముతో ఉంటే గుణాతీతమైన పరమాత్మ యందు సులభముగా ప్రీతి కలుగుతుంది.

యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమానాచార్యవాన్జ్ఞానవిరాగరంహసా
దహత్యవీర్యం హృదయం జీవకోశం పఞ్చాత్మకం యోనిమివోత్థితోऽగ్నిః

ఇలా పరమాత్మ యందు నైష్ఠికమైన ప్రీతీ భక్తీ కలిగితే, ఒక అచార్యుడు దొరుకుతాడు ("ఆచార్యవాన్‌ పురుషోవేద''  - ఆచార్యుడున్న వాడే జ్ఞాని కాగలడు అనీ ఛాందోగ్యోపనిషత్ చెబుతున్నవి) దాని వలన జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలుగుతుంది. జ్ఞ్యాన వైరాగ్యాల వలన జీవునికి కోశముగా ఉండే పంచభూతాత్మకమైన ప్రకృతిని ధ్వంసం చేస్తుంది, దహింపచేస్తుంది. ఆత్మ ఉండేదీ మనసు ఉండేదీ జీవకోశముండేదీ శరీరములోనే. అగ్ని అరణి నుండి పుడుతుంది (వెదురు బొంగులు), అయినా ఆ వెదురు బొంగును కూడా కాలుస్తుంది. అలాగే శరీరములో పుట్టిన జ్ఞ్యానాగ్ని శరీరాన్ని దహిస్తుంది.

దగ్ధాశయో ముక్తసమస్తతద్గుణో నైవాత్మనో బహిరన్తర్విచష్టే
పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్స్వప్నే యథా పురుషస్తద్వినాశే

దీని వలన వాసన దగ్ధమవుతుంది. ప్రకృతికి కావలసిన అన్ని గుణముల నుండీ విడివడి, ఆత్మలోపలా ఉండడు ఆత్మ బయటా ఉండడు. అంటే కైవల్యమూ ఉండదు, సంసారమూ ఉండదు. జీవాత్మకూ పరమాత్మకూ వ్యవధానము లేకుండా ఉండాలి. (అద్వైతం ప్రకారం అవిద్య ఇద్దరి మధ్యా వ్యవధానముగా ఉంటుంది) అంతర్యాత్మగా ఉన్న పరమాత్మతో జీవాత్మ శరీరములోపల ఎలా కలిసి ఉంటాడో, శరీరము నుండి విడివడిన తరువాత కూడా జీవాత్మ పరమాత్మతో కలిసి ఉండాలి. జీవుడు హృదయములో ఉంటాడు, అందులో పరమాత్మ ఉంటాడు. ఇద్దరికీ అడ్డముగా సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం పోతే జీవుడు పరమాత్మతో కలుస్తాడు. స్వప్నములో విషయాలు మెలకువ రాగానే పోయినట్లుగా. జీవుడు ఆచరించిన పుణ్యపాపాలను అనుభవించడానికి ఉన్న లోకాలు సరిపోక స్వప్నలోకం కూడా సృష్టించబడింది. స్వప్నము కూడా పరమాత్మ ఏర్పరచిన లోకమే. స్వప్నములో ఉన్నంత కాలం ఉన్నట్లుగా ఉండి లేవగానే ఎలా పోతున్నాయో, ప్రకృతి ఉన్నంతకాలం ఉంది అంటూ అది పోవగానే అది లేదని తెలుసుకుంటాము
స్వప్నావస్థలో ఉన్నవి జాగృదావస్థలో లేనట్లుగా ఎలా తెలుసుకుంటామో అజ్ఞ్యానావస్థలో ఉన్నవి జ్ఞ్యానావస్థలో లేవని తెలుసుకుంటాము

ఆత్మానమిన్ద్రియార్థం చ పరం యదుభయోరపి
సత్యాశయ ఉపాధౌ వై పుమాన్పశ్యతి నాన్యదా

ఇక్కడ ఆత్మ అంటే శరీరం. ఆత్మానం - శరీరము. ఇంద్రియార్థమంటే శబ్దాది విషయాలు. భోగ్యములు విషయములూ భోగస్థానం శరీరం భోగోపకరణం ఇంద్రియాలు. శరీరేంద్రియ విషయాలు వాసన ఉన్నప్పుడే, ఉపాధి ఉన్నప్పుడే చూస్తాడు.

నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుషః
ఆత్మనశ్చ పరస్యాపి భిదాం పశ్యతి నాన్యదా

పూర్వ జన్మ సంస్కారం, వాటితో ఉన్న శరీరం ఉన్నప్పుడే "ఇది వేరూ అది వేరు" అని చూస్తారు. జడాదావపి - ప్రకృతి పురుషునకూ తేడా చూస్తాము ఈ శరీరం సంబంధం ఉన్నంతవరకూ.

ఇన్ద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః
చేతనాం హరతే బుద్ధేః స్తమ్బస్తోయమివ హ్రదాత్

శరీరేంద్రియ విషయాలు. మనస్సును ఇంద్రియాలు ఆకర్షిస్తాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములతో ఆకర్షింపబడిన ఇంద్రియాలు మనసును ఆకర్షిస్తాయి, బుద్ధికున్న చైతన్యాన్ని  హరిస్తాయి. దాని వలన జీవాత్మను  అటువైపు లాగి సంసారములో పడేస్తాయి. అంటే భయంకరమైనవి విషయాలు. సంసారములో పడటానికీ మోక్షానికి వెళ్ళకుండా ఉండటానికీ ఇక్కడే మనని  బంధించడానికీ కారణాలు ఇవే - శబ్ద స్పర్శ రూప రస గంధములు. విషయాలు ఇంద్రియాలని, ఇంద్రియాలు మనసునీ, మనసు బుద్ధినీ ఆకర్షిస్తాయి. పొలాల్లో నీళ్ళు పడటానికి కలవలుంటాయి, అక్కడే గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి ఆ నీళ్ళను లాక్కుని బ్రతుకుతుంది, వరద పెరగగానే ఆ గడ్డి కుప్ప ఊడి ఒడ్డును కూడా లాగుకొని నీటిలో పడుతుంది. మనము కూడా విషయాలచే ఆకర్షింపబడి బుద్ధిని కూడా అందులో పడేస్తాము. ఇంద్రియములు విషయముల వెంట వెళతాయి. విషయములు ఇంద్రియాలకు ఆహారం. విషయాలకీ ఇంద్రియాలకీ చైతన్యం ఉండదు.

భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశః స్మృతిక్షయే
తద్రోధం కవయః ప్రాహురాత్మాపహ్నవమాత్మనః

ఎప్పుడైతే బుద్ధి యొక్క చైతన్యం హరించబడుతుందో స్మృతి పోతుంది. స్మృతిపోగానే జ్ఞ్యానమూ పోతుంది. జ్ఞ్యానభ్రంశమే ఆత్మ స్వరూపం తెలియడానికి అడ్డు, ఆత్మను కప్పి పుచ్చుతుంది, తెలియకుండా చేస్తుంది.

నాతః పరతరో లోకే పుంసః స్వార్థవ్యతిక్రమః
యదధ్యన్యస్య ప్రేయస్త్వమాత్మనః స్వవ్యతిక్రమాత్

జ్ఞ్యాన భ్రంశము కంటే జీవునికి వచ్చే నష్టమింకోలేదు. పురుషునికి ఇంత కంటే స్వార్థ (స్వస్వరూప జ్ఞ్యానం) భంగం లేదు. ఆత్మ కంటే పరమాత్మ కంటే భిన్నమైన విషయములు ప్రీతిగా అనిపించడమే పెద్ద ఆపద. మన దారి నుంచి మనని తప్పించేది మనకు వాస్తవముగా ఏది ప్రియమో, అది కాక అన్యమైనవి ప్రియముగా అనిపించడం. చెడ్డగా ఉన్న దానిని మంచీ అనుకోవడం వలన మంచిగా ఉన్న మనం చెడైపోతున్నాము.

అర్థేన్ద్రియార్థాభిధ్యానం సర్వార్థాపహ్నవో నృణామ్
భ్రంశితో జ్ఞానవిజ్ఞానాద్యేనావిశతి ముఖ్యతామ్

మనను నిండా ముంచేది విషయాలు ఇంద్రియాలూ గురించి ఆలోచించుటే. అర్థేంద్రియాల మీద కలిగిన ఆసక్తి మరి దేని మీద ఆసక్తి లేకుండా చేస్తుంది. అర్థేంద్రియాల మీద కలిగిన ఆసక్తి వలన మన మీద మనమే ఆసక్తిని పోగొట్టుకుంటాము.
ఇంద్రియార్థాలను నిరంతరం ధ్యానించుటే అన్ని విషయాలను తెలుసుకోకుండా చేస్తోంది. జ్ఞ్యానమూ (మోక్షము మీద బుద్ధి) విజ్ఞ్యానము (శాస్త్ర జ్ఞ్యానం) లేకుండా పోతున్నయి. ఇలా రెంటి వలనా భ్రష్టులమై మనము చాలా ముఖ్యులమవుతాము (స్థావర సృష్టిని ముఖ్యసృష్టీ అంటారు. అంటే మొద్దులవుతామన్నమాట)

న కుర్యాత్కర్హిచిత్సఙ్గం తమస్తీవ్రం తితీరిషుః
ధర్మార్థకామమోక్షాణాం యదత్యన్తవిఘాతకమ్

తీవ్రమైన తమస్సునూ అజ్ఞ్యానాన్నీ సంసారాన్నీ దాటాలి అంటే విషయముల యందు ఆసక్తి కలిగి ఉండకూడదు. ఈ సంగము ఎంత ప్రమాదకారీ అంటే ధర్మాన్నీ అర్థాన్నీ కామాన్నీ మోక్షాన్నీ పాడుచేస్తుంది.

తత్రాపి మోక్ష ఏవార్థ ఆత్యన్తికతయేష్యతే
త్రైవర్గ్యోऽర్థో యతో నిత్యం కృతాన్తభయసంయుతః

తక్కిన మూడూ పోయినా మోక్షము పోవడం వలన ఎక్కువ నష్టము కలుగుతుంది. ఆత్యంతికమైనది మోక్షము. దానికీ భంగము కలిగించి త్రైవర్గికానికి (ధర్మార్థ కామాలకు) భంగం కలిగిస్తుంది. అసలు నాశము లేని మోక్షానికి భంగం వస్తే మిగతా వాటి సంగతి వేరే చెప్పాలా. త్రివర్గము (ధర్మార్థ కామాలు) ప్రతీ క్షణమూ కాలానికి భయపడుతూ ఉంటుంది. కాల భయం లేనిది మోక్షానికి. స్వస్వరూప జ్ఞ్యానము లేని వారికి ధర్మమూ అర్థమూ జ్ఞ్యానమూ వస్తే ఏమి పోతే ఏమి. ధర్మార్థ కామాలు మనము కోరుకున్నా కోరకున్నా వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పటికీ నాశము లేని మోక్షాన్ని కోరాలు

పరేऽవరే చ యే భావా గుణవ్యతికరాదను
న తేషాం విద్యతే క్షేమమీశవిధ్వంసితాశిషామ్

పరావర భావములు (శరీరమూ మనసు ఇంద్రియములూ విషయములూ బుద్ధీ) గుణవ్యతికరము (అంటే గుణ వైషమ్యాలు వస్తే, అంటే సృష్టి వస్తే) ఐతేనే పుడతాయి. అంటే సృష్టి జరిగితేనే "ఇది శరీరమూ మనసూ ఆత్మ బుద్ధీ ఎక్కువా తక్కువా " అనిపించే బుద్ధి పుడుతుంది. సృష్టిననుసరించే ఈ భావాలన్నీ కలుగుతాయి. సృష్టి తరువాత కలిగే శరీరేంద్రియ విషయ భేధాలకి క్షేమమే లేదు. ఈశవిధ్వంసితాశిషామ్ - పరమాత్మ చేత నాశము చేయబడే స్వరూపము గలవి. వస్తువు పుట్టిందంటే దాని నాశము కూడా పుడుతుంది. ఈ భావాలన్నీ సృష్టి వెంట వచ్చేవి, ప్రళయం వెంట పోయేవి.

తత్త్వం నరేన్ద్ర జగతామథ తస్థూషాం చ
దేహేన్ద్రియాసుధిషణాత్మభిరావృతానామ్
యః క్షేత్రవిత్తపతయా హృది విశ్వగావిః
ప్రత్యక్చకాస్తి భగవాంస్తమవేహి సోऽస్మి

నేను భగవంతుని అంశే. స్థావర జంగమాలకూ దేహ ఇంద్రియ ప్రాణ బుద్ధీ ఆత్మా ఉంటాయి. క్షేత్రవిత్తపతయా  - శరీరాన్ని తెలుసుకునేది ఆత్మ (శరీరము వేరు నేను వేరు). ఆ జ్ఞ్యానం కలగడానికి ఆ ఆత్మ శరీరములో పడే తాపమునకు ఏదీ సాటి లేదు. హృది విశ్వగావిః - హృదయములో అనేకమైన ఇంద్రియముల చేత. దేన్ని చూచి నేను ఆత్మ అనుకుంటున్నానో దేన్ని సమగమాన్ని సుఖమనుకుంటున్నానో, దేని ప్రవృత్తిని బలమనుకుంటున్నానో, దేని వ్యవహారాన్ని జ్ఞ్యానమనుకుంటున్నానో అది అంతా నశ్వరములూ, అనిత్యములూ క్షుద్రములూ దుఃఖమును కలిగించేవి అనే భావనను మనలో ఉన్న పరమాత్మ ప్రతీ క్షణమూ చెబుతున్నాడు. పరమాత్మ ఆవరించి ఉన్న జీవాత్మ ఆవరించిన ఉన్న శరీరములో ఉన్న వాడిని నేను. నేను పరమాత్మకు సంబంధించిన వాడిని, జ్ఞ్యాన స్వరూపిని. చలీ వేడీ సుఖమూ దుఃఖమూ ఏమీ లేని పరమాత్మ నాలో ఉన్నాడు.
పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మను నేను. భగవాంస్తమవేహి సోऽస్మి - సః  భగవన్ అహం అస్మి. అదే సోऽస్మి - సోహం. పరమాత్మ అంతరాత్మగా ఉన్న నాకు సుఖ దుఃఖ రాగా ద్వేషాదులూ సంగములూ లేవు. విషయములచేత ఆకర్షింపబడిన మనసు చేత ఆకర్షింపబడిన బుద్ధిని కలగకుండా ఉన్న నాడు ఈ విషయం తెలుస్తుంది.

యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి
మాయా వివేకవిధుతి స్రజి వాహిబుద్ధిః
తం నిత్యముక్తపరిశుద్ధవిశుద్ధతత్త్వం
ప్రత్యూఢకర్మకలిలప్రకృతిం ప్రపద్యే

"ఇది సత్, ఇది అసత్, ఇది ప్రకృతి ఇది జీవాత్మ" అనే బుద్ధి, జ్ఞ్యానం లేకుంటే పూలదండను పాము అనుకున్నట్లు భ్రమింపచేస్తాయి. వివేకం లేని చోట ఈ మాయ ప్రకాశిస్తుంది. వాస్తవముగా పరమాత్మ నిత్యముక్తపరిశుద్ధవిశుద్ధతత్త్వం. పరమాత్మకు గానీ జీవాత్మకు గానీ సంసారముతో సంబంధము లేదు. పరమాత్మ నిత్యుడూ పరిశుద్ధుడు, ఎలాంటి దోషమూ లేని వాడు, అజ్ఞ్యానం లేని వాడు (ఇంద్రియార్థములే జ్ఞ్యానమునకు ఆవరణములు),  కర్మల చేత ఏర్పడే ప్రకృతికి పరమాత్మ ఎదురు. అటువంటి పరమాత్మను శరణు వేడుతున్నాను.

యత్పాదపఙ్కజపలాశవిలాసభక్త్యా
కర్మాశయం గ్రథితముద్గ్రథయన్తి సన్తః
తద్వన్న రిక్తమతయో యతయోऽపి రుద్ధ
స్రోతోగణాస్తమరణం భజ వాసుదేవమ్

సత్పురుషులు కర్మకు మూలమైన, కూర్చబడిన (గ్రధితం) వాసనా సంస్కారాన్ని పరమాత్మ యొక్క పాద పద్మ దళ సౌందర్య భక్తి కలవాడు కూర్చబడిన వాసనను తొలగిస్తాడు. రిక్తమతయో - ఏమీ లేని దాన్ని ఆలోచించేవారు, శూన్యము గురించి ఆలోచించేవారు. న రిక్తమతయో - శూన్యాన్ని గురించి ఆలోచించని వారు, ఇంద్రియాలను అరికట్టిన యతులు కూడా (రుద్ధ స్రోతోగణా, స్రోతమంటే ఇంద్రియములు, నిరంతరం ప్రవహించేవి. ) ఇంకొక పుట్టుక రాకుండా సంస్కారాన్ని వాసననూ తొలగించుకుంటారు. అలాంటి దానికి ఆశ్రయమైన వాసుదేవున్ని భజించు.

కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం
షడ్వర్గనక్రమసుఖేన తితీర్షన్తి
తత్త్వం హరేర్భగవతో భజనీయమఙ్ఘ్రిం
కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరార్ణమ్

నడిపేవాడు లేని పడవతో, లేదా, పడవలేకుండా (అప్లవేశా) ముసళ్ళూ సొరచేపలూ ఉన్న సంసార సముద్రాన్ని దాటాలనుకోవడం చాలా కష్టము. పరమాత్మ యొక్క సేవించదగిన పాదమును పడవగా చేసుకుని కష్టాన్ని దాటు. అది లేని వారికి ఈ సంసార సాగరం దాట శక్యము గానిది.

మైత్రేయ ఉవాచ
స ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా
దర్శితాత్మగతిః సమ్యక్ప్రశస్యోవాచ తం నృపః

ఆత్మజ్ఞ్యానం కల సనత్కుమారునిచేత ఆత్మ స్వరూపం చూపెట్టబడి మహారాజు స్తోత్రం చేసి ఇలా అన్నాడు

రాజోవాచ
కృతో మేऽనుగ్రహః పూర్వం హరిణార్తానుకమ్పినా
తమాపాదయితుం బ్రహ్మన్భగవన్యూయమాగతాః

ఆర్తుల మీద దయ కలిగిన పరమాత్మ మొదట నన్ను అనుగ్రహించాడు. పరమాత్మ చూపిన అనుగ్రహాన్ని దృఢం చేయడానికి మీరొచ్చారు.

నిష్పాదితశ్చ కార్త్స్న్యేన భగవద్భిర్ఘృణాలుభిః
సాధూచ్ఛిష్టం హి మే సర్వమాత్మనా సహ కిం దదే

పరమ దయాళువులైన మీరు చేయవలసిన పనిని పూర్తి చేసారు. మీరనుభవించి వదిలిపెట్టినదే నా దగ్గర ఉంది. అది అంతా మీ సొమ్మే (గొప్పవారు వద్దనుకున్నదే మనకు దక్కుతుంది). అది మీకిస్తే మీది మీకిచ్చినట్లే అవుతుంది

ప్రాణా దారాః సుతా బ్రహ్మన్గృహాశ్చ సపరిచ్ఛదాః
రాజ్యం బలం మహీ కోశ ఇతి సర్వం నివేదితమ్

నావి అనుకున్నవన్నీ మొత్తం మీకే నివేదిస్తున్నాను.

సైనాపత్యం చ రాజ్యం చ దణ్డనేతృత్వమేవ చ
సర్వ లోకాధిపత్యం చ వేదశాస్త్రవిదర్హతి

వేద శాస్త్రములు తెలిసినవాడు సేనాపతీ కాగలడూ, రాజూ కాగలడూ కోశాధికారీ కాగలడూ సర్వలోకాధిపతీ కాగలడు.

స్వమేవ బ్రాహ్మణో భుఙ్క్తే స్వం వస్తే స్వం దదాతి చ
తస్యైవానుగ్రహేణాన్నం భుఞ్జతే క్షత్రియాదయః

ఒక్క బ్రాహ్మణుడే తన వస్తువును తాను తింటున్నాడు, తన ఇంటిలో తాను ఉంటున్నాడు, అటువంటి బ్రాహ్మణుడు దయ చూపితేనే క్షత్రియులూ, మిగతా వారు అన్నం తింటున్నారు. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తేనే వర్షమొస్తుంది.

యైరీదృశీ భగవతో గతిరాత్మవాద
ఏకాన్తతో నిగమిభిః ప్రతిపాదితా నః
తుష్యన్త్వదభ్రకరుణాః స్వకృతేన నిత్యం
కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రమ్

మీరు ఇలాంటి భగవత్స్వరూప స్వభావాలనూ ఆత్మ వాదాన్ని నిశ్చయముగా వేదములతో సహా మాకు ప్రతిపాదించారు. మీకంటూ ఇవ్వడానికి నాదంటూ ఏమీ లేదు. ఇలాంటి సంసారములో పడి బాధ పడుతున్న మూర్ఖులకు ఇలాంటి జ్ఞ్యానం కలిగించామని మీరే సంతోషించండి. మీరు చేసిన వాటితోనే మీరు సంతోషించండి. మీకు సంతోషాన్నిచ్చే పని మేము చేయలేము. అడ్డు లేని, అనంతమైన దయ కలిగిన వారు. ప్రపంచములో జ్ఞ్యానమును బోధించిన గురువుగారికి తగిన ప్రత్యుపకారం ఎవరు చేయగలరు. నేను చేయగలిగినది ఒక్కటే - వినోదపాత్రమ్ - వినా + ఉదపాత్రం - దోసిటితో ఆర్ఘ్యం ఇవ్వగలగడం తప్ప.

మైత్రేయ ఉవాచ
త ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితాః
శీలం తదీయం శంసన్తః ఖేऽభవన్మిషతాం నృణామ్

ఈ ప్రకారముగా సనకాదులు ఆదిరాజైన పృధు చక్రవర్తితో ఆరాధించబడి అతని స్వభావాన్ని ప్రశంసించి అందరూ చూస్తుండగా ఆకాశములోకి వెళ్ళిపోయారు.

వైన్యస్తు ధుర్యో మహతాం సంస్థిత్యాధ్యాత్మశిక్షయా
ఆప్తకామమివాత్మానం మేన ఆత్మన్యవస్థితః

వేనపుత్రుడు అయిన పృధు చక్రవర్తి మహానుభావుల జ్ఞ్యానబోధతో రాజ్యభారాన్ని పరమాత్మలో ఉండి తనకన్నీ లభించాయనుకున్నాడు (కొరతే ఆశకు మూలం. అన్నీ ఉన్నాయనుకుంటే ఇంక ఆశకు ఆస్కారము లేదు. నేనంటే ఆత్మా అని తెలుసుకున్నవాడికి ఆశ ఉండదు. పరమాత్మకన్నా భిన్నమైనది ఆత్మకు అవసరం లేదు. ఆ పరమాత్మ ఆత్మలోనే ఉన్నాడు)

కర్మాణి చ యథాకాలం యథాదేశం యథాబలమ్
యథోచితం యథావిత్తమకరోద్బ్రహ్మసాత్కృతమ్

ఏ సమయములో ఏ పనులు ఎంత శక్తితో చేయాలో యధోచితముగా యధా విత్తం పరమా. త్మను ప్రత్యక్షముగా చేసుకుని చేసిన పనులన్నీ బ్రహ్మార్పణం చేసాడు

ఫలం బ్రహ్మణి సన్న్యస్య నిర్విషఙ్గః సమాహితః
కర్మాధ్యక్షం చ మన్వాన ఆత్మానం ప్రకృతేః పరమ్

పని చేస్తున్న పరమాత్మకే ఫలితాన్ని అర్పించాడు. దేనియందూ ఆసక్తి లేకుండా సావధాన మనస్కుడై ఏ పని చేస్తున్నా మనసు ఆ పని మీదే ఉండి, ఫలితం మీద కాకుండా చేసాడు. అన్ని కర్మలకూ అధ్యక్షుడుగా ఉన్న ఆత్మే ప్రకృతి కంటే పరం అని తెలుసుకున్నాడు. శరీరం కంటే విడిగా ఆత్మ ఉంది అని తెలుసుకున్నవాడేకోరికలూ కోరడు.

గృహేషు వర్తమానోऽపి స సామ్రాజ్యశ్రియాన్వితః
నాసజ్జతేన్ద్రియార్థేషు నిరహమ్మతిరర్కవత్

సంసారములో రాజ్యములో ఉన్నాడు, అయినా విషయముల యందు ఏ మాత్రం ఆసక్తి కలిగి లేడు. అహంకార మమకారాలు లేకుండా ఉన్నాడు. సూర్యభగవానుడిలా నీటిలో నిప్పులో ఉండి కూడా ఏది అంటకుండా ఉన్నాడు.

ఏవమధ్యాత్మయోగేన కర్మాణ్యనుసమాచరన్
పుత్రానుత్పాదయామాస పఞ్చార్చిష్యాత్మసమ్మతాన్

ఈ రీతిలో ఆధ్యాత్మ యోగముతో కర్మలు చేస్తూ ఉన్నాడు. అర్చి యందు తనకు అనుగుణమైన వారు ఐదుగురు పుత్రులు కలిగారు.

విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకమ్
సర్వేషాం లోకపాలానాం దధారైకః పృథుర్గుణాన్

విజితాశ్వం ధూమ్రకేశం హర్యక్షం ద్రవిణం వృకమ్. తాను చక్రవర్తిగా ఉండి సకల లోకపాలకుల గుణాలన్నీ తానొక్కడే ధరించాడు.

గోపీథాయ జగత్సృష్టేః కాలే స్వే స్వేऽచ్యుతాత్మకః
మనోవాగ్వృత్తిభిః సౌమ్యైర్గుణైః సంరఞ్జయన్ప్రజాః

ఏ సమయములో ఏమి కావాలో అవి తీసుకున్నాడు. పరమాత్మ యందు మనసు పెట్టి చేసాడు. ప్రజలను తన మనసుతో వాక్కుతో శరీరముతో రంజింపచేసాడు. రంజింపచేసే వాడు రాజు. రాజు అనే నామాన్ని ఈయన సార్థకం చేసాడు, చంద్రుడిలా.

రాజేత్యధాన్నామధేయం సోమరాజ ఇవాపరః
సూర్యవద్విసృజన్గృహ్ణన్ప్రతపంశ్చ భువో వసు

సూర్యునిలా వ్యవహరించాడు. నీటిని తీసుకుని విడిచిపెట్టి అవసరమైనప్పుడు ఇస్తాడు. రాజు కూడా ప్రజాపాలనకు ఇబ్బంది వస్తే పన్నుగా తీసుకుని, ప్రజలకు బాధలొచ్చినపుడు మళ్ళీ ఇస్తాడు. శాసనముతో ఆజ్ఞ్యతో తపింపచేసాడు

దుర్ధర్షస్తేజసేవాగ్నిర్మహేన్ద్ర ఇవ దుర్జయః
తితిక్షయా ధరిత్రీవ ద్యౌరివాభీష్టదో నృణామ్
వర్షతి స్మ యథాకామం పర్జన్య ఇవ తర్పయన్
సముద్ర ఇవ దుర్బోధః సత్త్వేనాచలరాడివ

ధర్మరాడివ శిక్షాయామాశ్చర్యే హిమవానివ
కువేర ఇవ కోశాఢ్యో గుప్తార్థో వరుణో యథా

అగ్ని లాగ ఎవ్వరినీ (శత్రువులను) దగ్గరకు రానివ్వలేదు, ఇంద్రునిలా ఎవ్వరిచేతా జయింపబడని వాడు , భూమి వంటి ఓర్పూ, ఆకాశములా అడిగినవన్నీ ఇచ్చేవాడు. పర్జన్యుడిలా ప్రజల అవసరాన్ని తీర్చేవాడూ, సముద్రములా తనలో ఏముందో ఎవరికీ తెలియని వాడు, ధైర్యములో పర్వతములా ఉన్నాడు, తప్పు చేసిన వారిని శిక్షించడములో యముడిలా, ఐశ్వరములో హిమవంతునిలా ఉన్నాడు ధనములో కుబేరునిలా, ధనమును దాచిపెట్టడములో వరుణుడిలా (వరుణుడు నీటిని దాస్తాడు)

మాతరిశ్వేవ సర్వాత్మా బలేన మహసౌజసా
అవిషహ్యతయా దేవో భగవాన్భూతరాడివ
కన్దర్ప ఇవ సౌన్దర్యే మనస్వీ మృగరాడివ
వాత్సల్యే మనువన్నృణాం ప్రభుత్వే భగవానజః
బృహస్పతిర్బ్రహ్మవాదే ఆత్మవత్త్వే స్వయం హరిః
భక్త్యా గోగురువిప్రేషు విష్వక్సేనానువర్తిషు
హ్రియా ప్రశ్రయశీలాభ్యామాత్మతుల్యః పరోద్యమే

వాయువులా అందరిలో ఉంటాడు, శరీర మనో ఇంద్రియ బలముతో వాయువులా ఉంటాడు.  ఎవ్వరూ దగ్గరగా రాకుండా ప్రళయ కాల రుద్రుడిలా ఉంటాడు. సౌందర్యములో మన్మధుడిలా పౌర్షములో సింహములా ప్రేమలో మనువులా ఉంటాడు శాసించడములో యోగక్షేమాలను కల్పించడములో బ్రహ్మలో బుద్ధిలో వేద వాదములో బృహస్పతిలా, ఆత్మ స్వరూపములో శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు. ఇన్ని ఉన్నా ఆయన సిగ్గుపడాడు (వినయవంతుడు) ఇతరులకి ఏదైనా కావలసి వస్తే, తనకి కావలసిన దానికెంత కష్టపడతాడో అంత కష్టపడతాడు. ఇన్ని ఉత్తమ గుణములతో తన కీర్తిని పృధు చక్రవర్తి మూడు లోకాలలో వ్యాపింపచేసాడు


కీర్త్యోర్ధ్వగీతయా పుమ్భిస్త్రైలోక్యే తత్ర తత్ర హ
ప్రవిష్టః కర్ణరన్ధ్రేషు స్త్రీణాం రామః సతామివ

సత్పురుషులందరికీ ఎలా రాముడు ఆరాధ్యుడో ఈ రాజ్యములో అందరికీ ఈయన ఆరాధ్యుడు. పృధు చక్రవర్తి కూడా సర్వ జన రంజకుడుగా ప్రసిద్ధి పొందాడు.

Saturday, March 2, 2013

భగవంతుడు ఉన్నాడా?

భగవంతుడు ఉన్నాడా?

అస్తి యజ్ఞపతిర్నామ కేషాఞ్చిదర్హసత్తమాః
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః

మొత్తం పధ్నాలుగు శాస్త్రాల యొక్క చర్చ ఉన్న శ్లోకం ఇది
మనమాచరించే యజ్ఞ్యమునకు ఒక అధిపతి ఉన్నాడు.
పరమాత్మను ఒప్పుకోని వారు కొందరుంటారు. భగవంతుడున్నాడని ఒప్పించడానికి "పరమాత్మ ఉన్నాడు" అని అన్నాడు పృధువు. పరమాత్మ లేడు అనే వారి ఉద్దేశ్యమేమిటి? పరమాత్మ ఉన్నట్లైతే వేటి వేటి వలన తెలియాలో వాటి వాటి వలన పరమాత్మ తెలియబడట్లేదు. ప్రత్యక్షం మనకు ఒక ప్రమాణం. కంటికి కనపడడు,  చెవికి వినబడడు. ప్రత్యక్షముతో తెలియబడడు. ప్రత్యక్షముతో తెలియబడనిది అనుమానముతో తెలియబడదు. ఉదా: అంతకు ముందు మనం నిప్పు వలన పొగ చూసిన వారే పొగను చూసి అక్కడ నిప్పు ఉందీఇ అనుకుంటారు. కాబట్టి ప్రత్యక్షముతో తెలియబడని వస్తువు అనుమానముతో తెలియబడదు. అలాగే ప్రత్యక్షముతో తెలియబడనిది ఉపమానముతో కూడా తెలియబడదు. ఇక మిగిలిన ప్రమాణం శబ్దము. ఇది రెండు రకాలు. లౌకిక శబ్దము మనము మాట్లాడుకునేది. వైదిక శబ్దాలు వేదాలు. లౌకిక శబ్దం ప్రమాణం కాదు. ఎందుకంటే వాటిలో భ్రమా పొరబాటూ ఉంటుంది. బాధితులూ స్వార్థులూ ఆశాపరులూ ఒక తీరుగా ఉన్న దానిని ఇంకో తీరుగా చెప్పవచ్చు. మరచిపోయీ చెప్పవచ్చు. శబ్దము మనకు అర్థమును తెలపాలంటే ఎలాంటిది కావాలి? ప్రపంచములో మాట్లాడేవారందరూ వ్యాకరణ శాస్త్రమూ వేదమూ తెలిసి మాట్లాడుకుంటారా? వారి వారి పెద్దల వలన వచ్చిన శాబ్ద బోధే వారు మాట్లాడుకుంటారు. వృధ్ధులూ పెద్దలూ చెప్పేవన్నీ అశాశ్వతములే అనిత్యములే. మన ఇంట్లో పెద్ద వారు వేద శబ్దాలను చెబుతున్నారా? లేదు. వృద్ధ వ్యవహారము కూడా నశించేవాటి గురించే చెబుతాయి. నశించని పరమాత్మ నశించే వస్తువులను కూర్చి చెప్పే ప్రమాణముతో వర్ణింపబడలేదు. శబ్దమూ ప్రమాణము కాదు. ఉపమానం అనుమానం ప్రత్యక్షం ప్రమాణం కాదు.
వేదములో ఉన్నవన్నీ అర్థవాదాలు. మరి జగత్తుకు కారణం అని దేన్నంటారు. మనకు ఆచరించే పనులకు రావలసిన ఫలాన్ని ఎవరిస్తారు? ప్రకృతే ఫలమిస్తుందని కొందరి వాదన. ఉదా: భూమిలో విత్తనం వేస్తే పంట వస్తోంది,  వాన పడితే భూమి పండుతోంది. దేశ కాల వస్తు విభాగాలను ముందు పెట్టుకుని అవే ఇస్తున్నాయి. ప్రకృతి కంటే జీవుని కంటే విలక్షణముగా పరమాత్మ ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవాలి. సృష్టి జీవులు చేస్తున్నాయి, ప్రకృతి ఫలితం ఇస్తోంది. కనుక పరమాత్మ లేడు. జీవుడే కర్త. అని ఒక వాదం.
ఈ వాదాలు చెప్పేవారందరికీ సమాధానముగా పృధు చక్రవర్తి "అస్తి యజ్ఞ్యపతి" అన్నాడు
కొందరి దృష్టిలో పరమాత్మ లేడు అంటున్నారేమో గానీ పరమాత్మ ఉన్నాడని చెప్పేవారి సంఖ్యే ఎక్కువ - కేషాఞ్చిదర్హసత్తమాః
మరి దానికి ప్రమాణమేమిటి? అన్ని లోకాలూ ఒక్క తీరులో ఉన్నాయా? విశేశముగా ప్రకాశించే లోకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని లోకాలు చీకటితో ఉన్నాయి.
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః -
కొన్ని లోకాలలో సుఖమూ కొన్ని లోకాలలో దుఃఖముంది. దుఃఖము కలిగేదాన్ని జీవుడెందుకు సృష్టించాడు. లోకాలను జీవుడెందుకు సృష్టించాడు. ఆ జీవుడు స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే యజ్ఞ్యం ఎందుకు చేస్తున్నాడు? అంటే జీవుడే స్వర్గాన్ని సృష్టించి, ఆ స్వర్గానికి వెళ్ళడానికి మళ్ళీ యజ్ఞ్యమెందుకు చేస్తున్నాడు? అంటే తన ఇంటికి తాను వెళ్ళడానికి ఇంకొకరి అనుమతి కావాలా?కాదు, ఈ లోకాలన్నీ ప్రకృతే సృష్టిస్తోందనుకుందాము. ప్రకృతే సృష్టిస్తోంటే ఇన్ని చిత్ర విచిత్రాలు ప్రకృతిలో ఉండకూడదు. ప్రకృతి పరిణామశీలము. ప్రకృతి స్తబ్ధముగా ఉండదు. మరి నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో ఏమి చేస్తుంది? నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో కూడా పరిణామశీలం కావాలి కదా. ప్రకృతి ప్రళయకాలములో స్తబ్ధముగా ఉంటుంది. అంటే ప్రకృతి సృష్టి చేయట్లెదు. జీవుడు సృష్టి చేసాడనుకుంటే నరకాన్నిచ్చే పాపాన్నెందుకు సృష్టిస్తాడు. సృష్టించిన పాపాన్ని తాను ఆచరిస్తాడా? తాను పాపాన్ని సృష్టించి దాని వలన బాధలు పడడానికి నరకాన్ని సృష్టించి దానిలో బాధపడతాడా?
కొన్ని జీవులు పురుగులుగా కొన్ని కీటకాలుగా ఎందుకు పుడుతున్నాయి. ఇన్ని రకాల జీవరాశులు ఎందుకుంటాయి. ప్రపంచములో ఏ జీవుడైనా అలాంటి జన్మ కావాలి అని కోరుకుంటారా?
అంటే జీవుడూ కాదు, ప్రకృతీ కాదు సృష్టి చేసేది. అందుకే ఈ రెంటికీ విలక్షణముగా ఒకడు సృష్టి చేస్తాడు. ఆచరించే పనులను రెండు భాగాలుగా విభజించాడు, మంచి కర్మలూ చెడు కర్మలూ అని.
ఆయన ఆజ్ఞ్యను శాస్త్రం అని చెప్పి, మన చేత చేయించాడు, వ్యవస్థలో పనీ, పనిని చేయించేవాడు, పని చేసేవాడు, చేసిన వాడు తప్పు చేస్తే శిక్షించేవాడు, ఒప్పు చేస్తే రక్షించేవాడు ఉండాలి. జీవుడే సృష్టించేవాడంటే, పని తానే సృష్టించి, దాని ఫలితాన్నీ తానే పొందుతాడా? అంటే తప్పు తానే చేసి తనను తానే కారాగారములో పెట్టుకుంటాడా? అంటే ఒక యజ్ఞ్యపతి ఉన్నాడు.
యజ్ఞ్యం అంటే కర్మ, యజ్ఞ్యము చేసేవాడు కర్త, చేయించే వాడు పరమాత్మ. ఒక శాసకుడూ ప్రభువూ, రక్షకుడూ ఉన్నాడు. పాపము చేస్తే ఒక లోకానికీ పుణ్యము చేస్తే ఒక లోకానికీ పముపుతాడు. కర్మా కర్తా శాసకుడూ ఉన్నారు. ఈ ప్రకృతినీ జీవాత్మనూ పరమాత్మ తన ఇష్టానుపూర్వముగా నడిపిస్తున్నాడు. చిత్ర విచిత్రములైన లోకములూ దేహములూ పనులూ, ఈ మూడూ ఉన్నాయంటే ఇవి మనకు మనముగా చేసుకునేవి కావు. ఎవరి మటుకూ వాడు కష్టపడేవాటిని సృష్టించుకోడు. దొంగా, కారాగారం, కారాగారములో వేసేవాడు ఈ ముగ్గురూ వేరు. మనకు ఇష్టము లేకుండా మనం బాధపడే లోకాలు ఉన్నాయి, మనను బాధపెట్టే పనులూ ఉన్నాయి. అంటే ఇది ఎవరి పని? ఎవరికి వారు వారిని వారు బాధించుకోడూ, శిక్షించుకోడూ కాబట్టి అవి ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. సృష్టించింది మానవుడే అయి ఉంటే ఎవరికీ రోగాలు రావు. అందుకే యజమాని ఒకడు ఉన్నాడు. కర్మ (యజ్ఞ్యము) ఉంది.
అందుకే పరమాత్మ ఉన్నాడు. ఎటువంటి సందేహము లేదు. భూలోకములో హిమాలయాది ప్రాంతాలూ ఉన్నాయి, నీటి చుక్కలు లేని ఎడారులూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఒకలా ఎందుకు లేవు. అలాగే పరలోకాలలో కూడా యమలోకం వరుణ లోకం పితృలోకం అని ఉన్నాయి. కర్మలను బట్టి ఆయా కర్మలను ఆచరించిన వారికి ఆయా లోకాలను పంపడానికి ఆ లోకాలు సృష్టించబడ్డాయి. పరమాత్మ ఉన్నాడు అనడానికి ఒక ప్రమాణం ప్రకృతే. కర్తా కారయితా, చేసే వాడు చేయించేవాడూ చేసే పనీ  పనికి ఫలితం, - ఈ నాలుగు ఒక తీరుగా ఉండవు. తర్క మీమాన్స (జైన) కార్తాంతికులనూ పృధువు ఈ విధముగా

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
మౌక్తికైః కుసుమస్రగ్భిర్దుకూలైః స్వర్ణతోరణైః
మహాసురభిభిర్ధూపైర్మణ్డితం తత్ర తత్ర వై

యజ్ఞ్యము పూర్తి చేసుకుని వస్తున్న పృధు చక్రవర్తికి ప్రజలు ఘన స్వాగతం చెప్పారు, స్వర్ణ తోరణాలతో పట్టు వస్త్రాలతో పుష్ప మాలలతో ముత్యాలతో గొప్ప సువాసన గల ధూఒపాలతో అలంకరించి స్వాగతం చెప్పారు.

చన్దనాగురుతోయార్ద్ర రథ్యాచత్వరమార్గవత్
పుష్పాక్షతఫలైస్తోక్మైర్లాజైరర్చిర్భిరర్చితమ్

చందనం కస్తూరి అగరు పన్నీటి జలముతో నాలుగు దారుల కూడళ్ళనూ, అన్ని దారులకూ వెదజల్లి, పుష్పాలతో అక్షతలతో పళ్ళతో కొన్ని రకాల ఆకులతో దీపములల్తో పేలాలతో అలంకరించి, అరటి గెలలతో కూడిన స్తంభాలతో అలంకరించారు

సవృన్దైః కదలీస్తమ్భైః పూగపోతైః పరిష్కృతమ్
తరుపల్లవమాలాభిః సర్వతః సమలఙ్కృతమ్

పోక చెట్లతో అలంకరించారు. చెట్లూ చిగురుటాకులూ పుష్పమాలలతో అలంకరించి మంగళ హారతులు పట్టుకుని మంగళములు చేస్తూ ఎదురొచ్చారు ఆ పుర ప్రజలు.

ప్రజాస్తం దీపబలిభిః సమ్భృతాశేషమఙ్గలైః
అభీయుర్మృష్టకన్యాశ్చ మృష్టకుణ్డలమణ్డితాః

నగరాన్ని అలంకరించారు ద్వారాన్నీ వీధులనీ అలంకరించారు, వారిని వారు అలంకరించుకుని చెవులకు కుండలాలతో, కిరీటాలతో హారాలతో అలంకరించుకుని ఎదురు వెళ్ళారు

శఙ్ఖదున్దుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చర్త్విజామ్
వివేశ భవనం వీరః స్తూయమానో గతస్మయః

శంఖ నాదం దుందుభి నాదముతో వేద ఘోషతో అందరిచే స్తోత్రం చేయబడ్డాడు. ఏమాత్రమూ గర్వమూ లేకుండా వినయముతో నగరములోకి ప్రవేశించాడు. (స్మయమంటే గర్వం)

పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః
పౌరాఞ్జానపదాంస్తాంస్తాన్ప్రీతః ప్రియవరప్రదః

గొప్ప కీర్తి పొందిన వాడు కాబట్టి ప్రజలచే కీర్తించబడ్డాడు. తనని పూజించినవారిని పూజించాడు. పౌరలను జనపదములో ఉండేవారినీ సామంతులనూ వారికి కావలసిన కానుకలు వారికిచ్చి పూజించాడు

స ఏవమాదీన్యనవద్యచేష్టితః కర్మాణి భూయాంసి మహాన్మహత్తమః
కుర్వన్శశాసావనిమణ్డలం యశః స్ఫీతం నిధాయారురుహే పరం పదమ్

ఇలా పృధు చక్రవర్తి పది మంది చేత కీర్తించబడ్డ కార్యాలు చేసి మహానుభావుడేఉ గొప్ప పనులనూ చాలా పనులనూ చేస్తూ భూమండలాన్ని శాసించాడు. బాగా వృద్ధి పొందిన కీర్తిని అంతటా వ్యాపింపచేసి పరమపదాన్ని అధిష్ఠించాడు.

సూత ఉవాచ
తదాదిరాజస్య యశో విజృమ్భితం గుణైరశేషైర్గుణవత్సభాజితమ్
క్షత్తా మహాభాగవతః సదస్పతే కౌషారవిం ప్రాహ గృణన్తమర్చయన్

ఆది రాజైన అశేష గుణాలతో కీర్తి వ్యాపిప్మబడిన వాడు, గొప్ప గుణాలు కలవాడు కాబట్టి గుణములు కలవారిచేత కీర్తించబడిన వాడు. పరమభాగవతుడైన విదురుడు (క్షత్తా ) కథ చెబుతున్న మైత్రేయున్ని పూజిస్తూ ఇలా అడిగాడు

విదుర ఉవాచ
సోऽభిషిక్తః పృథుర్విప్రైర్లబ్ధాశేషసురార్హణః
బిభ్రత్స వైష్ణవం తేజో బాహ్వోర్యాభ్యాం దుదోహ గామ్

పృధు చక్రవర్తి పెద్దల చేత రాజ్యాభిషేకం చేయించబడ్డాడు. దేవతల చేతా ఆరాధించబడ్డాడు. విష్ణువు యొక్క తేజస్సుని ధరించినవాడై ఆవు యొక్క పాలు పితికాడు.

కో న్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాః
లోకాః సపాలా ఉపజీవన్తి కామమద్యాపి తన్మే వద కర్మ శుద్ధమ్

ఏ కొంచమైన జ్ఞ్యానం ఉన్నవాడెవడైనా ఈయన కీర్తిని ఇంకా వినాలనుకోడు? ఏ మహానుభావుని పరాక్రమం చేత ఏర్పరచబడి, అతను అనుభవించిన తరువాత విడిచిపెట్టిన దాన్నే తక్కిన లోకపాలకులు అనుభవిస్తున్నారు, అతని పరాక్రమం యొక్క ఎంగిలే ఇదంతా. దీన్నే తక్కిన రాజులూ లోకపాలకులూ ఇప్పటికీ భుజిస్తూ బతుకుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఏమి చేసాడో చెప్పండి

మైత్రేయ ఉవాచ
గఙ్గాయమునయోర్నద్యోరన్తరా క్షేత్రమావసన్
ఆరబ్ధానేవ బుభుజే భోగాన్పుణ్యజిహాసయా

రాజధానిని గంగా ఎమునల మధ్య (ఆర్యావర్తః పుణ్యభూమి) క్షేత్రములో యజ్ఞ్య శాలనేర్పాటు చేసి, తాను సంపాదించిన సంపదలను బాగా అనుభవించాడు చేసిన పుణ్యం మొత్తం అనుభవించాలని. పుణ్యపాపాలు రెండూ పోతేనే మోక్షం వస్తుంది.

సర్వత్రాస్ఖలితాదేశః సప్తద్వీపైకదణ్డధృక్
అన్యత్ర బ్రాహ్మణకులాదన్యత్రాచ్యుతగోత్రతః

ప్రభువు ఆజ్ఞ్యను అందరూ అనువర్తించి ఉండేవారు. ఇతని ఆజ్ఞ్యను ఎవరూ తిరస్కరించే వారు కాదు. అలా సప్త్ ద్వీపాలనీ పరిపాలించాడు. ఏడు ద్వీపాలు గల భూమండలాన్ని పరిపాలించాడు. బ్రాహ్మణోత్తములని భగవత్భక్తులకూ తప్ప అందరినీ శాసించాడు,

ఏకదాసీన్మహాసత్ర దీక్షా తత్ర దివౌకసామ్
సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సత్తమ

ఒక మహా సత్ర దీక్షని ఏర్పాటు చేసాడు. దానికి దేవతలూ బ్రహ్మర్షులూ రాజర్షులూ వచ్చారు

తస్మిన్నర్హత్సు సర్వేషు స్వర్చితేషు యథార్హతః
ఉత్థితః సదసో మధ్యే తారాణాముడురాడివ

వచ్చిన వారందరూ వారి వారి యోగ్యతలకనుగుణముగా ఆరాధించబడ్డారు. సభామధ్యములోంచి రాజు నక్షత్రాల మధ్య చంద్రుడి వలే లేచి నిలబడ్డారు

ప్రాంశుః పీనాయతభుజో గౌరః కఞ్జారుణేక్షణః
సునాసః సుముఖః సౌమ్యః పీనాంసః సుద్విజస్మితః

ఉన్నతుడు, ఎత్తైన్ భుజములు కలవాడు, ఎర్రటి వర్ణం కలవాడు, పద్మం వంటి నేత్రములు కలవాడు, కొనదేరిన ముక్కు కలవాడు చక్కని ముఖం కలవాడు చక్కని పలు వరుస కలిగి ఉన్న చిరునవ్వు కలవాడు.

వ్యూఢవక్షా బృహచ్ఛ్రోణిర్వలివల్గుదలోదరః
ఆవర్తనాభిరోజస్వీ కాఞ్చనోరురుదగ్రపాత్
సూక్ష్మవక్రాసితస్నిగ్ధ మూర్ధజః కమ్బుకన్ధరః
మహాధనే దుకూలాగ్ర్యే పరిధాయోపవీయ చ
వ్యఞ్జితాశేషగాత్రశ్రీర్నియమే న్యస్తభూషణః
కృష్ణాజినధరః శ్రీమాన్కుశపాణిః కృతోచితః

ఉన్నతమైన వక్షస్థలం గలవాడు. మూడు వల్గులు కల ఉదరం కలవాడు. సుడిలాంటి నాభి కలవాడు, ఓజోవంతుడు బంగారములాంటి తొడలూ ఉన్నతమైన పాదములూ కలవాడు, సూక్షమైనవీ వంకర తిరిగినా నల్లని దట్టమైన కేశములు కలవాడు. శంఖం వంటి కంఠం కలవాడు. విలువైన పట్టు పీతాంబరలాను కట్టుకున్నాడు. నియమే న్యస్తభూషణః - యజ్ఞ్య దీక్షలో ఉన్నాడు కాబట్టి ఆభరణాలను విడిచిపెట్టాడు (కాబట్టి ఆభరణాలను విడిచిపెట్టిన ఆయన అవయవ సౌందర్యం అందరూ చూడగలుగుతున్నారు)
కృష్ణాగినాన్ని ధరించాడు, చేతిలో ధర్భాన్ని ధరించాడు. ఆచమనం చేసినవాడు

శిశిరస్నిగ్ధతారాక్షః సమైక్షత సమన్తతః
ఊచివానిదముర్వీశః సదః సంహర్షయన్నివ

ప్రేమతో నిండిన చల్లని చూపు కలవాడు. వచ్చిన వారిని చూచి ఈయన ఇలా పలికాడు

చారు చిత్రపదం శ్లక్ష్ణం మృష్టం గూఢమవిక్లవమ్
సర్వేషాముపకారార్థం తదా అనువదన్నివ

అందమైన మాటలూ, వినగానే ఆనందం కలగాలి, వినయముతో ఉండాలి (శ్లక్ష్ణం ) , గంభీరముగా ఉండాలి, అర్థము పండితులకి మాత్రమే కావాలి, దైన్యము లేని మాటలు కావాలి. ఇవన్నీ కలిగి ఉన్న మాటలు మాట్లాడాడు. యజ్ఞ్యమునకు వచ్చిన వారందరికీ మేలు జరగడానికి, వారికి కావలసినవీ, వారు చేయవలసినవీ

రాజోవాచ
సభ్యాః శృణుత భద్రం వః సాధవో య ఇహాగతాః
సత్సు జిజ్ఞాసుభిర్ధర్మమావేద్యం స్వమనీషితమ్

సభకు వచ్చిన మహానుభావులారా, మీకు మంగళం కలుగు గాక, నేను చెప్పేది వినండి. ఇది సజ్జనులకోసము. తెలుసుకోవాలనే జిజ్ఞ్యాస ఉన్నవాడు తెలుపగల సజ్జనులు వచ్చి చేరినప్పుడు తన మనసులో ఉన్నదాన్ని వారికి నివేదించాలి. నేను జ్ఞ్యానిగా మాట్లాడటం లేదు. ఉపదేశం చేయుట లేదు. విజ్ఞ్యాపన చేస్తున్నాను.

అహం దణ్డధరో రాజా ప్రజానామిహ యోజితః
రక్షితా వృత్తిదః స్వేషు సేతుషు స్థాపితా పృథక్

నన్ను బ్రహ్మ (పరమాత్మ) ప్రజలను శాసించమని రాజుగా నియమించాడు. నా పని దండించడమే కాదు, వారిని కాపాడాలి కూడా. ఒక వేళ వారికి పని లేకపోతే వారికి వృత్తినివ్వాలి. వారి వారిని వారి వారి మర్యాదలలో నిలపాలి. ఎవరూ మర్యాదాతిక్రమణ చేయకుండా చూడాలి. విడి విడిగా వారి వారి ధర్మాలలో వారిని నిలిపేది నేనే. వారికి బ్రతుకు తెరువునివ్వాలి, వారిని కాపాడాలి. ధర్మాన్ని నియమించాలి.

తస్య మే తదనుష్ఠానాద్యానాహుర్బ్రహ్మవాదినః
లోకాః స్యుః కామసన్దోహా యస్య తుష్యతి దిష్టదృక్

పరమాత్మ నియమించిన పనిని సక్రమముగా చేసిన నాకు నేననుకున్న కోరికలు తీర్చే లోకాలు ఎలాగూ వస్తాయి. వీటి కన్నా నాకు కావలసినదేమిటంటే ఇలా అనుష్ఠించిన వాడిని చూచి పరమాత్మ సంతోషిస్తాడు. రాజు రాజ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే, దాని వలన స్వర్గములే కాక, అదృష్టాన్ని బాగా పరిశీలించే పరమాత్మ సంతోషించి మోక్షాన్నిస్తాడు.

య ఉద్ధరేత్కరం రాజా ప్రజా ధర్మేష్వశిక్షయన్
ప్రజానాం శమలం భుఙ్క్తే భగం చ స్వం జహాతి సః

ప్రజలను ధర్మములో ప్రవర్తింపచేయకుండా వారి నుండి పన్ను తీసుకున్నవాడు ప్రజలు చేసిన పాపాలను అనుభవించవలసి వస్తుంది. అంతే కాదు, తనకున్న జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులూ పోతాయి.

తత్ప్రజా భర్తృపిణ్డార్థం స్వార్థమేవానసూయవః
కురుతాధోక్షజధియస్తర్హి మేऽనుగ్రహః కృతః

నేను రాజును. మిమ్ములను పరిపాలిస్తున్న నాకు కృతజ్ఞ్యతగా అసూయ (ఎదుటివారిలో దోషాలు చూసే) లేకుండా మీ మీ ధర్మాలను ఆశ్రయించండి. నా కోసం, నా మీద కృతజ్ఞ్యతా బుద్ధితో ఆచరించండి. స్వార్థముతోనే చేయండి (స్వర్గాది లోకాలు వస్తాయని). కానీ అసూయ లేకుండా చేయండి. ఫలము మీద కోరికలేకుండా భగవంతుని ధ్యానిస్తూ చేయండి. నిజముగా త్యాగులైన వారు ఫలమును కోరక పరమాత్మకు అర్పిస్తారు. భోగులు  ఫలం కోరతారు. ఫలము కోరేవారు కూడా పరమాత్మ మీద ధ్యానముతో చేస్తే ఫలితాన్ని ఆయనే ఇస్తాడు. మనం చేరవలసినదీ అతన్నే, చేరచవలసినదీ అతనే. పరమాత్మని ఆరాధిస్తూ చేయడం వలన మనసు పరిశుద్ధిగా ఉంటుంది కాబట్టి రాగ ద్వేషాలు ఉండవు. నాకు కృతజ్ఞ్యత చెబుతున్నట్లుగా చేయండి. ఆచరించే ధర్మం పరమాత్మ కైంకర్యముగా చేయండి. ఇలా మీరు చేస్తే నన్ను దయ చూచిన వారవుతారు.

యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయోऽమలాః
కర్తుః శాస్తురనుజ్ఞాతుస్తుల్యం యత్ప్రేత్య తత్ఫలమ్

పితృదేవతలూ రాజర్షులూ మహర్షులూ మా వారు చేస్తున్న ధర్మాన్ని ఆమోదించండి. ధర్మమును ఆచరించిన వారికెంత ఫలమో ఆమోదించినవారికీ అంతే ఫలం.

అస్తి యజ్ఞపతిర్నామ కేషాఞ్చిదర్హసత్తమాః
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః

మొత్తం పధ్నాలుగు శాస్త్రాల యొక్క చర్చ ఉన్న శ్లోకం ఇది
మనమాచరించే యజ్ఞ్యమునకు ఒక అధిపతి ఉన్నాడు.
పరమాత్మను ఒప్పుకోని వారు కొందరుంటారు. భగవంతుడున్నాడని ఒప్పించడానికి "పరమాత్మ ఉన్నాడు" అని అన్నాడు పృధువు. పరమాత్మ లేడు అనే వారి ఉద్దేశ్యమేమిటి? పరమాత్మ ఉన్నట్లైతే వేటి వేటి వలన తెలియాలో వాటి వాటి వలన పరమాత్మ తెలియబడట్లేదు. ప్రత్యక్షం మనకు ఒక ప్రమాణం. కంటికి కనపడడు,  చెవికి వినబడడు. ప్రత్యక్షముతో తెలియబడడు. ప్రత్యక్షముతో తెలియబడనిది అనుమానముతో తెలియబడదు. ఉదా: అంతకు ముందు మనం నిప్పు వలన పొగ చూసిన వారే పొగను చూసి అక్కడ నిప్పు ఉందీఇ అనుకుంటారు. కాబట్టి ప్రత్యక్షముతో తెలియబడని వస్తువు అనుమానముతో తెలియబడదు. అలాగే ప్రత్యక్షముతో తెలియబడనిది ఉపమానముతో కూడా తెలియబడదు. ఇక మిగిలిన ప్రమాణం శబ్దము. ఇది రెండు రకాలు. లౌకిక శబ్దము మనము మాట్లాడుకునేది. వైదిక శబ్దాలు వేదాలు. లౌకిక శబ్దం ప్రమాణం కాదు. ఎందుకంటే వాటిలో భ్రమా పొరబాటూ ఉంటుంది. బాధితులూ స్వార్థులూ ఆశాపరులూ ఒక తీరుగా ఉన్న దానిని ఇంకో తీరుగా చెప్పవచ్చు. మరచిపోయీ చెప్పవచ్చు. శబ్దము మనకు అర్థమును తెలపాలంటే ఎలాంటిది కావాలి? ప్రపంచములో మాట్లాడేవారందరూ వ్యాకరణ శాస్త్రమూ వేదమూ తెలిసి మాట్లాడుకుంటారా? వారి వారి పెద్దల వలన వచ్చిన శాబ్ద బోధే వారు మాట్లాడుకుంటారు. వృధ్ధులూ పెద్దలూ చెప్పేవన్నీ అశాశ్వతములే అనిత్యములే. మన ఇంట్లో పెద్ద వారు వేద శబ్దాలను చెబుతున్నారా? లేదు. వృద్ధ వ్యవహారము కూడా నశించేవాటి గురించే చెబుతాయి. నశించని పరమాత్మ నశించే వస్తువులను కూర్చి చెప్పే ప్రమాణముతో వర్ణింపబడలేదు. శబ్దమూ ప్రమాణము కాదు. ఉపమానం అనుమానం ప్రత్యక్షం ప్రమాణం కాదు.
వేదములో ఉన్నవన్నీ అర్థవాదాలు. మరి జగత్తుకు కారణం అని దేన్నంటారు. మనకు ఆచరించే పనులకు రావలసిన ఫలాన్ని ఎవరిస్తారు? ప్రకృతే ఫలమిస్తుందని కొందరి వాదన. ఉదా: భూమిలో విత్తనం వేస్తే పంట వస్తోంది,  వాన పడితే భూమి పండుతోంది. దేశ కాల వస్తు విభాగాలను ముందు పెట్టుకుని అవే ఇస్తున్నాయి. ప్రకృతి కంటే జీవుని కంటే విలక్షణముగా పరమాత్మ ఉన్నాడని ఎందుకు ఒప్పుకోవాలి. సృష్టి జీవులు చేస్తున్నాయి, ప్రకృతి ఫలితం ఇస్తోంది. కనుక పరమాత్మ లేడు. జీవుడే కర్త. అని ఒక వాదం.
ఈ వాదాలు చెప్పేవారందరికీ సమాధానముగా పృధు చక్రవర్తి "అస్తి యజ్ఞ్యపతి" అన్నాడు
కొందరి దృష్టిలో పరమాత్మ లేడు అంటున్నారేమో గానీ పరమాత్మ ఉన్నాడని చెప్పేవారి సంఖ్యే ఎక్కువ - కేషాఞ్చిదర్హసత్తమాః
మరి దానికి ప్రమాణమేమిటి? అన్ని లోకాలూ ఒక్క తీరులో ఉన్నాయా? విశేశముగా ప్రకాశించే లోకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని లోకాలు చీకటితో ఉన్నాయి.
ఇహాముత్ర చ లక్ష్యన్తే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః -
కొన్ని లోకాలలో సుఖమూ కొన్ని లోకాలలో దుఃఖముంది. దుఃఖము కలిగేదాన్ని జీవుడెందుకు సృష్టించాడు. లోకాలను జీవుడెందుకు సృష్టించాడు. ఆ జీవుడు స్వర్గాది లోకాలకు వెళ్ళాలంటే యజ్ఞ్యం ఎందుకు చేస్తున్నాడు? అంటే జీవుడే స్వర్గాన్ని సృష్టించి, ఆ స్వర్గానికి వెళ్ళడానికి మళ్ళీ యజ్ఞ్యమెందుకు చేస్తున్నాడు? అంటే తన ఇంటికి తాను వెళ్ళడానికి ఇంకొకరి అనుమతి కావాలా?కాదు, ఈ లోకాలన్నీ ప్రకృతే సృష్టిస్తోందనుకుందాము. ప్రకృతే సృష్టిస్తోంటే ఇన్ని చిత్ర విచిత్రాలు ప్రకృతిలో ఉండకూడదు. ప్రకృతి పరిణామశీలము. ప్రకృతి స్తబ్ధముగా ఉండదు. మరి నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో ఏమి చేస్తుంది? నిరంతర పరిణామశీలమైతే ప్రళయకాలములో కూడా పరిణామశీలం కావాలి కదా. ప్రకృతి ప్రళయకాలములో స్తబ్ధముగా ఉంటుంది. అంటే ప్రకృతి సృష్టి చేయట్లెదు. జీవుడు సృష్టి చేసాడనుకుంటే నరకాన్నిచ్చే పాపాన్నెందుకు సృష్టిస్తాడు. సృష్టించిన పాపాన్ని తాను ఆచరిస్తాడా? తాను పాపాన్ని సృష్టించి దాని వలన బాధలు పడడానికి నరకాన్ని సృష్టించి దానిలో బాధపడతాడా?
కొన్ని జీవులు పురుగులుగా కొన్ని కీటకాలుగా ఎందుకు పుడుతున్నాయి. ఇన్ని రకాల జీవరాశులు ఎందుకుంటాయి. ప్రపంచములో ఏ జీవుడైనా అలాంటి జన్మ కావాలి అని కోరుకుంటారా?
అంటే జీవుడూ కాదు, ప్రకృతీ కాదు సృష్టి చేసేది. అందుకే ఈ రెంటికీ విలక్షణముగా ఒకడు సృష్టి చేస్తాడు. ఆచరించే పనులను రెండు భాగాలుగా విభజించాడు, మంచి కర్మలూ చెడు కర్మలూ అని.
ఆయన ఆజ్ఞ్యను శాస్త్రం అని చెప్పి, మన చేత చేయించాడు, వ్యవస్థలో పనీ, పనిని చేయించేవాడు, పని చేసేవాడు, చేసిన వాడు తప్పు చేస్తే శిక్షించేవాడు, ఒప్పు చేస్తే రక్షించేవాడు ఉండాలి. జీవుడే సృష్టించేవాడంటే, పని తానే సృష్టించి, దాని ఫలితాన్నీ తానే పొందుతాడా? అంటే తప్పు తానే చేసి తనను తానే కారాగారములో పెట్టుకుంటాడా? అంటే ఒక యజ్ఞ్యపతి ఉన్నాడు.
యజ్ఞ్యం అంటే కర్మ, యజ్ఞ్యము చేసేవాడు కర్త, చేయించే వాడు పరమాత్మ. ఒక శాసకుడూ ప్రభువూ, రక్షకుడూ ఉన్నాడు. పాపము చేస్తే ఒక లోకానికీ పుణ్యము చేస్తే ఒక లోకానికీ పముపుతాడు. కర్మా కర్తా శాసకుడూ ఉన్నారు. ఈ ప్రకృతినీ జీవాత్మనూ పరమాత్మ తన ఇష్టానుపూర్వముగా నడిపిస్తున్నాడు. చిత్ర విచిత్రములైన లోకములూ దేహములూ పనులూ, ఈ మూడూ ఉన్నాయంటే ఇవి మనకు మనముగా చేసుకునేవి కావు. ఎవరి మటుకూ వాడు కష్టపడేవాటిని సృష్టించుకోడు. దొంగా, కారాగారం, కారాగారములో వేసేవాడు ఈ ముగ్గురూ వేరు. మనకు ఇష్టము లేకుండా మనం బాధపడే లోకాలు ఉన్నాయి, మనను బాధపెట్టే పనులూ ఉన్నాయి. అంటే ఇది ఎవరి పని? ఎవరికి వారు వారిని వారు బాధించుకోడూ, శిక్షించుకోడూ కాబట్టి అవి ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. సృష్టించింది మానవుడే అయి ఉంటే ఎవరికీ రోగాలు రావు. అందుకే యజమాని ఒకడు ఉన్నాడు. కర్మ (యజ్ఞ్యము) ఉంది.
అందుకే పరమాత్మ ఉన్నాడు. ఎటువంటి సందేహము లేదు. భూలోకములో హిమాలయాది ప్రాంతాలూ ఉన్నాయి, నీటి చుక్కలు లేని ఎడారులూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఒకలా ఎందుకు లేవు. అలాగే పరలోకాలలో కూడా యమలోకం వరుణ లోకం పితృలోకం అని ఉన్నాయి. కర్మలను బట్టి ఆయా కర్మలను ఆచరించిన వారికి ఆయా లోకాలను పంపడానికి ఆ లోకాలు సృష్టించబడ్డాయి. పరమాత్మ ఉన్నాడు అనడానికి ఒక ప్రమాణం ప్రకృతే. కర్తా కారయితా, చేసే వాడు చేయించేవాడూ చేసే పనీ  పనికి ఫలితం, - ఈ నాలుగు ఒక తీరుగా ఉండవు. తర్క మీమాన్స (జైన) కార్తాంతికులనూ పృధువు ఈ విధముగా

మనోరుత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః
ప్రియవ్రతస్య రాజర్షేరఙ్గస్యాస్మత్పితుః పితుః

మరి ఈ వాదాన్ని ఇది వరకు ఒప్పుకున్నవారున్నారా? మనువూ, ఆయన కుమారుడు ఉత్తాన పాదుడూం, ధ్రువుడూ , ప్రియవ్రతుడు, మా తాతగారైన అంగుడూ ఒప్పుకున్నారు

ఈదృశానామథాన్యేషామజస్య చ భవస్య చ
ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతా

వీరందరినీ సృష్టించిన బ్రహ్మ ఒప్పుకున్నాడు. శంకరుడూ ఒప్పుకున్నాడు. ప్రహ్లాదుడూ బలీ కొడుకూ కూడా ఒప్పుకున్నారు. వీరందరికీ పరమాత్మతో పని ఉంది. (వారందరూ పరమాత్మ చేత ఆయన ప్రీతిని ఫలముగా పొందినవారే)

దౌహిత్రాదీనృతే మృత్యోః శోచ్యాన్ధర్మవిమోహితాన్
వర్గస్వర్గాపవర్గాణాం ప్రాయేణైకాత్మ్యహేతునా

అందరూ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ విడిగా ఎందుకు చెప్పాలి? అంటే భగవంతుడు లేడు అని అనే వారు ఉన్నారు. మరి లేని వారికి పేరు ఎలా వస్తుంది. ఉన్న వస్తువుకు పేరు ఉంటుంది కానీ లేని వస్తువుకు ఉండదు.
మా తండ్రి ( మృత్యువు కూతురి కొడుకు) భగవంతుడు లేడన్నాడు. అతను ధర్మము వలన మోహం పొందాడు.
వర్గస్వర్గాపవర్గాణాం  - (త్రి)వర్గమంటే ధర్మార్థ కామాలు. స్వర్గమటే దాని ఫలితం. ఫలితం వద్దంటే కలిగేది అపవర్గం. త్రివర్గం సృష్టించినవాడూ స్వర్గం సృష్టించిన వాడూ అపవర్గం సృష్టించినవాడూ ఒకడా వేరా? ధర్మార్థ కామాలు దాని ఫలితమూ మోక్షమూ, ఈ మూడిటికీ ఒకడే కర్త ఉండాలి కాబట్టి పరమాత్మ ఉన్నాడు. ధర్మార్థ కామములను సృష్టించినవాడే వాటి ఫలితముగా స్వర్గాన్ని, పరమాత్మ అర్పణ బుద్ధితో చేస్తే అపవర్గమునూ సృష్టించాడు. కర్మ ఒకటే గానీ సంకల్పమును బట్టి స్వర్గాన్ని కానీ అపవర్గాన్నీ గానీ పొందుతాడు. వీటిని సృష్టించినది పరమాత్మ. అచేతనమైన ప్రకృతికి భేధమూ వైచిత్రీ కుదరదు, చేతానున్ని శాసించజాలదు, ప్రకృతి ఇచ్చుటా పుచ్చుకొనుటా కాని పని. జీవుడు కోరి కోరి తనకు కష్టాలను కలిగించుకునే పనిని చేయడు. అంటే ప్రకృతీ జీవుడూ కాకుండా ఈ మూడింటికీ ఒకడే కర్త ఉండాలి. వాడే పరమాత్మ.
పరమాత్మ ఉన్నాడు అనడానికి ఇదే హేతువు.

యత్పాదసేవాభిరుచిస్తపస్వినామశేషజన్మోపచితం మలం ధియః
సద్యః క్షిణోత్యన్వహమేధతీ సతీ యథా పదాఙ్గుష్ఠవినిఃసృతా సరిత్

తపస్వులకీ మునులకీ పరమాత్మ పాద సేవ యందు అభిరుచి ఉంటుంది. అది రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుంది - అన్వహమేధతీ. ఒక్క నాడు అన్నం తింటే రోజూ ఎలా ఆకలి కాకుండా ఉంటుందో అలా. ఎన్నో జన్మలనుండీ కష్టపడి సంపాదించుకున్న బుద్ధికి పట్టిన మురికి (పాపం) పోగొడుతుంది ఎలా ఐతే పరమాత్మ పాదాంగుష్ఠమునుండి పుట్టిన గంగ లాగ.

వినిర్ధుతాశేషమనోమలః పుమానసఙ్గవిజ్ఞానవిశేషవీర్యవాన్
యదఙ్ఘ్రిమూలే కృతకేతనః పునర్న సంసృతిం క్లేశవహాం ప్రపద్యతే

అది పోతే ఏమవుతుంది? బుద్ధికంటిన మురికి పోవడం వలన వైరాగ్యం కలుగుతుంది. సంసారం మీద కోరికా అంటే బుద్ధికి పట్టిన మురికి. ఎపుడైతే అది పోయిందో విజ్ఞ్యానం కలుగుతుంది. దేహం వేరు ఆత్మ వేరనే వివేకం కలుగుతుంది. అలా వివేక వైరాగ్యాలు పుడతాయి. ఇల్లూ వాకిలీ అంతా పరమాత్మ పాదములని తెలుసుకుని అక్కడ నివాసమేర్పరచుకుని మళ్ళీ తిరిగి రాడు. అది కలగాలంటే దేహాత్మ వివేకమూ వైరాగ్యమూ కావాలి. అది కావాలంటే మురికి పోవాలి. అలాంటి వాడు కష్టాలకు పుట్టినిల్లు అయిన సంసారములో ప్రవేశించడు

తమేవ యూయం భజతాత్మవృత్తిభిర్మనోవచఃకాయగుణైః స్వకర్మభిః
అమాయినః కామదుఘాఙ్ఘ్రిపఙ్కజం యథాధికారావసితార్థసిద్ధయః

మీ మీ వర్ణాశ్రమ ఆచార అనుగుణ ధర్మముతో పరమాత్మను ఆరధించండి. మనో వాక్కాయ కర్మలతో భజించండి. మోసం చేయకండి. భగవంతున్ని ఆరాధిస్తున్నట్లు నటించకండి. బుద్ధితో కూడా పరమాత్మనే ధ్యానించాలి. ఆలోచనలో కూడా కాపట్యం ఉండకూడదు. ఎందుకంటే ఆయన కామదుఘ్ - అన్ని కోరికలనూ తీరుస్తాడు. కొలిచినా కొలవకున్నా ఆయన మన కోరికలను తీరుస్తాడు. యథాధికారావసితార్థసిద్ధయః - మీ మీ యోగ్యతలను బట్టి ఫల సిద్ధి లభిస్తుంది.

అసావిహానేకగుణోऽగుణోऽధ్వరః పృథగ్విధద్రవ్యగుణక్రియోక్తిభిః
సమ్పద్యతేऽర్థాశయలిఙ్గనామభిర్విశుద్ధవిజ్ఞానఘనః స్వరూపతః

యజ్ఞ్యమూ యజ్ఞ్య సంబారాలూ యజ్ఞ్య మంత్రాలు యజ్ఞ్య కర్తా యజ్ఞ్య యజమానీ యజ్ఞ్య ఫలితమూ , యజ్ఞ్య ఫలితాన్నిచ్చేవాడూ పరమాత్మే.
అసౌ - ఈయనే. అనేక గుణః - అనంతమైన కళ్యాణ గుణాలు కలవాడు. అగుణః - ప్రకృతి సంబంధమైన గుణాలు లేని వాడు. అధ్వరః - యజ్ఞ్య స్వరూపుడు. యజ్ఞ్యమే కాదు, యజ్ఞ్యానికి కావల్సిన ద్రవ్యములు కూడా పరమాత్మే. గుణాలు (ఉదా: లోహిత శుక్ల కృష్ణాం - ఎరుపూ తెలుప్పూ నలుపూ ఉండిం, ఒకే సంవత్సరం వయసు గల మేక కావాలి, ఇవన్నీ ద్రవ్యములో గుణాలు ), క్రియ (ఉదా: వడ్లను దంచితే వచ్చిన బియ్యమును పొడిగా చేసి, మళ్ళి వేచి అందులో నెయ్యి వేయాలి, ప్రోక్షణ చేయాలి, నెయ్యిపోసిన గిన్నెను అగ్ని దగ్గర పెట్టి దాన్ని కరిగించాలి, మంత్రాలు ఉండాలి. ఇవన్నీ క్రియలు)
అర్థ ఆశయ లింగ నామభిః - అర్థం (ఉదా: స్వర్గము), ఆశ్రయం (ఇంద్రుడు), ఆ రూపం ధరించినవాడు, ఆ పేరు గలవాడు అనే ఈ నాలుగూ పరమాత్మే. అంటే ఆయా లోకాలు లేదా ఫలములూ, ఆ లోకమునకు,లేదా ఫలమునకూ ఆశ్రయమూ, ఆ రూపము గలవాడూ, పేరు కలవాడూ పరమాత్మే. ఆ పరమాత్మకు ఎలాంటి గుణాలూ లేవు, పరిశుద్ధమైన విజ్ఞ్యానమే మూర్తీభవించినవాడు పరమాత్మ. ఆయనకు ఏ ఆకారమూ గుణమూ బాధా సంతోషమూ లేదు. ఆయన మనకోసం ద్రవ్యాలనూ గుణాలను క్రియలనూ మంత్రాలనూ ఫలితాలనూ లోకాలనూ అధిపతులనూ ఆకారాలనూ వారి పేర్లనూ సృష్టించాడు.

ప్రధానకాలాశయధర్మసఙ్గ్రహే శరీర ఏష ప్రతిపద్య చేతనామ్
క్రియాఫలత్వేన విభుర్విభావ్యతే యథానలో దారుషు తద్గుణాత్మకః

అంతెందుకు మనము కూడా ఆయనే. శరీరమూ మనసూ బుద్ధీ ఆత్మా అంతర్యామీ ఆయనే. దేన్ని బట్టి మనం వేరు వేరు అంటున్నాము? ఈ పృధక్ భావానికి బీజమేది? శరీరం. ఈ శరీరం ఎలా వచ్చింది. ప్రకృతీ కాలమూ (ప్రకృతిని క్షోభింపచేసేది),  బుద్ధి (ఆశయం - మహత్ తత్వం), దానితో ఆచరించే ధర్మములూ (కర్మలు) - వీటి ఫలితం శరీరం. ఈ శరీరములోకి జీవ రూపిగా పరమాత్మ ప్రవేశిస్తాడు. అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య వ్యాకరవాణీతి (చాంధోగ్యోపనిషత్తు)
కట్టెలలో ఉన్న అగ్ని ఆ కట్టెల రూపాన్ని పొందినట్లుగా ఈ పరమాత్మే ఆయా కర్మల రూపములో ఫలితాన్ని అనుభవిస్తాడు

అహో మమామీ వితరన్త్యనుగ్రహం హరిం గురుం యజ్ఞభుజామధీశ్వరమ్
స్వధర్మయోగేన యజన్తి మామకా నిరన్తరం క్షోణితలే దృఢవ్రతాః

ఎవరైతే తమ ధర్మాలను విశ్వ గురువైన పరమాత్మను నిరంతరమూ ఆరాధిస్తున్నారో వారు నా వారు.
నా ప్రజలు నన్ను అనుగ్రహిస్తున్నారు. శాసనముల వలన కార్యాలు జరుగవు. ప్రభువు శాసనాన్ని పాటించేవారంటే ప్రభువు మీద ప్రీతి ఉన్నవారు.

మా జాతు తేజః ప్రభవేన్మహర్ద్ధిభిస్తితిక్షయా తపసా విద్యయా చ
దేదీప్యమానేऽజితదేవతానాం కులే స్వయం రాజకులాద్ద్విజానామ్

బ్రహ్మ క్షత్రం ఒకరినొకరు ఆగ్రహించుకునేట్లుగానీ నిగ్రహించుకునేట్లుగానీ ఈ రాజ్యములో ఉండకూడదు
రాజకులాద్ద్విజానామ్ కులే స్వయం - క్షతిర్యులనూ బ్రాహ్మణులూ, బ్రాహ్మణులను క్షత్రియులూ ఒకరినొకరు ద్వేషించరాదు.
రాజులకు సంపదా అధికారం క్షత్రియమైన తేజస్సు ఉంటుంది. వాటితో అహంకరించి బ్రాహ్మణులను అవమానించే అవకాశముంది. కానీ వారికి వచ్చిన బలం తేజస్సూ అధికారం వచ్చింది బ్రాహ్మణుల వలనే.
రాజులకు సంపదా అధికారం పరాక్రమం. బ్రాహ్మణులకు తపస్సు విద్యా ఓర్పూ ఉన్నాయి. అందుకని వీరు పరస్పరం ఒకరినొకరు తిరస్కరించకూడదు.
అజితదేవతానాం కులే - పరమాత్మను మాత్రమే ఆరాధించే కులము వారు, బ్రాహ్మణులు. వారి తేజస్సు మమ్మల్ని కప్పిపుచ్చవద్దు.

బ్రహ్మణ్యదేవః పురుషః పురాతనో నిత్యం హరిర్యచ్చరణాభివన్దనాత్
అవాప లక్ష్మీమనపాయినీం యశో జగత్పవిత్రం చ మహత్తమాగ్రణీః

నిరంతరం బ్రాహ్మణుల పాద పరాగం ధరించి ఉంచుట వలనే లక్ష్మి నన్ను విడిచిపెట్టకుండా ఉంది అని పరమాత్మే చెప్పాడు. బ్రాహ్మణుల యందు అధికమైన  భక్తి కలవారికి (బ్రహ్మణ్యదేవః ) పరదైవమైన పరమాత్మ పురుషోత్తముడు, పురాతనుడు (కొలతకు ప్రమాణం దొరకని వాడు), బ్రాహ్మణుల పాద పద్మములకు నమస్కరించడం వలన నిత్యానపాయిని (ఎన్నడూ విడిచిపోని) లక్ష్మిని పొందాడు, గొప్ప కీర్తిని పొందాడు.

యత్సేవయాశేషగుహాశయః స్వరాడ్విప్రప్రియస్తుష్యతి కామమీశ్వరః
తదేవ తద్ధర్మపరైర్వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతామ్

బ్రాహ్మణులను సేవించడం వలన అందరిలో అంతర్యామిగా ఉన్న స్వరాట్ (తనను తాను ప్రకాశింపచేసుకునేవాడు), బ్రాహంఅనుల యందు అధిక ప్రీతి గలవాడు సంతోషిస్తాడు. కాబట్టి మీ మీ ధర్మాలు ఆచరించే వారు వినయముతో అన్ని విధాలా బ్రాహ్మణులను సేవించండి.

పుమాన్లభేతానతివేలమాత్మనః ప్రసీదతోऽత్యన్తశమం స్వతః స్వయమ్
యన్నిత్యసమ్బన్ధనిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజామ్

 బ్రాహ్మణులను ఆరాధిస్తే హద్దు అంటూ లేకుండా మనసు ప్రసన్నమవుతుంది. దాని వలన మనసులో బుద్ధిలో ఉండే ఉద్వేగం కొరత క్రోధం పోయి శాంతిని పొందుతారు. దీని కంటే కావలసినదేముంటుంది. బ్రాహ్మణులని సేవించడం వలన బ్రాహ్మణులను సేవించడం వలన వచ్చే ఫలితమే కాకుండా యజ్ఞ్య యాగాదులు ఆచరించడం వలన (అగ్నిహోత్రములో హవిస్సు ఇవ్వడం వలన) వచ్చే ఫలితం వస్తుంది, ఎందుకంటే అఖిల దేవతలు బ్రాహ్మణుల ముఖము. పరమాత్మకూ దేవతలకూ ముఖము వంటి వారు బ్రాహ్మణులు. అందుకని బ్రాహ్మణులని ఆరాధిస్తే దేవతలు కూడా సంతోషిస్తారు.

అశ్నాత్యనన్తః ఖలు తత్త్వకోవిదైః శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభిః
న వై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్యపర్యగుః

ఇంద్రుడనీ ఉపేంద్రుడనీ వరుణుడనీ ఏ బ్రాహ్మణులకు భోజనం పెడితే పరమాత్మ ఆరగిస్తాడో అగ్నిహోత్రుడలో వేస్తే అలా భుజించడు. అగ్నిహోత్రుడు చైతన్యం లేని వాడు. చైతన్యం లేని అగ్నిహోత్రునిలో వేయడం కంటే చైతన్యం కలిగిన బ్రాహ్మణులకు పెడితే పరమాత్మ ఆనందిస్తాడు. పరమాత్మ పరమహంసలచేత ఆరాధించబడతాడు. పరమహంసలున్న చోటికి పరమాత్మ వెళతాడు. బ్రాహ్మణులూ మునులూ యోగుల సమాగం ఉంటేనే అక్కడ పరమాత్మ ఉంటాడు.

యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధాతపోమఙ్గలమౌనసంయమైః
సమాధినా బిభ్రతి హార్థదృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే

పరమాత్మ చాలా పెద్దవాడు (యద్బ్రహ్మ ), పెద్దవాటన్నిటికంటే పెద్దవాడు, నాశం లేని వాడు, ఎలాంటి కల్మషములూ లేని వాడు, అనాధి నుండీ ఉన్నవాడు, అలాంటి పరమాత్మను ఆరాధించాలంటే శ్రద్ధా తపసు మౌనమూ మంగలమూ నియమమూ ఉండాలి. అలాంటి పరమాత్మ బ్రాహ్మణులలో అద్దములా ఉంటాడు. బ్రాహ్మణులు పరమాత్మకు అద్దము వంటి వారు. బ్రాహ్మణులను ఆరాధిస్తున్నామంటే పరమాత్మను ఆరాధిస్తున్నట్లే.

తేషామహం పాదసరోజరేణుమార్యా వహేయాధికిరీటమాయుః
యం నిత్యదా బిభ్రత ఆశు పాపం నశ్యత్యముం సర్వగుణా భజన్తి

నేను అలాంటి బ్రాహ్మణోత్తముల పాద పరాగం కిరీటము మీద ధరిస్తాను. ఇలా బ్రాహ్మణోత్తముల పాదపరాగాన్ని ధరించిన వారికి పాపం తొలగిపోతుంది. అలాంటి వారిని అన్ని ఉత్తమ గుణాలు వచ్చి పొందుతాయి

గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేऽను సమ్పదః
ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యమ్

సంపదలు ఎవరి దగ్గరకు వస్తాయి? అన్ని మంచి గుణములూ కలవాడికి, ఉత్తం శీలము కలవాడికి, చేసిన ఉపకారం మరచిపోని వాడికీ, పెద్దవారిని ఆశ్రయించి ఉన్నవాడికీ అన్ని సంపదలూ స్వయముగా వచ్చి వరిస్తాయి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు గోవులూ దేవతలూ పరమాత్మ నా విషయములో ప్రసన్నమవుదురు గాక.

మైత్రేయ ఉవాచ
ఇతి బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయః
తుష్టువుర్హృష్టమనసః సాధువాదేన సాధవః

ఈ మాటలు విన్న పితృదేవతలు పరమానందాన్ని పొందారు. పరమసతోషముతో రాజును "బాగా చెప్పవ" ని స్తోత్రం చేసారు

పుత్రేణ జయతే లోకానితి సత్యవతీ శ్రుతిః
బ్రహ్మదణ్డహతః పాపో యద్వేనోऽత్యతరత్తమః

మానవుడు అన్ని లోకాలనూ స్వయముగా గెలవాలంటే తన కుమారుడితో గెలుస్తాడని శ్రుతి. ఇంతవరకూ అది శ్రుతి అనిపించేది. ఇపుడు నీతో అది నిజమని అర్థమయింది. పరమ పాపి అయిన వేనుడు ఉత్తమగతులను పొందాడు. బ్రహ్మదండం పొందిన వాడు వేనుడు అజ్ఞ్యానాన్ని సంసారాన్ని దాటి మోక్షాన్ని పొందాడు.

హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిన్దయా తమః
వివిక్షురత్యగాత్సూనోః ప్రహ్లాదస్యానుభావతః

హిరణ్యకశిపుడు కూడా భగవన్నిందతో నరకానికి వెళ్ళవలసిన వాడే గానీ తన కొడుకు ప్రహ్లాదుని వలన ఉత్తమగతిని పొందాడు

వీరవర్య పితః పృథ్వ్యాః సమాః సఞ్జీవ శాశ్వతీః
యస్యేదృశ్యచ్యుతే భక్తిః సర్వలోకైకభర్తరి

అఖిల బ్రహ్మానడ కోటి నాయకుడైన నారాయణుని మీద భక్తి ఉన్న నీవు, భూమికి తండ్రివైన నీవు, చాలా కాలము చల్లగా బ్రతుకు.

అహో వయం హ్యద్య పవిత్రకీర్తే త్వయైవ నాథేన ముకున్దనాథాః
య ఉత్తమశ్లోకతమస్య విష్ణోర్బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి

మీ నాన్నగారే కాదు, ఉత్తముడైన నీవు రాజుగా ఉన్న మీ రాజ్యములో ఉన్న ప్రజలమైన మేము కూడా తరించాము. మాకు కూడా శ్రీమన్నారాయణుడే స్వామి. మహానుభావులందరూ గానము చేసే పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు బ్రాహ్మణోత్తములను ఆరాధించేవారికి దేవుడు, బ్రాహ్మణుల యందు ప్రీతి గల దేవుడు. ఆ పరమాత్మ కథను మీచే నిరంతరం వినడం వలన మేము కూడా ఆయన భక్తులమయ్యాము.

నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనమ్
ప్రజానురాగో మహతాం ప్రకృతిః కరుణాత్మనామ్

నీలాంటి మహానుభావుడు ప్రజలను ఇలా శాసించుట పెద్ద వింతేమీ కాదు. లోకములో రాజూలైన వారు తమ ఇంటిలో పరమాత్మను ఆరాధించవచ్చు గానీ, ప్రజల మీద ప్రేమతో ప్రజలు కూడా ముక్తి పొందాలని కరుణతో ఉన్న రాజులకు ప్రజలయందు అనురాగం ఉండుట సహజం.

అద్య నస్తమసః పారస్త్వయోపాసాదితః ప్రభో
భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవసంజ్ఞితైః

మహారాజా! ఈనాడు మా చీకటి మీ వలన తొలగించబడింది.  ఒక వేళ మీరు ఇలా మాకు తత్వమును బోధించకుంటే మా పరిస్థితి ఏమయి ఉండేది? పనులను చేస్తున్నాము, దేవతలను ఆరాధిస్తున్నాము. కానీ దేనికి ఆరాధిస్తున్నాము. మంచి ఇంటికోసమో భార్యకోసమో పిల్లల కోసమో ఆరాధిస్తున్నాము. సంసారములో పూర్తిగా మునిగి పోవడానికి ఆరాధిస్తూ సంసారమే నిత్యమూ సుఖమూ అనుకుని భ్రమిస్తున్నాము. వాస్తవానీ చూడలేకపోతున్నాము. నిత్యాన్ని అనిత్యమనీ, అనిత్యాన్ని నిత్యమనీ అనుకుంటున్నాము. అలాంటి మా అజ్ఞ్యానం నీ వలన తొలగించబడింది.

నమో వివృద్ధసత్త్వాయ పురుషాయ మహీయసే
యో బ్రహ్మ క్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజసా

పరమాత్మకు నమస్కారం! తత్వం బాగా తెలిసిన మహానుభావుడు, మహాపురుషుడూ అయిన పరమాత్మకు నమస్కారము. ఏ పరమాత్మ్ ఈ క్షత్రియున్ని ఆవేశించి పరిపాలిస్తున్నాడో అలాంటి మహా పురుషునికి నమస్కారం